ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్ విజేతగా దక్షిణాఫ్రికా నిలిచింది. 2025, జూన్ 14న లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది. 282 పరుగుల ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 213/2తో ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా.. మరో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన. మార్క్రమ్కు (136; 207 బంతుల్లో 14×4) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐసీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడిపోవడం పదిహేనళ్లలో ఇదే తొలిసారి. చివరగా 2010 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయంపాలైంది. గత యాభై ఏళ్లలో పద్నాలుగుసార్లు ఐసీసీ టోర్నీ ఫైనల్