Posts

Current Affairs

India’s total exports of goods and services rose by 5.5%

♦ India’s total exports of goods and services rose by 5.5% to a record $820.93 billion in the financial year 2024-25, compared to $773 billion in the previous year (2023-24). ♦ Merchandise exports stood at $437.4 billion, while non-petroleum exports registered a 6% year-on-year increase, reaching $374.08 billion in FY25. ♦ However, India’s trade deficit widened to $21.54 billion in 2025 March, up from $14.05 billion in 2025 February, according to data from the Ministry of Commerce and Industry. ♦ Compared to February, exports in March jumped 13.75%, while imports grew 24.6%.

Current Affairs

ఏఐ ఇండెక్స్‌ 2025

‘కృత్రిమ మేధ (ఏఐ) నిపుణుల నియామకంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలించిందని ‘ఏఐ ఇండెక్స్‌ 2025’ నివేదిక పేర్కొంది. కానీ, ఈ ప్రతిభను నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు పడుతోంది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మేధో సంపత్తి హక్కులను పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది వెల్లడించింది. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఈ నివేదికను తయారు చేసింది.

Current Affairs

భారత న్యాయ నివేదిక-2025

దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని భారత న్యాయవ్యవస్థపై విడుదలైన ‘భారత న్యాయ నివేదిక-2025’ వెల్లడించింది. అదే అమెరికాలో ప్రతి 10 లక్షల మంది పౌరులకు 150 మంది జడ్జీలు, ఐరోపాలో 220 మంది జడ్జీలు ఉన్నట్లు వివిధ గణాంకాలు పేర్కొన్నాయి. 2019లో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో ఈ అధ్యయనం మొదలుకాగా ‘భారత న్యాయ నివేదిక-2025’ పేరుతో నాలుగో ఎడిషన్‌ తాజాగా విడుదలైంది. సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్, కామన్‌ కాజ్, కామన్వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనీషియేటివ్, దక్ష్, టిస్‌-ప్రయాస్, విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ, హౌ ఇండియా లివ్స్‌ వంటి సంస్థలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి.  నివేదికలోని అంశాలు: దేశంలో 140 కోట్ల జనాభాకు 21,285 మంది జడ్జీలు ఉన్నారు. అంటే ప్రతి 10 లక్షల మందికి 15 మంది న్యాయమూర్తులు. 1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్‌ ఈ సంఖ్య 50గా ఉండాలని సూచించింది. 2025లో హైకోర్టుల్లో మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 33 శాతం జడ్జి పోస్టులు ఖాళీగా ఉండగా, జిల్లా కోర్టుల్లో అది 21 శాతంగా ఉంది.  జాతీయ స్థాయిలో చూస్తే జిల్లా కోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తిపై 2,200 కేసుల పనిభారం ఉంది. జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం పెరిగింది. 2017లో వారి సంఖ్య 30 శాతం ఉండగా 2025లో 38.3 శాతానికి పెరిగింది. హైకోర్టుల్లో 11.4 శాతం నుంచి 14 శాతానికి చేరుకుంది. మొత్తంగా  ప్రస్తుతం ఒక హైకోర్టులో మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా మహిళ ఉన్నారు.

Current Affairs

న్యూయార్క్‌ నగరం

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం అంబేడ్కర్‌ జయంతిని అధికారికంగా గుర్తించింది. 2025 ఏప్రిల్‌ 14ను డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయంలోని అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్‌ దిలీప్‌ చౌహాన్‌ వెల్లడించారు. అంబేడ్కర్‌ 134వ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14న ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రత్యేక సభలో కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అఠావలె కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Current Affairs

లా కమిషన్‌ ఛైర్మన్‌

న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి 2025, ఏప్రిల్‌ 15న నియమితులయ్యారు. 2024, సెప్టెంబరు 3న 23వ లా కమిషన్‌ మూడేళ్ల కాలపరిమితితో ఏర్పడగా.. తాజాగా ఈ కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, కమిషన్‌ పూర్తిస్థాయి సభ్యులుగా హితేశ్‌ జైన్‌ (న్యాయవాది), ప్రొఫెసర్‌ డి.పి.వర్మ (లా ప్రొఫెసర్‌- బీహెచ్‌యూ) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్‌ పదవీ కాలం 2027 ఆగస్టు 31వరకు కొనసాగనుంది. గత లా కమిషన్‌లో కూడా వర్మ సభ్యుడిగా ఉన్నారు. నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచవచ్చో లేదో కూడా లా కమిషన్‌ పరిశీలించనుంది. 

Current Affairs

భారత్, శ్రీలంక మధ్య ఒప్పందం

వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయ విధానాల అమలుపై ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార పథకం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా భారతదేశం, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. 2025, ఏప్రిల్‌ 15న అమరావతి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ భారతదేశ ప్రతినిధి, సంచాలకులు ఎలిజబెత్‌ ఫౌర్‌ పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.  ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో ఐదేళ్లపాటు దీన్ని అమలు చేస్తారు. 

Current Affairs

రాష్ట్రాల ‘స్వయం సాధికారత’పై ఉన్నత స్థాయి కమిటీ

రాష్ట్రాల స్వయం సాధికారత కోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 2025, ఏప్రిల్‌ 15న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని, సభ్యులుగా ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అశోక్‌ వర్ధన్‌ శెట్టి, తమిళనాడు ప్రణాళికా సంఘం మాజీ వైస్‌ ఛైర్మన్‌ నాగనాథన్‌ ఉంటారని వెల్లడించారు. 

Current Affairs

2025-26లో వృద్ధి 6.1 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత వృద్ధి 6.1 శాతానికి తగ్గొచ్చని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. వృద్ధిరేటు 6.5% ఉండొచ్చని ఇంతకు ముందు సంస్థ అంచనా వేసింది. అంటే ప్రస్తుతం 40 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. 2026-27లో వృద్ధి 6.3 శాతానికి పుంజుకోవచ్చని పేర్కొంది. అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా తలెత్తిన అనిశ్చితి పరిస్థితులే ఇందుకు కారణమని వెల్లడించింది. 2025లో కీలక రేట్లను మరో 0.50% మేర ఆర్‌బీఐ తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

Current Affairs

దేశీయ ఎగుమతులు

2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 820.93 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.70.60 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. 2023-24 ఎగుమతులు 778.13 బి.డా.తో పోలిస్తే, ఇవి 5.5% ఎక్కువ. 2025, మార్చిలో ఎగుమతులు 0.7% పెరిగి 41.97 బి.డా.కు చేరాయి. అయితే దిగుమతులు 11.3% పెరిగి, 63.51 బి.డా.కు చేరడం వల్ల వాణిజ్యలోటు 21.54 బి.డా.గా నమోదైంది. 2024-25లో వస్తువుల ఎగుమతులు 0.08% పెరిగి 437.42 బి.డా.కు, దిగుమతులు 6.62% అధికమై 720.24 బి.డా.కు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు 282.82 బి.డా.కు చేరింది. 2023-24లో వాణిజ్యలోటు 241.14 బి.డా. 

Current Affairs

తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం

తెలంగాణ, దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2025, మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. దేశవ్యాప్తంగా సగటున 3.34% నమోదు కాగా.. తెలంగాణలో 1.06%, దిల్లీలో 1.48, ఝార్ఖండ్‌లో 2.08, ఆంధ్రప్రదేశ్‌లో 2.50 శాతానికి పరిమితమైంది. తెలంగాణ తొలి, ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానాల్లో నిలిచాయి. అత్యధిక ద్రవ్యోల్బణంలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. మార్చిలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 0.20%, పట్టణ ప్రాంతాల్లో 1.79%, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 2.14%, పట్టణ ప్రాంతాల్లో 3.13% మేర ద్రవ్యోల్బణం నమోదైంది.