Posts

Current Affairs

Suravaram Sudhakar Reddy

♦ Veteran Communist Party of India (CPI) leader and former Member of Parliament, Suravaram Sudhakar Reddy, died in hyderabad on 22 August 2025. ♦ He was 83. He was born on March 25, 1942, in Kondravpally village of Telangana's Mahabubnagar district. ♦ He was a two-time Member of Parliament, representing the Nalgonda constituency in the 12th (1998-1999) and 14th (2004-2009) Lok Sabha.  ♦ Sudhakar Reddy was elected as the general secretary of the CPI in 2012 during the national congress held in Patna. ♦ He was re-elected to the post in 2015 (Puducherry) and again in 2018 (Kollam). ♦ Though his term was set to continue until 2021, he stepped down from the role on July 24, 2019, citing health reasons.

Current Affairs

Kajal Dochak won a gold medal

♦ India’s Kajal Dochak won a gold medal in the U-20 World Wrestling Championships held at Samokov in Bulgaria on 22 August 2025. ♦ She defeated China’s Yuqi Liu 8-6 in a stiff 72kg final.   ♦ While Shruti and Saarika grabbed bronze medals in the women’s event. ♦ Saarika secured bronze in the women’s 53kg category with a technical superiority win over Poland’s Ilona Valchuk. ♦ Shruti earned bronze in the 50kg category, defeating Germany’s Josephine Wrench 6-0.  ♦  In the men’s Greco-Roman 60kg category, Suraj clinched bronze by overcoming France’s Lucas Go Grasso. ♦ So far, Indian wrestlers have won nine medals – two gold, four silver and three bronze – at the ongoing championships.

Current Affairs

రష్యాలో వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా ‘మ్యాక్స్‌’

విదేశీ డిజిటల్‌ సర్వీసులపై ఆధారపడకుండా సొంత డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా సొంత యాప్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరి మొబైల్‌ ఫోన్, ట్యాబ్లెట్‌లలో ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌గా ‘మ్యాక్స్‌’ను ఉంచాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్‌లో ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. 

Current Affairs

ఆదాయపు పన్ను చట్టం-2025ను ఆమోదించిన రాష్ట్రపతి

ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, ఆగస్టు 22న ఆమోదం తెలిపారు. దీంతో ఆదాయపు పన్ను చట్టం-1961ని ఇది భర్తీ చేయనుంది. ఆదాయపు పన్ను చట్టం-2025.. 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది పన్ను చట్టాలను మరింత సులభతరం చేయనుంది.  ఆదాయపు పన్ను-2025 బిల్లును ఈ నెల 12న పార్లమెంటు ఆమోదించింది.

Current Affairs

గౌహర్‌ సుల్తానా

హైదరాబాద్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ గౌహర్‌ సుల్తానా (37 ఏళ్లు) క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2008లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేసిన ఆమె.. భారత్‌ తరఫున 50 వన్డేలు, 37 టీ20లు ఆడింది. ఆమె 2014 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ (టీ20)లో కనబడింది. గౌహర్‌ వన్డేల్లో 66 వికెట్లు.. టీ20ల్లో 29 వికెట్లు పడగొట్టింది. 2009, 2013 వన్డే ప్రపంచకప్‌ల్లోనూ ఆడి 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసింది. 2009-2014 మధ్య మూడు టీ20 ప్రపంచకప్‌లలో పాల్గొని ఏడు వికెట్లు పడగొట్టింది.

Current Affairs

అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌

అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాజల్‌ పసిడి పతకాన్ని నెగ్గింది. 2025, ఆగస్టు 22న సామోకోవ్‌ (బల్గేరియా)లో జరిగిన మహిళల 72 కేజీల ఫైనల్లో కాజల్‌ 8-6తో యుకిలూ (చైనా)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు దక్కిన రెండో స్వర్ణమిది. ఇంతకుముందు తపస్య (57 కేజీ) పసిడి నెగ్గింది. 

Current Affairs

సురవరం కన్నుమూత

కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) 2025, ఆగస్టు 22న హైదరాబాద్‌లో మరణించారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన ఆయన... మూడు దఫాలు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన కంటే ముందు చండ్ర రాజేశ్వరరావు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.  సుధాకర్‌రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో జన్మించారు. 1988, 2004లో నల్గొండ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2000లో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. 2012 పట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2021 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జులై 24న వైదొలిగారు.

Walkins

ఈఎస్‌ఐసీలో ముంబయిలో ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ముంబయి ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: 1.సీనియర్ రెసిడెంట్ 18 విభాగాలు: సర్జరీ,ఆర్థోపెడిక్స్, డెంటిస్ట్రీ, నియోనాటాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ ,అనాటమీ, ఫిజియాలజీ,బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్, మెడిసిన్, క్యాజువాలిటీ, అబ్స్టెట్రిక్స్ ,గైనకాలజీ. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.67,700.  ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 2025 ఆగస్టు 25, 26. వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 5వ అంతస్తు, ఈఎస్ఐసీ హాస్పిటల్ ప్రాంగణం, కాండివలి, అక్రూలి రోడ్, కాండివలి ఈస్ట్, ముంబయి - 400101. Website:https://esic.gov.in/recruitments

Walkins

ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ గోరఖ్‌పూర్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్   పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: సీనియర్ రెసిడెంట్ - 50 విభాగాలు: అనస్థీషియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ,ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్ ,రేడియాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, ట్రామా & ఎమర్జెన్సీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  ఎన్ఎంసీ ఎంసీఐ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ(ఎనస్థీసియా/ఎమర్జెన్సీ మెడిసిన్/జనరల్ మెడిసిన్/జనరల్ సర్జరీ/ఆర్థోపెడిక్స్‌)లో ఉత్తీర్ణత ఉండాలి.  జీతం: నెలకు రూ.67,700. గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు. దరఖాస్తు ఫీజు: జనరల్ ఈడౠ్ల్యఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.250.పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ తేదీ: 26 -08 -2025.  ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎయిమ్స్ క్యాంపస్, కున్రాఘాట్, గోరఖ్‌పూర్, ఉత్తర్‌ ప్రదేశ్‌ -273008. Website:https://aiimsgorakhpur.edu.in/category/current-recruitment-notice/

Government Jobs

యూసీఐఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

ఝార్ఖండ్‌లోని యునిరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌, ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 95 వివరాలు: 1. మేనేజ్‌ మెంట్‌ ట్రైనీ: 13 2. గ్రాడ్యుయేట్‌ ఆపరేషనల్ ట్రైనీ: 20 3. డిప్లొమా ట్రైనీ: 62 అర్హత: పోస్టులను అనుసరించి బీటెక్‌, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు 28 ఏళ్లు, మిగతా పోస్టులకు 30 ఏళ్లు. స్టైపెండ్‌: నెలకు మేనేజ్‌మెంట్‌ ట్రైనీకి రూ.40,000, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అపరేషనల్ ట్రైనీకి రూ.29,990. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 ఆగస్టు 30. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 24. Website:https://www.ucil.gov.in/job.html