Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

Defence Research and Development Organisation (DRDO)

♦ The Defence Research and Development Organisation (DRDO) successfully conducted a long-duration ground test of an actively cooled, full-scale scramjet engine. The test, held at the Scramjet Connect Pipe Test (SCPT) facility of the Defence Research & Development Laboratory (DRDL) in Hyderabad, achieved a runtime of over 12 minutes. ♦ The achievement builds on a sub-scale long-duration test conducted on April 25, 2025, and is seen as a critical step in the country’s Hypersonic Cruise Missile programme. Both the combustor and the test facility were designed and developed by DRDL and realised with support from industry partners. ♦ The successful run positions India among a small group of nations with advanced hypersonic capabilities. Hypersonic cruise missiles are designed to sustain speeds exceeding Mach 5 — more than 6,100 km/hr — using air-breathing engines that rely on supersonic combustion to maintain extended flight durations. The latest tests have validated the combustor design and showcased the capabilities of the SCPT facility.

Current Affairs

ప్రవాసీ భారతీయ దివస్‌

భారతదేశంలో పుట్టి చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర దేశాల్లో స్థిరపడిన వారిని ప్రవాసులుగా పేర్కొంటారు. విదేశాల్లోని భారత సంతతి వ్యక్తులకు పుట్టిన సంతానాన్ని కూడా ప్రవాస భారతీయులుగానే పరిగణిస్తారు. దేశాభివృద్ధిలో వీరి పాత్ర ఎనలేనిది. వారు ఇతర దేశాల్లో ఉంటూ స్వదేశంలోని తమ బంధువులు, స్నేహితులకు డబ్బు పంపుతుంటారు. తద్వారా విదేశీ మారక నిల్వలు పెరిగి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తోడ్పడుతున్నారు. విదేశాల్లో నివసిస్తోన్న భారతీయుల సహకారాన్ని గుర్తించి, గౌరవించే లక్ష్యంతో మన దేశంలో జనవరి 9న ‘ప్రవాసీ భారతీయ దివస్‌’గా (Pravasi Bharatiya Divas) నిర్వహిస్తున్నారు. దీన్నే నాన్‌-రెసిడెంట్‌ ఇండియన్‌ (ఎన్‌ఆర్‌ఐ) డే అని కూడా పిలుస్తారు. ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రవాసులకు, భారత ప్రభుత్వానికి మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు తమ మూలాలు, సంస్కృతితో వారిని అనుసంధానం చేయడంపై ఈ రోజు ప్రధానంగా దృష్టి సారిస్తుంది.  చారిత్రక నేపథ్యం భారత స్వాంతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు. స్వరాజ్య పోరాటంలో చేరడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నారు. 1915, జనవరి 9న గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏటా ఆ తేదీన ‘ప్రవాసి భారతీయ దివస్‌’గా జరపాలని 2003లో నాటి వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి 2014 వరకు ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించారు. 2015 నుంచి ఈ దినోత్సవాన్ని రెండేళ్లకోసారి జరపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీర్మానించింది. ఆ రోజున సదస్సులు నిర్వహించి.. ప్రవాసులకు మరింత చేరువకావాలనేది ప్రభుత్వ లక్ష్యం.

Current Affairs

ఎన్‌ఐడీఎంఎస్‌

నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) అభివృద్ధి చేసిన జాతీయ డిజిటల్‌ ఐఈడీ డేటా మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎన్‌ఐడీఎంఎస్‌) ఫ్లాట్‌ఫాంను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 2026, జనవరి 9న ప్రారంభించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశానికి ముందు తరం భద్రతా కవచంగా ఇది నిలుస్తుందని అమిత్‌ షా పేర్కొన్నారు.  హరియాణాలోని గురుగ్రామ్‌ సమీప మనేసర్‌లోని ఎన్‌ఎస్‌జీ గారిసన్‌లో ఎన్‌ఐడీఎంఎస్‌ను నెలకొల్పారు. 

Current Affairs

యాక్టివ్లీ కూల్డ్‌ స్క్రామ్‌జెట్‌ ఫుల్‌ స్కేల్‌ కంబస్టర్‌

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌ అభివృద్ధి చేసిన ‘యాక్టివ్లీ కూల్డ్‌ స్క్రామ్‌జెట్‌ ఫుల్‌ స్కేల్‌ కంబస్టర్‌’ను డీఆర్‌డీఓ 2026, జనవరి 9న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో హైపర్‌సోనిక్‌ క్షిపణులను అభివృద్ధి చేసే దిశలో ఇది కీలక ముందడుగు. కంచన్‌బాగ్‌ మిస్సైల్‌ క్లాంప్లెక్స్‌ ప్రయోగశాలలోని అత్యాధునిక స్క్రామ్‌జెట్‌ కనెక్ట్‌ పైప్‌ టెస్ట్‌(ఎస్‌సీపీటీ) ఫెసిలిటీలో ఈ గ్రౌండ్‌ టెస్ట్‌ను నిర్వహించారు. ఇంజిన్‌ కంబస్టర్‌ను ఏకధాటిగా 12 నిమిషాలకు పైగా పనిచేయించి దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో.. గంటకు సుమారు 6100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం హైపర్‌సోనిక్‌ క్షిపణుల సొంతం.

Current Affairs

నారీశక్తి పురస్కారం

ప్రవాస భారతీయుల అభివృద్ధి, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రవాస తెలంగాణ మహిళ అబ్బగౌని నందినికి ఖతార్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం నారీశక్తి పురస్కారం లభించింది. ఖతార్‌ రాజధాని దోహాలో 2026, జనవరి 9న జరిగిన ప్రవాసీ భారతీయ దినోత్సవంలో అక్కడి భారతీయ రాయబారి విపుల్‌ పురస్కారాన్ని అందజేశారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటకు చెందిన నందిని, తన భర్త శ్రీధర్‌తో 15 ఏళ్ల కిందట ఖతార్‌ వెళ్లారు.  వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. 

Current Affairs

అతి విశిష్ట రైల్‌ సేవా పురస్కారాలు

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఏడుగురు అధికారులకు ‘అతి విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌-2025’ లభించాయి. 2026, జనవరి 9న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయమంత్రి వి.సోమన్న, రైల్వే బోర్డు ఛైర్మన్‌ సతీష్‌కుమార్‌లు వీరికి ఈ అవార్డులు అందజేశారు. పురస్కార గ్రహీతల్లో ట్రైన్‌ మేనేజర్‌ సీహెచ్‌ మహేశ్‌బాబు, డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ విశాల్‌ అర్జున్‌ ఆర్‌జీ, డివిజనల్‌ సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీర్‌ రమేశ్‌ కముల్లా, వర్క్‌షాప్‌ జూనియర్‌ ఇంజినీర్‌ జీఆర్‌ఏ స్రవంతి, డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ నెల్లిభాను సూర్యప్రకాశ్, చీఫ్‌ కమర్షియల్‌ కం రిజర్వేషన్‌ సూపర్‌వైజర్‌ ఎస్‌.తిరుమలై కుమార్, సీనియర్‌ డివిజనల్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ వాద్వాలు ఉన్నారు.  ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ నుంచి తెలుగు వారైన డిప్యూటీ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీర్‌ ఎస్‌.శ్రీనివాసరావు కూడా ఈ పురస్కారం స్వీకరించారు. 

Current Affairs

2026లో భారత్‌ వృద్ధి రేటు 6.6%

ఈ ఏడాది (2026)లో భారత వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదుకావొచ్చని ఐక్యరాజ్యసమితి (ఐరాస) అంచనా వేసింది. అమెరికా సుంకాల ప్రభావాన్ని స్థిరమైన ప్రైవేట్‌ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు భర్తీ చేస్తాయని తెలిపింది. వరల్డ్‌ ఎకనామిక్‌ సిచ్యువేషన్‌ అండ్‌ ప్రాస్పెక్ట్స్‌ పేరిట ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను విడుదల చేసింది.  అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2026లో 2.7% వృద్ధి చెందొచ్చని ఈ నివేదిక పేర్కొంది.

Internship

క్రిడాన్‌సీ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

క్రిడాన్‌సీ కంపెనీ వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: క్రిడాన్‌సీ పోస్టు పేరు: వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.3,000 - రూ. 5,500. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 29-01-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-video-editing-making-internship-at-kridaanc1767078490

Government Jobs

ఎస్‌వీఐఎంఎస్‌ తిరుపతిలో నర్స్ ఉద్యోగాలు

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (ఎస్‌వీఐఎంఎస్‌), తిరుపతి ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య- 22 వివరాలు: 1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ - I : 03  2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - III : 10  3. ప్రాజెక్ట్ నర్స్ II  : 09  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జీఎన్‌ఎం/డిగ్రీ/పీజీ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 30 నుంచి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు  రిసెర్చ్ సైంటిస్ట్ - I కు రూ.67,000. టెక్నికల్ సపోర్ట్ - IIIకు రూ.28,000. ప్రాజెక్ట్ నర్స్ IIకు రూ.20,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. చిరునామా: ఎస్‌వీఐఎంఎస్‌ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి కార్యాలయం తిరుపతి. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 12. Website:https://svimstpt.ap.nic.in/jobs.html

Government Jobs

ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌ (టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: డిప్యూటీ మేనేజర్‌(టెక్నికల్): 40  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (సివిల్‌ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.56,100 - రూ.1,77,500. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. ఎంపిక విధానం: 2025 గేట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 9. Website:https://nhai.gov.in/#/vacancies/current