Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

బ్రిటన్‌ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి

    బ్రిటన్‌లో పర్యాటకులు ఎలక్ట్రానిక్‌ వీసా (ఇ-వీసా)లను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను 2026, ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి తెచ్చింది. భారతీయులకు కూడా ఇది వర్తిస్తుంది. వీసా అవసరం లేనివారు ఎలక్ట్రానిక్‌ ప్రయాణ ధ్రువీకరణ (ఇ.టి.ఏ.) పొందాలి. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌లతో సహా 85 దేశాలకు చెందినవారు బ్రిటన్‌ సందర్శించాలంటే ఇంతకాలం వీసాలు అక్కర్లేదు. కొత్త నిబంధనల ప్రకారం వారు ఇ.టి.ఏ. పొందాలి. దీని కోసం 16 పౌండ్లు చెల్లించాలి. అది రెండేళ్లపాటు కానీ, ప్రయాణికుడి పాస్‌పోర్ట్‌ గడువు ముగిసిపోయేవరకు కానీ చెల్లుబాటులో ఉంటుంది. 

Current Affairs

స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు

    2025లో మనదేశం నుంచి 30 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.7 లక్షల కోట్ల) విలువైన  స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2026, ఫిబ్రవరి 25న పేర్కొన్నారు. గతేడాది మనదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యింది కూడా స్మార్ట్‌ఫోన్లేనని తెలిపారు. 2025లో మన దేశంలో రూ.5.5 లక్షల కోట్ల (60 బి.డాలర్ల) విలువైన మొబైల్‌ ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. 2024-25లో ఈ విభాగ ఎగుమతులు దాదాపు రూ.2 లక్షల కోట్లు (22 బి.డాలర్లు)గా ఉన్నాయి. 2025లో దేశం నుంచి మొత్తం ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు (44 బి.డాలర్లు) మించాయి.

Current Affairs

ఏప్రిల్‌ 1 నుంచి పెట్రోలులో 20% ఇథనాల్‌ తప్పనిసరి

    అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2026 ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా పెట్రోలులో 20% వరకు ఇథనాల్‌ కలిపి విక్రయించాలని కేంద్రం తెలిపింది. రిసెర్చ్‌ ఆక్టేన్‌ నంబరు (ఆర్‌ఓఎన్‌) 95తో ఈ పెట్రోలు ఉండాలనీ చమురు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. వాహన ఇంజిన్లలో కేవలం పెట్రోలును వాడడంతో పోలిస్తే, ఇథనాల్‌ కలిపి వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం తక్కువగా ఉంటుంది. చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి రైతులకు మద్దతు ధర లభిస్తుంది. దేశంలోకి ముడి చమురు దిగుమతులూ తగ్గించొచ్చు. 

Current Affairs

‘ఫెలో ఫార్మర్‌’ పురస్కారాలు

    గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఇదే మండలం అనంతవరప్పాడుకు చెందిన సేంద్రియ వ్యవసాయ రైతు బండారు శ్రీనివాసరావు ‘ఫెలో ఫార్మర్‌’ పురస్కారాలను అందుకున్నారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ దిల్లీలో 2026, ఫిబ్రవరి 25న నిర్వహించిన ‘పూసా కృషి విజ్ఞాన్‌ మేళా 2026’లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వీరికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. చిరుధాన్యాల నుంచి ఉప ఉత్పత్తుల తయారీ, విలువ జోడింపు, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు రాష్ట్రాల రైతులకు అవగాహన కల్పించడం, ప్రకృతి విధానంలో సాగు తదితర అంశాల్లో చేస్తున్న కృషికిగాను  వెంకటేశ్వరరావుకు ఈ అవార్డు లభించింది. అధునాతన పద్ధతుల్లో సేంద్రియ విధానంలో పంటల సాగుకు గాను బండారు శ్రీనివాసరావుకు పురస్కారం వరించింది.

Current Affairs

మోదీకి కనెసెట్‌ అత్యున్నత పురస్కారం

    రెండురోజుల పర్యటన నిమిత్తం 2026, ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. తొలుత ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహుతో కొంతసేపు భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ (కనెసెట్‌)లో మోదీ చరిత్రాత్మక ప్రసంగం చేశారు. భారత ప్రధాని ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ప్రసంగించడం ఇదే తొలిసారి. తమ అత్యున్నత పురస్కారమైన ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో ఆయన్ను కనెసెట్‌ గౌరవించింది. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లు పార్లమెంట్‌ తెలిపింది. ఈ మెడల్‌ను అందుకున్న తొలి నేత మోదీయే. 

Government Jobs

పీజీఐఎంఈఆర్ ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1 ఉద్యోగాలు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్), పీడియాట్రిక్స్ విభాగంలోని నియోబోర్న్ యూనిట్ ఒక పరిశోధన ప్రాజెక్ట్ కోసం వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: 1. ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1(నాన్‌-మెడికల్/మెడికల్): 02 2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌-3: 02 3. ప్రాజెక్ట్ స్టాఫ్‌ నర్స్‌-2: 04   అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, పీజీ, బీఫార్మసి, బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 30 నుంచి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు పోస్టులను అనుసరించి రూ.20,000 - రూ.67,000. నియామక కాలం: ప్రారంభంలో 6 నెలల పాటు ఉంటుంది. పనితీరు & నిధుల లభ్యతను బట్టి పొడిగించే అవకాశం ఉంది. దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌తో పాటు సీవీ, వయస్సు ధృవీకరణ, విద్యార్హతలు, అనుభవ పత్రాలు, ఎన్ఓసీ (NOC) వంటి పత్రాల హార్డ్ కాపీలను సమర్పించాలి. దరఖాస్తు పంపాల్సిన చిరునామా: నియోనాటాలజీ ఆఫీస్, రూమ్ నెం.05, లెవల్-III, ఎఫ్-బ్లాక్, నెహ్రూ హాస్పిటల్, పీజీఐఎంఈఆర్, చండీగఢ్. ఎంపిక విధానం: అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే 09 మార్చి 2026 ఉదయం 9:30 గంటలకు రాత పరీక్ష నిర్వహించవచ్చు. ఇంటర్వ్యూ అదే రోజు మధ్యాహ్నం ఉండే అవకాశం ఉంది. చివరి తేదీ: 06 మార్చి 2026, సాయంత్రం 4:00 గంటల వరకు. Website:https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/VACANCIE_VIEW.jsp?countt=0

Government Jobs

హెచ్‌పీసీఎల్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌/ఇంజినీర్‌ ఉద్యోగాలు

మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( హెచ్‌పీసీఎల్‌), 2025-26 సంవత్సరానికి వివిధ విభాగాలలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్‌/ఇంజినీర్‌/ఆఫీసర్: 732 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 25 నుంచి 45 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు పోస్టులను అనుసరించి రూ.30,000 - రూ.2,80,000. విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఫైనాన్స్, హెచ్‌ఆర్, క్వాలిటీ కంట్రోల్, ఫైర్ అండ్ సేఫ్టీ వంటి విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ & ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫ్రెషర్స్ కోసం: మెకానికల్ ఇంజనీర్ (72), ఎలక్ట్రికల్ ఇంజనీర్ (37), సివిల్ ఇంజనీర్ (17), కెమికల్ ఇంజనీర్ (15) వంటి పోస్టులు ఉన్నాయి. వీటికి గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లుగా నిర్ణయించారు. అనుభవం ఉన్నవారి కోసం: సీబీజీ ఆపరేషన్స్, సేఫ్టీ, సేల్స్, లా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ:  అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్ & పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షను తాత్కాలికంగా మే 3, 2026న నిర్వహించనున్నారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఇతరులకు ఫీజు లేదు. దరఖాస్తుకు చివరి తేదీ: 25 మార్చి 2026 (రాత్రి 11:59 గంటల వరకు). Website:https://www.hindustanpetroleum.com/job-openings

Apprenticeship

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్ ఉద్యోగాలు

రాజస్థాన్‌లోని రావత్‌భట్‌ రాజస్థాన్‌ సైట్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌) వివిధ ట్రేడ్‌ల్లో ఏడాది శిక్షణకు ట్రేడ్‌ అప్రెంటిస్‌ల నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 245 వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్‌లు: 245 పోస్టులు ఫిట్టర్- 68 ఎలక్ట్రీషియన్ - 68 మెకానిక్‌- 68 సీఓపీఏ (COPA) - 10 టర్నర్‌- 10 మెషినిస్ట్‌- 10 వెల్డర్‌- 11 అర్హత: గుర్తింపు పొందిన సంస్థల నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 18/03/2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.9,600. ఎంపిక విధానం: విద్యార్హత మెరిట్‌ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా NAPS 2.0 పోర్టల్‌లో అనంతరం ఎన్‌పీసీఐఎల్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 26.02.2026. దరఖాస్తు గడువు: 18.03.2026. Website: https://npcil.nic.in/index.aspx

Admissions

నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026

నవయుగ్ స్కూల్, సరోజినీ నగర్ (న్యూ దిల్లీ)లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7వ తరగతులలో ప్రవేశం కోసం ఎన్‌టీఏ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పాఠశాల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుబంధంతో నడిచే ఒక ప్రముఖ విద్యా సంస్థ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ (మెరిట్) ఆధారంగానే విద్యార్థులను ఎంపిక చేస్తారు. వివరాలు:  నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ఎంట్రన్స్‌ టెస్త్‌ (NSSNET)-2026 సీట్ల సంఖ్య: 6వ తరగతి: 105 సీట్లు (3 సెక్షన్లు). 7వ తరగతి: 58 సీట్లు (2 సెక్షన్లు). అర్హతలు: విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి (6వ తరగతిలో చేరడానికి) లేదా 6వ తరగతి (7వ తరగతిలో చేరడానికి) ఉత్తీర్ణులై ఉండాలి లేదా 2026 మార్చి నాటికి ఫైనల్ పరీక్షలు రాస్తూ ఉండాలి.  వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి 6వ తరగతికి: 10 నుంచి 12 సంవత్సరాల మధ్య (01 ఏప్రిల్ 2014 - 31 మార్చి 2016 మధ్య జన్మించి ఉండాలి). 7వ తరగతికి: 11 నుంచి 13 సంవత్సరాల మధ్య (01 ఏప్రిల్ 2013 - 31 మార్చి 2015 మధ్య జన్మించి ఉండాలి). దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: ఈ పరీక్షకు ఎటువంటి దరఖాస్తు రుసుము (Fee) లేదు. పరీక్ష విధానం: ఈ పరీక్ష పెన్, పేపర్ (Pen and Paper)మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఓఎంఆర్‌  పద్ధతిలో ఉంటుంది. నెగటివ్‌ మార్కింగ్‌ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో వస్తుంది. వ్యవధి రెండున్నర గంటలు. సబ్జెక్టుల వారీగా వివరాలు: 6వ తరగతి: మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులు.  గణితం (50 మార్కులు), ఇంగ్లిష్-25 మార్కులు, హిందీ- 25, ఎన్విర్మెంటల్‌ సైన్స్‌, జనరల్ నాలెడ్జ్ (EVS & GK)-25, జనరల్ ఇంటెలిజెన్స్- 25 మార్కులకు ఉంటుంది. 7వ తరగతికి: మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులు.  గణితం- 30, ఇంగ్లిష్-20, హిందీ- 20, సైన్స్‌- 20, సోషల్‌ సైన్స్‌- 20, జనరల్ నాలెడ్జ్- 20, జనరల్ ఇంటెలిజెన్స్- 20 మార్కులకు ఉంటుంది.  అభ్యర్థి ప్రవేశానికి అర్హత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులు సాధించాలి. మొత్తం కనీసం 65శాతం మార్కులు సాధించాలి. ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 25.02.2026. దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2026. పరీక్ష తేదీ: 10.04.2026. Website:https://exams.nta.nic.in/nssnet/#%C2%A0

Government Jobs

Jobs in PGIMER

Post Graduate Institute of Medical Education and Research (PGIMER), Department of Biochemistry, Chandigarh invites applications for the recruitment of staff on contract basis for a research project.  No. of Posts: 08 Details: 1. Project Research Scientist-1 (Non-Medical/Medical): 02 2. Project Technical Support-3: 02 3. Project Staff Nurse-2: 04 Eligibility: Candidates should have passed MBBS, BDS, PG, B.Pharmacy, B.Sc Nursing, GNM in the relevant discipline as per the posts along with work experience. Age Limit: Not more than 30 to 35 years. Age relaxation will be given to SC/ST/OBC/PH candidates as per government norms. Salary: Rs.20,000 - Rs.67,000 per month as per the posts. Appointment Period: Initially for 6 months. It is possible to extend depending on performance & availability of funds. Application Procedure: Interested candidates should submit the prescribed application form along with hard copies of CV, age proof, educational qualifications, experience certificates, NOC etc. Application should be sent to: Neonatology Office, Room No. 05, Level-III, F-Block, Nehru Hospital, PGIMER, Chandigarh. Selection Procedure: In case of large number of candidates, written test may be conducted on 09 March 2026 at 9:30 AM. Interview is likely to be held in the afternoon of the same day. Last Date: 06 March 2026, up to 4:00 PM. Website:https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/VACANCIE_VIEW.jsp?countt=0