Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ఫోర్బ్స్‌ బిలియనీర్ల 2026 జాబితా

భారత్‌లో బిలియనీర్ల (కుబేరుల) సంఖ్య 2025లో 205 మంది ఉండగా, 2026 నాటికి 229కి చేరినట్లు ఫోర్బ్స్‌ బిలియనీర్ల 2026 జాబితా   వెల్లడించింది. వీరి మొత్తం సంపద విలువ లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.92 లక్షల కోట్ల)ను అధిగమించింది. 2025లో ఇది 941 బి. డాలర్లుగా ఉంది. అగ్రగామి 10 మంది భారతీయ కుబేరుల చేతిలో 368 బి. డాలర్ల (రూ.33.85 లక్షల కోట్ల) సంపద ఉంది. దేశంలోని మొత్తం బిలియనీర్ల సంపదలో ఇది మూడో వంతు కంటే ఎక్కువ. గతేడాదితో పోలిస్తే వీరి సంపద 32 బి. డాలర్లు పెరిగింది.  భారత్, ఆసియాలో అగ్రగామి కుబేరుడుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కొనసాగారు. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద 12% పెరిగింది. రెండో స్థానంలో గౌతమ్‌ అదానీ నిలిచారు. ఓపీ జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ అత్యంత ధనవంతురాలైన భారతీయ మహిళగా నిలిచారు. 

Current Affairs

కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

ప్రమాదవశాత్తు గాయపడి 13ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన యువకుడికి కారుణ్య మరణాన్ని ప్రసాదించేందుకు సుప్రీంకోర్టు 2026, మార్చి 11న అనుమతించింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు వెలువరించడం ఇదే మొట్టమొదటిసారి. గౌరవంగా మరణించే హక్కును గుర్తిస్తూ 2018లో వెలువడిన కామన్‌ కాజ్‌ కేసు తీర్పును తొలిసారిగా అమలు చేస్తున్నట్లు జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.  కారుణ్య మరణాలకు సంబంధించి సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. భావోద్వేగాలతో ముడిపడిన ఈ అంశంలో ఆచరణాత్మకమైన, పొందికైన, స్పష్టమైన రీతిలో ఆ చట్టం ఉండాలని పేర్కొంది.

Current Affairs

సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్‌ ఉత్పత్తి

హైదరాబాద్‌కు చెందిన భారతీయ రసాయన సాంకేతికత సంస్థ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు సూర్యరశ్మిని ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ‘జెడ్‌ఐఎఫ్‌-8 నానో హైబ్రిడ్స్‌’ అనే అత్యాధునిక పదార్థాలను అభివృద్ధి చేశారు. రసాయన చర్యలను వేగవంతం చేసే అద్భుతమైన గుణాలను ఇది కలిగి ఉందని వారు తెలిపారు. ఈ కొత్త పద్ధతిలో కేవలం సూర్యరశ్మిని వాడుకుని నీటి నుంచి లేదా ఇతర వనరుల నుంచి హైడ్రోజన్‌ను వేరు చేయవచ్చని నిరూపించారు.  ఈ పదార్థాల తయారీలో వాటి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఏఐ/ఎంఎల్, డెన్సిటీ ఫంక్షనల్‌ థియరీ(డీఎఫ్‌టీ)  సాంకేతికతను వినియోగించారు. 

Current Affairs

హెవీ మినరల్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 359.79 మిలియన్‌ టన్నుల 25 హెవీ మినరల్‌ డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ 2026, మార్చి 11న లోక్‌సభలో తెలిపారు. ఇందులో ఇల్మెనైట్‌ 178.75 మిలియన్‌ టన్నులు, రూటిల్‌ 11.46, లూకోక్సిన్‌ 3.64, మోనజైట్‌ 4.05, జిర్కాన్‌ 12.75, గార్నెట్‌ 67.30, సిలిమనైట్‌ 81.85 మిలియన్‌ టన్నుల నిల్వలు రాష్ట్రంలో ఉన్నట్లు వివరించారు.

Current Affairs

ఏవీఎస్‌ఎస్‌ఎన్‌ రాజు

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌గా కాకినాడకు చెందిన వెటుకూరి ఏవీఎస్‌ఎస్‌ఎన్‌ రాజుని ప్రభుత్వం 2026, మార్చి 11న నియమించింది. సభ్యులుగా కేవీ వెంకట పద్మలత (గుంటూరు జిల్లా), దోని శ్రీనివాసమూర్తి (శ్రీసత్యసాయి జిల్లా), వి.గాంధీబాయి (అల్లూరి), చల్లా మధుసూదనరావు (గుంటూరు), ఎంజీ సూర్యనారాయణ (కాకినాడ), బి.పద్మావతి (రాజమహేంద్రవరం) నియమితులయ్యారు.   

Current Affairs

‘ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2023-24’

ఆర్థిక ఆరోగ్యపరంగా ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ 2026, మార్చి 11న విడుదల చేసిన ‘ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2023-24’ నివేదికలో పేర్కొంది. మొత్తం 18 పెద్ద రాష్ట్రాలను ఒక గ్రూప్‌గా చేసి విడుదల చేసిన ర్యాంకుల్లో తొలి మూడు స్థానాలను ఒడిశా, గోవా, ఝార్ఖండ్‌లు నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లు ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్‌ 23.1 స్కోర్‌తో 17వ స్థానానికి పరిమితమైంది. 

Government Jobs

భారత నౌకాదళంలో అగ్నివీర్ (ఎస్ఎస్‌ఆర్‌) పోస్టుల భర్తీ

భారత నౌకాదళం అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) 01/2027 & 02/2027 బ్యాచ్‌లలో పోస్టుల భర్తీకి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: అర్హత ప్రమాణాలు: విద్యార్హత: కనీసం 50% మార్కులతో గణితం & ఫిజిక్స్ సబ్జెక్టులుగా 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ నుంచి ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో 50% మార్కులతో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే. వయోపరిమితి: 01/2027 బ్యాచ్ అభ్యర్థులు డిసెంబర్ 01, 2004 నుంచి మే 31, 2009 మధ్య జన్మించి ఉండాలి. 02/2027 బ్యాచ్ వారు మే 01, 2005 నుంచి అక్టోబర్ 31, 2009 మధ్య జన్మించి ఉండాలి. వైవాహిక స్థితి: కేవలం అవివాహిత అభ్యర్థులు మాత్రమే అర్హులు. శిక్షణ & నాలుగు సంవత్సరాల సేవా కాలంలో వివాహం చేసుకోకూడదు. జీతభత్యాలు, ప్రయోజనాలు: ఎంపికైన అగ్నివీర్‌లకు నెలకు రూ.30,000 జీతంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్ ఉంటుంది. నాలుగు సంవత్సరాల సేవ తర్వాత, వడ్డీతో కలిపి సుమారు రూ.10.04 లక్షల 'సేవా నిధి' ప్యాకేజీ అందుతుంది.  రూ.48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అందించబడుతుంది. ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది: 1. దశ-1 (INET): మే 2026లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ & జనరల్ అవేర్‌నెస్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 2. దశ-2: ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT), రాత పరీక్ష & మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. దరఖాస్తు రుసుము: రూ.550 + 18% GST. ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14 మార్చి 2026. చివరి తేదీ: 06 ఏప్రిల్ 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు). Website:https://www.joinindiannavy.gov.in/

Government Jobs

ఎయిమ్స్ గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), గువాహటి వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 64  వివరాలు: 1. ప్రొఫెసర్ : 18 2. అడిషనల్ ప్రొఫెసర్ : 11 3. అసోసియేట్ ప్రొఫెసర్ : 16 4. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 19  అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,68,900. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా . దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ,ఎస్టీ,పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-03-2026. హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ: 06-04-2026. Website:https://aiimsguwahati.ac.in/page/faculty

Apprenticeship

సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్  (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. 1961 అప్రెంటిస్ చట్టం ప్రకారం ఈ నియామకాలు జరగనున్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య: 106 వివరాలు: అర్హతలు: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  & సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ (ITI) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి: మార్చి 10, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ & ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: 10వ తరగతి & ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.100 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుబీడీ (PwBD), మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్య తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10, 2026 ఉదయం 11:00 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 9, 2026 సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తాయి. Website:https://rrccr.etrpindia.com/rrccrapprentice/applicationIndex

Apprenticeship

ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఐఓసీఎల్‌), వెస్ట్రన్ రీజియన్ పరిధిలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 473 వివరాలు: 1.టెక్నీషియన్ అప్రెంటిస్  2. ట్రేడ్ అప్రెంటిస్  3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్  4. డాటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు: మహారాష్ట్ర: 194  గుజరాత్: 121  మధ్యప్రదేశ్: 82  ఛత్తీస్‌గఢ్: 40  గోవా: 16  దాద్రా నగర్ హవేలీ & డామన్ దియు: 20  విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ తదితర విభాగాలు విద్యార్హత: సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో టెన్త్‌/ ఐటిఐ/డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.(నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది). ఎంపిక విధానం: విద్యా అర్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11-03-2026. దరఖాస్తు చివరి తేదీ: 26-03-2026. Website:https://www.iocl.com/apprenticeships