ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్లో మేనేజర్ పోస్టులు
న్యూ దిల్లీలోని ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ (ఈపీఐఎల్) ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: మేనేజర్ (గ్రేడ్-2)- 18 అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంసీఏ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.50,000. వయోపరిమితి: 35 మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ఏజీఎం, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కోర్-3, స్కోప్ కాంప్లెక్స్, లోధీ రోడ్, న్యూదిల్లీ. దరఖాస్తు చివరి తేదీ: 29.10.2025. Website:https://epi.gov.in/