Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

The French government

♦ The French government is planning to ban social media platforms for children under the age of 15 from the start of the 2026 academic year. President Emmanuel Macron has championed the idea in recent weeks, expressing that he wants France to follow Australia's world-first ban on social media platforms for under-16s, which came into action in December. ♦ The social media ban will come into effect from September 2026. ♦ According to a report by Le Monde, a draft bill is now complete and contains two measures: a ban on social media for under-15s and a ban on mobile phones in high schools, where 15 to 18-year-olds study.

Current Affairs

Karthikeyan Manickam

♦ ESAF Small Finance Bank announced the appointment of Karthikeyan Manickam as its Chairman. He is a former executive director of the Bank of India. Manickam possesses expertise across key areas, including banking operations, risk management, regulatory compliance, human resources management, and credit monitoring and recovery. ♦ Manickam has also served on the boards of Tamil Nadu Grama Bank and BOI STAR Investment Managers, and was the Chairman of Star Union Dai-ichi Life Insurance Company (SUD Life).

Current Affairs

బియ్యం ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం

బియ్యం ఉత్పత్తిలో చైనాను వెనక్కినెట్టి భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 2026, జనవరి 4న వెల్లడించారు. 25 రకాల పంటలకు సంబంధించి 184 రకాల వంగడాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త వంగడాలతో  రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. మొత్తం 150.18 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తితో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు.

Current Affairs

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్‌ 2025, జనవరి 4న బాధ్యతలు చేపట్టారు. 90 రోజులపాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించారు. వెనెజువెలా రాజధాని కారకాస్‌లో 1969లో డెల్సీ రోడ్రిగ్జ్‌ జన్మించారు. ఆమె వామపక్ష గెరిల్లా నాయకుడు జార్జ్‌ అంటోనియో కుమార్తె.  దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై 2025, జనవరి 3న అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఆ దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా సైన్యం.. బంధించి న్యూయార్క్‌కు తరలించింది. ఈ పేపథ్యంలోనే ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

Current Affairs

చరిత్ర సృష్టించిన ఏపీ జెన్‌కో

ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థ ఏపీ జెన్‌కో 2025, జనవరి 4న థర్మల్‌ ప్లాంట్ల ద్వారా 5,828 మెగావాట్లు, జల విద్యుత్‌ ద్వారా 181 మెగావాట్లు.. మొత్తం 6,009 మెగావాట్లను ఉత్పత్తి చేసి చరిత్ర సృష్టించింది. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల గతంతో పోలిస్తే రోజుకు సుమారు 1,500 మెగావాట్ల విద్యుత్‌.. థర్మల్‌ ప్లాంట్ల ద్వారా గ్రిడ్‌కు అందుతోందని అధికారులు తెలిపారు.  ఏపీ జెన్‌కో, ఏపీ విద్యుత్‌ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌)లకు విజయవాడ, కడప, నెల్లూరు జిల్లాల్లో 6,610 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న థర్మల్‌ యూనిట్లు ఉన్నాయి. వాటిద్వారా గతంలో 4 వేల మెగావాట్ల ఉత్పత్తే కష్టమయ్యేది. ప్రస్తుతం 5,828 మెగావాట్ల ఉత్పత్తి గ్రిడ్‌కు అందుతోంది. ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంలో సగటున 88.79 శాతం ఉత్పత్తి వస్తోంది.  ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని కారణంగా జల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం తక్కువ. ఈ పరిస్థితుల్లోనూ మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 120 మెగావాట్లు, నాగార్జునసాగర్‌ కుడికాలువ పంప్‌ హౌస్‌ ద్వారా 40 మెగావాట్లు, హంపి పవర్‌ హౌస్‌ ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ గ్రిడ్‌కు అందింది. 

Current Affairs

ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా డాక్టర్‌ రాజిరెడ్డి

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ చాడ రాజిరెడ్డి బెంగళూరులోని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా ఎన్నికయ్యారు. రసాయన శాస్త్రంలో.. ప్రత్యేకించి ఆరోగ్య సంరక్షణ అనువర్తనాల కోసం ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీలో ఆయన చేసిన అత్యుత్తమ పరిశోధనలకు దక్కిన గుర్తింపు ఇది.  భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేసిన కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌లో ఉపయోగించిన అడ్జువెంట్‌ మాలిక్యూల్‌ అభివృద్ధి ప్రక్రియలో పాల్గొన్న కీలక శాస్త్రవేత్తల్లో డాక్టర్‌ రాజిరెడ్డి ఒకరు. 

Current Affairs

రాజస్థాన్‌ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి

విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచడంతో పాటు పఠనాసక్తిని పెంపొందించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. విద్యార్థుల పదజాలం మెరుగుపరచడం, లోకజ్ఞానం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌లోనూ ఇటువంటి నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

Current Affairs

ప్రపంచ తెలుగు మహాసభ

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో 2026, జనవరి 3న ప్రారంభమమయ్యాయి. మాతృభాషను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు. జనవరి 4న మారిషస్‌ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్‌ గోకుల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజులుపాటు సాగిన కార్యక్రమం జనవరి 5న ముగిశాయి.  తెలుగు భాషకు సేవలందించిన పలువురు ప్రముఖులకు మహాసభల్లో పూర్ణకుంభ పురస్కారాల ప్రదానం జరిగింది. శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడి చేతుల మీదుగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ తనయుడు నాగేంద్ర, తూర్పుబాగోతం కళాకారుడు శంకర్రావు, సినీనటుడు ఏడిద శ్రీరాం, బుర్రా సాయిమాధవ్, గద్దర్‌ కుమార్తె వెన్నెల, తోలుబొమ్మల కళాకారుడు చిదంబరం, పొత్తూరు రంగారావు తదితరులను సత్కరించారు.

Internship

నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరిలో ఇంటర్న్స్‌ పోస్టులు

నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరి (ఎన్‌డీటీఎల్‌) ఇంటర్న్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ఇంటర్న్స్: 10  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.20,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 7.  Website:https://ndtlindia.com/career/

Government Jobs

ఐఐటీ రూర్కీలో జేఆర్‌ఎఫ్ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంటెక్‌/ఎమ్మెస్సీ(హైడ్రాలజీ లేదా జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌/రిమోట్ సెన్సింగ్/గ్లేషియాలజీ/జియాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు నెట్/ గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఫెలోషిప్‌: నెలకు రూ.37,000. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా dsarya.iitr@gmail.com.కు పంపాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 20. Website:https://iitr.ac.in/Careers/Project%20Jobs.html