Posts

Current Affairs

Sri Lanka

♦ On 23 December 2025, India announced a USD 450 million reconstruction assistance package to assist in the reconstruction of areas affected by Cyclone Ditwah in Sri Lanka. External Affairs Minister Dr. S. Jaishankar announced this while addressing the media in Colombo.  ♦ He stated that the package comprises a 350 million concessionary line of credit and 100 million dollars in grants, aimed at supporting the rebuilding of cyclone-affected regions of the nation.  ♦ He added that under Operation Sagar Bandhu, India delivered around 11 hundred tonnes of relief material and over 14.5 tonnes of medicines and medical equipment to the neighbouring country.

Current Affairs

Vinod Kumar Shukla

♦ Eminent Hindi writer and Jnanpith Award winner Vinod Kumar Shukla passed away on 23 December 2025 at the age of 89. He was born on January 1, 1937, in Rajnandgaon, in present-day Chhattisgarh. ♦ His most well-known novel, Naukar Ki Kameez, earned wide recognition and was later adapted into a film by filmmaker Mani Kaul. Another notable work, Deewar Mein Ek Khidki Rehti Thi, further established his reputation as a writer of quiet depth and philosophical insight. ♦ In 2023, he was awarded the Jnanpith Award, India’s highest literary honour, a recognition widely viewed as long overdue.

Current Affairs

వినోద్‌కుమార్‌ కన్నుమూత

ప్రముఖ హిందీ రచయిత, జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత వినోద్‌కుమార్‌ శుక్లా (88) 2025, డిసెంబరు 23న రాయ్‌పుర్‌లో మరణించారు. శుక్లా 1937 జనవరి 1న ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జన్మించారు. హిందీ సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. నౌకర్‌ కీ కమీజ్, ఖిలేగా తో దేఖేంగే, దీవార్‌ మే ఏక్‌ ఖిర్కీ రహతీ థీ, ఏక్‌ చుప్పీ జగాహ్‌ వంటి నవలలను రచించి అందరి ప్రశంసలు పొందారు.   ‘దీవార్‌ మే ఏక్‌ ఖిర్కీ రహతీ థీ’కిగాను 1999లో సాహిత్య అకాడమీ అవార్డును ఆయన పొందారు. 

Current Affairs

సలహా కమిటీ

ట్రాన్స్‌జెండర్లకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే అంశంపై పరిశీలించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆశామేనన్‌ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన ట్రాన్స్‌జెండర్‌ హక్కుల పోరాట కార్యకర్త వైజయంతి వసంత మోంగ్లీకి స్థానం కల్పించింది. అలాగే కర్ణాటకకు చెందిన అక్కై పద్మశాలి, గ్రేస్‌బాను, జిందాల్‌ గ్లోబల్‌ లా స్కూల్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సౌరవ్‌ మండల్, సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ పాలసీ రీసెర్చ్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ నిత్యారాజశేఖర్, అసోసియేషన్‌ ఫర్‌ ట్రాన్స్‌జెండర్‌ హెల్త్‌ ఇన్‌ ఇండియా సీఈఓ డాక్టర్‌ సంజయ్‌ శర్మ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.  ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు విద్య, ఉద్యోగాలు, ఇతర విషయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు విధాన రూపకల్పన చేయాలంటూ సుప్రీంకోర్టు 2025 అక్టోబరు 17న జారీచేసిన తీర్పు మేరకు ఈ కమిటీ ఏర్పడింది.

Current Affairs

శ్రీలంకకు 45 కోట్ల డాలర్ల ప్యాకేజీ

దిత్వా తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు భారత్‌ 45 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. శ్రీలంక పునర్నిర్మాణానికి స్థిరమైన నిబద్ధతతో భారత్‌ ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. భారత ప్రధానమంత్రి మోదీ తరఫున ప్రత్యేక రాయబారిగా ఆయన శ్రీలంకకు వెళ్లారు.  రోడ్లు, రైలుమార్గాల పునరుద్ధరణకు.. ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణానికి.. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా వ్యవస్థల మద్దతుకు ఈ ఆర్థికసాయం ఉపయోగపడుతుందని తెలిపారు.

Current Affairs

‘అయిలా’

దిల్లీ ఐఐటీ శాస్త్రవేత్తలు డెన్మార్క్, జర్మనీలకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ‘ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌’ (అయిలా) అనే సరికొత్త కృత్రిమ మేధ పరికరాన్ని రూపొందించారు. శాస్త్రవేత్తల మాదిరిగానే వైజ్ఞానిక ప్రయోగాలను నిర్వహించే సామర్థ్యం వీటికి ఉంటుంది.  అతి సూక్ష్మస్థాయిలో పదార్థాలను విశ్లేషించే అటామిక్‌ ఫోర్స్‌ మైక్రోస్కోప్‌పై అయిలా సాయంతో పరిశోధన నిర్వహించారు. 

Current Affairs

రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కారాలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌-2025 అందుకున్నారు. 2025, డిసెంబరు 23న రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరు ఈ పురస్కారాలను స్వీకరించారు. ఇందులో నాగ్‌పుర్‌లోని సీఎస్‌ఐఆర్‌ నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న ఎస్‌.వెంకటమోహన్, హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీలో సీఎస్‌ఐఆర్‌ భట్నాగర్‌ ఫెలోగా సేవలందిస్తున్న కుమారస్వామి తంగరాజ్‌లు విజ్ఞాన్‌శ్రీ పురస్కారాలు అందుకున్నారు.  దిల్లీలోని బీఆర్‌ఐసీ- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ జీనోం రీసెర్చ్‌లో స్టాఫ్‌ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్న జగదీష్‌ గుప్త కాపుగంటి, హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌లో సీనియర్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సత్యేంద్రకుమార్‌ మంగ్రౌతియాలు విజ్ఞాన్‌ యువ పురస్కారాలు స్వీకరించారు. 

Current Affairs

అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్‌

సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ 2025, డిసెంబరు 23న నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. రవీంద్రకుమార్‌  1983లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌కౌన్సిల్‌లో నమోదై న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ విద్యుత్తు బోర్డు, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంల స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు.  2018 నుంచి 2024 వరకు తెదేపా తరఫున రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Walkins

సాయిల్‌ సైన్స్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌ (ఐఐఎస్ఎస్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు:  1. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01 2. యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 02  అర్హత: ఎంఎస్సీ (సాయిల్‌ సైన్స్‌/ సాయిల్‌ సైన్స్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ కెమిస్ట్రీ/అగ్రికల్చరల్‌ ఫిజిక్స్‌, ప్లాంట్‌ సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌ స్కోరు, ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ఫెలోకు రూ.37,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-IIకు రూ.42,000. వయోపరిమితి: సీనియర్‌ రిసెర్చ్‌ఫెలోకు పురుషులకు 35, మహిళలకు 40 ఏళ్లు; యంగ్‌ ప్రొఫెషనల్‌కు 21 నుంచి 45 ఏళ్లు మధ్య ఉండాలి.  టెస్ట్‌/ఇంటర్వ్యూ తేదీలు: 29, 30, 31.12.2025. వేదిక: ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌, నబిబాగ్‌, బెరాసియా రోడ్‌, భోపాల్‌. Website:https://iiss.icar.gov.in/

Internship

స్పికీటెక్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

స్పికీటెక్‌ వీడియో ఎడిటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ:  స్పికీటెక్‌ పోస్టు పేరు: వీడియో ఎడిటర్‌  నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మార్కెటింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.2,500 - రూ. 9,000. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 16-01-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-video-editor-internship-at-spikitech-private-limited1765949160