భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 3,445 ఖాళీల భర్తీకి వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్ గ్రాడ్యుయేట్)లకు సంబంధించి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య: 3,445.
వివరాలు:
1. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 పోస్టులు
2. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు
3. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు
4. ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు
ఆర్ఆర్బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పుర్, జమ్ము & శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
ఆర్ఆర్బీ భువనేశ్వర్లో 56, ఆర్ఆర్బీ బెంగళూరులో 60, ఆర్ఆర్బీ చెన్నైలో 194, ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో 89 ఖాళీలు ఉన్నాయి.
వయోపరిమితి: 01-01-2025 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
అర్హత: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్/ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కనీసం 50 శాతం మాక్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్/ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కనీసం 50 శాతం మాక్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత, ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
ప్రారంభ వేతనం: నెలకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు రూ.21,700. ఇతర పోస్టులకు రూ.19,900 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), మ్యాథ్స్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు).
మొత్తం ప్రశ్నల సంఖ్య- 100, మొత్తం మార్కులు- 100. పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు.
సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), మ్యాథ్స్(35 ప్రశ్నలు- 35 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు).
మొత్తం ప్రశ్నల సంఖ్య- 120, మొత్తం మార్కుల సంఖ్య- 120. పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-10-2024.
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 22.10.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 23.10.2024 నుంచి 01.11.2024 వరకు.
Website:https://www.rrbapply.gov.in/#/auth/landing
Apply online:https://www.rrbapply.gov.in/#/auth/landing