Posts

Walkins

సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు

మహారాష్ట్ర, నాగ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్ (గ్రూప్‌ ఏ) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు: 103 (అన్‌ రిజర్వ్‌డ్‌-31; ఓబీసీ-32; ఎస్సీ-20; ఎస్టీ-10; ఈడబ్ల్యూఎస్‌- 10) వివరాలు: విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ హెమటాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్ సర్జరీ, న్యూరాలజీ, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంస్‌/ ఎండీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.67,700. వయో పరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250; దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, ఉద్యోగానుభం, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 05-02-2025. వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఎయిమ్స్‌ క్యాంపస్‌, మిహన్‌, నాగ్‌పుర్‌. Website:https://aiimsnagpur.edu.in/

Government Jobs

ఐఐటీ కాన్పూర్ లో టెక్నికల్ పోస్టులు

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీకే) వివిధ విభాగాల్లో టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 34 వివరాలు: 1. సీనియర్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఎస్ఈ): 01 2. సూపరింటెండెంట్ ఇంజినీర్(డీసీఈ & డీఈఈ): 02 3. డిప్యూటీ రిజిస్ట్రార్: 02 4. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీసీఈ & డీఈఈ): 02 5. అసిస్టెంట్ కౌన్సిలర్: 03 6. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01 7. అసిస్టెంట్ రిజిస్ట్రార్(లైబ్రరీ): 01 8. హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్: 01 9. మెడికల్ ఆఫీసర్: 02 10. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్( ఫర్ ఉమెన్): 02 11. అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్: 02 12. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, డీన్ ఆఫ్‌ అకడెమిక్ అఫైర్స్): 03 13. జూనియర్ అసిస్టెంట్: 12 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ( సివిల్, ఎలక్ట్రికల్), ఎంఫీల్( క్లినికల్ సైకాలజీ), హోటల్ మేనేజేమెంట్, ఎంబీబీఎస్, డిగ్రీ(బీపీఈడి), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: సీనియర్ సూపరింటెండెంట్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టులకు 57 ఏళ్లు; డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుకు 21 - 50 ఏళ్లు; అసిస్టెంట్ కౌన్సిలర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్(లైబ్రరీ), హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 21 - 45 ఏళ్లు; అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్( ఫర్ ఉమెన్), అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకు 21 - 35 ఏళ్లు; . జూనియర్ అసిస్టెంట్ కు 21 - 30 ఏళ్లు. జీతం: నెలకు సీనియర్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కు రూ.1,31,100 - రూ. 2,16,600; సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టుకు రూ.1,23,100 - రూ.2,15,900; డిప్యూటీ రిజిస్ట్రార్ కు రూ.78,800 - రూ.2,09,200; ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుకు రూ.67,700 - రూ. 2,08,700; అసిస్టెంట్ కౌన్సిలర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్(లైబ్రరీ), హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.56,100 - రూ.1,77,500; అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్( ఫర్ ఉమెన్), అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.35,400 - 1,12,400; జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,700 - రూ.69,100. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-01-2025. Website:https://www.iitk.ac.in/new/recruitment

Government Jobs

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంలో జూనియర్‌ సెక్రటేరియట్‌ పోస్టులు

ఉత్తరాఖాండ్‌ రాష్ట్రం దేహ్రాదూన్‌లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పెట్రోలియం కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 17 వివరాలు: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌)- 05 జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (స్టోర్‌ అండ్‌ పర్చెస్‌)- 03 జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌)- 05 జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌- 04 అర్హతలు: టెన్+2/ ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఇంగ్లిష్‌, హింది టైపింగ్‌ స్పీడ్‌ కలిగి ఉండాలి. వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 28 జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు మించకూడదు. జీతం: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900 - రూ.63,200. జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు రూ.25,500-రూ.81.100. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌ షార్ట్‌లిస్టింగ్‌ తదితరాల ఆధారంగా. ముఖ్య తేదీలు:  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 10.02.2025. ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.02.2025. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు సీనియర్‌ కంట్రోలర్‌ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌, సీఎస్‌ఐఆర్‌-ఐఐపీ, పీఓ. ఐఐపీ హరిద్వార్‌ రోడ్‌, దేహ్రాదూన్‌ ఉత్తరాఖండ్‌ చిరునామాకు పంపించాలి. Website:https://www.iip.res.in/

Government Jobs

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో మేనేజర్ పోస్టులు

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్‌) అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 8 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(సివిల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 30 ఏళ్లు.  జీతం: నెలకు రూ.62,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-02-2025. Website:https://chennaimetrorail.org/job-notifications/

Government Jobs

సీఎంపీఎఫ్‌ఓలో గ్రూప్‌ - సి పోస్టులు

కోల్ మైన్స్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌ఓ) గ్రూప్ - సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 115 వివరాలు: 1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 11 2. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్: 104 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 18 - 27 ఏళ్లు.  జీతం: నెలకు రూ.28,000. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15-02-2025. Website:https://cmpfo.gov.in/

Government Jobs

బీఈఎంఎల్ బెంగళూరులో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్‌ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఓఎల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టులు: 7 వివరాలు: అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత, హిందీ టైపింగ్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ ఉండాలి. వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు మొదటి ఏడాది రూ.28,000; రెండో ఏడాది రూ.31,000; మూడో ఏడాది రూ.34,000; నాలుగో ఏడాది రూ.37,500. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 05.02.2025. ఇంటర్వ్యూ తేదీలు: దిల్లీలో 05.02.2025; బెంగళూరులో 19.02.2025. వేదిక: బెంగళూరు- బీఈఎంఎల్‌ సౌదా, 23/1, 4వ మెయిన్‌, ఎస్‌ఆర్‌నగర్‌, బెంగళూరు. దిల్లీ- ఈ, ఎఫ్, జీ, హెచ్‌, వందన, 11వ అంతస్తు, 11 టోస్టీ మార్గ్‌, న్యూ దిల్లీ. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూల ఆధారంగా. Website:https://www.bemlindia.in/

Government Jobs

బీఈసీఐఎల్ లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

బ్రాడ్ కాస్ట్‌ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 170 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 30 ఏళ్లు.  జీతం: నెలకు రూ.28,000. ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 04-02-2025. Website:https://www.becil.com/Vacancies

Admissions

తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. వివరాలు: పరీక్ష పేరు: ఈఎంఆర్‌ఎస్‌ సెలెక్షన్‌ టెస్ట్‌(ఈఎంఆర్‌ఎస్‌ఎస్‌టీ)- 2025 సీట్ల వివరాలు: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు ఉన్నాయి.  అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో 5వ తరగతి చదివి ఉండాలి. లేదా ఇంటివద్దనే ఐదో తరగతి చదివిన వారు కూడా అర్హలే. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు. వయోపరిమితి: మార్చి 31, 2025 నాటికి ఆరో తరగతికి 10-13 ఏళ్ల మధ్య ఉండాలి. 31.03.2012 నుంచి 31.03.2015 మధ్య జన్మించి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: ఆరో తరగతికి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ (50 ప్రశ్నలు), అరిథ్‌మెటిక్‌ (25 ప్రశ్నలు), తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.100.  దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 16-02-2025. ప్రవేశ పరీక్ష నిర్వహణ: 16.03.2025. పరీక్ష ఫలితాల ప్రకటన: 31.03.2025. మొదటి దశ ప్రవేశాలు: 31.03.2025. Website:https://tsemrs.telangana.gov.in/ Apply online:https://telanganaemrs.cgg.gov.in/TGEMRSWEB/

Current Affairs

Nigeria becomes the ninth BRICS partner country

♦ Nigeria officially became a partner state of the BRICS group. The announcement was made by Kimiebi Ebienfa, acting spokesperson for Nigeria’s ministry of foreign affairs. ♦ BRICS was formed by Brazil, Russia, India and China in 2009, with South Africa added in 2010, as a counterweight to the Group of Seven leading industrialized nations. ♦ Nigeria becomes the ninth BRICS partner country, joining Belarus, Bolivia, Cuba, Kazakhstan, Malaysia, Thailand, Uganda, and Uzbekistan. ♦ In 2024, the group added Iran, Egypt, Ethiopia and the United Arab Emirates. Saudi Arabia has been invited to join. ♦ Turkey, Azerbaijan and Malaysia have formally applied to become members, and a few others have expressed interest.

Current Affairs

Mahesh Kumar Aggarwal

♦ Mahesh Kumar Aggarwal was appointed as the Additional Director General (ADG) in the Border Security Force (BSF). ♦ He is a 1994-batch IPS officer from the Tamil Nadu cadre. Mahesh Kumar currently serving as the Special Director General of Police, Armed Police, in Tamil Nadu. ♦ Aggarwal will hold the position for four years from the date he assumes charge or until further orders, whichever is earlier.