Posts

Current Affairs

మానవ హక్కుల దినోత్సవం

జాతి, కులం, లింగం లేదా మరే ఇతర హోదాతో సంబంధం లేకుండా మానవులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, భావప్రకటన లాంటి మౌలిక హక్కులు ఉంటాయి. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి సమాజంలో ఒక సభ్యుడిగా అనుభవించే కనీస హక్కులనే ‘మానవ హక్కులు’ అంటారు. వీటి పరిరక్షణకు ఆయా దేశాలు చట్టబద్ధత కల్పించాయి. ప్రజలందరికీ తమ హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 10న ‘మానవ హక్కుల దినోత్సవం’గా (Human Rights Day) నిర్వహిస్తారు. హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడం, వాటి రక్షణ కోసం పోరాడుతున్న వ్యక్తులు - సంస్థలను గౌరవించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మానవులపై అనేక దురాగతాలు చోటుచేసుకున్నాయి, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మనుషులపై జరిగే దారుణాలను నిరోధించి, వారి గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 1948, డిసెంబరు 10న విశ్వమానవ హక్కుల ప్రకటనను  ఆమోదించింది. దీనికి గుర్తుగా ఏటా డిసెంబరు 10న ‘మానవ హక్కుల దినోత్సవం’గా జరుపుకోవాలని 1950లో ఐరాస జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. వివక్ష, అసమానతలు, అణచివేత లాంటి వాటికి వ్యతిరేకంగా మానవ హక్కులకు సంబంధించి కొనసాగుతున్న పోరాటాల గురించి అవగాహన కల్పించడం లాంటివి ఈ రోజు చేస్తారు. 2025 నినాదం: Human Rights, Our Everyday Essentials

Current Affairs

తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు

తెలంగాణలో ఇంతవరకు పదో తరగతికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌కు ఇంటర్మీడియట్‌ బోర్డులు పనిచేస్తుండగా.. వాటిని మిళితం చేసి ‘తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు (టీజీఎస్‌ఈబీ)’ పేరిట ఒకటే ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రైజింగ్‌ దార్శనికత పత్రం-2047లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే వేర్వేరు బోర్డులున్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు ఒకే బోర్డును ప్రతిపాదించింది.  ఈ మేరకు విద్యా ప్రమాణాలు, నాణ్యత, గుర్తింపునకు సంబంధించి అన్ని రకాల పాఠశాలల కోసం తెలంగాణ స్కూల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (టీజీఎస్‌ఎస్‌ఏ)ని ఏర్పాటు చేస్తారు. పరీక్షల విధానం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించే విధానాల్లో మార్పులు చేస్తారు.

Current Affairs

ది లాన్సెట్‌’ జర్నల్‌

2023 నాటికి- బాల్యంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 101 కోట్లుగా ఉందని ఒక అధ్యయనం తెలిపింది. సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింస (ఐపీవీ)కు గురైన మహిళల సంఖ్య 60.8 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. 2023 నాటికి 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసుకు చేరుకున్నవారి పరిస్థితినే ఈ అధ్యయనంలో విశ్లేషించినట్లు పేర్కొంది. ‘ది లాన్సెట్‌’ జర్నల్‌లో సంబంధిత వివరాలు ప్రచురితమయ్యాయి. వాటి ప్రకారం- లైంగిక వేధింపులు, ఐపీవీకి సంబంధించిన ఘటనలు సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, దక్షిణాసియాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. భారత్‌లో మహిళల్లో 30% మంది, పురుషుల్లో 13% మంది బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. మహిళల్లో 23% మంది సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింసకు గురయ్యారు. 

Current Affairs

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌

జూనియర్‌ హకీ ప్రపంచకప్‌లో భారత జట్టు కాంస్యం నెగ్గింది. 2025, డిసెంబరు 10న ఆతిథ్య జట్టు అర్జెంటీనాను 4-2తో ఓడించి మూడో స్థానం సాధించింది. సెమీస్‌లో భారత్‌ను ఓడించిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ.. ఫైనల్లో విజయం సాధించింది. ఆ జట్టు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. నిర్ణీత సమయంలో 1-1తో సమమైన ఫైనల్లో జర్మనీ షూటౌట్‌లో 3-2తో స్పెయిన్‌ను ఓడించింది.

Current Affairs

2025-26లో భారత వృద్ధి 7.2%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదు కావొచ్చని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన 6.5 శాతాన్ని గణనీయంగా పెంచింది. ద్రవ్యోల్బణ అంచనాను కూడా 3.1% నుంచి 2.6 శాతానికి ఏడీబీ సవరించింది. ఇటీవలి జీఎస్‌టీ రేట్ల కోతలు.. దేశీయ వినియోగం, వృద్ధికి మద్దతు ఇస్తాయని తెలిపింది. 

Current Affairs

దీపావళికి యునెస్కో గుర్తింపు

యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో దీపావళి పండగను చేర్చారు. దిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో 2025, డిసెంబరు 10న ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌కు చెందిన 15 అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లయింది. వీటిలో కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌లోని గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణ గాథను ప్రదర్శించే రామ్‌లీల సంప్రదాయ ప్రదర్శనలున్నాయి. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని యునెస్కో ప్రతినిధులు వెల్లడించారు.

Internship

డీఆర్‌డీఓ ఎస్‌ఏజీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

న్యూదిల్లీలోని డీఆర్‌డీవో- సైంటిఫిక్‌ అనాలసిస్‌ గ్రూప్‌ (ఎన్‌ఏజీ) ఆరు నెలల కాలానికి యూజీ, పీజీ ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 30 వివరాలు: అర్హత: బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ విభాగాలు: సీఎస్‌/ఏఐ/ఐఎస్‌ఈ/సైబర్‌ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్‌/ ఈసీఈ/ఈఐఈ, ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు. అర్హత: సంబంధిత విభాగాల్లో చివరి ఏడాది బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ అర్హత ఉండాలి. స్టైపెండ్‌: నెలకు 5,000 చొప్పున ఆరు నెలలకు మొత్తం రూ.30,000. ఎంపిక విధానం: విద్యార్హతల్లో మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్‌ (saghr.sag@gov.in) ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 19.12.2025. Website:https://www.drdo.gov.in/drdo/en/offerings/vacancies 

Government Jobs

ఎన్టీపీసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఎన్టీపీసీ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్‌ (ఐబీడీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ (కంబైన్డ్‌ సైకిల్ పవర్‌ ప్లాంట్‌-ఓ అండ్ ఎం): 15 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్‌/ఇనుస్ట్రుమెంటేషన్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు.  జీతం: నెలకు రూ.90,000.  దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/సీబీటీ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 24.  Website:https://careers.ntpc.co.in/recruitment/

Government Jobs

ఐఐబీఎఫ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐబీఎఫ్‌) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్‌: 10 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఎంకామ్‌, ఎంఏ, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 నవంబర్ 1వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.40,400 - రూ.1,30,400. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.700 + జీఎస్‌టీ. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 13. Website:https://www.iibf.org.in/

Apprenticeship

రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్‌ రాష్ట్రం కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్) యాక్ట్ అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికషన్‌ విడుదల చేసింది.  వివరాలు: యాక్ట్ అప్రెంటిస్: 550 ఖాళీలు (యూఆర్‌-275; ఎస్సీ-85; ఎస్టీ-42; ఓబీసీ-148) ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్, మోటర్‌ వెహికిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌. అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 07-01-2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-01-2026. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 09-01-2026. Website:https://rcf.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,296,640