Posts

Current Affairs

Union Cabinet has sanctioned seven schemes

The Union Cabinet has sanctioned seven schemes to transform the agricultural sector, with a combined financial commitment of Rs.14,235.30 crore on 2 September 2024. These initiatives enhance farmers’ livelihoods, improve agricultural productivity, and ensure sustainable development. The seven schemes & allocations: ♦ Digital Agriculture Mission: Rs. 2,817 crore ♦ Livestock health and dairy: Rs.1,702 crore ♦ Krishi Vigyan Kendras (KVKs): Rs. 1,202 crore ♦ Natural resource management to support sustainable agricultural productivity: Rs.1,115 crore ♦ Focuses on crop science: Rs.3,979 crore ♦ To strengthen agricultural education and research: Rs. 2,291 crore  ♦ Sustainable development of horticulture: Rs. 1,129.30 crore

Current Affairs

Satluj Jal Vidyut Nigam

♦ The Ministry of Finance upgraded four public-sector enterprises - Satluj Jal Vidyut Nigam (SJVN), Solar Energy Corporation of India Limited, National Hydroelectric Power Corporation Limited (NHPC) and RailTel Corporation of India Limited, to the 'Navratna' status. Three of the four new Navratna companies in India are publicly traded: Railtel, SJVN, and NHPC. ♦ Navratna status is awarded to government-owned companies that were previously classified under 'miniratna' category I.  ♦ Navratna companies can invest up to Rs.1,000 crore without prior government approval. Navratna PSUs also can allocate around 15 percent to a specific project or 30 percent of their net worth over an entire year, as long as it is under the Rs.1,000 crore limit. ♦ Shipbuilder Mazgaon Dock was the last PSU to be upgraded to the Navratna status, making these four the 22nd, 23rd, 24th, and 25th enterprises to be upgraded.

Current Affairs

ఎస్‌బీఐ ఎండీగా రామ మోహన్‌ రావు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా తెలుగువారైన రామ మోహన్‌ రావు అమరా 2024, సెప్టెంబరు 2న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. * ఎస్‌బీఐ ఛైర్మన్‌గా సి.ఎస్‌.శెట్టికి పదోన్నతి లభించడంతో, ఖాళీ అయ్యిన స్థానానికి రామ మోహన్‌ రావును ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) ఎంపిక చేసింది. రామ మోహన్‌ రావు ఎంపికతో ఎస్‌బీఐకి ఆయన నాలుగో ఎండీ అవుతారు. 

Current Affairs

బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఎస్‌యు-5

బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఎస్‌యు-5 విభాగంలో భారత్‌ రెండు పతకాలు సాధించింది. తులసిమతి మురుగేశన్‌ రజతం గెలవగా, మనీషా రామ్‌దాస్‌ కాంస్యం సాధించింది. వీళ్లిద్దరూ తమిళనాడుకు చెందిన క్రీడాకారిణులే.  * ఫైనల్లో తులసిమతి చైనా అమ్మాయి యాంగ్‌ కియుగ్జియా చేతిలో ఓడి రజతానికి పరిమితమైంది. * మనీషా కేథరిన్‌ (డెన్మార్క్‌)ను ఓడించి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.

Current Affairs

శీతల్, రాకేశ్‌ జోడీకి కాంస్యం

పారిస్‌ పారాలింపిక్స్‌ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో శీతల్‌ దేవి, రాకేశ్‌ కుమార్‌ జోడీ కాంస్యం సొంతం చేసుకుంది. కంచు పతక పోరులో టాప్‌సీడ్‌ శీతల్‌- రాకేశ్‌ 156-155 తేడాతో ఎలోనోరా- మాటియో (ఇటలీ)పై విజయం సాధించారు.  *  శీతల్‌ 2023 ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. ఈ పోటీల్లో పతకం గెలిచిన చేతుల్లేని మొదటి అమ్మాయి శీతల్‌. ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ రజతం నెగ్గింది. * రాకేశ్‌ కుమార్‌ 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మిక్స్‌డ్‌ స్వర్ణం గెలిచాడు. ఆసియా పారా క్రీడల్లో ఓ స్వర్ణం, రెండు రజతాలు దక్కించుకున్నాడు. 

Current Affairs

యోగేశ్‌కు మరో రజతం

డిస్కస్‌ త్రోలో వరుసగా రెండో పారాలింపిక్స్‌లోనూ యోగేశ్‌ కతూనియా రజతం గెలిచాడు. 2024, సెప్టెంబరు 2న జరిగిన ఎఫ్‌-56 విభాగంలో యోగేశ్‌ 42.22 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరాడు. బ్రెజిల్‌ క్రీడాకారుడు బటిస్తా శాంటోస్‌ 46.86 మీటర్లతో క్రీడల రికార్డు నెలకొల్పుతూ పారాలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ స్వర్ణం సాధించాడు. గ్రీస్‌ అథ్లెట్‌ 41.32 మీటర్లతో కాంస్యం నెగ్గాడు.

Current Affairs

సుమిత్‌ అంటిల్‌కు స్వర్ణం

పారాలింపిక్స్‌ జావెలిన్‌లో సుమిత్‌ అంటిల్‌ స్వర్ణ పతకం నెగ్గాడు. 2024, సెప్టెంబరు 2న జరిగిన మ్యాచ్‌లో అతడు జావెలిన్‌ను 70.59 మీటర్లు త్రో చేసి అగ్రస్థానంలో నిలిచాడు. డూలన్‌ (శ్రీలంక-67.03 మీ) రజతం, బురియన్‌ (ఆస్ట్రేలియా-67.03 మీ) కాంస్యం సాధించారు. * గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ సుమిత్‌ 68.55 మీటర్లతో పసిడి నెగ్గాడు.

Current Affairs

రజతం నెగ్గిన సుహాస్‌ యతిరాజ్‌

పారిస్‌ పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-4 విభాగం ఫైనల్లో సుహాస్‌ యతిరాజ్‌ రజతం నెగ్గాడు. 2024, సెప్టెంబరు 2న జరిగిన ఫైనల్లో సుహాస్‌ 9-21, 13-21తో ఫ్రాన్స్‌ ఆటగాడు లూకాస్‌ మజూర్‌ చేతిలో ఓడాడు.  * టోక్యో పారాలింపిక్స్‌లోనూ సుహాన్‌ రజతం గెలిచాడు.

Current Affairs

నితేశ్‌ కుమార్‌కు స్వర్ణం

పారిస్‌ పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-3 విభాగంలో నితేశ్‌ కుమార్‌ స్వర్ణం నెగ్గాడు.  2024, సెప్టెంబరు 2న జరిగిన ఫైనల్లో నితేశ్‌ 21-14, 18-21, 23-21 తేడాతో టోక్యో రజత పతక విజేత డేనియల్‌ బెతెల్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)పై విజయం సాధించాడు. ఎస్‌ఎల్‌-3 విభాగంలో నడుము కింది భాగంలో వైకల్యం ఉన్న వాళ్లు పోటీ పడతారు. * పారా బ్యాడ్మింటన్‌ టోక్యో పారాలింపిక్స్‌లోనే అరంగేట్రం చేయగా, వరుసగా రెండు ఒలింపిక్స్‌లోనూ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-3 విభాగంలో పసిడి భారత్‌కే దకింది. టోక్యో పారాలింపిక్స్‌లో ప్రమోద్‌ భగత్‌ స్వర్ణం సాధించాడు.

Current Affairs

23వ లా కమిషన్‌ ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం 2024, సెప్టెంబరు 2న 23వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కమిషన్‌లో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి ఛైర్‌పర్సన్‌గా, హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు.  * ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్, మరో నలుగురు సభ్యులు ఉంటారు. 22వ లా కమిషన్‌ కాల వ్యవధి ఆగస్టు 31తో ముగిసింది.