నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో పోస్టులు
తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని ప్రభుత్వ రంగ సంస్థ- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 171 వివరాలు: 1. జూనియర్ ఓవర్మ్యాన్: 69 2. మైనింగ్ సర్దార్: 102 అర్హతలు: మైనింగ్ లేదా మైనింగ్ ఇంజినీరింగ్లో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ ఓవరమ్యాన్, మైనింగ్ మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.04.2025 నాటికి యూఆర్/ ఈడబ్ల్యూఎస్ వారికి 30ఏళ్లు; ఓబీసీలకు 33 ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లు ఉండాలి. పే స్కేల్: నెలకు జూనియర్ ఓవర్మ్యాన్ రూ.31,000- రూ.1,00,000; మైనింగ్ సర్దార్కు రూ.26,000- రూ.1,10,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జూనియర్ ఓవర్మ్యాన్కు యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.595, ఎస్సీ ఎస్టీ వారికి రూ.295; మైనింగ్ సర్దార్కు యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.486; ఎస్సీ/ ఎస్టీ వారికి రూ.236. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15-04-2025. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-05-2025. Website: https://www.nlcindia.in/website/en/