ఎస్బీఐ ఎండీగా రవి రంజన్
ఎస్బీఐ నూతన మేనేజింగ్ డైరెక్టరుగా రవి రంజన్ను ప్రభుత్వం 2025, డిసెంబరు 15న నియమించింది. ఆయన ఇప్పటివరకు డిప్యూటీ ఎండీగా ఉన్నారు. 2025 నవంబరు 30న పదవీ విరమణ చేసిన వినయ్ స్థానంలో రవి బాధ్యతలు స్వీకరించారు. 2028 సెప్టెంబరు 30 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.