ప్రపంచ రక్త దాతల దినోత్సవం
రక్త వర్గాలను కనుక్కున్న శాస్త్రవేత్త లాండ్ స్టీనర్ జయంతిని పురస్కరించుకుని ఏటా జూన్ 14న ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’గా నిర్వహిస్తారు. మానవ జీవక్రియలో రక్తం ముఖ్య భూమిక పోషిస్తుంది. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు, దేహంలోని మలినాలను బయటకు పంపడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. గాయాలు, శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం జరిగి రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడి అవసరమవుతుంది. రక్తంలో వేర్వేరు యాంటిజన్లు, యాంటీబాడీలు ఉంటాయి. రక్తమార్పిడి సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యక్తికి సరైన రక్త గ్రూప్ను మాత్రమే ఇవ్వాలి. అలాకాకపోతే రెండు రక్తవర్గాల మధ్య గుచ్ఛీకరణ (Agglutination) జరిగి వ్యక్తి మరణించే ప్రమాదం ఉంది. తెలియని వ్యక్తుల కోసం తమ రక్తాన్ని దానం చేసే వారిని గౌరవించి, వారికి కృతజ్ఞతలు తెలపడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: ఆస్ట్రియాకు చెందిన జీవశాస్త్రవేత్త లాండ్ స్టీనర్ 1901లో మానవుల్లో ప్రధాన రక్త గ్రూపులైన తి, తీ, వీ లను కనుక్కున్నారు. తర్వాత 1902లో ఈయన సహచరులైన అల్ఫ్రెడ్ డెకాస్టెల్లో, అడ్రియానో స్టర్లి తితీ రక్తవర్గాన్ని గుర్తించారు. లాండ్ స్టీనర్ పరిశోధనల ఫలితంగానే మానవుల్లో సురక్షిత రక్త మార్పిడికి అవకాశం ఏర్పడింది. ఈయన 1868, జూన్ 14న జన్మించారు. ఈ రోజును ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2004లో తీర్మానించింది. 2025 నినాదం: Give blood, give hope: together we save lives.