Posts

Current Affairs

National Institute of High Security Animal Diseases (NIHSAD)

♦ India has secured a prestigious position in global animal health with the designation of the ICAR-National Institute of High Security Animal Diseases (NIHSAD) in Bhopal as a Category A Rinderpest Holding Facility (RHF) by the World Organisation for Animal Health (WOAH) and the United Nations’ Food and Agriculture Organization (FAO). ♦ The recognition was The achievement highlights India’s commitment to international disease control standards and reinforces its pivotal role in safeguarding global animal health. ♦ This milestone places India among an elite group of six global facilities tasked with securely managing rinderpest virus material, underscoring the nation’s leadership in animal health, biosecurity, and the One Health framework. ♦ Rinderpest, historically known as “cattle plague,” was a devastating livestock disease eradicated globally in 2011. ♦ To prevent its re-emergence, WOAH and FAO restrict the storage of Rinderpest Virus-Containing Material (RVCM) to aselect few high-security laboratories worldwide. ♦ ICAR-NIHSAD, a Biosafety Level-3 (BSL-3) facility and WOAH reference laboratory for avian influenza, was designated as India’s RVCM repository in 2012.

Current Affairs

మంగళాభట్‌ కన్నుమూత

ప్రముఖ కథక్‌ నృత్య కళాకారిణి, నాట్యగురువు మంగళాభట్‌ (62) 2025, జూన్‌ 16న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ప్రఖ్యాత నాట్యగురువు రాఘవరాజ్‌భట్‌ సతీమణి, జానపద కళాబ్రహ్మ గోపాల్‌రాజ్‌భట్‌ కోడలు అయిన మంగళాభట్‌ హైదరాబాద్‌లో ఆకృతి కథక్‌ కళాకేంద్రం ద్వారా మూడున్నర దశాబ్దాలుగా ఎంతోమందిని తీర్చిదిద్దారు. ఆమె మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో జన్మించారు.   1990లో మంగళాభట్‌ తన భర్తతోకలిసి హైదరాబాద్‌లో ఆకృతి కేంద్రాన్ని ప్రారంభించారు. కథక్‌ సంప్రదాయంలో ప్రయోగాలు చేసి మెప్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. 

Current Affairs

ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయెన్స్‌ (ఐబీసీఏ) సమావేశం

95 సభ్యదేశాలు కలిగిన ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయెన్స్‌ (ఐబీసీఏ) తొలి సమావేశం 2025, జూన్‌ 16న దిల్లీలో జరిగింది. దీనికి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షత వహించారు. వన్యప్రాణి సంరక్షణలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భూపేందర్‌ యాదవ్‌ వెల్లడించారు. పిల్లి జాతికి చెందిన పులులు, సింహాల వంటి వన్యమృగాల పరిరక్షణకు ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయెన్స్‌ (ఐబీసీఏ) సభ్యదేశాలతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.   ఈ సమావేశంలో భూపేందర్‌ యాదవ్‌ ఐబీసీఏ అధ్యక్షునిగా ఎన్నిక కాగా ఎస్‌.పి.యాదవ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 

Current Affairs

‘సైబర్‌ సురక్ష’ ప్రారంభం

రక్షణ రంగానికి సంబంధించి వాస్తవ జగతిలో తలెత్తగల సైబర్‌ ముప్పుల్ని అనుకరించి వాటికి దీటైన సమాధానం ఎలా ఇవ్వాలో తెలియజేస్తూ పరిష్కారం చూపే ‘సైబర్‌ సురక్షా’ కార్యక్రమం 2025, జూన్‌ 16న ప్రారంభమైందని రక్షణ శాఖ ప్రకటించింది. భారత సమగ్ర రక్షణ దళాల ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో రక్షణ శాఖ సైబర్‌ సంస్థ ఈ సైబర్‌ భద్రతా సమావేశం నిర్వహిస్తోంది. జూన్‌ 27న ఇది ముగుస్తుంది. రక్షణ, అనుబంధ రంగాలకు చెందిన జాతీయస్థాయి సంస్థల నుంచి 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Current Affairs

సిప్రి నివేదిక

భారత్‌వద్ద 2025, జనవరి నాటికి 180 అణ్వాయుధాలు (అణు వార్‌హెడ్లు) ఉన్నాయని స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) నివేదిక వెల్లడించింది. ఇవి పాకిస్థాన్‌వద్ద ఉన్న 172 కంటే ఎక్కువ.. చైనావద్ద ఉన్న 600 కంటే తక్కువని పేర్కొంది. ఏడాదిలో భారత్‌ 8 వార్‌హెడ్లను పెంచుకుందని తెలిపింది. ప్రపంచ దేశాలవద్ద అణ్వాయుధాలపై వార్షిక నివేదికను సిప్రి 2025, జూన్‌ 16న విడుదల చేసింది.  చైనా ఏటా 100 అణు వార్‌హెడ్‌లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుంటోందని నివేదిక పేర్కొంది. 

Current Affairs

మోదీకి సైప్రస్‌ అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ మకారియోస్‌ 3’తో సైప్రస్‌ గౌరవించింది. 2025, జూన్‌ 16న ఆ దేశాధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో కలిపితే ఇప్పటివరకూ ప్రధాని మోదీని వరించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 23కు చేరుకుంది. సైప్రస్‌ పర్యటనలో భాగంగా నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌తో సమావేశమైన మోదీ.. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, పర్యావరణంసహా పలు ద్వైపాక్షిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు.

Current Affairs

అమితాబ్‌ కాంత్‌

అమితాబ్‌ కాంత్‌ 2025, జూన్‌ 16న జీ20 షెర్పా బాధ్యతల నుంచి వైదొలిగారు. 1980 బ్యాచ్, కేరళ క్యాడర్‌కు చెందిన ఈ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి 2022 జులైలో భారత జీ20 షెర్పాగా నియమితులయ్యారు. అప్పట్లో జీ20 సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించడానికి కొద్ది నెలల ముందు ఈ నియామకం జరిగింది.   2016-22 వరకు నీతిఆయోగ్‌ సీఈఓగా కాంత్‌ బాధ్యతలు నిర్వహించారు. పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు.. సంస్కరణలు, సరళీకరణలకు కాంత్‌ పెద్దపీట వేశారు. పర్యాటక మంత్రిత్వ శాఖకు సంయుక్త కార్యదర్శిగా కాంత్‌ ఉన్న సమయంలోనే ‘ఇంక్రెడిబుల్‌ ఇండియా’ను తీసుకొచ్చారు.

Current Affairs

‘ఎమ్‌ఐ6’కి నేతృత్వం వహించనున్న బ్లేయిస్‌ మెట్రెవేలీ

యూకే ప్రభుత్వ నిఘా సంస్థ ‘ఎమ్‌ఐ6’ 18వ చీఫ్‌గా బ్లేయిస్‌ మెట్రెవేలీ నియమితులయ్యారు. 116 ఏళ్ల చరిత్ర ఉన్న ‘ఎమ్‌ఐ6’కి నాయకత్వ బాధ్యత వహించనున్న మొదటిసారిగా ఈమె నిలిచారు. దేశంలో టెర్రరిజాన్ని అరికట్టడం, రాష్ట్రాల్లో అల్లర్లను అడ్డుకోవడం, సైబర్‌ భద్రతను కాపాడటం వీరి ప్రధాన కర్తవ్యాలు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి ఆంత్రపాలజీ చదువుకున్న మెట్రెవేలీ 1999లో దేశ నిఘా విభాగంలో చేరి మధ్య ఆసియా, ఐరోపాలో విధులు నిర్వర్తించారు.  

Current Affairs

జన గణన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

జన గణన కోసం కేంద్ర హోంశాఖ 2025, జూన్‌ 16న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్‌ జనరల్, సెన్సస్‌ కమిషనర్‌ మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ పేరుతో ఇది విడుదలైంది. జన గణన చట్టం-1948లోని సెక్షన్‌ 3 కింద ఉన్న అధికారాలను అనుసరించి 2019 మార్చి 28న జారీ చేసిన 2021 నాటి జన గణన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో ఇప్పుడు 2027 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2027 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది.

Walkins

సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన సీఈసీఆర్‌ఐ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌- 01 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I - 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/  బీటెక్‌/ ఎంఎస్సీ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టుకు రూ.25,000. వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు 35 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ: 19-06-2025. వేదిక: సీఎస్‌ఐఆర్- సీఈసీఆర్ఐ, చెన్నై యూనిట్‌ తారామణి. Website:https://www.cecri.res.in/cecri/Default.aspx