Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

India’s electric vehicle (EV) market continued its rapid expansion in 2025

♦ India’s electric vehicle (EV) market continued its rapid expansion in 2025, with total EV sales touching 2.3 million units and accounting for 8 percent of all new vehicle registrations, according to data from the government’s Vahan Portal. A report by the India Energy Storage Alliance (IESA) said electric two-wheelers remained the biggest driver of growth, with sales of 1.28 million units, making up 57 percent of total EV sales. Electric three-wheelers, including L3 and L5 categories, followed with 0.8 million units, or 35 percent of the market. ♦ Electric four-wheeler sales stood at around 1.75 lakh units during the year, with increasing demand seen in small and light commercial electric goods carriers, indicating rising adoption in the logistics and delivery segments. ♦ India’s overall automobile market recorded 28.2 million vehicle registrations in 2025, of which two-wheelers accounted for 72 percent. Passenger four-wheeler sales crossed 4.4 million units, while tractors and agricultural vehicles exceeded 1.06 million units. ♦ On a state-wise basis, Uttar Pradesh emerged as the largest EV market with over 4 lakh units, representing 18 percent of national EV sales.  Maharashtra followed with 2.66 lakh units, or 12 percent, and Karnataka with 2 lakh units, accounting for 9 percent of the total.  ♦ India’s EV ecosystem raised over $1.4 billion in 2025, about 27 per cent higher than in 2024.

Current Affairs

Narendra Modi

♦ Prime Minister Narendra Modi held delegation-level talks with German Chancellor Friedrich Merz at the Mahatma Mandir Convention Centre in Gandhinagar on 12 January 2026, focusing on strengthening cooperation across a wide range of sectors. The meeting took place as part of Chancellor Merz’s first official visit to India, which coincides with the completion of 75 years of India–Germany diplomatic relations and 25 years of the India-Germany Strategic Partnership.  ♦ During the talks, the two leaders reviewed progress under the Strategic Partnership and discussed ways to further intensify cooperation in trade and investment, technology, education, skilling and mobility.  ♦ India and Germany signed 19 key MoUs and made eight key announcements, including a Joint Declaration of Intent to strengthen bilateral defence industrial cooperation and the establishment of a Chief Executive Officers’ Forum to bolster trade and investment.  ♦ They also explored collaboration in defence and security, science, innovation and research, green and sustainable development, and people-to-people ties. Regional and global issues of mutual interest were also discussed. ♦ Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz also jointly inaugurated the International Kite Festival at the Sabarmati Riverfront, sharing festive moments that blended cultural celebration with diplomatic engagement.

Current Affairs

జాతీయ యువజన దినోత్సవం

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకే ఉంది. దేశ ప్రగతిలో వీరి పాత్ర ఎనలేనిది. కుల, లింగ, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడంలో; ప్రజలకు మంచి పాలన అందించడంలో; ఆర్థిక వృద్ధి సాధనలో యువతరం భాగస్వామ్యం కీలకం. జాతీయ శ్రేయస్సులో యువత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా జనవరి 12న ‘జాతీయ యువజన దినోత్సవం’గా (National Youth Day) నిర్వహిస్తారు. స్వామి వివేకానంద జయంతి కూడా ఈరోజే! సమాజ హితం పట్ల యువకుల్లో స్ఫూర్తి నింపేలా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేయడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం యువతలో ఉత్తేజాని నింపి, వారు సన్మార్గంవైపు పయనించేలా చేయడంలో వివేకానంద బోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి. తరాలు మారినా ఆయన సందేశాలు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉన్నాయి. నిస్వార్థంగా దేశసేవకు అంకితం అవ్వండి అని ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. యువతలో వివేకానం ఆలోచనలు, తత్వాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆయన జన్మదినమైన జనవరి 12న ఏటా ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1984లో ప్రకటించింది. 1985 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 12న జరుపుతారు.

Current Affairs

ఆర్‌ఏఎస్‌ స్వర్ణ పతకం

భారత సంతతికి చెందిన అమెరికన్‌ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్‌ కులకర్ణికి బ్రిటిష్‌ రాయల్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ (ఆర్‌ఏఎస్‌) స్వర్ణ పతకాన్ని ప్రదానం చేసింది. ఆర్‌ఏఎస్‌ 1824 నుంచి ఏటా బహూకరిస్తున్న స్వర్ణ పతకాలను పొందినవారిలో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, ఎడ్విన్‌ హబుల్, స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటి జగద్విఖ్యాత శాస్త్రవేత్తలు ఉన్నారు.  కులకర్ణి మహారాష్ట్రలో జన్మించారు. ఐఐటీ-దిల్లీలో చదువుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా-బెర్కిలీ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. 40 ఏళ్ల నుంచి కాల్టెక్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, పరిశోధకుడిగా ఉన్నారు. విశ్వ రహస్యాలను ఛేదించడానికి తోడ్పడే 10 పరికరాలను కూడా రూపొందించారు. 

Current Affairs

మధుమేహంతో ఆర్థిక భారం

మధుమేహం కారణంగా అధిక ఆర్థిక భారం పడుతోన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 16.5 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, 11.4 లక్షల కోట్ల డాలర్లతో భారత్‌ ద్వితీయ స్థానంలో, 11 లక్షల కోట్ల డాలర్లతో చైనా తృతీయ స్థానంలో ఉంది.  2020-2025 మధ్య 204 దేశాలపై మధుమేహం వల్ల పడిన ఆర్థిక భారాన్ని పరిశీలించిన ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అప్లైడ్‌ సిస్టమ్స్‌ అనాలసిస్‌’, ‘వియన్నా యూనివర్సిటీ ఆఫ్‌ ఎకనామిక్స్‌’, ‘బిజినెస్‌ ఇన్‌ ఆస్ట్రియా’ల పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనధికార సంరక్షణ వ్యయం ప్రపంచ జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ)లో 1.7 శాతం (10 లక్షల కోట్ల డాలర్లు)గా ఉందని తెలిపారు.  

Current Affairs

ట్యాంకు విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం

సైనికులు మోసుకెళ్లగల ట్యాంకు విధ్వంసక క్షిపణికి సంబంధించిన కొత్త వెర్షన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహల్యనగర్‌లో ఉన్న ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. కదులుతున్న ఒక లక్ష్యంపైకి దీన్ని ప్రయోగించి చూసినట్లు రక్షణశాఖ తెలిపింది. అలాగే ట్యాంకు పైభాగాన్ని లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్నీ పరీక్షించినట్లు వివరించింది. ఇది మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ (ఎంపీఏటీజీఎం). మూడోతరానికి చెందిన ఈ క్షిపణి.. నిర్దేశిత లక్ష్యాన్ని గుర్తించి, దాన్ని ధ్వంసం చేయగలదు. 

Current Affairs

2026-27లో వృద్ధి 7 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జీడీపీ వృద్ధి 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో 7 శాతంగా నమోదుకావొచ్చని ఫిచ్‌ గ్రూప్‌ కంపెనీ బీఎంఐ అంచనా వేసింది. సానుకూల విధాన నిర్ణయాలు భారత్‌కు అండగా నిలవొచ్చని పేర్కొంది. ద్రవ్య పరపతి నిర్ణయాలు, నియంత్రణపరమైన చర్యలు పెట్టుబడులకు, వినియోగం పెంచేందుకు దోహదపడతాయని తెలిపింది.  ఇంతకు ముందు అంచనాల్లో 2025-26లో 7.2%, 2026-27లో 6.6% వృద్ధిరేటు లభించొచ్చని పేర్కొంది. ఇప్పుడు ఈ అంచనాలు పెంచింది. 

Current Affairs

మోదీతో ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ భేటీ

భారత్‌లో రెండ్రోజుల పర్యటన కోసం వచ్చిన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ 2026, జనవరి 12న అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇద్దరూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం అంతర్జాతీయ పతంగుల పండగ-2026ను మోదీ ప్రారంభించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, విలువైన ఖనిజాలు, సెమీ కండక్టర్లు, శాస్త్ర-సాంకేతిక రంగాలు, విద్య, నైపుణ్యం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇద్దరు నేతలూ నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య 19 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. 

Walkins

ఎన్‌ఐఓలో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

కొచ్చిలోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రాఫీ (ఎన్‌ఐఓ) ఒప్పంద ప్రాతిపదికిన టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 14 వివరాలు:  1. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ (డిప్లొమా): 03 2. గ్రాడ్యుయేట్‌ (నాన్‌- ఇంజినీరింగ్‌) అప్రెంటిస్‌షిప్‌: 11 శిక్షణ వ్యవధి: ఏడాది. విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌, ఓషనోగ్రఫీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.8,000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000. వయోపరిమితి: డిప్లొమా టెక్నీషియన్స్‌కు 18 నుంచి 24 ఏళ్లు; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 21 నుంచి 26 ఏళ్లు మించకూడదు.  దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఎన్‌ఏటీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.  ఇంటర్వ్యూ తేదీ: 22-01-2026. వేదిక: సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, రీజినల్‌ సెంటర్‌, కిచ్చి, డా.సలీమ్‌ ఆలీ రోడ్‌, హైకోర్ట్‌ జంక్షన్‌, కొచ్చి, కేరళ. Website:https://www.nio.res.in/vacancies/temporary

Walkins

ఈఎస్‌ఐసీ గువాహటిలో సీనియర్‌ రెసిండెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) గువాహటి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: సీనియర్ రెసిడెంట్‌: 49 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ. గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లలోపు ఉండాలి. జీతం: నెలకు రూ.67,000.- రూ.1,39,462. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. deanbeltolaguwahati@gmail.com కు పంపాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 2026 జనవరి 20.  వేదిక: డీన్ ఛాంబర్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ & హాస్పిటల్, బెల్టోలా, గువాహటి -781022. Website:https://esic.gov.in/recruitments