Posts

Current Affairs

Swasth Nari, Sashakt Parivar Abhiyaan

♦ India has achieved three Guinness World Record titles under the campaign Swasth Nari, Sashakt Parivar Abhiyaan on 31 October 2025. ♦ The initiative set multiple records, including the highest number of people to register for a health care platform in a single month, numbering over 3.21 crore. ♦ It also achieved the record for most people to sign up for a breast cancer screening online in one week. ♦ Over 9.94 lakh women had signed up for the screening. ♦ Besides these, a record number of 1.25 lakh people signed up for vital signs screening online in one week at the state level.  ♦ The campaign which started from 17th September to 2nd of November has witnessed unprecedented community participation.  ♦ More than 5 lakh Panchayati Raj representatives, 1.14 Crore school and college students, 94 lakh SHG members, and 5 lakh other community platform members participated in the campaign.

Current Affairs

Defense agreement between India and the US

♦ India and the United States signed a 10-year Defence Framework Agreement on 31 October 2025, marking a new era in their growing partnership. ♦ The agreement, exchanged between Defence Minister Rajnath Singh and US Secretary of War Pete Hegseth in Kuala Lumpur, provides a long-term policy direction for the US–India Major Defence Partnership. ♦ The meeting between the two leaders took place on the sidelines of the ASEAN–India Defence Ministers’ Informal Meeting in Kuala Lumpur. ♦ The informal session was held ahead of the ASEAN Defence Ministers’ Meeting Plus (ADMM-Plus), scheduled for November 1, where regional security and cooperation will be key topics of discussion.

Current Affairs

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్‌

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ (62) తెలంగాణ రాష్ట్ర మంత్రిగా 2025, అక్టోబరు 31న పమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ.. అజారుద్దీన్‌తో ప్రమాణం చేయించారు. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జన్మించిన అజారుద్దీన్‌ అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్య, నిజాం కళాశాలలో డిగ్రీ అభ్యసించారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తొలి మూడు టెస్టుల్లోనే వరుస సెంచరీలు సాధించి సంచలనం సృష్టించారు. 

Current Affairs

అమెరికా సంస్థతో ఎల్‌ అండ్‌ టీ ఒప్పందం

దేశ రక్షణ దళాల కోసం మానవ రహిత విమానాలను దేశీయంగా తయారు చేసేందుకు అమెరికా సంస్థ అటామిక్స్‌ ఏరోనాటికల్‌ సిస్టమ్స్, ఇంక్‌.(జీఏ-ఏఎస్‌ఐ)తో మౌలిక రంగ దిగ్గజం ఎల్‌ అండ్‌ టీ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద ఇరు కంపెనీలు కలిసి మీడియం ఆల్టిట్యూట్‌ లాంగ్‌ ఎండ్యూరన్స్‌ (ఎమ్‌ఏఎల్‌ఈ) రిమోట్లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌(ఆర్‌పీఏఎస్‌)ను భారత్‌లో తయారు చేస్తాయి. ఎల్‌ అండ్‌ టీకి రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల్లో ప్రెసిషన్‌ తయారీ, సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌ సామర్థ్యాలుండగా.. జీఏ-ఏఎస్‌ఐకి ఈ రంగాల్లో నిర్వహణ నైపుణ్యం ఉంది. 

Current Affairs

దిగ్గజ గోల్‌కీపర్‌ ఫ్రెడరిక్‌ మృతి

భారత పురుషుల హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్‌ మాన్యుయెల్‌ ఫ్రెడరిక్‌ (78) 2025, అక్టోబరు 31న బెంగళూరులో కన్నుమూశారు. 1972 మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో ఫ్రెడరిక్‌ సభ్యుడు. 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. 1947 అక్టోబరు 20న కన్నూర్‌లోని బర్నస్సేరిలో జన్మించిన ఫ్రెడరిక్‌.. కేరళకు మొదటి ఒలింపిక్‌ పతకాన్ని అందించాడు. 

Current Affairs

ప్రొ కబడ్డీ టైటిల్‌ విజేత దిల్లీ

ప్రొ కబడ్డీ సీజన్‌-12 విజేతగా దిల్లీ నిలిచింది. 2025, అక్టోబరు 31న దిల్లీ త్యాగరాజ్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దబంగ్‌ దిల్లీ 31-28తో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. దిల్లీకి ఇది రెండో పీకేఎల్‌ టైటిల్‌. 2021లో తొలిసారి టైటిల్‌ గెలిచింది. 12 సీజన్లలో పట్నా పైరేట్స్‌ అత్యధికంగా మూడుసార్లు నెగ్గింది. దిల్లీ, జైపుర్, రెండేసి టైటిళ్లు సాధించగా.. యు ముంబా, పుణెరి పల్టాన్, హరియాణా స్టీలర్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్‌ వారియర్స్‌ ఒక్కో ట్రోఫీ నెగ్గాయి. 

Current Affairs

సదరన్‌ నేవల్‌ కమాండ్‌ అధిపతిగా సమీర్‌ సక్సేనా

కేరళలోని కొచ్చిన్‌ నగరంలో సదరన్‌ నేవల్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ ఆఫ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌గా వైస్‌ అడ్మిరల్‌ సమీర్‌ సక్సేనా 2025, అక్టోబరు 31న బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన వైస్‌ అడ్మిరల్‌ వి.శ్రీనివాస్‌ స్థానంలో ఆయన నియమితులయ్యారు. సక్సేనా 1989 జులై 1న నౌకాదళంలో చేరారు. 

Current Affairs

తూర్పు నావికాదళ చీఫ్‌గా సంజయ్‌ భల్లా

తూర్పు నావికాదళ చీఫ్‌ (ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌)గా వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా 2025 అక్టోబరు 31న నియమితులయ్యారు. కమాండ్‌ ముఖ్య కార్యాలయం ఐఎన్‌ఎస్‌ సర్కార్స్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈఎన్‌సీ చీఫ్‌గా పని చేసిన వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది. సంజయ్‌ భల్లా 1989 జనవరి 1న భారత నౌకాదళంలో చేరారు. 

Current Affairs

‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్‌’ అవార్డులు

2025 ఏడాదికి గానూ ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్‌’ అవార్డుల కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు చెందిన 1,466 మంది పోలీసు సిబ్బందిని ఎంపిక చేసినట్లు 2025, అక్టోబరు 31న కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇందులో పహల్గాం ఉగ్రవాదులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన 40 మంది జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉన్నారు. ఈ పతకాల ప్రదానాన్ని ఫిబ్రవరి 1, 2024న మొదలుపెట్టారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఏటా అక్టోబరు 31న పతకాలను ప్రకటిస్తారు.

Current Affairs

భారత్‌-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం

భారత్‌- అమెరికాల మధ్య వ్యూహాత్మక, భద్రత సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఇరుదేశాలు 2025, అక్టోబరు 31న కీలక ఒప్పందం కుదిరింది. 10 ఏళ్ల కాలానికి ఇది అమల్లో ఉంటుంది. భారతదేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లో కలిసి అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ కౌలాలంపూర్‌లో ఈ ద్వైపాక్షిక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. 2015లో కుదిరిన ఇలాంటి ఒప్పందం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇది అనివార్యమైంది.