Posts

Current Affairs

The 14th edition of EKUVERIN

♦ The 14th edition of EKUVERIN, the joint military exercise involving the Indian Army and the Maldives National Defence Force (MNDF), began in Thiruvananthapuram on 2 December 2025. The exercise concludes on 15 December 2025. The Indian Army contingent of 45 personnel from Southern Command is participating alongside an equivalent strength of the Maldivian contingent. ♦ The Exercise aims to enhance interoperability while carrying out counterinsurgency and Counter Terrorism operations in semi-urban, jungle and coastal terrain.  ♦ EKUVERIN meaning ‘Friends’ is a bilateral annual exercise conducted alternatively in India and Maldives. Ekuverin is one of the three major joint exercises between India and the Maldives. ♦ The two bilateral exercises are “Ekuverin” and “Ekatha” and trilateral- “Dosti”, which includes Sri Lanka.  ♦ Conducted alternately in both countries since 2009, EKUVERIN continues to be a shining example of India's neighbourhood first policy and its commitment to building enduring defence partnerships with friendly nations.

Current Affairs

Defence Research and Development Organisation (DRDO)

♦ The Defence Research and Development Organisation (DRDO) has successfully conducted a high-speed rocket-sled test of a fighter aircraft escape system at the Rail Track Rocket Sled (RTRS) facility of the Terminal Ballistics Research Laboratory, Chandigarh on 2 December 2025. The test validated canopy severance, ejection sequencing, and complete aircrew recovery.  ♦ The test reached a controlled velocity of 800 km/h and validated canopy severance, ejection sequencing and full aircrew recovery. ♦ The DRDO conducted the test in collaboration with the Aeronautical Development Agency and Hindustan Aeronautics Limited.

Current Affairs

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం

సమాజంలో వేగంగా విస్తరిస్తోన్న వ్యాధులకు, మరణాలకు కాలుష్యమే ప్రధాన కారణం. ప్రధాన పారిశ్రామిక విపత్తుల్లో ఒకటైన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం మన దేశంలో ఏటా డిసెంబరు 2న ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా  (National Pollution Control Day) నిర్వహిస్తారు. పర్యావరణానికి నష్టం కలిగించే తీవ్రమైన కాలుష్య కారకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు పారిశ్రామిక విపత్తుల నివారణకు అనుసరించాల్సిన చర్యల అవసరాన్ని చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  చారిత్రక నేపథ్యం 1984 డిసెంబరు 2, 3 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న యూనియన్‌ కార్బైడ్‌ పురుగుమందుల కర్మాగారంలోని ట్యాంకు నుంచి 40-45 టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్‌ ఐసోసైనేట్‌ (ఎంఐసీ) వాయువు లీకైంది. పరిశ్రమ చుట్టూ 40 కి.మీ. ప్రాంతంలోని జీవులు దీని ప్రభావానికి లోనయ్యారు. తొలి 3 రోజుల్లో దాదాపు 10 వేలమంది మృత్యువాతపడగా.. మొత్తంగా పాతిక వేలమంది మరణించినట్లు అంచనా. గాయపడ్డవారి సంఖ్య దాదాపు 6 లక్షలు. ఆ సంఖ్య నాటి మొత్తం నగర జనాభాలో మూడింట రెండొంతులు. ప్రపంచ పారిశ్రామికరంగ చరిత్రలో అత్యంత ఘోర విపత్తుగా భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను పేర్కొంటారు. * ఈ ప్రమాదం కారణంగా ప్రభావితులైన ప్రజలను స్మరించుకునే ఉద్దేశంతో మన దేశంలో ఏటా నవంబరు 2న ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా జరుపుతున్నారు. కాలుష్యం, పారిశ్రామిక భద్రత గురించి అవగాహన కలిపంచడం ఈ రోజు లక్ష్యం.

Current Affairs

హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లు

అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైనిక దళాలకు ఇవి బాగా ఉపయోగపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.   హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లు ఇప్పటికే భారత సైన్యం, వాయుసేన అమ్ములపొదిలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని నౌకాదళంలోనూ ప్రవేశపెట్టబోతున్నట్లు ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. 

Current Affairs

హైస్పీడ్‌ రాకెట్‌ స్లెడ్‌ టెస్ట్‌

యుద్ధవిమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడేందుకు పైలట్‌కు సహాయపడే ఎస్కేప్‌ వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. పైలట్‌ను క్షేమంగా వెలుపలికి తీసుకురావడం సహా భద్రతకు సంబంధించిన కీలక అంశాలను ఈ సందర్భంగా ధ్రువీకరించుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో సొంతంగా ఇలాంటి పరీక్ష సామర్థ్యాన్ని కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది.  హైస్పీడ్‌ రాకెట్‌ స్లెడ్‌ టెస్ట్‌ అనే ఈ పరీక్షను చండీగఢ్‌లో డీఆర్‌డీవోకు చెందిన టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ (టీబీఆర్‌ఎల్‌)లో నిర్వహించారు. ఇందులో తేజస్‌ యుద్ధవిమానానికి సంబంధించిన ముందు భాగాన్ని ఉపయోగించారు. 

Current Affairs

విమాన విడిభాగాల (ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌) పరిశ్రమ

2024-25 ఆర్థిక సంవత్సరంలో మనదేశం 6.9 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.61,410 కోట్లు) విలువైన విమాన విడిభాగాలను ఎగుమతి చేసింది. ఈ పరిశ్రమ 2030 నాటికి 22 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ఎయిర్‌బస్‌ మనదేశం నుంచి ఏటా 1.5 బిలియన్‌ డాలర్ల విలువైన విడిభాగాలను కొనుగోలు చేస్తోంది. 2030 నాటికి దీన్ని 2 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలనేది ఎయిర్‌బస్‌ ప్రణాళిక.  ఫ్రాన్స్‌ దిగ్గజ సంస్థ అయిన శాఫ్రన్‌ దాదాపు రూ.1300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తన తొలి ఇంజిన్‌ నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌ఓ) సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. మనదేశ విమానయాన సంస్థలు దాదాపు 1500 శాఫ్రన్‌ ఇంజిన్ల కోసం ఆర్డర్లు ఇచ్చింది.

Current Affairs

మొక్కజొన్న ఉత్పాదకతలో ఆంధ్రాదే అగ్రస్థానం

పంటల ఉత్పాదకత పరంగా ఆంధ్రప్రదేశ్‌ మొక్కజొన్నలో దేశంలో తొలిస్థానంలో, వరి, మినుము పంటల్లో రెండో స్థానంలో నిలిచింది. 2024-25 లెక్కల ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ 2025, డిసెంబరు 2న లోక్‌సభలో ఈ విషయం వెల్లడించారు. కంది ఉత్పాదకతలో దేశంలో ఏపీ అట్టడుగున ఉంది. శనగలో 12, పెసలులో 6, వేరుశనగలో 13, సోయాబిన్‌లో 7, చెరకులో 4, పత్తిలో 9వ స్థానంలో నిలిచింది. 

Current Affairs

దేశంలో ప్రతి 811 మందికి ఒక డాక్టరు

దేశంలో ప్రతి 811 మంది ప్రజలకు ఒక అర్హత కలిగిన వైద్యుడు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం 2025, డిసెంబరు 2న పార్లమెంటుకు తెలిపింది. అల్లోపతి పద్ధతిలో చికిత్స చేసే వైద్యులు దేశంలో 13,88,185 మంది ఉండగా, ఆయుష్‌ వైద్య విధానంలో రిజిస్టర్‌ అయినవారు 7,51,768 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో చెప్పారు. రిజిస్టర్‌ అయిన అల్లోపతి, ఆయుష్‌ వైద్యుల్లో 80 శాతం మంది అందుబాటులో ఉన్నారని భావించినా దేశంలో డాక్టర్లు 1 : 811 నిష్పత్తిలో ఉన్నారు.

Current Affairs

జన గణన

దేశంలో జన గణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2026 ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జన గణన జరుగుతుందని 2025, డిసెంబరు 2న లోక్‌సభకు తెలిపింది. అదే సమయంలో కుల గణనను కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. తొలి దశలో... గృహాల లిస్టింగ్, గణన (2026 ఏప్రిల్‌-సెప్టెంబరు) -  రెండో దశలో... జనాభా లెక్కల సేకరణ (2027 ఫిబ్రవరి- మార్చి 1) నిర్వహిస్తారు. లద్ధాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లోని ప్రతికూల వాతావరణ ప్రాంతాల్లో జన గణన 2026 సెప్టెంబరు- అక్టోబరు 1 వరకు ఉంటుంది.

Walkins

ఎన్‌సీఎస్‌ఎస్ఆర్ దిల్లీలో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్‌ రిసెర్చ్ - (ఎస్‌ఏఐ - SAI, ఎన్‌సీఎస్‌ఎస్ఆర్), ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (టెక్నికల్ ఆఫీసర్),ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 07 వివరాలు: 1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (టెక్నికల్ ఆఫీసర్) - 01 2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) - 06 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ (న్యూట్రిషన్ & డైటెటిక్స్/ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్)లో ఉత్తీర్ణులై ఉండాలి. జీతం: నెలకు రూ.28,000. గరిష్ఠ వయోపరిమితి: 2025, డిసెంబరు 15వ తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 2025 డిసెంబర్‌ 15, 16. వేదిక: రూమ్ నం. 41, ఎన్‌సీఎస్‌ఎస్ఆర్‌, ఇందిరా గాంధీ స్టేడియం కాంప్లెక్స్, ఐపీ ఎస్టేట్, న్యూ దిల్లీ - 110002 Website:https://sportsauthorityofindia.nic.in/sai_new/job-opportunities