Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

India-Japan joint military exercise

♦ The 7th edition of the annual India-Japan joint military exercise ‘Dharma Guardian’ commenced at the Foreign Training Node in Chaubattia, Uttarakhand on 24 February 2026. ♦ The exercise concludes on March 9. ♦ The drill brings together 120 personnel each from the Indian Army and the Japan Ground Self-Defense Force (JGSDF). ♦ The Japanese contingent is represented by troops from the 32nd Infantry Regiment, while the Indian side is represented by the Ladakh Scouts. ♦ Held alternately in India and Japan, Exercise ‘Dharma Guardian’ has emerged as a key pillar of defence cooperation between the two countries, reflecting their growing strategic partnership and shared commitment to regional peace and stability. ♦ The primary objective of the exercise is to strengthen military collaboration and enhance the combined capabilities of both forces to undertake joint operations in a semi-urban environment. 

Current Affairs

సెంట్రల్‌ ఎక్సైజ్‌ డే

దేశంలో వస్తు ఉత్పత్తుల తయారీ, పంపిణీ, అమ్మకం కోసం విధించే పన్నును ఎక్సైజ్‌ సుంకం అంటారు. ఇది వస్తువుల తయారీదారులు భారత ప్రభుత్వానికి చెల్లించే పరోక్ష పన్ను. దేశంలో తయారైన వస్తువులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక విస్తృత శ్రేణి ఎక్సైజ్‌ పన్నులు విలీనమయ్యాయి. అయితే పొగాకు, పెట్రోలియం ఉత్పత్తులు లాంటి కొన్నింటిపై మాత్రమే ఇది కొనసాగుతోంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) ఈ పన్నుల నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. సకాలంలో పన్ను చెల్లించాల్సిన ఆవశ్యకతను, దేశ ఆర్థిక వృద్ధిలో సీబీఐసీ పాత్రను తెలియజేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 24న ‘సెంట్రల్‌ ఎక్సైజ్‌ డే’గా నిర్వహిస్తారు. పన్నుల దాఖలు ప్రాముఖ్యతతోపాటు సుంకాల ఎగవేత వల్ల జరిగే పరిణామాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  చారిత్రక నేపథ్యం దేశంలో ఉప్పు సహా ఇతర తయారీ వస్తువులపై ఎక్సైజ్‌ సుంకాలను ఏకీకృతం చేసే ఉద్దేశంతో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం 1944, ఫిబ్రవరి 24న సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ సాల్ట్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఎక్సైజ్‌ పన్నులకు సంబంధించి అప్పటి వరకు ఉన్న 11 చట్టాలను ఏకీకృతం చేసి దీన్ని అమలు చేశారు. 1966లో దీని పేరును సెంట్రల్‌ ఎక్సైజ్‌ చట్టం, 1944గా మార్చారు. దేశంలో సక్రమ పన్ను విధింపు, సేకరించడంలో ఈ చట్టం ఎంతగానో తోడ్పడింది. పరిశ్రమల లైసెన్సింగ్, వస్తువుల అధిక ఉత్పత్తి నియంత్రణకు, పరిశ్రమల్లో అవినీతిని అరికట్టడానికి ఇది ఉపయోగపడింది. అంతేకాక దీని అమలు వల్ల ప్రభుత్వానికి పన్ను రూపంలో అధిక ఆదాయం సమకూరుతోంది. ఈ చట్టం అమలుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 24న ‘సెంట్రల్‌ ఎక్సైజ్‌ డే’గా నిర్వహిస్తున్నారు.

Current Affairs

కేరళ పేరు ‘కేరళం’

    కేరళ పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు 2026, ఫిబ్రవరి 24న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం ‘సేవాతీర్థ్‌’లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి కేరళ శాసనసభ అభిప్రాయాన్ని తీసుకుంటారు. తర్వాత బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఆమోదానికి సాధారణ ఆధిక్యం సరిపోతుంది. రాష్ట్రపతి ఆమోదముద్రతో అధికారికంగా పేరు మారుతుంది. పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళ అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసింది.

Current Affairs

సూర్యునిపై నిరంతర నిఘాకు త్రీడీ నమూనా

    సూర్యగోళంలో సంభవిస్తున్న పరిణామాల పరిశీలనకు ఐఐటీ- కాన్పుర్‌కు చెందిన పరిశోధకులు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డేటా ఆధారిత త్రీడీ నమూనాను రూపొందించారు. ఈ నమూనా ఖగోళ వాతావరణ అధ్యయనానికి ఎంతో కీలకం కానుంది. సూర్యునిపై నిరంతరం సౌర తుపానుల వంటి పరిణామాలు సంభవిస్తూనే ఉంటాయి. ఈ పరిణామాలు కొన్నిసార్లు తీవ్రంగా, మరికొన్నిసార్లు తేలికగా ఒక నిరంతర వృత్తంలా సాగుతుంటాయి. 11 సంవత్సరాలు సాగే ఈ సౌర వలయంలో అత్యధిక పరిణామాలు సంభవించే కాలాన్ని మ్యాగ్జిమా అని, అత్యల్ప కార్యకలాపాల కాలాన్ని మినిమా అని పిలుస్తారు.

Current Affairs

‘అగ్ని వర్ష’ విన్యాసాలు

    యుద్ధ సామర్థ్యాలను, సన్నద్ధతను చాటిచెప్పేలా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఎడారుల్లో భారత సైన్యం 2026, ఫిబ్రవరి 24న ‘అగ్ని వర్ష’ పేరుతో భారీ విన్యాసాలు నిర్వహించింది. సైన్యంలోని సదరన్‌ కమాండ్‌ బలగాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ విన్యాసాల్లో మానవరహిత గగనతల వాహనాలు, డ్రోన్‌ నిరోధక వ్యవస్థలు, ఆధునిక ఆర్టిల్లరీ ప్లాట్‌ఫాంలు, నిఘా వ్యవస్థలను ఎక్కువగా ప్రదర్శించారు. 25 దేశాలకు చెందిన విదేశీ పాత్రికేయులు వీటిని వీక్షించారు. 

Current Affairs

నీతి ఆయోగ్‌ సీఈవోగా నిధి ఛిబ్బర్‌

నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి నిధి ఛిబ్బర్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న బి.వి.ఆర్‌.సుబ్రమణ్యం పదవీకాలం 2026 ఫిబ్రవరి 24న ముగియడంతో ఛిబ్బర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈమె ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కి చెందిన 1994 ఐఏఎస్‌ అధికారి. 

Government Jobs

బీపీఎస్‌సీఎల్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

బొకారో పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (బీపీఎస్‌సీఎల్‌), రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ (బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్) - 15  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌(మెకానికల్/ఎలక్ట్రికల్/ కెమికల్/ పవర్ ప్లాంట్/ ప్రొడక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణులై ఉండాలి గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000  ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 మార్చి 5. Website:https://bpscl.com/our_people/careers/

Government Jobs

ఎయిమ్స్‌లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌)-10 నోటిఫికేషన్‌ విడుదలైంది.  మొత్తం పోస్టులు: 2551 వివరాలు: నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఎయిమ్స్‌ సంస్థలు: ఎయిమ్స్‌ భటిండా, ఎయిమ్స్‌ భోపాల్‌, ఎయిమ్స్‌ భువనేశ్వర్, ఎయిమ్స్‌ దేవ్‌ఘర్, ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్, ఎయిమ్స్‌ గువాహటి, ఎయిమ్స్‌ కల్యాణి, ఎయిమ్స్‌ మంగళగిరి, ఎయిమ్స్‌ నాగ్‌పుర్, ఎయిమ్స్‌ రాయ్ బరేలీ, ఎయిమ్స్‌ న్యూదిల్లీ, ఎయిమ్స్‌ పట్నా, ఎయిమ్స్‌ రిషికేశ్‌, ఎయిమ్స్‌ విజయ్‌పూర్, ఎయిమ్స్‌ సీఏపీఎఫ్‌ఐఎంఎస్‌, ఎన్‌ఐటీఆర్‌డీ, సీఐపీ రాంచీ, జిప్‌మర్‌ కరైకల్‌, ఈఎస్‌ఐసీ న్యూదిల్లీ తదితరాలు. అర్హత: డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.  స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి. వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.  జీత భత్యాలు: రూ.9,300- రూ.34,800తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది. దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2,400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. GAIL Jobs: గెయిల్, న్యూదిల్లీ - 70 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు ఎంపిక ప్రక్రియ: నార్‌సెట్‌-10 ఆన్‌లైన్‌ సీబీటీ (స్టేజ్‌-I) ప్రిలిమినరీ, సీబీటీ(స్టేజ్‌-II) ప్రధాన పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.03.2026. సిటీ ఇంటిమేషన్‌ తేదీలు: 04.04.2026. అడ్మిట్‌ కార్డులు అందుబాటులో: 08.04.2026. సీబీటీ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 11-04-2026. సీబీటీ మెయిన్ పరీక్ష తేదీ: 30.04.2026. Website:https://aiimsexams.ac.in/advertisement/699d90c3a5c5ab7d59ac721b

Apprenticeship

కొంకణ్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్‌), 1961/1973 అప్రెంటిస్ చట్టం ప్రకారం వివిధ విభాగాల్లో ఒక సంవత్సరం శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ & జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్. మొత్తం ఖాళీలు: 190. అర్హత: 2021 నుంచి 2025 మధ్య సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా NATS పోర్టల్‌లో నమోదై ఉండాలి.  వయోపరిమితి: 01.01.2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.  స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9,000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8,000 చెల్లిస్తారు (ఇందులో 50% DBT ద్వారా అందుతుంది). ఎంపిక విధానం: అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా (మెరిట్ లిస్ట్) ఎంపిక చేస్తారు. కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం భూమి కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.  దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు & ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 మార్చి 2026. Website:https://konkanrailway.com/en/vacancy

Apprenticeship

హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టులు

పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌), 2026-27 సంవత్సరానికి ఇంజినీరింగ్ విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌): 250 ఖాళీలు (ముంబయి రిఫైనరీ-మహారాష్ట్ర- 120; విశాఖ రిఫైనరీ- ఆంధ్రప్రదేశ్‌- 130) అప్రెంటిస్‌షిప్ వ్యవధి: 1 సంవత్సరం అర్హత: అభ్యర్థులు కనీసం 60% (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ50%) మార్కులతో సంబంధిత విభాగాలలో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 10-03-2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. (సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు 5; ఓబీసీలకు 3; పీడబ్ల్యూబీడీ 10 సంవత్సరాలు). జీతం/స్టైపెండ్: నెలకు రూ.25,000. ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. అప్రెంటిస్‌షిప్ శిక్షణ బోర్డు (BOAT) ద్వారా ఎన్‌ఏటీఎస్‌ (NATS 2.0) పోర్టల్‌లో, హెచ్‌పీసీఎల్‌ అప్రెంటిస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ: 10.03.2026. Website:https://www.hindustanpetroleum.com/job-openings