Posts

International

The Department for Promotion of Industry and Internal Trade

The Department for Promotion of Industry and Internal Trade (DPIIT) signed an agreement with the Korea Transport Institute (KoTI), Republic of Korea (RoK) on 10 February 2025 to enhance cooperation in logistics and infrastructure development. The MoU was signed at the Sejong National Research Complex, South Korea by Mr. Youngchan Kim, President of KOTI, and H.E. Amit Kumar, Ambassador of India to the Republic of Korea. ♦ The MoU will enhance cooperation in logistics and infrastructure development, leveraging KOTI's expertise to support India’s ambitious infrastructure initiatives. Joint working meetings will be held for taking the initiative forward. ♦ The key benefits of this collaboration include the establishment of a research-driven program that enhances expertise in logistics and infrastructure through knowledge exchange, training, and technical assistance. It will also foster cross-learning in areas such as master planning, technology adoption, and innovation. Additionally, the partnership will highlight the achievements under the PM GatiShakti initiative and promote GIS data-based technology on a global stage.

Current Affairs

నీతి ఆయోగ్‌ నివేదిక

2021-22కు సంబంధించి గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నిష్పత్తిలో (జీఈఆర్‌) రాష్ట్రాల ప్రతిభపై నివేదికను 2025, ఫిబ్రవరి 10న నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. దీని ప్రకారం, ఉన్నత విద్య ప్రవేశాల్లో తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభ కనబరిచి టాప్‌ 4లో నిలిచాయి. ఆ తర్వాత ముందు వరుసలో (ఫ్రంట్‌ రన్నర్స్‌) ఉన్న వాటిలో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్, కర్ణాటక నిలిచాయి. ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, ఝార్ఖండ్, బిహార్‌ రాష్ట్రాలు అట్టడుగున్న నిలిచాయి. 

Current Affairs

కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పు

2025-26 బడ్జెట్‌ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అంతర్గత అప్పులు రూ.200.16 లక్షల కోట్లకు, విదేశీరుణాలు రూ.8.92 లక్షల కోట్లకు చేరనున్నట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి 2025, ఫిబ్రవరి 10న లోక్‌సభలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రుణ-జీడీపీ నిష్పత్తిలో ఏటా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. 2018-19లో 49.3% మేర ఉన్న ఈ రుణ నిష్పత్తి ఆ తర్వాత తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. 2031 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తిని జీడీపీలో 50శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2026-27 నుంచి 2030-31 వరకు ఏటా ఆర్థికలోటును తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Current Affairs

‘శివశక్తి’ పాయింట్‌ వయసు 370 కోట్ల సంవత్సరాలు

చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రదేశమైన ‘శివశక్తి’ భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబోరేటరీ బృందం రూపొందించింది. దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం దాదాపు  370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు. భూమిపై తొలి జీవ రూపాలు కూడా ఆ సమయంలోనే ఆవిర్భవించాయి.  

Current Affairs

కుటుంబ తలసరి అప్పు రూ.86,713

2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి రూ.86,713 అప్పు ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి 2025, ఫిబ్రవరి 10న లోక్‌సభలో తెలిపారు. 2019లో రూ.46,898 మేర ఉన్న రుణ భారం అయిదేళ్లలో 85%మేర పెరిగినట్లు వెల్లడించారు.  ఇదే సమయంలో కుటుంబాల పొదుపుశాతం తగ్గినట్లు చెప్పారు. ఇది 2018-19లో జీడీపీలో 20.3%మేర ఉన్న కుటుంబాల పొదుపు నిష్పత్తి, 2019-20లో 19.1%, 2020-21లో 22.7%, 2021-22లో 20.1%కి చేరి 2022-23 నాటికి 18.4%కి తగ్గినట్లు తెలిపారు.  

Current Affairs

ఏరో ఇండియా-2025

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2025, ఫిబ్రవరి 10న బెంగళూరులో 15వ ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను (ఏరో ఇండియా-2025) ప్రారంభించారు. ‘ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా నిలిచే ఈ షోకు ఈ దఫా ఇతివృత్తం (థీమ్‌) ‘రన్‌ వే ఫర్‌ బిలియన్‌ అపార్చునిటీస్‌’. 90 దేశాల నుంచి 150 కంపెనీలు పాల్గొన్నాయి. 900కు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. అమెరికా, రష్యా తదితర దేశాల యుద్ధవిమానాల విన్యాసాలుంటాయి. 30 దేశాల రక్షణ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. ఫిబ్రవరి 14న విన్యాసాలు ముగుస్తాయి. భారత రక్షణ రంగం ఉత్పాదనపరంగా రూ.1.27 లక్షల కోట్లు, ఎగుమతుల్లో రూ.21 వేల కోట్లు దాటిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.

Walkins

ఐఐపీఆర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్‌పుర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌ (ఐఐపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో- 01 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌- 01 అర్హత: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు సంబంధిత విభాగంలో పీజీ  ఉత్తీర్ణతతో పాటు నెట్‌/ గేట్‌/ ఐసీఏఆర్‌-ఎస్‌ఆర్‌ఎఫ్‌ స్కోర్‌, ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.37,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.15,000. వయోపరిమితి: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 18- 35 ఏళ్లు; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 21- 45ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ: 17.03.2025. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఇంటర్వ్యూ వేదిక: ఐసీఏఆర్‌- ఐఐపీఆర్‌ రీజినల్‌ స్టేషన్‌, ఫాండా (టోల్‌ ప్లాజా దగ్గర) భోపాల్‌. Website:https://iipr.icar.gov.in/

Walkins

ఐఏఆర్‌ఐలో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

దిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: 1. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 02  2. యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 01  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ,  ఉత్తీర్ణతతో పాటు, నెట్‌/ గేట్‌ స్కోర్‌, ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు మొదటి, రెండో ఏడాది రూ.37,000, రెండో ఏడాది రూ.42,000; యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.30,000. వయోపరిమితి: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లు; యంగ్‌ ప్రొఫెషనల్‌కు 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా మార్చి 11వ తేదీ వరకు పంపించవచ్చు. ఈమెయిల్:viromeacpv@gmail.com  ఇంటర్య్వూ తేదీ: 13.03.2025. వేదిక: ఐసీఏఆర్‌-ఐఏఆర్‌ఐ, న్యూ దిల్లీ. Website:https://www.iari.res.in/en/index.php

Government Jobs

ఇర్కాన్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (ఇర్కాన్) రెగ్యులర్‌ ప్రాతిపదికన జనరల్‌ మేనేజర్‌ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 5 వివరాలు: 1. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/ సివిల్‌- 01 2. మేనేజర్‌/ ఫైనాన్స్‌- 02   3. డిప్యూటీ మేనేజర్‌/ ఫైనాన్స్‌- 02 అర్హత: సీఏ/ సీఏంఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు 41 ఏళ్లు; మేనేజర్‌కు 37 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 33 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.70,000 నుంచి రూ.2,00,000. మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ వారికి ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జేజీఎం/ హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, సీ-4, డిస్ట్రిక్ట్‌ సెంటర్‌, సాకేత్‌, దిల్లీ. దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.02.2025. దరఖాస్తు చివరి తేదీ: 07.03.2025. Website:https://www.ircon.org/index.php?lang=en

Government Jobs

సీఎస్‌ఐఆర్‌-సీఎఫ్‌టీఆర్‌ఐలో సైంటిస్ట్‌ పోస్టులు

మైసూర్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్‌-సీఎఫ్‌టీఆర్‌ఐ) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 35 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌, కెమికల్, డిసైన్‌), పీహెచ్‌డీలో  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు. జీతం: నెలకు రూ.67,700 - రూ.2,08,700. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025. Website:https://cftri.res.in/