Posts

Current Affairs

యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్‌ విగ్రహం

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని 2025, నవంబరు 26న ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఖాలెద్‌ ఎల్‌ ఎనానీ, 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

Current Affairs

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రజాస్వామ్యం, ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ (ఐఐడీఈఏ) అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 2026 సంవత్సర కాలంలో జరిగే కౌన్సిల్‌ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహిస్తారని ఎన్నికల సంఘం 2025, నవంబరు 26న తెలిపింది.  డిసెంబరు 3న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరగనున్న ఐఐడీఈఏ సభ్యదేశాల సమావేశంలో ఆయన అధ్యక్ష పదవిని స్వీకరిస్తారని తెలిపింది.

Current Affairs

ప్రోత్సాహక పథకం

అరుదైన భూ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించేందుకు రూ.7,280 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘స్కీమ్‌ టు ప్రమోట్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ సింటెర్డ్‌ రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌’కు అనుమతి లభించింది. ఏడాదికి 6,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం సృష్టించడం దీని లక్ష్యం. ఈ పథకం కాల వ్యవధి 7 ఏళ్లు. ఇందులో రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌ (ఆర్‌ఈపీఎం) తయారీ ప్లాంట్‌ ఏర్పాటు కోసం రెండేళ్ల సమయాన్ని (గెస్టేషన్‌ పీరియడ్‌) కూడా కలిపారు. ఆర్‌ఈపీఎం విక్రయాలపై 5 ఏళ్లు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు.

Current Affairs

ఇంద్రజాల్‌ రేంజర్‌

దేశంలోనే మొదటి యాంటీ డ్రోన్‌ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్‌ రేంజర్‌’ను హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న టీ హబ్‌లో 2025, నవంబరు 26న ఆవిష్కరించారు. భారత ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ దేవేంద్ర ప్రతాప్‌ పాండే, ఇంద్రజాల్‌ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్‌ రాజు దీన్ని విడుదల చేశారు. ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని రూపొందించారు.  దేశ సరిహద్దులు, బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్థ స్థలాలు, డ్రోన్‌ దాడి ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలపై ఇది నిఘా పెడుతుంది.

Current Affairs

స్వదేశీ నౌకా ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థ

ఓడరేవుల కోసం దేశంలో మొదటి స్వదేశీ నౌకా ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థను ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దీన్ని అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు 2025, నవంబరు 26న పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఇప్పటికే కేరళలోని విఝింజమ్‌ ఇంటర్నేషనల్‌ సీపోర్ట్‌ లిమిటెడ్‌(వీఐఎస్‌ఎల్‌)లో అమలు చేశారు. పశ్చిమ తీరంలోని మరో రెండు ఓడరేవుల్లోనూ అమలుకు ఐఐటీ మద్రాస్‌తో చర్చలు జరుపుతున్నాయి.   

Walkins

ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

గాంధీనగర్‌లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు:  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లెక్చరర్‌ విభాగాలు: టాక్సికాలజీ, నానోటెక్నాలజీ, ఫోరెన్సిక్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్‌/బ్లాక్‌ చైన్‌, లా, ఐటీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.75,000- రూ.90,000; లెక్చరర్‌కు రూ.68,000. ఇంటర్వ్యూ తేదీలు: 28.11.2025, 01.12.2025. వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ గాంధీనగర్‌ క్యాంపస్‌. Website:https://nfsu.ac.in/Contractual_Recruitment

Internship

ఎక్రాస్‌ ద గ్లోబ్‌ (ఏటీజీ) కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

ఎక్రాస్‌ ద గ్లోబ్‌ (ఏటీజీ)  కంపెనీ డిజిటల్‌ మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: ఎక్రాస్‌ ద గ్లోబ్‌ (ఏటీజీ)  పోస్టు పేరు: డిజిటల్‌ మార్కెటింగ్‌  నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.2,500- రూ.10,000 . వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 19-12-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-digital-marketing-internship-at-across-the-globe-atg1763519255

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌).. నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌, సౌత్ జోన్‌లలో వివిధ విభాగాల్లో  అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్ మేనేజర్‌: 400 విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌, మెకానికల్, మెటలర్జీ, కెమికల్‌, ఐటీ, ఫుడ్‌ టెక్నాలజీ, ఫార్మ,  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(సివిల్, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఐటీ, మెటలర్జీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు ఉండాలి.   జీతం: నెలకు రూ.42,478. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300. దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 26. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్ 25.  ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.  రాత పరీక్ష తేదీ: 2026 జనవరి 11. పరీక్ష కేంద్రాలు: దిల్లీ/గురుగ్రామ్‌, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, భువనేశ్వర్‌, హైదరాబాద్‌, బిలాయ్‌, చెన్నై, పట్నా, లఖ్‌నవూ. Website:https://www.rites.com/Career

Government Jobs

బీఈసీఐఎల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

నొయిడాలోని బ్రాడ్ కాస్ట్‌ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 18 వివరాలు: 1. డ్రైవర్‌: 05 2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈఓ): 10 3. మెడికల్ ఫిజిసిస్ట్(రేడియో థెరపి): 01 4. మెడికల్ ఫిజిసిస్ట్‌(రేడియాలజీ): 01 5. మెడికల్ ఫిజిసిస్ట్‌(న్యూక్లియర్‌ మెడిసిన్‌): 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.  వయోపరిమితి: డ్రైవర్‌కు 21 నుంచి 40 ఏళ్లు, డేటా ఎంట్రీ పరేటర్‌కు 18 నుంచి 40 ఏళ్లు, మెడికల్ ఫిజిసిస్ట్‌కు 35 ఏళ్లు. జీతం: నెలకు డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,506, మెడికల్ ఫిజిసిస్ట్‌కు రూ.75,000, దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.  దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 7. చిరునామా: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), బీఈసీఐఎల్‌ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా-201307 (ఉత్తర్‌ప్రదేశ్‌) చిరునామాకు దరఖాస్తులు పంపిచాలి. ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా. Website:https://www.becil.com/Vacancies

Admissions

మేనేజ్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ఇన్ అగ్రీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్ కోర్సు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్‌) 2026-28 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీడీఎం (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు, అగ్రి రంగంలో మేనేజీరియల్‌ నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందిచారు.  వివరాలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్)- 2026-2028 అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్ సైన్సెస్/ అగ్రికల్చర్ సంబంధ విభాగాల్లో) ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌-2025 స్కోరును కలిగి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2026 నాటికి డిగ్రీ అర్హత సమర్పించాలి. ఎంపిక విధానం: క్యాట్-2025 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, అకడమిక్ రికార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్ష/ ఇంటర్వ్యూ కేంద్రం: మేనేజ్‌ క్యాంపస్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10-02-2026. ఎస్సై రైటింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌ అండ్‌ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 2026. ఫలితాలు: ఏప్రిల్‌/మే 2026. Website:https://www.manage.gov.in/