Posts

Government Jobs

Academic and Non-Academic Posts In FDDI, Hyderabad ​​​​​​​

Applications are invited for the recruitment of Academic and Non-Academic posts on contractual basis at Footwear Design and Development Institute (FDDI) in Ankleshwar, Hyderabad. No. of Posts: 18 Details: 1. Senior Faculty Grade 1/ Chief Faculty: 01 2. Junior Faculty/ Faculty/ Senior Faculty: 08 3. Lab Assistant: 03 4. Junior Faculty/ Faculty/ Senior Faculty Grade 2,1: 01 5. Assistant Manager: 05 Departments: Fashion Design, Leather Goods and Accessories, School of Footwear Design and Production, Promotions and Admissions, Student Appearance and Examination Department. Qualification: Candidates should have passed 8th class, 10th, any degree, diploma, B.Tech, BE, MBA, PGDM, PG, M.Phil, Ph.D in the relevant discipline and have work experience. Salary: Per Month Rs.45,000 for Junior Faculty post; Rs.65,000 for Faculty; Rs.80,000 for Senior Faculty Grade 1; Rs.1,10,000 for Senior Faculty Grade 2; Rs.1,50,000 for Chief Faculty; Rs.25,000 for Lab Assistant; Rs.40,000 for Assistant Manager. Minimum age limit: Must be 18 years old. Selection process: Based on written test and interview. Application process: Offline. Last Date of Application: 26-05-2025. Website: https://fddiindia.com/

Current Affairs

ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం

భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను సమర్థంగా, సమైక్యంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సభ్యదేశాలు తొలిసారిగా 2025, మే 20న ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొవిడ్‌-19 సంక్షోభం అనంతరం మూడేళ్లుగా సాగుతున్న చర్చలకు పర్యవసానంగా ఈ ఒప్పందం కుదిరింది.  ‘డబ్ల్యూహెచ్‌వో ప్యాండమిక్‌ అగ్రీమెంట్‌’కు ప్రపంచ ఆరోగ్య సమ్మేళనం ప్లీనరీ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంపై జరిగిన ఓటింగులో 124 దేశాలు అనుకూలంగా ఓటేయగా, 11 దేశాలు గైర్హాజరయ్యాయి. దీనిపై ఏ ఒక్క దేశమూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 

Current Affairs

ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ పదవీకాలం పొడిగింపు

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) చీఫ్‌ తపన్‌ కుమార్‌ డేకా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. దీని ప్రకారం 2026 జూన్‌ వరకూ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులను సమర్థంగా పరిష్కరించిన తపన్‌ కుమార్‌ పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. 2024లోనూ ఆయనకు తొలిసారి పొడిగింపు లభించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన తపన్‌ కుమార్‌.. 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఈయన గతంలో రెండు దశాబ్దాల పాటు ఐబీ ఆపరేషన్స్‌ విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. 2008 ముంబయి 26/11 ఉగ్రదాడి సమయంలో కౌంటర్‌ ఆపరేషన్లకు ఆయన నేతృత్వం వహించారు.

Current Affairs

‘అన్నమిత్ర’ యాప్‌ ప్రారంభం

ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్‌ జోషి 2025, మే 20న ‘‘డిపో దర్పణ్‌’’ పోర్టల్‌తో పాటు ‘‘అన్నమిత్ర’’, ‘‘అన్న సహాయత’’ అనే యాప్‌లను ప్రారంభించారు.   ‘అన్నమిత్ర’ మొబైల్‌ యాప్‌ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరుస్తుందగా.. ‘అన్న సహాయతా’ యాప్‌ ఫిర్యాదుల నమోదుకు ఉపయోగపడుతుందని ఆహార శాఖ తెలియజేసింది.  ఆహార ధాన్య డిపోల ఉద్యోగులు క్రమ పద్ధతిలో తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు, స్వయంగా తమ పనితీరును అంచనా వేసుకునేందుకు వీలుగా ‘‘డిపో దర్పణ్‌’’ పోర్టల్‌ రూపొందించారు. 

Current Affairs

సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరం

దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం రికార్డు సృష్టించింది. ఈ  మేరకు మిజోరం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం లాల్‌దుహోమా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్‌ చౌధరి సమక్షంలో 2025, మే 20న ఈ విషయాన్ని ప్రకటించారు.

Current Affairs

అడ్రియన్‌కు రజతం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌కు చెందిన అడ్రియన్‌ కర్మాకర్‌ రజతం నెగ్గాడు. 2025, మే 20న షల్‌ (జర్మనీ)లో జరిగిన 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌ ఫైనల్లో అతడు 626.7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. 0.3 పాయింట్ల తేడాతో అతడు స్వర్ణాన్ని కోల్పోయాడు.  జెస్పర్‌ జొనాసన్‌ (స్వీడన్, 626.37) స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. గ్రిఫిన్‌ లేక్‌ (అమెరికా, 624.6)కు కాంస్యం దక్కింది. 

Current Affairs

టైమ్స్‌ జాబితా

ప్రపంచవ్యాప్తంగా దాతృత్వంలో మిన్నగా ఉంటున్న, అత్యంత ప్రభావశీలురైన 100 మందితో కూడిన జాబితాను టైమ్స్‌ మ్యాగజైన్‌ 2025, మే 20న విడుదల చేసింది. ఆ జాబితాలో మనదేశం నుంచి ముకేశ్‌- నీతా అంబానీ దంపతులు, విప్రో మాజీ ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ ఉన్నారు. ఫౌండేషన్లు, లాభాపేక్ష లేని సంస్థలను స్థాపించిన వారు ఎంతో ఉదారంగా, అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నారని ‘ద టైమ్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఫిలాంత్రపీ 2025’ జాబితా వెల్లడించింది. దీని ప్రకారం.. నీతా, ముకేశ్‌ దంపతులు 2024లో రూ.407 కోట్లు (48 మి. డాలర్లు) విరాళంగా ఇచ్చారు. ఈ దంపతుల వ్యాపార సామ్రాజ్యం 110 బిలియన్‌ డాలర్లుగా ఉంది. భారత్‌లో అత్యంత ఉదారత కలిగిన వ్యక్తుల్లో ప్రేమ్‌జీ ఒకరు. 2013లో గివింగ్‌ ప్లెడ్జ్‌పై సంతకం పెట్టిన తొలి భారతీయుడు ప్రేమ్‌జీనే. 2023-24లో సంప్రదాయ విరాళాలతో పాటుగా, 109 మి. డాలర్ల (దాదాపు రూ.950 కోట్ల)ను విద్య, ఆరోగ్యం, తదితర రంగాల్లోని 940 సంస్థలకు విరాళం ఇచ్చారు. 

Current Affairs

ఎం.ఆర్‌.శ్రీనివాసన్‌ కన్నుమూత

ప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఎం.ఆర్‌.శ్రీనివాసన్‌ (95) 2025, మే 20న ఊటీలో కన్నుమూశారు. 1930లో బెంగళూరులో జన్మించిన శ్రీనివాసన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. 1955లో అణు విద్యుత్‌ శాఖలో చేరారు. దేశ అణు విద్యుత్‌ రంగానికి ఆద్యుడైన డాక్టర్‌ హోమీ జహంగీర్‌ భాభాతో కలిసి పనిచేశారు. దేశ తొలి అణు పరిశోధక రియాక్టర్‌ ‘‘అప్సర’’ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.  1959లో ఆయన దేశ తొలి అణు విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీరుగా నియమితులయ్యారు. 1967లో ఆయన మద్రాస్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌కు చీఫ్‌ ప్రాజెక్టు ఇంజినీరుగా పనిచేశారు.   అణు రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను 2015లో పద్మవిభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. 

Current Affairs

జయంత్‌ విష్ణు నార్లికర్‌ మరణం

ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్‌ జయంత్‌ విష్ణు నార్లికర్‌ (86) 2025, మే 20న పుణెలో మరణించారు. ఆయన 1938, జులై 19న జన్మించారు. పైచదువుల కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లినన నార్లికర్‌.. తనకు డాక్టోరల్‌ సలహాదారుగా వున్న ఫ్రెడ్‌ హాయ్ల్‌తో కలిసి హాయ్ల్‌-నార్లికర్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు.  1965లో కేంద్ర ప్రభుత్వం ఆయనను 26 ఏళ్ల పిన్నవయసులో పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. 2004లో ఆయన పద్మవిభూషణ్‌ అవార్డును, 2011లో మహారాష్ట్ర భూషణ్‌ అవార్డును అందుకున్నారు. మరాఠీలో రాసిన ఆయన ఆత్మకథకు 2014లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.

Current Affairs

Tapan Kumar Deka

♦ The Union Government extended the tenure of Intelligence Bureau director Tapan Kumar Deka by one year on 20 May 2025. ♦ He is an 1988-batch IPS officer of the Himachal Pradesh cadre. ♦ His tenure as director of IB will now continue till June 2026.  ♦ Deka was appointed the IB chief for a fixed tenure of two years in 2022. ♦ He was given his first extension for a year in 2024, June. ♦ Before becoming the IB chief, he headed the operations wing of the agency for over two decades. ♦ He was also responsible for counter-assault operations during the 26/11 Mumbai attacks in 2008.