హైదరాబాద్ కంచన్బాగ్లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) వివిధ విభాగాల్లో 2025 ఏడాదికి సంబంధించి ఐటీఐ ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 210
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 30
టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్: 20
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 160
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్ మెకానిక్, ఏపీ మెకానిక్, వెల్డర్, సీవోపీఏ, ఫోటోగ్రాఫర్, ప్లంబర్, కార్పెంటర్, మెటలార్జీ, మెటకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఐటీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో/ట్రేడులో డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఐటీఐ, ఉత్తీర్ణత.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు రూ.12,300; టెక్నీషియన్కు రూ.10,900; ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్కు రూ.9,600.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో పొందిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అప్రెంటిషిప్ పోర్టల్లో నమోదు చేసుకున్న తరువాత అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు హార్డ్కాపీలను పోస్ట్ ద్వారా అడిషనల్ జనరల్ మేనేజర్, ట్రైనింగ్ అండ్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్, మిధానీ, కంచన్భాగ్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 10.12.2025.
Website:https://midhani-india.in/