Posts

Current Affairs

నోయల్‌ టాటా

టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌గా నోయల్‌ టాటా (67) 2024, అక్టోబరు 11న నియమితులయ్యారు. ఈయన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా సవతి సోదరుడు. టాటా ట్రస్ట్స్‌కు టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌లో 66% వాటా ఉంది. టాటా ట్రస్ట్స్‌లోని అన్ని ట్రస్టులకు నోయల్‌ నాయకత్వం వహిస్తారు.  టాటా గ్రూప్‌లోని అన్ని వాణిజ్య సంస్థలను టాటా సన్స్‌ నిర్వహిస్తోంది. 100 దేశాల్లో వినియోగ వస్తువులు, హోటళ్లు, వాహనాలు, విమాన రంగాల్లో 30కి పైగా సంస్థలు టాటా సన్స్‌ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఈ సంస్థల మొత్తం టర్నోవర్‌ 165 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.14 లక్షల కోట్లు). 

Current Affairs

రాజ్యసభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌గా ఘనశ్యామ్‌

రాజస్థాన్‌కు చెందిన భాజపా ఎంపీ ఘనశ్యామ్‌ తివారీ రాజ్యసభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కమిటీ పునర్నిర్మాణంలో భాగంగా ఎగువసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ నియామకాన్ని చేపట్టారు. 2024, అక్టోబరు 11 నుంచి ఇది అమలులోకి వచ్చింది. 

Current Affairs

తూర్పు ఆసియా సదస్సు

లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో జరిగిన 19వ తూర్పు ఆసియా సదస్సులో 2024, అక్టోబరు 11న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు దక్షిణాది దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యురేసియా, పశ్చిమాసియాల్లో వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరత నెలకొనాలని పిలుపునిచ్చారు.  థాయ్‌లాండ్‌ ప్రధానితో వాణిజ్యంపై చర్చలు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు, సాంస్కృతిక సంబంధాలకు ఊతమిచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రతో ప్రధాని మోదీ 2024, అక్టోబరు 11న లావోస్‌లో చర్చలు జరిపారు. షినవత్రతో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. 

Current Affairs

నోబెల్‌ శాంతి బహుమతి 2024

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన పాశవిక అణుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో ఏర్పాటైన ‘నిహాన్‌ హిడాంక్యో’ అనే సంఘానికి నోబెల్‌ శాంతి బహుమతి 2024 వరించింది. ఈ బాధితులు అకుంఠిత దీక్షతో శాంతి, అణ్వస్త్రరహిత ప్రపంచం కోసం గళమెత్తారని అవార్డు కమిటీ పేర్కొంది.  1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా అణు బాంబు ప్రయోగించింది. ఫలితంగా 1.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 9న నాగసాకిపై మరో బాంబును అమెరికా వేసింది. ఇందులో 70 వేల మంది బలయ్యారు. నాటి విధ్వంసంలో ప్రాణాలు దక్కించుకున్నవారిని ‘హిబాకుషా’గా అభివర్ణిస్తుంటారు. వీరు, పసిఫిక్‌ అణ్వస్త్ర పరీక్షల బాధితులు కలిసి 1956లో నిహాన్‌ హిడాంక్యోను ఏర్పాటు చేశారు.

Walkins

అల్వార్‌ ఈఎస్‌ఐసీలో ఫ్యాకల్టీ పోస్టులు

రాజస్థాన్‌ రాష్ట్రం అల్వార్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 104  వివరాలు: 1. ప్రొఫెసర్‌: 08 పోస్టులు 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 21 పోస్టులు 3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 25 పోస్టులు 4. సీనియర్‌ రెసిడెంట్: 34 పోస్టులు 5. సీనియర్‌ రెసిడెంట్ ఎగనెస్ట్ జీడీఎంఓ: 16 పోస్టులు విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ, జనరల్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, జనరల్ సర్జరీ తదితరాలు. అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి:  సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు; సూపర్ స్పెషలిస్ట్ పోస్టులకు 67 ఏళ్లు; ఫ్యాకల్టీ పోస్టులకు 69 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.225; ఎస్సీ/ ఎస్టీ / మహిళ / ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ /పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌, దేసులా, అల్వార్‌, రాజస్థాన్‌. ఇంటర్వ్యూ తేదీ: 21-10-2024. Website:https://mcalwar.esic.gov.in/

Scholarships

ఎన్టీఆర్‌ జీఈఎస్‌టీ (గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్)-2025

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2025)ను డిసెంబర్‌ 8న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థ వెల్లడించింది. దీని ద్వ‌రా ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందిస్తారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నారు. వివరాలు: ఎన్టీఆర్‌ జీఈఎస్‌టీ (గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్)-2025 అర్హతలు: ప్రస్తుత విద్యాసంవత్సరం (2024-25) పదో తరగతి (స్టేట్‌/ సీబీఎస్‌ఈ/ ఐసీఎస్‌ఈ) చదువుతున్న విద్యార్థినులు అర్హులు. పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలు. పరీక్షాంశాలు: మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జీకే, పదో తరగతి స్థాయి రీజనింగ్. రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2024. పరీక్ష తేదీ: 08-12-2024. స్థలం: ఎన్టీఆర్ జూనియర్ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, ఆర్‌ఆర్‌ జిల్లా. Website:https://ntrcollegeforwomen.education/ntr-gest-scholarship-inter/ Apply online:https://pages.razorpay.com/pl_P4sy3rLgibB49u/view

Internship

ఎర్న్‌వెల్‌లో ఫైనాన్స్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఖాళీలు

ఎర్న్‌వెల్ కంపెనీ ఫైనాన్స్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: పోస్టు: ఫైనాన్స్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌  కంపెనీ: ఎర్న్‌వెల్‌  నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌ తదితరాలు. స్టైపెండ్‌: నెలకు రూ.5,000. వ్యవధి: 2 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 06-11-2024 Website:https://internshala.com/internship/detail/work-from-home-finance-and-wealth-management-internship-at-earnwell1728291146

Government Jobs

యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు

చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న త‌మ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 200 వివ‌రాలు:  1. స్పెషలిస్టులు: 100  2. జనరలిస్ట్‌లు: 100 విభాగాలు: రిస్క్ మేనేజ్‌మెంట్, లీగల్ డేటా అనలిటిక్స్‌, ఫైనాన్స్‌ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, ఆటోమొబైల్, కెమికల్/ మెకాట్రానిక్స్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో సీఏ/ సీడబ్ల్యూఏ, డిగ్రీ (లా/ బీకామ్), బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంకామ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీత భత్యాలు: నెలకు రూ.50,925 - రూ.96,765. దరఖాస్తు ఫీజు: రూ.1000+జీఎస్‌టీ; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250+జీఎస్‌టీ. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-11-2024 Website:https://uiic.co.in/en/home

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో టెక్నీషియన్ ఖాళీలు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్ని్కల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్ (రైట్స్‌) ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్‌-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 15 వివ‌రాలు: అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అప్రెంటిస్ (సివిల్ ఇంజినీరింగ్) సర్టిఫికేట్ తప్పనిసరి.  జీతం: నెలకు రూ.22,000-రూ.66,000. దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 8-11-2024. Website:https://www.rites.com/

Government Jobs

ఎన్‌టీఆర్ఓలో సైంటిస్ట్ ‘బి’ పోస్టులు

దిల్లీలోని నేషనల్ టెక్నీకల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్ఓ) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ ‘బి’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 75 వివ‌రాలు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్‌, జియో- ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్, మ్యాథమేటిక్స్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గేట్ స్కోరు తప్పనిసరి. వయోపరిమితి: 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీత భత్యాలు: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500. దరఖాస్తు ఫీజు: రూ.250; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: గేట్‌ స్కోరు, రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2024 Website:https://ntro.gov.in/welcome.do