Posts

Current Affairs

విజయ్‌ దివస్‌

1947లో బ్రిటిష్‌ వారు భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించడంతోపాటు మన దేశం నుంచి పాకిస్థాన్‌ను విడగొట్టి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య వివిధ భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల పరస్పరం ఘర్షణలు, యుద్ధాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 1947లో జరిగిన మొదటి కశ్మీర్‌ యుద్ధం నుంచి 2025లో ఆపరేషన్‌ సిందూర్‌ వరకు అనేక ఘటనలు అందులో ఉన్నాయి. ఈ క్రమంలో మన దేశం ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదునుపెడుతూ, సరికొత్త యుద్ధ రీతితో పాకిస్థాన్‌పై పైచేయి సాధిస్తూనే ఉంది. అయితే 1971లో జరిగిన యుద్ధం మన దేశ గెలుపును చాటడంతోపాటు బంగ్లాదేశ్‌ ఆవిర్భవాన్ని సూచిస్తుంది. ఈ పోరులో భారత్‌ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న ‘విజయ్‌ దివస్‌’గా నిర్వహిస్తారు. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన సైనికులను స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన తూర్పు పాకిస్థాన్‌ (బంగ్లాదేశ్‌)పై పశ్చిమ పాకిస్థాన్‌ చేపట్టిన క్రూర అణచివేత 1971లో భారత్‌-పాక్‌ల మధ్య మూడో యుద్ధానికి కారణమైంది. బెంగాలీ భాష మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌ వాసులు పశ్చిమ పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోరుతూ చేసిన ఉద్యమానికి భారత్‌ మద్దతు పలికింది. డిసెంబరు 3న భారత్‌ - పాకిస్థాన్‌ యుద్ధం ప్రారంభమైంది. డిసెంబరు 16న యుద్ధం ముగిసినట్లు ప్రకటన వెలువడింది. యుద్ధానంతరం తూర్పు పాకిస్థాన్‌ పేరు బంగ్లాదేశ్‌గా మారింది. ఈ యుద్ధంలో భారత్‌ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న ‘విజయ్‌ దివస్‌’గా నిర్వహిస్తారు.  

Current Affairs

సింగరేణి ఇన్‌ఛార్జి సీఎండీగా కృష్ణభాస్కర్‌

సింగరేణి సంస్థకు ఇన్‌ఛార్జి ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణభాస్కర్‌ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ 2025, డిసెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ట్రాన్స్‌కో సీఎండీగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ ఈ పోస్టులో కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. ఇంతకాలం ఇన్‌ఛార్జి సీఎండీగా ఉన్న బలరాంను ఈ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. 

Current Affairs

కోల్‌ ఇండియా సీఎండీగా సాయిరాం

ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా బి.సాయిరాం బాధ్యతలు స్వీకరించారు. 2025 అక్టోబరు 31న పీఎం ప్రసాద్‌ పదవీ విరమణ చేసిన తర్వాత తాత్కాలిక ఛైర్మన్‌గా బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి సనోజ్‌ కుమార్‌ ఝా కొనసాగారు. ఇప్పుడు పూర్తిస్థాయి నియామకంలో భాగంగా సాయిరాం బాధ్యతలు తీసుకున్నారు.  ఈ నియామకానికి ముందు సాయిరాం కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎన్‌సీఎల్‌)కు సీఎండీగా పనిచేశారు. 

Current Affairs

డబ్ల్యూటీఏ ఉత్తమ ప్లేయర్‌గా సబలెంకా

డబ్ల్యూటీఏ ఈ ఏడాది (2025) ఉత్తమ ప్లేయర్‌ అవార్డును బెలారస్‌ స్టార్‌ అర్యానా సబలెంకా గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని పొందడం ఈమెకు వరుసగా ఇది రెండోసారి. యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలవడం, ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరడం, సీజన్‌ను నంబర్‌వన్‌గా ముగించడంతో సబలెంకాకు అవార్డు దక్కింది. వరుసగా రెండు సీజన్లలో ఈ పురస్కారం అందుకున్న సెరెనా విలియమ్స్, ఇగా స్వైటెక్‌ సరసన సబలెంకా చోటు దక్కించుకుంది. 

Current Affairs

రాష్ట్రపతి భవన్‌లో దేశ వీరుల గ్యాలరీ

దేశ సేవలో ప్రాణ త్యాగాలు చేసిన వీరుల గౌరవార్థం ‘పరమ్‌ వీర్‌ దీర్ఘ’ పేరుతో రాష్ట్రపతి భవన్‌లో చిత్రశాల (గ్యాలరీ)ను ఏర్పాటు చేశారు. పరమ్‌ వీర్‌ చక్ర అవార్డులు పొందిన 21 మంది ఫొటోలను ఇందులో ఉంచారు. దేశ రక్షణలో ధైర్యసాహసాలు చూపిన వారి గుర్తుగా, వీరుల గొప్పతనాన్ని సందర్శకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని నెలకొల్పారు. విజయ్‌ దివాస్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, డిసెంబరు 16న ఈ చిత్రశాలను ప్రారంభించారు.  ఇప్పుడు ఏర్పాటు చేసిన ‘పరమ్‌ వీర్‌ దీర్ఘ’ స్థానంలో ఇది వరకు బ్రిటిష్‌ ఆర్మీ అధికారుల చిత్రాలు(ఏడీసీ-ఎస్‌) ఉండేవి. 

Current Affairs

శంషాబాద్‌ విమానాశ్రయానికి పురస్కారం

టర్మినల్‌ ఆపరేటర్‌ ఎయిర్‌ కార్గో విభాగంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి సీఐఐ స్కేల్‌-2025 జాతీయ పురస్కారం లభించింది. 2025, డిసెంబరు 16న జీఎమ్‌ఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో(జీహెచ్‌ఏసీ) అధికారులు దీన్ని అందుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ కార్గో టర్మినల్‌లో ఆపరేషనల్‌ ఎక్సెలెన్స్, టెక్నాలజీ వినియోగం, ఇన్‌క్లూజివిటీ, సస్టెయినబుల్‌ కార్గో హ్యాండ్లింగ్‌ విధి, విధానాలను పక్కాగా అమలు చేస్తుండడంతో ఈ అవార్డు దక్కింది. 

Current Affairs

మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

ఇథియోపియా ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘గ్రేట్‌ ఆనర్‌ నిషాన్‌ ఆఫ్‌ ఇథియోపియా’’తో సత్కరించింది. అదిస్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్‌ అబి అహ్మద్‌ అలీ ఆయనను అవార్డుతో సత్కరించారు. జోర్డాన్‌ పర్యటనను ముగించుకొని మోదీ 2025, డిసెంబరు 16న ఇథియోపియా రాజధాని అదిస్‌ అబాబా చేరుకున్నారు.

Internship

స్వఫినిక్స్‌ టెక్నాలజీస్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

స్వఫినిక్స్‌ టెక్నాలజీస్‌ కంప్యూటర్‌ విజన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: స్వఫినిక్స్‌ టెక్నాలజీస్‌ పోస్టు పేరు: గ్రాఫీక్‌ డిజైన్  నైపుణ్యాలు: ఏడబ్ల్యూఎస్‌ లాంబా, కంప్యూటర్‌ విజన్, డీప్‌ లెర్నింగ్, జాంగో, ఫ్లాస్క్, జావాస్క్రిప్ట్, లినక్స్, మెషీన్‌ లెర్నింగ్, ఓపెన్‌సీబీ, పైతాన్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.25,000 - రూ.37,000. వ్యవధి: 4 నెలలు దరఖాస్తు గడువు: 07-01-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-computer-vision-internship-at-swafinix-technologies-pvt-ltd1765350275

Government Jobs

టీఆర్‌ఏఐలో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని టెలీకామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల గేట్‌ స్కోర్‌ ఆధారంగా  భర్తీ చేయనుంది.  వివరాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌: 06 పోస్టులు విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిరల్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2023/2024/2025 అర్హత కలిగి ఉండాలి.  జీతం: నెలకు రూ.56,100. వయోపరిమితి: 31.10.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.  ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ: 04.01.2026. Website:https://www.trai.gov.in/vacancies

Government Jobs

దామోదర్‌ వ్యాలిలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలు

కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ), హ్యమన్‌ రిసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ గేట్‌ 2025 స్కోర్‌ ఆధారాంగా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ కోసం ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ- 54 ఖాళీలు విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, సీ అండ్‌ ఐ) అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.56,100- రూ.1,77,500. వయోపరిమితి: చివరి తేదీ నాటికి 29 ఏళ్లు ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: గేట్‌ 2025 స్కోర్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌-సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 23-12-2025. Website:https://www.dvc.gov.in/#