Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

‘కౌశలం’

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు వచ్చే నాలుగు నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్‌ అగ్రిగేటర్లకు వారధిలా ‘కౌశలం’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది సమస్త సమాచారాన్ని అందులో ఉంచింది.

Current Affairs

పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం

దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ ‘పినాక’ తొలి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. రాకెట్‌ 120 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి, పూర్తి సత్తాను చాటింది. నిర్దేశించిన రీతిలో గాల్లో విన్యాసాలూ చేసింది. పినాకను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ల్యాబ్‌ తయారుచేసింది.

Current Affairs

5వ శతాబ్దం నాటి నౌక పునఃసృష్టి

అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్‌లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు దాన్ని పునఃసృష్టించారు. ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పేరిట భారత నౌకాదళంలో చేరిన ఈ తెరచాప పడవ.. 2025, డిసెంబరు 29న గుజరాత్‌లోని పోరుబందర్‌ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు పయనమైంది. ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య తయారీలో మొత్తం పురాతన విధానాలనే అవలంబించారు. లోహాలు, మేకులను ఉపయోగించలేదు. చెక్కలను వాడారు. వీటిని కొబ్బరి పీచుతో తయారుచేసిన తాళ్లతో గుదిగుచ్చారు. అందువల్ల ఈ నౌకను ‘స్టిచ్డ్‌ షిప్‌’గా పిలుస్తున్నారు. సముద్ర ఉప్పునీటి నుంచి రక్షణ కోసం దీనికి సహజసిద్ధ జిగురుపూతను వేశారు. ఈ నౌకలో ఇంజిన్‌ ఉండదు. తెరచాపల సాయంతో ప్రయాణిస్తుంది. 

Current Affairs

పెరిగిన జిల్లాల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడు మరో రెండు జిల్లాలను చేరుస్తూ 2025, డిసెంబరు 29న రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్‌ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది.  మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28కి పెరిగింది.  

Current Affairs

52 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి

సోయజ్‌-2.1బి అనే వాహక నౌక ద్వారా రష్యా 2025, డిసెంబరు 28న ఒకేసారి 52 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వోస్టోక్నీ స్పేస్‌పోర్టు నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్‌’ తెలిపింది.  కక్ష్యలో ప్రవేశపెట్టినవాటిలో ఇరాన్‌కు చెందిన మూడు కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. 

Current Affairs

నౌకానిర్మాణ పథకాలు

రూ.44,700 కోట్లకు పైగా వ్యయంతో రెండు ప్రధాన నౌకా నిర్మాణ పథకాలకు మార్గదర్శకాలను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దేశీయ నౌకానిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా షిప్‌బిల్డింగ్‌ ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ స్కీమ్‌ (ఎస్‌బీఎఫ్‌ఏఎస్‌), షిప్‌బిల్డింగ్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ (ఎస్‌బీడీఎస్‌)లను ప్రభుత్వం తీసుకొచ్చింది.

Current Affairs

ఐఎన్‌ఎస్‌ వాఘ్‌శీర్‌లో ద్రౌపదీ ముర్ము ప్రయాణం

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌శీర్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. తద్వారా జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు.  2025, డిసెంబరు 28న కర్ణాటకలోని కార్వార నౌకాదళ స్థావరానికి నేవీ యూనిఫాంలో వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. జలాంతర్గామిలో ప్రయాణం ప్రారంభించారు. గంటపాటు ఈ యాత్ర కొనసాగింది.  

Current Affairs

స్మృతి మంధాన

మహిళల క్రికెట్లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 2025, డిసెంబరు 28న శ్రీలంకతో నాలుగో టీ20లో ఆమె 80 పరుగులు చేసింది. 27 పరుగుల వద్ద ఆమె పది వేల పరుగులకు చేరుకుంది.  స్మృతి వన్డేల్లో 5322, టీ20ల్లో 4102, టెస్టుల్లో 629 పరుగులు చేసింది. 

Current Affairs

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌

తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్‌ ఇరిగేశి ఫిడే ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌లో కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన హంపి.. మూడో స్థానంలో నిలిచింది. అలెగ్జాండ్రా గొర్యాచ్‌కినా (రష్యా)కు స్వర్ణం, జు జినెర్‌ (చైనా)కు రజతం దక్కాయి. ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌లో అయిదు పతకాలు నెగ్గిన తొలి ప్లేయర్‌గా హింపి రికార్డు సాధించింది. ఆమె స్వర్ణం (2019, 2024), రజతం (2023), కాంస్యం (2012, 2025) సాధించారు. 

Walkins

ఎంఎస్‌ఎంఈ విశాఖపట్నంలో ఫ్యాకల్టీ/ ట్రైయినీ పోస్టులు

విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) ఒప్పంద ప్రాతిపదికన ట్రైనింగ్‌, ప్రొడక్షన్‌ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు: 19. వివరాలు: 1. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (సీఏడీ/ సీఏఎం):02 2. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ మెకానికల్‌ ఇంజినీర్‌- 02 3. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (టూల్‌ డిజైనర్‌- డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌/ షీట్‌ మెటల్‌/ఫారెన్‌/ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌)- 01 4. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ మెకట్రానిక్స్‌ ఇంజినీర్‌- 02 5. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (ఎలక్ట్రానిక్స్‌)- 01 6. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (సీఎన్‌సీ-టర్నింగ్‌/మిల్లింగ్‌)- 01 7. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (ఎంబెడెడ్‌ ఇంజినీర్‌)- 01 8. పర్చెస్‌ ఇన్‌ చేంజ్‌: 01 9. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్‌: 01 10. హాస్టల్‌ వార్డెన్‌/కేర్‌ టేకర్‌: 01 11. సీఎన్‌సీ 5 యాక్సిస్‌ మిల్లింగ్‌ ప్రోగ్రామర్‌ కమ్‌ ఆపరేటర్‌- 01 12. సీఎన్‌సీ 3 యాక్సిస్‌ మిల్లింగ్‌ ప్రోగ్రామర్‌ కమ్‌ ఆపరేటర్‌- 02 13. సీఎన్‌సీ టర్నింగ్‌ ప్రోగ్రామర్‌ కమ్‌ ఆపరేటర్‌- 02 14. క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ కమ్‌ సీఎంఎం ఇంజినీర్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: ట్రైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టులకు 35 ఏళ్లు; ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. జాబ్‌ లొకేషన్‌: ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌, విశాఖపట్నం. ఇంటర్వ్యూ తేదీలు: 8, 9.01.2026. వేదిక: ఎంఎస్‌ఎంఈ-డెవెలప్‌మెంట్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ ఆఫీస్‌ (డీఎఫ్‌ఓ), ఆటోనగర్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌. Website:https://www.msmetcvizag.org/