Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

కోల్‌ ఇండియా సీఈఓగా సాయిరాం

ప్రభుత్వ రంగ కోల్‌ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్న బి.సాయిరాంను సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమితులయ్యారు. దీనికి కంపెనీ బోర్డు 2025, డిసెంబరు 26న ఆమోదం తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో కోల్‌ ఇండియాకు 80% వాటా ఉంది. 

Current Affairs

రాష్ట్రీయ బాల పురస్కార్‌

వీర బాలదివస్‌ సందర్భంగా కేంద్ర మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ప్రకటించిన ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’ను 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలు అందుకున్నారు. ధైర్యసాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, సామాజికసేవ, శాస్త్రసాంకేతిక, క్రీడా విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని ఈ పురస్కారాలు వరించాయి. 2025, డిసెంబరు 26న విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు స్వీకరించారు. ఇందులో తెలంగాణ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పర్వతారోహకుడు విశ్వనాథ్‌కార్తికేయ పడకంటి, ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన 17 ఏళ్ల శివాని హోసూరు ఉప్పర ఉన్నారు.

Current Affairs

చైనా

ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌ వే సొరంగాన్ని చైనా 2025, డిసెంబరు 26న ప్రారంభించింది. ‘తియాన్షన్‌ షెంగ్లీ’గా దానికి నామకరణం చేశారు. ఈ సొరంగం పొడవు 22.13 కిలోమీటర్లు. వాయవ్య చైనాలోని షింజియాంగ్‌ యూగర్‌ అటానమస్‌ రీజియన్‌లో సెంట్రల్‌ తియాన్షన్‌ పర్వతాల మీదుగా ఇది వెళ్తుంది. ఆ పర్వతాల్లో గంటల పాటు పట్టే ప్రయాణ సమయాన్ని తియాన్షన్‌ షెంగ్లీ సొరంగం 20 నిమిషాలకు తగ్గిస్తుంది.

Current Affairs

7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లతో కలిసి సీఎం చంద్రబాబు 2025, డిసెంబు 26న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Current Affairs

అగరబత్తీలకు కొత్త నాణ్యతా ప్రమాణాలు

ప్రపంచంలోనే అత్యధికంగా అగరబత్తీలను తయారు చేస్తూ, ఎగుమతి చేస్తున్న మన దేశంలో, వీటి నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం నూతన నిబంధనలు జారీ చేసింది. ఇందుకోసం భారత ప్రమాణాల మండలి (బీఐఎస్‌) మార్గదర్శకాలు విడుదల చేసింది.  ప్రస్తుతం దేశీయ అగరబత్తీల వ్యాపార పరిమాణం సుమారు రూ.8,000 కోట్లుగా ఉంది. వినియోగదారు ఆరోగ్య భద్రత, అగరుబత్తీలు వెలిగించే గదిలో వాయు నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ నిబంధనలు, కొన్ని రకాల సువాసన ఉత్పత్తులు, రసాయనాలపై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని.. అగరబత్తీల కోసం ప్రత్యేకంగా ‘ఐఎస్‌ 19412:2025’ ప్రమాణాలను రూపొందించారు. 

Current Affairs

పత్రికా పఠనం తప్పనిసరి

విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి, పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను     అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం విద్యార్థుల్ని సమావేశపరిచే సమయంలో కనీసం పది నిమిషాల సమయాన్ని వార్తాపత్రికల పఠనానికి కేటాయించాలని స్పష్టంచేసింది.

Internship

మిపాస్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

మిపాస్‌ (Mepass) వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: మిపాస్‌ పోస్టు పేరు: కార్పొరేట్‌ రిలేషన్స్‌   నైపుణ్యాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్, క్లయింట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం), ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్, నెట్‌వర్కింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.10,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 21-01-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-corporate-relations-partnerships-internship-at-mepass1766389839

Government Jobs

నాల్కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ: 110 పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు:  మెకానికల్ ఇంజినీరింగ్‌: 59 పోస్టులు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌: 27 పోస్టులు కెమికల్ ఇంజినీరింగ్‌: 24 అర్హత: 65% మార్కులతో బీఈ, బీటెక్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2025 అర్హత సాధించి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: 22.01.2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. పే స్కేల్: శిక్షణ కాలంలో రూ.40,000 - రూ.1,40,000. శిక్షణ అనంతరం రూ.60,000- రూ.1,80,000. ఎంపిక ప్రక్రియ: ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్‌-2025) మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఇతరులకు రూ.100. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.01.2026. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-01-2026. Website:https://mudira.nalcoindia.co.in/rec_portal/default.aspx

Government Jobs

ఎంఓఐ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ పోస్టులు

నాగ్‌పూర్‌లోని మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్‌) వివిధ  విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, మేనేజ్‌మెంట్ ట్రెయినీ, మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 67 వివరాలు: 1. గ్రాడ్యుయేట్ ట్రెయినీ: 49 2. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ: 15 3. మేనేజర్‌: 03 విభాగాలు: మైనింగ్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, జియాలజీ, ప్రాసెస్, మెటీరియల్,  సిస్టం, పర్సనల్‌, మార్కెటింగ్‌, సర్వే. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 2026 జనవరి 20వ తేదీ నాటికి 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు మెనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000, మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.590, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 20. Website: https://moil.nic.in/recruitment-detail/82/RECRUITMENT%20OF%20GRADUATE%20TRAINEES%20/%20MANAGEMENT%20TRAINEES%20&%20MANAGER(SURVEY)

Apprenticeship

ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌లో లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) వివిధ రాష్ట్రాల్లో ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 501 వివరాలు: రాష్ట్రాల వారిగా ఖాళీలు.. 1. దిల్లీ: 120 2. హరియాణ: 30 3. పంజాబ్‌: 49 4. చండీగఢ్‌: 30 5. హిమాచల్‌ ప్రదేశ్‌: 09 6. జమ్మూ కశ్మీర్‌: 08 7. రాజస్థాన్‌: 90 8. ఉత్తర్‌ ప్రదేశ్‌: 140 9. ఉత్తరాఖండ్‌: 25 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, టెలీకమ్యూనికేషన్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్‌, మెషినిస్ట్, డేటా ఎంట్రీ, సివిల్, ఫిట్టర్‌, మొదలైనవి.. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఐటీఐ, డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 31.12.2025 తేదీ నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: జనవరి 12. Website:https://iocl.com/apprenticeships