Posts

Current Affairs

ఇజ్రాయెల్‌

మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింహ్‌జీ విగ్రహాన్ని నెవాటిమ్‌ (ఇజ్రాయెల్‌)లోని యూదు రైతుల సహకార సంఘమైన ‘‘మోషవ్‌’’లో ఆవిష్కరించారు. మహారాజా రంజిత్‌సింహ్‌జీ గుజరాత్‌లో ప్రస్తుతం జామ్‌నగర్‌గా ప్రసిద్ధమైన నవనగర్‌ సంస్థానాధీశుడు. ప్రపంచ యుద్ధకాలంలో అత్యంత దయాగుణం కనబరిచిన ఆ సంస్థానాధీశుని విగ్రహం స్థాపించడం ద్వారా ఇండియన్‌ జ్యూయిష్‌ హెరిటేజ్‌ సెంటర్, కొచిని జ్యూయిష్‌ హెరిటేజ్‌ సెంటర్‌లు ఆయనను మరణానంతరం సత్కరించాయి.

Current Affairs

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు (నవంబరు 10) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 7% పెరిగి రూ.12.92 లక్షల కోట్లకు చేరాయి. 2024-25 ఇదే సమయానికి ఈ వసూళ్లు రూ.12.08 లక్షల కోట్లుగా ఉన్నాయి.  2025 ఏప్రిల్‌ 1 నుంచి నవంబరు 10 మధ్య రిఫండ్‌ల జారీ 18% తగ్గి రూ.2.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నికర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు ఏడాది క్రితం (2024) రూ.5.08 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు రూ.5.37 లక్షల కోట్లకు పెరిగాయి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్‌యూఎఫ్‌ల)తో కూడిన నాన్‌ కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.6.62 లక్షల కోట్ల నుంచి రూ.7.19 లక్షల కోట్లకు చేరాయి. 

Current Affairs

హురున్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జాబితా

ప్రపంచంలోనే ఎక్కువ మంది బిలియనీర్లు (కుబేరులు) ఉండే అగ్రగామి 10 నగరాల్లో భారత్‌ నుంచి ముంబయి, దిల్లీ చోటు దక్కించుకున్నాయని హురున్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక వృద్ధికి ఊతంగా నిలుస్తున్న ఈ నగరాలు, ప్రపంచవ్యాప్త బిలియనీర్ల పటంలోనూ చోటు దక్కించుకోగలిగాయి. కనీసం బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8800 కోట్లు) సంపద కలిగిన వ్యక్తులు న్యూయార్క్‌లో 119 మంది ఉండడంతో, ఈ జాబితాలో అగ్రస్థానం దక్కింది.  

Current Affairs

బుకర్‌ ప్రైజ్‌

కెనడియన్‌-హంగరియన్‌-బ్రిటిష్‌ రచయిత డేవిడ్‌ సలై ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ గెలుపొందారు. ఆయన రచించిన ‘ఫ్లెష్‌’ నవలకుగానూ ఈ అవార్డు దక్కింది. భారత రచయిత్రి కిరణ్‌ దేశాయ్‌ నవల ‘ది లోన్లీనెస్‌ ఆఫ్‌ సోనియా అండ్‌ సన్నీ’ నవలను వెనక్కినెట్టి ఈ పోటీలో ఆయన విజయం సాధించారు. 51 ఏళ్ల డేవిడ్‌ సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించారు. 2025, నవంబరు 11న లండన్‌లో జరిగిన వేడుకలో డేవిడ్‌ రూ.50,000 పౌండ్లను, జ్ఞాపికను అందుకున్నారు. 2024 బుకర్‌ ప్రైజ్‌ విజేత సమంత హార్వీ వీటిని అందజేశారు.

Walkins

ఎన్‌ఐఈపీఎండీలో కన్సల్టెంట్‌ పోస్టులు

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌)లోని ఎన్‌బీఈఆర్‌ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు సంఖ్య: 13 వివరాలు: 1. సీనియర్‌ కన్సల్టెంట్‌: 02 2. కన్సల్టెంట్‌: 05 3. జూనియర్‌ కన్సల్టెంట్‌: 02 4. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 02 5. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ కన్సల్టెంట్‌కు రూ.60,000; కన్సల్టెంట్‌కు రూ.50,000; జూనియర్‌ కన్సల్టెంట్‌కు రూ.40,000; డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,000; మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు రూ.18,000. వయోపరిమితి: డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు 35 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు వయసు పరిమితి లేదు. ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.200. డీడీ ద్వారా చెల్లించాలి. ఇంటర్వ్యూ తేదీ: 17.11.2025. వేదిక: ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌. Website:https://www.niepmd.tn.nic.in/

Walkins

సీసీఆర్‌ఏఎస్‌లో కన్సల్టెంట్‌ ఉద్యోగాలు

దిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ( సీసీఆర్‌ఏఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ (ఆయుర్వేదం) ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: కన్సల్టెంట్ (ఆయుర్వేదం) - 05 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ, ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  వయోపరిమితి: 2025 నవంబరు 21వ తేదీ నాటికి 64 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు రూ.50,000.  ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025, నవంబర్‌ 21. వేదిక: కౌన్సిల్ మొదటి అంతస్తులోని ఆయుష్ ఆడిటోరియం. Website:https://ccras.nic.in/vacancies/

Internship

నోటరీ యాప్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

నోటరీ యాప్‌ కంపెనీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: నోటరీ యాప్‌  పోస్టు పేరు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.11,000- రూ.16,500. వ్యవధి: 3 నెలలు  దరఖాస్తు గడువు: 05-12-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-business-development-sales-internship-at-notary-app1762316508

Government Jobs

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌ ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ముంబయి రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. మేనేజర్‌: 05  2. డిప్యూటీ మేనేజర్‌: 05  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బీఎస్సీ, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 నవంబర్‌ 1వ తేదీ నాటికి మేనేజర్‌ పోస్టులకు 28 నుంచి 40 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు,  పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు మేనేజర్‌కు రూ.85,920 - రూ.1,05,280, డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 - రూ.93,960.  దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 1. Website:https://sbi.bank.in/web/careers/current-openings

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో ఇండివిడ్యువల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఇండివిడ్యువల్ కన్సల్టెంట్‌ పోస్టుల దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: ఇండివిడ్యువల్‌ కన్సల్టెంట్‌: 17 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 62 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.60,000 - రూ.2,55,000.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 8. Website:https://www.rites.com/Career

Apprenticeship

మిధాని, హైదరాబాద్‌లో ట్రేడ్, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు

హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) వివిధ విభాగాల్లో 2025 ఏడాదికి సంబంధించి  ఐటీఐ ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 210 వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 30  టెక్నీషియన్‌ డిప్లొమా అప్రెంటిస్‌: 20 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 160  ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్ మెకానిక్, ఏపీ మెకానిక్, వెల్డర్, సీవోపీఏ, ఫోటోగ్రాఫర్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌, మెటలార్జీ, మెటకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఐటీ తదితరాలు. అర్హత: సంబంధిత విభాగంలో/ట్రేడులో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌, ఐటీఐ,  ఉత్తీర్ణత. స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,300; టెక్నీషియన్‌కు రూ.10,900; ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.9,600. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో పొందిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు.   దరఖాస్తు విధానం: అప్రెంటిషిప్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తరువాత అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకొని దరఖాస్తు హార్డ్‌కాపీలను పోస్ట్‌ ద్వారా అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, ట్రైనింగ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, మిధానీ, కంచన్‌భాగ్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 10.12.2025. Website:https://midhani-india.in/