జాతీయ పరిశోధనా సంస్థగా సీటీఆర్ఐ
పొగాకుపై అనేక పరిశోధనలు చేస్తున్న రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐకార్-సీటీఆర్ఐ) ఐకార్ జాతీయ వాణిజ్య, వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఎన్ఐఆర్సీఏ-నిర్కా)గా మారింది. పొగాకుతోపాటు వాణిజ్య పంటలైన మిరప, పసుపు, అశ్వగంధ, ఆముదంపై పరిశోధనలు చేయనుంది. ఆ పంటల విలువ ఆధారిత ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలోకి పంపించడం, సాంకేతికత అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడమే లక్ష్యంగా సేవలు అందించనుంది. 1947లో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా సీటీఆర్ఐ ఏర్పాటైంది.