Posts

Current Affairs

జీఈతో హెచ్‌ఏఎల్‌ ఒప్పందం

దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్‌’ కోసం 113 జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్‌తో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) 2025, నవంబరు 7న కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.8,870 కోట్లు. దీనికింద ఎఫ్‌404-జీఈ-ఐఎన్‌20 శ్రేణి ఇంజిన్లను భారత్‌కు జీఈ అందిస్తుంది. 2027 నుంచి వీటి సరఫరా మొదలై 2032 కల్లా పూర్తవుతుంది. 

Current Affairs

గెయిల్‌ సీఎండీగా దీపక్‌ గుప్తా

గెయిల్‌ తదుపరి సీఎండీగా దీపక్‌ గుప్తా నియమితులుకానున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నియామక బోర్డు (పీఈఎస్‌బీ) ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ పదవి కోసం మొత్తం 12 మంది పోటీపడగా, ప్రస్తుతం అదే సంస్థలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న దీపక్‌ పేరును పీఈఎస్‌బీ ఖరారు చేసింది. ప్రస్తుతం గెయిల్‌ సీఎండీగా ఉన్న సందీప్‌ కుమార్‌ గుప్తా 2026 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేసిన అనంతరం ఆ స్థానంలో ఈయన బాధ్యతలు చేపడతారు. 

Current Affairs

అంబుజ్‌నాథ్‌బోస్‌ పురస్కారం

ప్రముఖ వైద్యవేత్త అంబుజ్‌నాథ్‌బోస్‌ పురస్కారాన్ని 2025 సంవత్సరానికి ప్రముఖ వైద్యులు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి ప్రదానం చేశారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ (ఆర్‌సీపీ) ఆధ్వర్యంలో అత్యుత్తమ పరిశోధనలకు ఏటా దీన్ని అందిస్తారు. ఎండోస్కోపీలో డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి చేసిన పరిశోధనలు, కృషిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అవార్డుకు ఎంపిక చేశారు. 

Current Affairs

వందేమాతన గేయానికి 150 ఏళ్లు

దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రతిఘటన, ఐక్యత, గర్వానికి చిహ్నంగా నిలిచిన వందేమాతర గేయానికి 2025, నవంబరు 7న 150 ఏళ్లు నిండాయి. బ్రిటిష్‌ ప్రార్థనా గీతం ‘గాడ్‌ సేవ్‌ ది కింగ్‌’ని భారత జాతీయ గీయంగా ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. దీన్ని మెజారిటీ భారతీయ జాతీయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంగ్లేయుల చర్యకు ప్రతిస్పందనగా బంకిమ్‌చంద్ర ఛటోపాధ్యాయ 1875, నవంబరు 7న వందేమాతర గేయాన్ని రచించారు. సంస్కృతం, బెంగాలీ పదాలను మిళితం చేసి ఆయన దీన్ని రాశారు. ఛటోపాధ్యాయ 1882లో రచించిన ‘ఆనందమఠ్‌’ నవలలో దీన్ని ప్రార్థనా గేయంగా ఉపయోగించారు. 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో మహాకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వందేమాతర గేయానికి స్వయంగా బాణి కట్టి, ఆలపించారు.  నాటి బ్రిటిష్‌ రాజప్రతినిధి లార్డ్‌ కర్జన్‌ 1905, జులై 20న బెంగాల్‌ను రెండు రాష్ట్రాలుగా విభజిస్తూ అధికారిక ప్రకటన చేశారు. 1905, అక్టోబరు 16 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశప్రజలంతా భారతమాతను స్మరించుకుంటూ ‘వందేమాతరం గేయాన్ని’ పాడారు. దేశవ్యాప్తంగా ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. తక్కువ కాలంలోనే ఇది దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. 1950, జనవరి 24న భారత రాజ్యాంగ సభ వందేమాతరాన్ని జీతీయ గీతంగా స్వీకరించింది.

Current Affairs

10 జట్లతో.. మహిళల ప్రపంచకప్‌

మహిళల వన్డే ప్రపంచకప్‌లో పోటీపడే జట్ల సంఖ్యను 10కి పెంచాలని ఐసీసీ నిర్ణయించింది. 2029లో ఈ జట్ల మధ్య మెగా టోర్నీ జరుగుతుంది. ప్రస్తుతం ఎనిమిది జట్లు ఆడుతున్నాయి. ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్‌ను దాదాపు 3 లక్షల మంది అభిమానులు స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లను వీక్షించారు. డిజిటల్‌ వేదికలో 500 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. అందుకే 2029 ప్రపంచకప్‌లో పది జట్లను ఆడించాలని నిర్ణయించినట్లు ఐసీసీ పేర్కొంది. 2025, నవంబరు 7న దుబాయ్‌లో జరిగిన బోర్డు సమావేశంలో వివిధ అంశాలపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 

Current Affairs

అంతర్జాతీయ హాకీ

భారత్‌.. అంతర్జాతీయ హాకీ (1925-2025)లో అడుగుపెట్టి 2025 ఏడాదికి వందేళ్లు పూర్తయింది. 1925 నవంబరులో భారత హాకీకి ఓ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం కొంత మంది వ్యక్తులు గ్వాలియర్‌లో సమావేశమయ్యారు. అలా మొదలైందే ఐహెచ్‌ఎఫ్‌ (ప్రస్తుతం హాకీ ఇండియా). ఐహెచ్‌ఎఫ్‌ 1925 నవంబరు 7న అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌).. గుర్తింపు పొందింది. మూడేళ్లలోనే అమ్‌స్టర్‌డామ్‌ (1928) క్రీడలు వచ్చాయి. అక్కడ భారత్‌ ఒలింపిక్‌ స్వర్ణం గెలిచింది. భారత్‌ ఇప్పటివరకు హాకీలో 8 స్వర్ణాలు సహా 13 ఒలింపిక్‌ పతకాలు గెలుచుకుంది. ఓసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తన ఆటతో ప్రపంచాన్ని మంత్రముగ్దుల్ని చేసిన భారత హాకీ జట్టు క్రమంగా తన ప్రమాణాలను, ప్రాభవాన్ని కోల్పోయింది. 1975లో ఎఫ్‌ఐహెచ్‌ ఆస్ట్రో టర్ఫ్‌ను ప్రవేశ పెట్టడం కూడా భారత్‌ ఆట దెబ్బతినడానికి కారణమైంది. టర్ఫ్‌లపై ఆడడానికి జట్టు త్వరగా అలవాటు పడలేకపోయింది. నిధుల లేమి కారణంగా హాకీ సమాఖ్య చాలా ఆలస్యంగా దేశంలో హాకీ టర్ఫ్‌లు ఏర్పాటు చేసింది.  వేగంగా బలహీనపడ్డ భారత జట్టు 1984 నుంచి 2016 వరకు ఒక్క ఒలింపిక్‌ పతకం కూడా నెగ్గలేకపోయింది. ఆ కాలంలో ఒక్కసారే గ్రూప్‌ దశ దాటింది. 2008లో అసలు ఒలింపిక్స్‌కే అర్హత సాధించకపోవడం భారత హాకీ చరిత్రలో ఒక మాయని మచ్చ. మరోవైపు క్రికెట్‌ దేశంలో క్రికెట్‌పై మోజు పెరగడంతో హాకీ మరింత నిరాదరణకు గురైంది. అయితే గత పదేళ్లలో మన హాకీ పునరుత్థానం మొదలైంది.   2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం (కాంస్యం) గెలిచిన భారత జట్టు.. పూర్వ వైభవం దిశగా తొలి అడుగు వేసింది. తిరిగి పారిస్‌ (2024) క్రీడల్లోనూ కాంస్యాన్ని గెలిచి ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు రేపింది.

Walkins

ఎంపీఎంఎంసీసీలో టెక్నీషియన్‌ ఖాళీలు

మహాత్మ పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య క్యాన్సర్‌ సెంటర్‌ (ఎంపీఎంఎంసీసీ) వారణాసి తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫార్మసిస్ట్‌, టెక్నీషియన్‌, సైంటిఫిక్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. ఫార్మసిస్ట్: 02  2. టెక్నీషియన్‌: 06 3. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఫార్మసి లేదా డీఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఇంటర్‌, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 27 ఏళ్ల నుంచి 45 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు టెక్నీషియన్‌కు రూ.23,218, ఫార్మసిస్ట్‌కు రూ.25,506, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు రూ.25,000 - రూ.30,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: నవంబర్‌ 10, 11, 12. వేదిక: మహాత్మ పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య క్యాన్సర్‌ సెంటర్‌, సుందర్‌ భాగియ, బీహెచ్‌యూ క్యాంపస్‌, వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్‌-221005. Website:https://tmc.gov.in/m_events/events/jobvacancies

Walkins

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు

బిలాస్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.  వివరాలు: సీనియర్‌ రెసిడెంట్ - 64 విభాగాలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా, రేడియోడయాగ్నోసిస్, ట్రామా & ఎమర్జెన్సీ , మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ప్రసూతి & గైనకాలజీ, ఆప్తాల్మాలజీ,సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, క్లినికల్ ఇమ్యునాలజీ. తదితర  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎమ్మెస్సీ, ఎండీ/ ఎంఎస్/ డిఎన్‌బీ / ఎంసీహెచ్‌/ పీహెచ్‌డీలో ఉత్తీర్ణత ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 2025 నంబరు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు  ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు రూ.67,000. ఎమ్మెస్సీ,పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.56,100. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.11,80. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.500. పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.  ఇంటర్వ్యూ  తేదీ: 12/11/2025. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 3వ అంతస్తు, ఎయిమ్స్-బిలాస్‌పూర్, కోఠిపురా, హిమాచల్ ప్రదేశ్-174037. Website:https://www.aiimsbilaspur.edu.in/recruitment  

Internship

ద సోల్డ్‌ స్టోర్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

హైదరాబాద్‌లోని ద సోల్డ్‌ స్టోర్‌  కంపెనీ రిటెయిల్‌ సేల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: ద సోల్డ్‌ స్టోర్‌  పోస్టు పేరు: రిటెయిల్‌ సేల్స్‌  నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, సేల్స్‌ లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.10,000. వ్యవధి: 1 నెల దరఖాస్తు గడువు: 12-11-2025. Website:https://internshala.com/internship/detail/part-time-retail-sales-internship-in-hyderabad-at-the-souled-store1760332794

Government Jobs

నేషనల్‌ హౌసింగ్ బ్యాంక్‌లో ఆఫీసర్‌ ఉద్యోగాలు

దిల్లీలోని నేషనల్ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. డిప్యూటీ జనరల్ మేనేజర్‌: 02  2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌: 01 3. అసిస్టెంట్ మేనేజర్‌: 03 4. చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌: 01 5. హెడ్‌: 01 6. సీనియర్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌: 02 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 21 నుంచి 62 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు పోస్టులను అనుసరించి రూ.85,920 - రూ.1,56,500. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175.   ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 28. Website:https://www.nhb.org.in/oppurtunities_nhb/recruitment-under-the-advertisement-no-nhb-hrmd-recruitment-2025-26-03/