Posts

Current Affairs

హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లు

అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైనిక దళాలకు ఇవి బాగా ఉపయోగపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.   హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లు ఇప్పటికే భారత సైన్యం, వాయుసేన అమ్ములపొదిలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని నౌకాదళంలోనూ ప్రవేశపెట్టబోతున్నట్లు ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. 

Current Affairs

హైస్పీడ్‌ రాకెట్‌ స్లెడ్‌ టెస్ట్‌

యుద్ధవిమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడేందుకు పైలట్‌కు సహాయపడే ఎస్కేప్‌ వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. పైలట్‌ను క్షేమంగా వెలుపలికి తీసుకురావడం సహా భద్రతకు సంబంధించిన కీలక అంశాలను ఈ సందర్భంగా ధ్రువీకరించుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో సొంతంగా ఇలాంటి పరీక్ష సామర్థ్యాన్ని కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది.  హైస్పీడ్‌ రాకెట్‌ స్లెడ్‌ టెస్ట్‌ అనే ఈ పరీక్షను చండీగఢ్‌లో డీఆర్‌డీవోకు చెందిన టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ (టీబీఆర్‌ఎల్‌)లో నిర్వహించారు. ఇందులో తేజస్‌ యుద్ధవిమానానికి సంబంధించిన ముందు భాగాన్ని ఉపయోగించారు. 

Current Affairs

విమాన విడిభాగాల (ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌) పరిశ్రమ

2024-25 ఆర్థిక సంవత్సరంలో మనదేశం 6.9 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.61,410 కోట్లు) విలువైన విమాన విడిభాగాలను ఎగుమతి చేసింది. ఈ పరిశ్రమ 2030 నాటికి 22 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ఎయిర్‌బస్‌ మనదేశం నుంచి ఏటా 1.5 బిలియన్‌ డాలర్ల విలువైన విడిభాగాలను కొనుగోలు చేస్తోంది. 2030 నాటికి దీన్ని 2 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలనేది ఎయిర్‌బస్‌ ప్రణాళిక.  ఫ్రాన్స్‌ దిగ్గజ సంస్థ అయిన శాఫ్రన్‌ దాదాపు రూ.1300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తన తొలి ఇంజిన్‌ నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌ఓ) సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. మనదేశ విమానయాన సంస్థలు దాదాపు 1500 శాఫ్రన్‌ ఇంజిన్ల కోసం ఆర్డర్లు ఇచ్చింది.

Current Affairs

మొక్కజొన్న ఉత్పాదకతలో ఆంధ్రాదే అగ్రస్థానం

పంటల ఉత్పాదకత పరంగా ఆంధ్రప్రదేశ్‌ మొక్కజొన్నలో దేశంలో తొలిస్థానంలో, వరి, మినుము పంటల్లో రెండో స్థానంలో నిలిచింది. 2024-25 లెక్కల ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ 2025, డిసెంబరు 2న లోక్‌సభలో ఈ విషయం వెల్లడించారు. కంది ఉత్పాదకతలో దేశంలో ఏపీ అట్టడుగున ఉంది. శనగలో 12, పెసలులో 6, వేరుశనగలో 13, సోయాబిన్‌లో 7, చెరకులో 4, పత్తిలో 9వ స్థానంలో నిలిచింది. 

Current Affairs

దేశంలో ప్రతి 811 మందికి ఒక డాక్టరు

దేశంలో ప్రతి 811 మంది ప్రజలకు ఒక అర్హత కలిగిన వైద్యుడు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం 2025, డిసెంబరు 2న పార్లమెంటుకు తెలిపింది. అల్లోపతి పద్ధతిలో చికిత్స చేసే వైద్యులు దేశంలో 13,88,185 మంది ఉండగా, ఆయుష్‌ వైద్య విధానంలో రిజిస్టర్‌ అయినవారు 7,51,768 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో చెప్పారు. రిజిస్టర్‌ అయిన అల్లోపతి, ఆయుష్‌ వైద్యుల్లో 80 శాతం మంది అందుబాటులో ఉన్నారని భావించినా దేశంలో డాక్టర్లు 1 : 811 నిష్పత్తిలో ఉన్నారు.

Current Affairs

జన గణన

దేశంలో జన గణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2026 ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జన గణన జరుగుతుందని 2025, డిసెంబరు 2న లోక్‌సభకు తెలిపింది. అదే సమయంలో కుల గణనను కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. తొలి దశలో... గృహాల లిస్టింగ్, గణన (2026 ఏప్రిల్‌-సెప్టెంబరు) -  రెండో దశలో... జనాభా లెక్కల సేకరణ (2027 ఫిబ్రవరి- మార్చి 1) నిర్వహిస్తారు. లద్ధాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లోని ప్రతికూల వాతావరణ ప్రాంతాల్లో జన గణన 2026 సెప్టెంబరు- అక్టోబరు 1 వరకు ఉంటుంది.

Walkins

ఎన్‌సీఎస్‌ఎస్ఆర్ దిల్లీలో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్‌ రిసెర్చ్ - (ఎస్‌ఏఐ - SAI, ఎన్‌సీఎస్‌ఎస్ఆర్), ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (టెక్నికల్ ఆఫీసర్),ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 07 వివరాలు: 1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (టెక్నికల్ ఆఫీసర్) - 01 2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్) - 06 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ (న్యూట్రిషన్ & డైటెటిక్స్/ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్)లో ఉత్తీర్ణులై ఉండాలి. జీతం: నెలకు రూ.28,000. గరిష్ఠ వయోపరిమితి: 2025, డిసెంబరు 15వ తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 2025 డిసెంబర్‌ 15, 16. వేదిక: రూమ్ నం. 41, ఎన్‌సీఎస్‌ఎస్ఆర్‌, ఇందిరా గాంధీ స్టేడియం కాంప్లెక్స్, ఐపీ ఎస్టేట్, న్యూ దిల్లీ - 110002 Website:https://sportsauthorityofindia.nic.in/sai_new/job-opportunities

Walkins

ఈఎస్‌ఐసీ జమ్మూలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) జమ్మూ ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైమ్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 27 వివరాలు: 1. ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ - 10 2. సీనియర్ రెసిడెంట్ - 17 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధింత విభాగాంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/ఎంబీబీఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్‌ పేరే నమోదై ఉండాలి. విభాగాలు అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ,చెస్ట్, డెర్మటాలజీ,ఓబ్స్ & గైనకాలజీ ,రేడియాలజీ ,సైకియాట్రీ తదితర విభాగాలు. జీతం: నెలకు ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ కు రూ.1,06,000. - రూ.1,23,000. సీనియర్ రెసిడెంట్ కు రూ.67,000. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ms-jammu@esic.gov.in కు పంపాలి. దరఖాస్తు ఫీజు:  జనరల్ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ మహిళా అభ్యర్థులకు  ఫీజు లేదు. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబరు 16. ఇంటర్వ్యూ తేదీ: 19/12/2025  వేదిక: ఈఎస్‌ఐసీ మోడల్ హాస్పిటల్, బారీ-బ్రహ్మణ, జమ్మూలోని మొదటి అంతస్తు. Website:https://esic.gov.in/recruitments

Internship

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోబోటిక్స్‌ కంపెనీలో పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోబోటిక్స్‌ కంపెనీ (ఐఐఓఆర్‌) బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోబోటిక్స్‌ పోస్టు పేరు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌  నైపుణ్యాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్, కోల్డ్‌ కాలింగ్, ఈమెయిల్‌ మార్కెటింగ్, మార్కెటింగ్‌ ఆటోమేషన్, సేల్స్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.5,000 - రూ.6,000. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 26-12-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-business-development-executive-internship-at-indian-institute-of-robotics1764132352

Government Jobs

ఎస్‌ఎస్‌సీ - కానిస్టేబుల్‌, రైఫిల్‌మ్యాన్‌ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌) లలో కానిస్టేబుల్ (జీడీ), రైఫిల్‌మ్యాన్‌ (జీడీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  మొత్తం పోస్టుల సంఖ్య: 25,487  వివరాలు: 1. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 14,595  2. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF): 5,490 3. సశస్త్ర సీమా బల్ (SSB): 1,764  4. అస్సాం రైఫిల్స్ (AR): 1,706  5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 1,293 6. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 616 7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF): 23  విద్యార్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పరీక్షలో 01.01.2026 నాటికి లేదా అంతకు ముందు ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు పరిమితి:  01.01.2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. (అంటే, అభ్యర్థులు 02.01.2003 కంటే ముందు 01.01.2008 తర్వాత జన్మించి ఉండకూడదు). వయస్సు సడలింపు: ఎస్సీ/ఎస్టీకి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ (ESM) అభ్యర్థులకు 3 ఏళ్లు.  వేతనం: నెలకు రూ. 21,700 నుంచి రూ.69,100. దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. SSC కొత్త వెబ్‌సైట్ (https://ssc.gov.in) లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేయాలి. పాత వెబ్‌సైట్‌లో చేసిన OTR చెల్లదు. ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉంటాయి: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE). ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST). ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET). వైద్య పరీక్ష (DME)/ వైద్య పరీక్ష (RME). డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV). CBE లోని మెరిట్, అభ్యర్థులు ఎంచుకున్న ఫోర్స్ ప్రాధాన్యత ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ముఖ్యమైన అంశాలు:  ఖాళీలు రాష్ట్రం/యూటీ వారీగా ఉంటాయి. SSF పోస్టులు మాత్రం ఆల్-ఇండియా ఆధారంగా భర్తీ చేస్తారు.  అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో పేర్కొన్న రాష్ట్రం/యూటీ, డోమిసైల్/పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ (PRC) ను డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా సమర్పించాలి. NCC సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు ప్రోత్సాహక/బోనస్ మార్కులు ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపేటప్పుడు ఏడు (7) ఫోర్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి. దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 31. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 2026 జనవరి 1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) తేదీ: 2026 ఫిబ్రవరి - ఏప్రిల్‌. Website:https://ssc.gov.in/