Posts

Current Affairs

Indian army has successfully conducted trials of the Rudrastra

♦ The Indian army has successfully conducted trials of the Rudrastra, a vertical take-off and landing (VTOL) unmanned aerial vehicle (UAV) designed for deep-strike missions. ♦ The trials have been conducted at the Pokhran firing range, with the drones demonstrating their ability to take down targets at a range of over 50 km. ♦ This was developed by Solar Aerospace and Defence Limited (SDAL). ♦ This indigenous drone demonstrated its capacity to carry out cross-border attacks and neutralize high-value targets, reflecting the armed forces’ growing reliance on homegrown technology for modern warfare.

Current Affairs

Garuda Aerospace's new Agri-Drone

♦ Union Minister of State for Rural Development Kamlesh Paswan inaugurated Garuda Aerospace's new Agri-Drone Indigenization Facility in Chennai on 14 June 2025. ♦ The Minister also inaugurated 300 Centres of Excellence (CoE) and flagged off Garuda Aerospace’s DGCA approved Train the Trainer (TTT) programme.  ♦ The new facility marks the expansion of Garuda Aerospace's existing manufacturing unit and is a major leap in advancing drone manufacturing and skill development in India. ♦ The Train the Trainer (TTT) programme is Garuda Aerospace's flagship skill building and development initiative which is designed to empower educators and professionals to become certified drone instructors.

Current Affairs

South Africa won the  ICC World Test Championship

♦ South Africa won the  ICC World Test Championship (WTC) title on 14 June 2025. ♦ It defeated Australia by five wickets at the Lord's Cricket Ground in London. ♦ This was South Africa's first ICC men's senior major trophy since 1998, with a 27-year wait for an ICC championship coming to an end.  ♦ Aiden Markram was awarded with the player of the match for his 4th inning century which helped the team to win title.  ♦ With this victory, South Africa bagged a prize money of $3.6 million (approx. Rs 31.05 crore). ♦ Runner-up Australia also got $2.16 million (approx. Rs 18.63 crore). ♦ India, which finished third in the 2023-25 WTC cycle, also received Rs 12.42 crore.

Current Affairs

మాగ్నా కార్టా డే

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రజాస్వామ్య విధానంలోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. అందరూ సమానం, అందరికీ స్వాతంత్య్రం అనేవి ఇందులో ప్రధాన నియమాలు. స్వేచ్ఛ, మానవ హక్కులకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి మహోన్నత ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచిన ‘మాగ్నా కార్టా’ ప్రకటనకు గుర్తుగా ఏటా జూన్‌ 15న ‘మాగ్నా కార్టా డే’గా నిర్వహిస్తారు.  చారిత్రక నేపథ్యం: ఇంగ్లండ్‌ రాజైన కింగ్‌ జాన్‌ ఎడ్వర్డ్‌ (1167-1216) పాలనలో ప్రజలు అనేక కష్ట, నష్టాలను ఎదుర్కొన్నారు. ఈయన జనాల నుంచి అధిక పన్నులు వసూలు చేయడంతోపాటు వారిని కఠినంగా శిక్షించేవాడు. చర్చిలపై ప్రభుత్వ జోక్యం అధికంగా ఉండేది. ఇతడి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఇంగ్లిష్‌ బారన్లు (సామంతులు), చర్చి నాయకులు రహస్యంగా సమావేశమై రాజు అధికారాన్ని పరిమితం చేయాలని ‘మాగ్నా కార్టా’ అనే పత్రాన్ని రూపొందించారు. రాజుతో సహా ప్రజలందరూ చట్టానికి లోబడే ఉంటారనే సూత్రాన్ని ఇందులో ప్రతిపాదించారు. అలాగే ప్రజలకు వివిధ హక్కులు కల్పించి, వారి రక్షణ కోసం ప్రత్యేక నియమాలు రూపొందించారు. మొదట జాన్‌ ఎడ్వర్డ్‌ దీన్ని ఆమోదించలేదు. అయితే ప్రజల్లో ఇతడిపై వ్యతిరేకత ఎక్కువవడంతో దానికి తలొగ్గి 1215, జూన్‌ 15న మాగ్నా కార్టాపై సంతకం చేశాడు.

Current Affairs

కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ నివేదిక

2023-24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు జీడీపీలో 18.1 శాతానికి పరిమితమైందని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ తెలిపింది. స్థూల దేశీయ పొదుపు 2014-15లో జీడీపీలో 32.2 శాతంగా ఉండగా, 2023-24 నాటికి జీడీపీలో 30.7 శాతానికి పరిమితమైంది. మరోవైపు కుటుంబాల రుణాలు జీడీపీలో 6.2 శాతానికి పెరిగాయి.  మరిన్ని అంశాలు.. పొదుపు ధోరణులను గమనిస్తే.. గ్రామీణ ప్రాంతాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. 2024తో పోలిస్తే 2025, ఫిబ్రవరిలో గ్రామీణ పురుష కార్మికుల వేతనాలు 6.1% వృద్ధి చెందాయి. వరుసగా నాలుగో నెలా గ్రామీణ ద్రవ్యోల్బణం కంటే ఇది అధికం. 2025 ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.2 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టు తర్వాత ఇదే అత్యల్పం. వంట నూనెలు (17.4%), పండ్లు (13.8%) ధరలు మాత్రమే అధికంగా కొనసాగాయి. రిజర్వాయర్‌ల్లో మంచి నీటి నిల్వలు, ఈ ఏడాది సగటు కంటే అధిక వర్షపాతం ఉండొచ్చన్న అంచనాలతో ఆహార ధరల స్థిరత్వం కొనసాగొచ్చని నివేదిక అంచనా వేసింది.

Current Affairs

యునెస్కో జీఈఎం నివేదిక

యెనెస్కోకు చెందిన అంతర్జాతీయ విద్యా పర్యవేక్షణ బృందం (జీఈఎం) ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్య, విద్యార్థులు చేరికపై ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. మహిళా విద్యపై నిషేదం, పేదరికం, మౌలిక సదుపాయాలు లేకపోవడం లాంటి కారణాలతో 2025లో ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది పిల్లలు పాఠశాలల బయటే ఉండిపోవాల్సి వస్తోందని ఇది తెలిపింది.  ముఖ్యాంశాలు: ప్రాథమిక పాఠశాల వయసు పిల్లల్లో 11 శాతం (7.8 కోట్లు), మాధ్యమిక పాఠశాల, కౌమర వయసు చిన్నారుల్లో 15 శాతం (6.4 కోట్లు) మంది, ఉన్నత పాఠశాల వయసు విద్యార్థుల్లో 31 శాతం (13 కోట్లు) మంది విద్యకు దూరమవుతున్నారు. ఎస్‌డీజీ 4 స్కోరుకార్డు ప్రకారం,  దేశాలు తమ లక్ష్యాలను చేరుకున్నట్లైతే 2030 నాటికి బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను 16.5 కోట్లకు తగ్గించవచ్చు. అయితే ఒక్క 2025లోనే ప్రాథమిక, ఉన్నత స్థాయి పాఠశాల వయసు గల 7.5 కోట్లమంది చిన్నారులు విద్యకు దూరం కానున్నారని నివేదిక అంచనా వేసింది. 

Current Affairs

జీ7 సదస్సు

కెనడాలోని ఆల్బర్టాలో ఉన్న కనానాస్కిస్‌  వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సు 2025, జూన్‌ 15న ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ సహా పలువురు అగ్ర నేతలు ఇందులో పాల్గొననున్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా జూన్‌ 15న ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్‌ చేరుకున్నారు. ఆ యనకు లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశాధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌ సాదర స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. సైప్రస్‌ పర్యటన అనంతరం.. ప్రధాని మోదీ కెనడా వెళ్లి అక్కడ జరగనున్న జీ7 సదస్సులో పాల్గొంటారు. అక్కడి నుంచి క్రొయేషియా పర్యటనకు వెళ్తారు. 

Current Affairs

ప్రపంచ రక్త దాతల దినోత్సవం

రక్త వర్గాలను కనుక్కున్న శాస్త్రవేత్త లాండ్‌ స్టీనర్‌ జయంతిని పురస్కరించుకుని ఏటా జూన్‌ 14న ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’గా నిర్వహిస్తారు. మానవ జీవక్రియలో రక్తం ముఖ్య భూమిక పోషిస్తుంది. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు, దేహంలోని మలినాలను బయటకు పంపడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. గాయాలు, శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం జరిగి రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడి అవసరమవుతుంది. రక్తంలో వేర్వేరు యాంటిజన్లు, యాంటీబాడీలు ఉంటాయి. రక్తమార్పిడి సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యక్తికి సరైన రక్త గ్రూప్‌ను మాత్రమే ఇవ్వాలి. అలాకాకపోతే రెండు రక్తవర్గాల మధ్య గుచ్ఛీకరణ (Agglutination) జరిగి వ్యక్తి మరణించే ప్రమాదం ఉంది. తెలియని వ్యక్తుల కోసం తమ రక్తాన్ని దానం చేసే వారిని గౌరవించి, వారికి కృతజ్ఞతలు తెలపడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: ఆస్ట్రియాకు చెందిన జీవశాస్త్రవేత్త లాండ్‌ స్టీనర్‌ 1901లో మానవుల్లో ప్రధాన రక్త గ్రూపులైన తి, తీ, వీ లను కనుక్కున్నారు. తర్వాత 1902లో ఈయన సహచరులైన అల్ఫ్రెడ్‌ డెకాస్టెల్లో, అడ్రియానో స్టర్లి తితీ రక్తవర్గాన్ని గుర్తించారు. లాండ్‌ స్టీనర్‌ పరిశోధనల ఫలితంగానే మానవుల్లో సురక్షిత రక్త మార్పిడికి అవకాశం ఏర్పడింది. ఈయన 1868, జూన్‌ 14న జన్మించారు. ఈ రోజును ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2004లో తీర్మానించింది. 2025 నినాదం: Give blood, give hope: together we save lives.

Current Affairs

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ఆర్య బోర్సె, అర్జున్‌ బబుతా జంట స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2025, జూన్‌ 14ప మ్యూనిక్‌లో జరిగిన ఫైనల్లో ఆర్య-అర్జున్‌ జోడీ 17-7తో ఒలింపిక్‌ ఛాంపియన్లు జిఫీయ్‌-లిహావో షెంగ్‌ (చైనా) జంటను ఓడించింది. జెనెట్‌ హెగ్‌-హెర్మాన్‌ (నార్వే) ద్వయం కంచు నెగ్గింది. కాంస్య పోరులో 16-14తో సాజెన్‌-పీటర్‌ మాథ్యూ (అమెరికా) జోడీని ఓడించింది.

Current Affairs

వాల్ట్‌లో ప్రణతికి కాంస్యం

ఆసియా జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రణతి నాయక్‌ కాంస్యం నెగ్గింది. 2025, జూన్‌ 14న దక్షిణ కొరియాలోని జిచియాన్‌లో జరిగిన టోర్నీలో వాల్ట్‌లో ఆమె 13.466 స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. యిహాన్‌ జాంగ్‌ (13.650) స్వర్ణం.. థికున్‌ హు (వియత్నాం, 13.583) రజతం గెలుచుకున్నారు. ప్రణతికి ఇది మూడో ఆసియా ఛాంపియన్‌షిప్‌ పతకం.