Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

National Payments Corporation of India

♦ Credit-focused fintech platform ZET has received approval from the National Payments Corporation of India (NPCI) to operate as a Third-Party Application Provider (TPAP), enabling it to enter the Unified Payments Interface (UPI) ecosystem. ♦ Following the approval, the company has launched ZET UPI, allowing users to make UPI payments using RuPay credit cards issued through its platform. The feature enables credit card-linked UPI transactions, extending card-based credit usage to routine, low-value payments typically made via UPI.

Current Affairs

India's sugar production

♦ India's sugar production rose 22 percent to 15.9 million tonnes by January 15 in the 2025-26 season from a year earlier, supported by higher cane supplies and better yields. The Indian Sugar & Bio-Energy Manufacturers Association (ISMA) said in a statement on 24 January 2026. Output stood at 13 million tonnes in the same period last year. ♦ Around 518 mills were operational as of Jan 15, compared with 500 a year ago. The sugar season runs from October to September. ♦ Production in top producing state Maharashtra rose 51 percent to 6.45 million tonnes from 4.27 million tonnes a year ago, while output in Uttar Pradesh increased to 4.6 million tonnes from 4.28 million tonnes. Karnataka's output rose to 3.1 million tonnes from 2.75 million tonnes in the year-ago period.

Current Affairs

Novak Djokovic

♦ Novak Djokovic became the first player to achieve 400 match wins in Grand Slam tournaments. The Serbian star secured this monumental milestone with a 6-3, 6-4, 7-6 (4) victory over Botic van de Zandschulp in the third round at the Australian Open on 24 January 2026.  ♦ Djokovic’s 400 Grand Slam wins now place him at the top of an illustrious list, surpassing Roger Federer, who has 369, and Rafael Nadal with 314. The legendary American Jimmy Connors holds the next spot with 233 wins, while Andre Agassi trails with 224.

Current Affairs

జాతీయ ఓటర్ల దినోత్సవం

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన వ్యక్తిని చట్టసభలకు ఎన్నుకుంటారు. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా పౌరులు దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, నిర్బంధరహితంగా నిర్వహించడం ముఖ్యం. రాజ్యాంగ సూత్రాలను కచ్చితంగా అమలు చేస్తూ, న్యాయాధికారాలు చెలాయించే స్వయంప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థతోనే ఇది సాధ్యమవుతుంది. అలా మన దేశంలో ఏర్పాటైందే ‘భారత ఎన్నికల కమిషన్‌’. దీని స్థాపనకు గుర్తుగా ఏటా జనవరి 25న భారత్‌లో ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’గా (National Voters' Day) నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఓటుహక్కు ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం భారత ఎన్నికల సంఘం ఏర్పడి 2010, జనవరి 25 నాటికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏటా జనవరి, 25న ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. 2011 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా ఓటు పొందే వయసు వచ్చిన యువతలో చైతన్యం నింపడం దీని ఆశయం. ఏటా జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, వారి పేర్లు ఓటరు జాబితాలో చేర్చి, జనవరి 25న ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తున్నారు. 

Current Affairs

బ్రిటన్‌లో ఎఫ్‌బీఐ తరహా పోలీసు విభాగం

ఉగ్రవాదం, మోసం, ముఠా హింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు కోసం కొత్తగా ఒక జాతీయ పోలీసు సర్వీసును ఏర్పాటు చేయనున్నట్లు బ్రిటన్‌ హోంమంత్రి షబానా మహమూద్‌ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగినవారితో ఈ విభాగం ఏర్పాటవుతుందని వివరించారు. ఇది అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) తరహాలో ఉంటుంది. ఈ విభాగం అధికారుల వద్ద అధునాతన పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. 

Current Affairs

డాక్టర్‌ విలియం కన్నుమూత

ప్రపంచ మానవాళి సాధించిన గొప్ప ప్రజారోగ్య విజయాల్లో ఒకటైన మశూచి నిర్మూలన కార్యక్రమ సారథి డాక్టర్‌ విలియం ఫోగ్‌ (89) మరణించారు. ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘టాస్క్‌ఫోర్స్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. విలియం అంటువ్యాధుల నిర్మూలనలో గణనీయమైన పాత్ర పోషించారు. 1980ల ప్రాంతంలో అమెరికా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సెంటర్స్‌కు డైరెక్టరుగా వ్యవహరించారు. 

Current Affairs

లాంగ్‌రేంజ్‌ యాంటీ షిప్‌ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ మిసైల్‌

సముద్రంపై సుదూరంగా ఉన్న శత్రు దేశాల యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు భారత్‌ మొదటిసారి లాంగ్‌రేంజ్‌ యాంటీ షిప్‌ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ మిసైల్‌ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం)ను సిద్ధం చేసింది. ఈ క్షిపణి పరిధి 1500 కి.మీ. కాగా గంటకు 6,100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీలో అభివృద్ధి చేసిన ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎంను 2024 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇందులో విజయం సాధించడంతో మరో రెండేళ్లలో సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.

Current Affairs

శౌర్య పురస్కారాలు

విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన 70 మంది త్రివిధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు. ఇందులో ఆరుగురిని మరణానంతరం ఎంపిక చేశారు. మొత్తం.. ఒక అశోక చక్ర, మూడు కీర్తి చక్రలు, 13 శౌర్య చక్రలు ప్రకటించారు. వ్యోమగామి శుభాంశు శుక్లాను ప్రభుత్వం శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం ‘అశోక చక్ర’కు ఎంపిక చేసింది.  ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌తోపాటు మేజర్‌ అర్ష్‌దీప్‌ సింగ్, నాయబ్‌ సుబేదార్‌ డోలేశ్వర్‌ సుబ్బాలను ‘కీర్తి చక్ర’ పురస్కారాలు వరించాయి. శాంతికాలంలో ఇచ్చే మూడో అత్యున్నత సాహస పురస్కారమైన శౌర్య చక్రకు ఎంపికైనవారిలో నౌకాదళానికి చెందిన మహిళా అధికారులు లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిల్నా, లెఫ్టినెంట్‌ కమాండర్‌ రూపా ఉన్నారు. వీరు తెరచాప నౌక ఐఎన్‌ఎస్‌వీ తరణిలో 8 నెలల పాటు ప్రపంచాన్ని చుట్టివచ్చారు. 

Current Affairs

రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం

దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు చెందిన రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్‌) ఐజీ-కమ్‌-ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ అరోమాసింగ్‌ ఠాకుర్‌ రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. 1993 సివిల్‌ సర్వీసెస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె హౌరా రైల్వే డివిజన్‌లో అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌గా ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ద.మ.రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలో విధులు నిర్వహిస్తున్నారు.  అలాగే రైల్‌నిలయంలో అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉత్తమ్‌కుమార్‌ బంద్యోపాధ్యాయ్, ఆర్పీఎఫ్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రావుల శ్రీనివాస్, విజయవాడ డివిజన్‌లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ కర్నాటి మహేశ్వరరెడ్డికి మెరిటోరియస్‌ సేవలకు పోలీస్‌ మెడల్స్‌ అందనున్నాయి.

Current Affairs

పద్మ పురస్కారాలు

* 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర, సాంకేతికత, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసిన 131 మందికి ఈ పౌర పురస్కారాలను 2026, జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌; 13 మంది పద్మ భూషణ్‌; 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు.  * పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, ఆరుగురు విదేశీయులు/ ఎన్‌ఆర్‌ఐ/ పీఐఓ/ ఓసీఐలు ఉన్నారు. 16 మందికి మరణానంతరం ప్రకటించారు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన ఐదుగురిలో ముగ్గురు కేరళకు చెందినవారే. 2026 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్‌ పొందినవారు.. ధర్మేంద్ర సింగ్‌ దేవోల్‌: మహారాష్ట్రకు చెందిన ఈయనకు కళల విభాగంలో అవార్డు పొందారు. 1935లో పంజాబ్‌లో పుట్టిన ధర్మేంద్ర సీనియర్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ స్ఫూర్తితో ముంబయికి చేరి సినిమా హీరో అయ్యారు. ఈయన 2025, నవంబరులో కన్నుమూశారు. 2012లో ధర్మేంద్రను ‘పద్మ భూషణ్‌’తో సత్కరించిన భారత ప్రభుత్వం.. తాజాగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్‌’ను (మరణానంతరం) ప్రకటించింది.  కె.టి.థామస్‌: కేరళకు చెందిన థామస్‌ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి. 1937 జనవరి 30న కేరళలోని కొట్టాయం జిల్లాలో జన్మించిన ఆయన 1996 మార్చి 29 నుంచి 2002 జనవరి 30 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2007లో పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్నారు. ప్రజా సంబంధాల విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఎన్‌.రాజం: డాక్టర్‌ ఎన్‌.రాజం కళల రంగంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి పద్మ విభూషణ్‌కు ఎంపికైనప్పటికీ ఆమె 1938 ఏప్రిల్‌ 8న చెన్నైలో జన్మించారు. వయొలిన్‌ విద్వాంసురాలుగా వాసికెక్కారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పేరు పొందారు. మనుషుల స్వరాన్ని తలపించేలా వయొలిన్‌ను పలికించడంద్వారా ఆమె ‘సింగింగ్‌ వయొలినిస్ట్‌’గా ప్రఖ్యాతి గడించారు. 1984లో పద్మశ్రీ, 2004లో పద్మ భూషణ్, 1990లో సంగీత నాటక అకాడమీ, 2012లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు పొందారు.   పి.నారాయణన్‌: 1936 మే 28న కేరళలోని మనకాడ్‌ అనే గ్రామంలో నారాయణన్‌ జన్మించారు. ఆరెస్సెస్, జన సంఘ్‌ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 1975లో కోళికోడ్‌ నుంచి ప్రారంభించిన జన్మభూమి పత్రికకు మేనేజర్‌గా, ప్రత్యేక కరస్పాండెంట్‌గా, ఎడిటర్‌గా పని చేశారు. 1992లో అదే పత్రికకు చీఫ్‌ ఎడిటర్‌గా పదోన్నతి పొందిన ఆయన 2000 సంవత్సరం వరకు అదే పదవిలో కొనసాగారు. సాహిత్యం, విద్య రంగంలో ఈ పురస్కారం పొందారు. వి.ఎస్‌.అచ్యుతానందన్‌: కేరళ మాజీ ముఖ్యమంత్రి. 2006 నుంచి 2011 వరకు సీపీఎం తరఫున ముఖ్యమంత్రిగా పని చేశారు. 1923 అక్టోబరు 20న జన్మించిన ఆయన 101 ఏళ్ల వయసులో 2025 జులై 21న కన్నుమూశారు. ప్రజా సంబంధాల రంగంలో అవార్డు పొందారు.