Posts

Current Affairs

Pabitra Margherita met Gabriela Sommerfeld

♦ Union Minister of State for External Affairs Pabitra Margherita met Gabriela Sommerfeld, Ecuador’s Minister of Foreign and Human Mobility Affairs, during his official visit to the Latin American country on 6 November 2025. ♦ During the meeting the two leaders signed a Memorandum of Understanding(MoU) on cooperation between the diplomatic training institutions of India and Ecuador. ♦ Both sides explored opportunities to deepen cooperation in political, trade, pharmaceuticals, training and capacity building, as well as other areas of shared interest. 

Current Affairs

INS Ikshak launched

♦ Chief of Naval Staff Admiral Dinesh Kumar Tripathi commissioned INS Ikshak, the Indian Navy’s third indigenously designed and built Survey Vessel (large) in Kochi on 6 November 2025. ♦ Built by Garden Reach Shipbuilders and Engineers in Kolkata, ‘Ikshak’ stands as a major success for the government’s Aatmanirbhar Bharat initiative, boasting over 80 per cent indigenous content.  ♦ The vessel will be the first of its class to be based at the Southern Naval Command. ♦ Named after the Sanskrit word for ‘Guide,’ the ship is equipped with advanced hydrographic and oceanographic tools, including multi-beam sonars and Autonomous Underwater Vehicles. 

Current Affairs

ఐఎన్‌ఎస్‌ ఇక్షక్‌ ప్రారంభం

దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ ఇక్షక్‌ను భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేశ్‌కుమార్‌ త్రిపాఠి 2025, నవంబరు 6న కొచ్చిన్‌లో ప్రారంభించారు. నౌకాదళానికి, భారతీయ నౌకానిర్మాణ రంగానికి ఇదొక మైలురాయి అని, ఈ ఏడాది ఇలాంటి పది ప్రారంభోత్సవాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కోల్‌కతాలో తయారైన ఇక్షక్‌లో అధునాతన పరికరాలు ఉన్నాయి. 

Current Affairs

ఎడెల్‌గివ్‌ హురున్‌ జాబితా

2025లో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్‌ నాడార్‌ కుటుంబం అగ్రస్థానంలో నిలిచినట్లు ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రఫి జాబితా-2025 వెల్లడించింది. 2024తో పోలిస్తే 26 శాతం అధికంగా ఆయన కుటుంబం 2025లో రూ.2,708 కోట్లు దానం చేసినట్లు తెలిపింది. అంటే ఆయన రోజుకు రూ.7.4 కోట్లు సమాజానికి తిరిగి ఇచ్చారు. గత అయిదేళ్లలో మన దేశంలో అత్యంత దానశీలిగా శివ్‌ నాడర్‌ నిలవడం ఇది నాలుగోసారి. తర్వాతి స్థానాల్లో ముకేశ్‌ అంబానీ, బజాజ్‌ కుటుంబం, కుమార్‌ మంగళం బిర్లా కుటుంబం, గౌతమ్‌ అదానీ కుటుంబం ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశీయ సంపన్నులు 191 మంది కలిసి 2025లో మొత్తంగా రూ.10,380 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఇందులో 12 మంది కొత్తవారు. 

Current Affairs

100 బిలియన్‌ డాలర్ల క్లబ్బులోకి ఎస్‌బీఐ

మార్కెట్‌ విలువపరంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 100 బిలియన్‌ డాలర్ల  (రూ.8.8 లక్షల కోట్ల) క్లబ్బులోకి చేరింది. ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ కంపెనీగా, ప్రభుత్వ రంగం నుంచి తొలి సంస్థగా నిలిచింది. 2025, నవంబరు 6న బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 1.47% పెరిగి జీవనకాల గరిష్ఠమైన రూ.971.15ను చేరింది. తద్వారా బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.8.96 లక్షల కోట్లకు (100 బి.డాలర్లకు పైగా) చేరింది.

Current Affairs

జస్టిస్‌ బాలకృష్ణన్‌ కమిషన్‌ పదవీకాలం పొడిగింపు

మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్‌ పదవీ కాలాన్ని కేంద్రం ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈమేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ 2025, నవంబరు 6న నోటిఫికేషన్‌ జారీ చేసింది. తొలుత నిర్ణయించిన గడువు ప్రకారం ఈ కమిషన్‌ 2024 అక్టోబరు 10నాటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. నిర్దేశిత పని పూర్తికాలేదన్న ఉద్దేశంతో గడువును 2025 అక్టోబరు 10వ తేదీ వరకూ ప్రభుత్వం పొడిగించింది. నివేదికకు తుది రూపునివ్వడానికి మరికొంత సమయం కావాలన్న కమిషన్‌ విజ్ఞప్తితో పదవీకాలాన్ని 2026 ఏప్రిల్‌ 10 వరకు కేంద్రం తాజాగా పొడిగించింది.

Current Affairs

2026 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ అహ్మదాబాద్‌లో

2026 ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబయిలను వేదికలుగా బీసీసీఐ ఖరారు చేసింది. ఇంకొన్ని వేదికలను ఎంపిక చేయాల్సివుంది. ఫైనల్‌కు అహ్మదాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. మొత్తం 10 వేదికల్లో టోర్నీని నిర్వహిస్తారు. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ కూడా అహ్మదాబాద్‌లోనే జరిగింది. 

Current Affairs

శీతల్‌ దేవి

పారా అథ్లెట్‌ శీతల్‌ దేవి వైకల్యం లేని, సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌లో పోటీ పడేందుకు అర్హత సాధించింది. త్వరలో జెడ్డా వేదికగా జరిగే ఆసియా కప్‌ స్టేజ్‌-3లో పోటీ పడే భారత జట్టులో ఆమె చోటు సంపాదించింది. జాతీయ సెలక్షన్స్‌ ట్రయల్స్‌ మహిళల విభాగంలో ఓవరాల్‌గా 3వ స్థానంతో శీతల్‌.. ఆసియా కప్‌నకు ఎంపికైంది. సాధారణ ఆర్చర్లతో కూడిన భారత జట్టులో ఇలా పారా ప్లేయర్‌ చోటు సంపాదించడం ఇదే తొలిసారి. రెండు చేతులూ లేకపోయినా ఆర్చరీలో అద్భుత నైపుణ్యం సంపాదించి పారా క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదిగింది శీతల్‌ దేవి.

Walkins

న్యూక్లియన్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో నర్స్‌ ఉద్యోగాలు

అణుశక్తి విభాగంలోని న్యూక్లియన్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎఫ్‌సీ) కోటా తాత్కాలిక ప్రాతిపదికన నర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: నర్స్‌: 04  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిప్లొమా(నర్సింగ్‌) లేదా బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 2025 నవంబర్‌ 12వ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.63,023. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 నవంబర్‌ 12. వేదిక: అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌, కోటా ప్రాజెక్ట్, పోస్ట్‌: అణుశక్తి, రావత్‌భట, రాజస్థాన్‌-323303. Website:https://www.nfc.gov.in/recruitment.html

Internship

ఎస్‌ప్రెసో మీడియా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు

ఎస్‌ప్రెసో మీడియా కంపెనీ బ్లాగింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: ఎస్‌ప్రెసో మీడియా  పోస్టు పేరు: బ్లాగింగ్‌ నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, జనరేటివ్‌ ఏఐ టూల్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.2,000- రూ.5,000. వ్యవధి: 2 నెలలు. దరఖాస్తు గడువు: 28-11-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-blogging-internship-at-aespresso-media1761737798