Posts

Government Jobs

బీఈఎంఎల్ బెంగళూరులో మేనేజీరియల్ ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్‌ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఒప్రంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 40 వివ‌రాలు: 1. మేనేజర్: 10 2. జనరల్ మేనేజర్: 02  3. అసిస్టెంట్ మేనేజర్: 10 4. డిప్యూటీ జనరల్ మేనేజర్: 12 5. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 02 6. చీఫ్ జనరల్ మేనేజర్: 03 7. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: 01 విభాగాలు: రైల్ అండ్ మెట్రో డివిజన్, రోలింగ్ స్టాక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ, రిసెర్చ్ అండ్ డిజైన్, టెస్టింగ్, స్టోర్స్‌, మెయింటెనెన్స్‌, ఫైనాన్స్‌, హెచ్ఆర్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ/సీఎంఏ, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 30 నుంచి 54 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ధ్రుపపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ ధ‌రఖాస్తుల‌కు చివరి తేదీ: 25-10-2024. Website:https://www.bemlindia.in/

Government Jobs

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు

జులై 2025లో ప్రారంభమయ్యే 53వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్‌) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారికి బీటెక్‌ కోర్సు, లెఫ్టినెంట్‌ కొలువులకు ఉచిత శిక్షణ అందుతుంది.  వివరాలు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 52 కోర్సు (టీఈఎస్‌)- జులై 2025 ఖాళీలు: 90. అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 16.5 నుంచి 19.5 ½½ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్స్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా. కోర్సు, శిక్షణ: మొత్తం అయిదేళ్లు కోర్సు, శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌, నాలుగేళ్లు టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీరింగ్‌ (బీఈ/ బీటెక్‌) డిగ్రీ అందజేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2024. Website:https://joinindianarmy.nic.in/Authentication.aspx

Admissions

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌(యూసీడ్‌) 2025

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీబీ) బాంబే- డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌(యూసీడ్‌) 2025’ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ (హైదరాబాద్‌, బాంబే, దిల్లీ, గువాహటి, రూర్కీ), ఐఐఐటీడీఎం(జబల్పూర్‌) సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో బీడిజైన్‌ కోర్సు చేసే అవకాశం ఉంటుంది. వివరాలు: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌(యూసీడ్‌) 2025 అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ లేదా పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపీసీ గ్రూప్‌ చదివినవారుపై 5 విద్యాసంస్థల్లో చేరొచ్చు. ఐఐఐటీడీఎంలో ప్రవేశానికి బైపీసీ అభ్యర్థులు కూడా అర్హులే. బైపీసీ సహా ఆర్ట్స్‌, కామర్స్‌ గ్రూప్‌లు చదివినవారు ఐఐటీ (హైదరాబాద్‌, బాంబే, దిల్లీ)లో చేరవచ్చు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వహించే రెండేళ్ల జాయింట్‌ సర్వీసెస్‌ వింగ్‌ కోర్సు పూర్తిచేసినవారు; నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) నిర్వహించే సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులు కూడా అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  వయో పరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01-10-2000న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 31, 2024. ఆలస్య రుసుంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 8, 2024. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: జనవరి 3, 2025. పరీక్ష తేదీ: జనవరి 19, 2025. ఫలితాల ప్రకటన: మార్చి 07, 2025. Website:https://www.uceed.iitb.ac.in/2025/ Apply online:https://uceedapp.iitb.ac.in/UCEED/home.jsp

Current Affairs

ఐరాసకు మానవతా విభాగాధిపతిగా టామ్‌ ఫ్లెచర్‌

ఐరాస మానవతా వ్యవహారాల విభాగాధిపతిగా బ్రిటన్‌కు చెందిన టామ్‌ ఫ్లెచర్‌ను సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ నియమించారు. ఇంతకుముందు ఈ పదవిని మరో బ్రిటిష్‌ జాతీయుడు మార్టిన్‌ గ్రిఫిత్స్‌ నిర్వహించారు. 

Current Affairs

ప్రపంచ వాణిజ్యంలో 2.7% వృద్ధి

ఈ ఏడాది (2024)లో ప్రపంచ వాణిజ్యం 2.7% వృద్ధి చెందుతుందనే అంచనాను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వ్యక్తం వేసింది. ఏప్రిల్‌ అంచనాల ప్రకారం ఈ వృద్ధి 2.6 శాతమే. 166 దేశాలకు ఈ సంస్థ సభ్యత్వం వహిస్తోంది. 2025 సంవత్సరానికి మాత్రం ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాను 3.3% నుంచి 3 శాతానికి తగ్గించింది. 

Current Affairs

సమగ్ర వార్షిక మాడ్యులార్‌ సర్వే (సీఏఎంఎస్‌)

  దేశంలో ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న 15-24 ఏళ్ల మధ్య వారిలో పల్లెల్లో 82 శాతానికి పైగా ఉన్నారని సమగ్ర వార్షిక మాడ్యులార్‌ సర్వే (సీఏఎంఎస్‌) వెల్లడించింది. నగరాల్లో ఈ వయసు వారు మరింత అధికంగా 92% ఉన్నారని తెలిపింది. 15-24 ఏళ్ల మధ్య వారిలో మొబైల్‌ ఫోన్‌ వాడుతున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో 95.7% ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 97% మంది ఉన్నారని సర్వే గుర్తించింది.  2022 జులై నుంచి 2023 జూన్‌ మధ్య నిర్వహించిన సమగ్ర వార్షిక మాడ్యులార్‌ సర్వే (సీఏఎంఎస్‌) కీలక వివరాలను గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జాతీయ శాంపుల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) 79వ రౌండ్‌లో ఈ సర్వే ఒక భాగమని తెలిపింది. 

Current Affairs

ఫోర్బ్స్‌ ఇండియా 2024 జాబితా

దేశంలోని 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్‌ 2024, అక్టోబరు 10న విడుదల చేసింది. ముకేశ్‌ అంబానీ 119.5 బిలియన్‌ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ గత 12 నెలల్లో 27.5 బి.డాలర్లు పెరింది. గౌతమ్‌ అదానీ 116 బి.డా.తో రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 12 నెలల్లో మాత్రం 48 బి.డా. పెరిగింది. ఈ జాబితాలో సావిత్రి జిందాల్‌ (43.7 బి.డా.), శివ్‌ నాడార్‌ (40.2 బి.డా.), దిలీప్‌ సంఘ్వి (32.4 బి.డా.) వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు. 

Current Affairs

సాహితీ నోబెల్‌ 2024

దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌ కాంగ్‌ (53)కు 2024 సంవత్సర సాహితీ నోబెల్‌ పురస్కారాన్ని 2024, అక్టోబరు 10న ప్రకటించారు. ఆమె రచనల్లో చారిత్రక పరిణామాలు తెచ్చిపెట్టిన మనో వ్యాఘాతాలు, మానవ జీవితంలోని దుర్బలత ప్రగాఢంగా చిత్రితమవుతాయని నోబెల్‌ కమిటీ వివరించింది. సాహిత్యంలో నోబెల్‌ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి, దక్షిణ కొరియా సాహితీవేత్త హాన్‌ కాంగే. 

Current Affairs

రిటైర్మెంట్‌ ప్రకటించిన నాదల్‌

టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ (38) 2024 నవంబరులో స్పెయిన్‌లో జరిగే డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌తో రిటైర్‌ కానున్నట్లు అక్టోబరు 10న ప్రకటించాడు. 2001లో ప్రొఫెషనల్‌ ఆటగాడిగా మారిన నాదల్‌ 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచాడు. అత్యధిక టైటిళ్లు సాధించిన వారిలో జకోవిచ్‌ (24) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచాడు. యుఎస్‌ ఓపెన్‌ను నాలుగు సార్లు సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రెండేసి సార్లు ట్రోఫీ ముద్దాడాడు. నాదల్‌ చివరగా 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆడాడు. ఒలింపిక్స్‌లో నాదల్‌ 2008లో సింగిల్స్, 2016లో డబుల్స్‌ స్వర్ణాలు గెలిచాడు. నవంబర్‌ 19 నుంచి 24 వరకు డేవిస్‌ కప్‌ నాకౌట్‌ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ ఫైనల్స్‌తోనే నాదల్‌ కెరీర్‌కు తెరపడనుంది. 

Current Affairs

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం నెగ్గింది. 2024, అక్టోబరు 10న కజకిస్థాన్‌లోని ఆస్తానాలో జరిగిన పోటీలో భారత్‌ 0-3తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో శరత్‌కమల్‌ 7-11, 10-12, 9-11తో లిన్‌ యూ జూ చేతిలో ఓడగా, తర్వాతి మ్యాచ్‌లో మానవ్‌ థక్కర్‌ 9-11, 11-8, 3-11, 11-13తో చెంగ్‌ చేతిలో ఓడాడు. ఆఖరి మ్యాచ్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 6-11, 9-11, 7-11తో హువాంగ్‌ యన్‌ చేతిలో ఓడి.. భారత్‌ పరాజయం పొందింది.