Posts

Current Affairs

Hindustan Shipyard gets Mini Ratna status

♦ Hindustan Shipyard Limited (HSL) in Visakhapatnam was granted Mini-Ratna status by the Government of India on 14 October 2025. ♦ The recognition follows the shipyard’s consistent financial performance, and operational improvements over the past few years.  ♦ Established in 1941, HSL has been a cornerstone of India’s shipbuilding capability, supporting India's naval and commercial fleets. ♦ In the 2024-25 financial year, HSL hit Rs.1,586 crore in income and Rs.166 crore profit—a 36% jump from last year (2023-24). ♦ With this status, HSL can invest up to ₹500 crore without waiting for approval—so decisions and partnerships get faster.

Current Affairs

Khuralsukh Ukhna meets Narendra Modi

♦ India and Mongolia inked ten MoUs following bilateral and delegation level between Prime Minister Narendra Modi and Mongolian President Khurelsukh Ukhnaa in New Delhi on 14 October 2025. ♦ The MoUs are for cooperation in Humanitarian aid, restoration of heritage site in Mongolia, cooperation in immigration, geology and mineral resources, promotion of Cooperatives, and sharing of digital solutions.  ♦ On this occasion, both the leaders jointly released the commemorative stamps marking the 70th anniversary of India and Mongolia’s bilateral relations.

Current Affairs

Human Rights Council

♦ India has been elected unopposed to the Human Rights Council for the seventh time for a three-year term (2026-28) starting next year. ♦ After India’s election by the General Assembly was announced on 14 October 2025, Permanent Representative P Harish said that this election reflects India’s unwavering commitment to human rights and fundamental freedoms.  ♦ The Human Rights Council is the main UN body with 47 members. ♦ It promotes and protects human rights around the world, reviews the situation in member countries, and provides a forum to discuss issues. ♦ The Council was formed by the General Assembly in 2006, when India was elected to its first term.

Current Affairs

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ఆరోగ్యకర జీవనంలో ‘ప్రమాణాలు’ కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి, కచ్చితమైన నిర్వచనాన్ని ఇస్తాయి. మనం కొనుగోలు చేసే లేదా వినియోగించే ఏ వస్తువుకైనా నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి. ఉత్పత్తులు, సేవలు, వ్యవస్థలు మొదలైనవి సురక్షితంగా, విశ్వసనీయంగా, పరస్పర అవగాహనతో ముందుకు సాగాలంటే ప్రామాణికీకరణ అవసరం. వీటి ఆవశ్యకతను ప్రపంచానికి తెలిపే లక్ష్యంతో ఏటా అక్టోబరు 14న ‘ప్రపంచ ప్రమాణాల దినోత్సవం’గా (World Standards Day) నిర్వహిస్తారు. వివిధ పరిశ్రమల్లో ప్రామాణీకరణను ప్రోత్సహించడంతోపాటు మెరుగైన ఉత్పత్తులు, వ్యవస్థల అభివృద్ధిలో వీటిని పాటించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం:  ప్రపంచవ్యాప్తంగా అన్ని అంశాల్లో ఒకే విధమైన ప్రామాణికీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో 1946, అక్టోబరు 14న లండన్‌ వేదికగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. 25 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రమాణాలను రూపొందించేలా ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని ఇందులో తీర్మానించారు. దీని ఫలితంగానే ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్‌డైజేషన్‌ (ఐఎస్‌ఓ)ను నెలకొల్పారు.  ఈ సమావేశాన్ని గుర్తుంచుకునేలా ఏటా అక్టోబరు 14న ‘ప్రపంచ ప్రమాణాల దినోత్సవం’గా నిర్వహించాలని ఐఎస్‌ఓ, ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రోటెక్నికల్‌ కమిషన్‌ (ఐఈసీ), ఇంటర్నేషనల్‌ టెలీకమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) భావించాయి. 1970 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు. 2025 నినాదం: "Shared Vision for a Better World: Spotlight on SDG 17 – Partnerships for the Goals".

Current Affairs

అరణ్‌(రక్షణ) వసతి గృహాలు

దాడులు, వేధింపులకు గురయ్యే హిజ్రాలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడానికి తమిళనాడు ప్రభుత్వం ‘అరణ్‌(రక్షణ)’ పేరుతో వసతి గృహాల్ని తీసుకొచ్చింది. తొలి విడతగా చెన్నై, మదురైలో రెండు గృహాల్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో కేంద్రంలో 25 మంది ఉండేలా సౌకర్యాలు కల్పించింది. సమాజంలో అభద్రతాభావంతో ఉన్న హిజ్రాలు, వివక్ష, వెలివేత, వేధింపులకు గురైనవారు, అనాథలుగా మిగిలినవారు.. గుర్తింపు కార్డు చూపించి ఉచిత వసతి పొందొచ్చు. బాధితుల్లో ధైర్యం నింపేందుకు కౌన్సెలింగ్‌ బృందాలనూ నియమించింది.  3 నెలల నుంచి 3 ఏళ్ల పాటు ఇక్కడ ఉండొచ్చు. 

Current Affairs

అరుణాచల్‌ ప్రదేశ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా శేర్‌గావ్‌ అడవుల్లో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) బృందం ‘ఇంపేషన్స్‌ రాజీబియానా’ పేరుతో గురివింద (బాల్సమ్‌) జాతి పూలలో కొత్తరకాన్ని కనుక్కుంది. 2025, అక్టోబరు 14న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ వెల్లడించారు. డాక్టర్‌ కృష్ణా చౌలూ సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని గుర్తించింది.  బీఎస్‌ఐ గతంలోనూ పలు గులివింద జాతి పూలను దేశంలో గుర్తించింది. 

Current Affairs

ఆలిండియా సింక్రొనస్‌ ఎలిఫెంట్‌ ఎస్టిమేషన్‌-2025

దేశంలో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆలిండియా సింక్రొనస్‌ ఎలిఫెంట్‌ ఎస్టిమేషన్‌-2025 పేరుతో నిర్వహించిన గణనలో తేలింది. 2017లో 27,312 ఉండగా ప్రస్తుతం 22,446కు పడిపోయింది. మొట్ట మొదటిసారిగా డీఎన్‌ఏ ఆధారంగా ఈ గణన నిర్వహించారు. ఇందులో ఏనుగుల సంఖ్య 18,255 నుంచి 26,645 వరకూ ఉండవచ్చని తేలింది. సగటున దేశంలో 22,446 ఏనుగులున్నట్లు ఈ పద్ధతిలో అంచనా వేశారు. 2021లో చేపట్టిన ఈ గణన ఫలితాలను 2025, అక్టోబరు 14న విడుదల చేశారు.  ఏనుగుల సంఖ్యను నిర్ధారించడం కోసం అవి సంచరించే ప్రాంతాల నుంచి 21,056 పేడ నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు. మొత్తం 6.7 లక్షల కిలోమీటర్ల పరిధిలో ఏనుగులు నడిచే అడవి బాటలో పరిశోధనలు నిర్వహించారు. 

Current Affairs

అవెండస్‌ వెల్త్‌-హురున్‌ ఇండియా జాబితా

35 ఏళ్లలోపే కంపెనీలకు సారథ్యం వహిస్తున్న 155 మంది భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాను అవెండస్‌ వెల్త్‌-హురున్‌ ఇండియా సంయుక్తంగా వెలువరచాయి. వీరి మొత్తం సంపద (443 బి. డాలర్లు/రూ.39 లక్షల కోట్లు) భారత జీడీపీలో పదో వంతు. 2025 సెప్టెంబరు 1 నాటికి తొలి తరం వ్యవస్థాపకులైతే 50 మి. డాలర్ల (సుమారు రూ.444 కోట్ల)కు పైగా విలువ ఉన్న కంపెనీలను, తదుపరి తరం కుటుంబ వ్యాపారాలైతే కనీసం 100 మి. డాలర్ల (సుమారు రూ.888 కోట్ల) విలువ ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుని  ఈ జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం.. అండర్‌-35 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అధికంగా కలిగిన నగరాల్లో బెంగళూరు అగ్రస్థానం(54)లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ముంబయి(29), దిల్లీ (22) ఉన్నాయి. ఆరుగురితో హైదరాబాద్‌ అయిదో స్థానంలో ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక (54 మంది), మహారాష్ట్ర (33), దిల్లీ (22) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 

Current Affairs

చైనా రక్షణ వ్యవస్థ

ప్రపంచంలోని ఏ మూల నుంచి క్షిపణిని ప్రయోగించినా ఇట్టే పసిగట్టేసి సమర్థవంతంగా నిలువరించే గగనతల కవచం ‘డిస్ట్రిబ్యూటెడ్‌ ఎర్లీ వార్నింగ్‌ డిటెక్షన్‌ బిగ్‌ డేటా ఫ్లాట్‌ఫామ్‌’ను చైనా సిద్ధంచేస్తోంది. ఏకంగా వెయ్యి క్షిపణులు చైనా పైకి దూసుకొచ్చినా వాటిని అడ్డుకోగలదు. ఇజ్రాయెల్‌కు క్షిపణుల్ని అడ్డుకునే ‘ఐరన్‌ డోమ్‌’ వ్యవస్థ ఉండగా, అంతకంటే శక్తిమంతమైన ‘గోల్డెన్‌డోమ్‌’ను అమెరికా ప్రతిపాదించింది. ఇప్పుడు చైనా కూడా ఆ ప్రయత్నం చేస్తోంది. 

Current Affairs

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ (పారా) రన్నింగ్‌ పోటీల్లో జీవాంజి దీప్తి రెండో బంగారు పతకం నెగ్గింది. ప్రతిష్టాత్మక పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 2025, అక్టోబరు 14న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన టీ20 మహిళల 200 మీటర్ల పరుగును 24.62 సెకన్లలో పూర్తిచేసిన దీప్తి అగ్రస్థానం కైవసం చేసుకుంది. అక్టోబరు 12న జరిగిన 400 మీటర్ల పరుగులోనూ దీప్తి పసిడి పతకం దక్కించుకుంది.