నిట్ కురుక్షేత్రలో ఎంబీఏ ప్రవేశాలు
నిట్ కురుక్షేత్రలో ఎంబీఏ ప్రవేశాలు హరియాణ రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర (ఎన్ఐటీకే) 2025- 27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీఏలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) 2025 - 2027 మొత్తం సీట్ల సంఖ్య: 53 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్/ సీమ్యాట్/ మ్యాట్ స్కోర్ కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఏదైనా నేషనల్ లెవెల్ పరీక్ష స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.2000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-05-2025. గ్రూప్ డిస్క్షన్, ఇంటర్వ్యూ ప్రకటన తేదీ: 08.05.2025. గ్రూప్ డిస్క్షన్, ఇంటర్వ్యూ తేదీ: 19.05.2025. మెరిట్ లిస్ట్: 20.05.2025. మొదటి రౌండ్ అడ్మిషన్ కౌన్సెలింగ్: 21-22.05.2025. రెండో మెరిట్ లిస్ట్: 23.05.2025. రెండో రౌండ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ (మిగిలి సీట్లకు మాత్రమే): 27.05.2025. Website: https://nitkkr.ac.in/admission-2021/