Posts

Current Affairs

12th BRICS Parliamentary Forum

♦ India assumed the chairmanship of the 12th BRICS Parliamentary Forum, to be hosted next year (2026), and Lok Sabha Speaker Shri Om Birla was formally handed over the chairmanship. ♦ The 11th BRICS Parliamentary Forum concluded in Brasilia, Brazil, with participating parliaments from all 10 BRICS member countries.  ♦ The ten BRICS countries represented in 2025 forum were: ♦ India, Brazil, Russia, China, South Africa, Iran, the United Arab Emirates, Egypt, Ethiopia, and Indonesia. 

Current Affairs

Chenab Bridge, the world’s highest railway arch bridge

♦ Prime Minister Narendra Modi inaugurated the Chenab Bridge, the world’s highest railway arch bridge on 6 June 2025. ♦ Soaring 359 metres above the Chenab River, the 1,315-metre-long steel arch bridge is built to withstand high seismic and wind loads. ♦ It will reduce travel time between Jammu and Srinagar by two to three hours. ♦ This bridge is 35 metres taller than the Eiffel Tower. ♦ PM Modi also inaugurated the Anji Bridge, India’s first cable-stayed railway bridge, constructed in one of the most challenging terrains in the region. 

Current Affairs

Kiren Rijiju

♦ Union Minister for Minority Affairs and Parliamentary Affairs, Kiren Rijiju, launched the UMEED Central Portal in New Delhi on 6 June 2025, marking a transformative step toward modernizing the management of Waqf properties across India.  ♦ The UMEED Central Portal, named after the Unified Waqf Management, Empowerment, Efficiency, and Development Act, 1995, is a centralized digital platform designed to enable real-time uploading, verification, and monitoring of Waqf properties. 

Current Affairs

బిమ్‌స్టెక్‌ డే

బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ-సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ (బిమ్‌స్టెక్‌) ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూన్‌ 6న ‘బిమ్‌స్టెక్‌ డే’గా నిర్వహిస్తారు. బంగాళాఖాతం ఒడ్డున లేదా ఆనుకుని ఉన్న దేశాలన్నీ ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. ఇందులో మొత్తం ఏడు సభ్య దేశాలు ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రవాణా, పర్యాటకం, మత్స్య సంపద లాంటి రంగాల్లో వాటి మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  చారిత్రక నేపథ్యం 1997, జూన్‌ 6న బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ బ్యాంకాక్‌ డిక్లరేషన్‌పై సంతకాలు చేసి, బిస్ట్‌ - ఎకనామిక్‌ కోపరేషన్‌ (బిస్ట్‌-ఈసీ)ను నెలకొల్పాయి. 1977, డిసెంబరు 22న మయన్మార్‌; 2004, ఫిబ్రవరిలో నేపాల్, భూటాన్‌ దేశాలు ఇందులో చేరాయి. 2004, జులై 31న బ్యాంకాక్‌లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో దీని పేరును ‘బిమ్‌స్టెక్‌’గా మార్చారు. అదే సదస్సులో ఏటా జూన్‌ 6న ‘బిమ్‌స్టెక్‌ డే’గా నిర్వహించాలని సభ్యదేశాలు తీర్మానించాయి. 

Current Affairs

0.50% తగ్గిన రెపో

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు (0.5%) తగ్గించి, 5.5 శాతానికి చేర్చింది. 2025లో, ఇంతకుముందే రెండుసార్లుగా 0.25% చొప్పున కోత విధించడంతో, తాజా తగ్గింపుతో కలిపి మొత్తం 1 శాతం (100 బేసిస్‌ పాయింట్ల) మేర రెపో రేటులో ఊరట కలిగింది. బ్యాంకులు తమ వడ్డీ రేటుకు ప్రామాణికంగా రెపోను పరిగణిస్తాయి. రెపో రేటుపై 2.5-2.75% అదనంగా వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంటాయి.

Current Affairs

చినాబ్, అంజీ వంతెనల ప్రారంభం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్‌ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025, జూన్‌ 6న ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కట్రా నుంచి కశ్మీర్‌కు వందేభారత్‌ రైలుకు జెండా ఊపడం ద్వారా మొదలు పెట్టారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన (కేబుల్‌ బ్రిడ్జి)ను ప్రారంభించారు.  అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్‌ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్ఠాత్మక ప్రణాళిక. బ్రిటిష్‌ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజినీర్లను నియమించినా ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. 

Walkins

దీన్‌ దయాల్‌ పోర్ట్‌ అథారిటీలో పైలట్‌ పోస్టులు

గుజరాత్‌, కచ్‌లోని దీన్‌ దయాల్ పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పైలట్‌ (మెరైన్‌) పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: పైలట్‌ (మెరైన్‌): 10 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో భారత ప్రభుత్వం షిప్పింగ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన విదేశీ గోయింగ్ షిప్‌లో మాస్టర్‌గా సమర్థత ధృవీకరణ పత్రం లేదా భారత ప్రభుత్వం షిప్పింగ్ మంత్రిత్వ శాఖ గుర్తించిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి పని అనుభవం ఉండాలి.   గరిష్ఠ వయోపరిమితి: 65 ఏళ్లు. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 25. వేదిక: ఛాంబర్‌ ఆఫ్‌ ది ఛైర్‌ పర్సన్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ బిల్డింగ్‌, దీన్‌ దయాల్ పోర్ట్‌ అథారిటీ, గాంధీధామ్‌, ఖచ్‌, గుజరాత్-370201. Website:https://www.deendayalport.gov.in/en/recruitments/current-openings/

Walkins

సీడాక్‌లో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులు

పుణెసెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 08.  వివరాలు: 1. మిషన్‌ కో ఆర్డినేటర్‌- 01  2. ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌: 02   3. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌: 02   4. డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌: 01  5. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌-ఫైనాన్స్‌: 01  6. సీనియర్‌ మేనేజర్‌- అడ్మిన్‌: 01  అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు మిషన్‌ కో ఆర్డినేటర్‌కు రూ.2,80,000; ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పోస్టులకు రూ.2,50,000; ఇతర పోస్టులకు రూ.1,50,000. వయోపరిమితి: మిషన్‌ కో ఆర్డినేటర్‌కు 63ఏళ్లు; ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పోస్టులకు 56ఏళ్లు; ఇతర పోస్టుకలు 50ఏళ్లు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: గూగుల్‌ లింక్‌ ద్వారా జూన్‌14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌కు జూన్‌ 20న; ఇతర పోస్టులకు జూన్‌ 19వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. Website:https://cdac.in/index.aspx?id=current_jobs

Government Jobs

ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2025

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ గ్రూప్‌ ‘బీ’ నాన్‌ గేజిటెడ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన 'కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2025' నోటిఫికేసన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: దాదాపు 437. వివరాలు: 1. జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్  2. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌  3. జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌  4. సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌  5. సీనియర్ ట్రాన్స్‌లేటర్‌  6. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌) అర్హతలు: పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ/ ఇంగ్లిష్). డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్‌లేషన్‌(హిందీ/ ఇంగ్లిష్) డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.  వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్/ సీనియర్ ట్రాన్స్‌లేటర్  పోస్టులకు రూ.44,900- రూ.1,42,400. ఇతర పోస్టులకు రూ.35,400- రూ.1,12,400. పరీక్ష విధానం:  పేపర్-1 (ఆబ్జెక్టివ్ టైప్/ కంప్యూటర్ బేస్డ్ మోడ్) సబ్జెక్టులు: జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్  (100 ప్రశ్నలు/ 100 మార్కులు); పేపర్-2 (డిస్క్రిప్టివ్‌) సబ్జెక్టులు: ట్రాన్స్‌లేషన్‌, ఎస్సే, మొత్తం 200 మార్కులు.  పరీక్ష వ్యవధి: 2 గంటలు. దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26.06.2025. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేదీ: 27.06.2025. దరఖాస్తు సవరణ తేదీలు: 01.07.2025 నుంచి 02.07.2025 వరకు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1): 12.08.2025. హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌: 180093063. Website:https://ssc.gov.in/ Apply online:https://ssc.gov.in/login

Government Jobs

ఈఎస్‌ఐసీలో డీన్‌ పోస్టులు

ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) పీజీఐఎంస్‌ఆర్‌ఎస్‌/ మెడికల్ కాలేజీల్లో డీన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 10 వివరాలు: అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 జులై 7వ తేదీ నాటికి 55 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.37,000 - రూ.67,000. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎంపకి ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 జులై 7. చిరునామా: ది రీజినల్ డైరెక్టర్‌, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌, పంచదీప్‌ భవన్‌, సెక్టార్‌-16 లక్ష్మీనారాయణ్‌ మందిర్‌, ఫరీదాబాద్‌-121002, హరియాణా. Website:https://esic.gov.in/