Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

నేపాల్‌లో ఆర్‌ఎస్‌పీ విజయం

హిమాలయ దేశం నేపాల్‌లో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ)’ అఖండ విజయం సాధించింది. నేపాల్‌ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. వాటిలో 165 సీట్లకు సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్‌ విధానంలో ఎన్నుకుంటారు. మిగతా 110 స్థానాలను దామాషా విధానంలో భర్తీ చేస్తారు. మార్చి 5న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రత్యక్ష ఓటింగ్‌ జరిగిన 165 స్థానాలకుగాను ఇప్పటివరకూ 159 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఆర్‌ఎస్‌పీ 122 సీట్లు గెల్చుకుంది. 17 సీట్లతో నేపాలీ కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. మాజీ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌) ఖాతాలో ఇప్పటివరకు ఎనిమిది సీట్లే చేరాయి. మరో రెండు చోట్ల అది ఆధిక్యంలో ఉంది. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ ఏడు సీట్లు దక్కించుకుంది. 

Current Affairs

టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌

టీ20 క్రికెట్లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. 2026, మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట భారత్‌ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రపంచకప్‌ ఫైనల్లో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. గత రికార్డూ భారత్‌ (176, దక్షిణాఫ్రికాపై) పేరిటే ఉంది. శాంసన్‌ (5 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు)కు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ; జస్‌ప్రీత్‌ బుమ్రా (4/15)కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కాయి. 

Current Affairs

దేశంలో ఇంధన నిల్వలు

ప్రస్తుతం మన దేశంలో ముడిచమురు, రిఫైన్డ్‌ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్‌ బ్యారెళ్ల (దాదాపు 4000 కోట్ల లీటర్లు) ఇంధన నిల్వలున్నాయని ప్రభుత్వం 2026, మార్చి 8న వెల్లడించింది. మంగళూరు, పడూర్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వ్యూహాత్మక కేంద్రాలతో పాటు ట్యాంకులు, పైప్‌లైన్లు, సముద్ర నౌకల్లో ఈ నిల్వలున్నాయని చెప్పింది. దశాబ్దం క్రితం 27 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుండగా, ప్రస్తుతం 40 దేశాల నుంచి మనకు చేరుతోంది. మన దేశ చమురు దిగుమతుల్లో 40 శాతమే హర్మూజ్‌ జలసంధి మీదుగా వస్తోందని, మిగతా 60% రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మధ్య ఆసియా మార్గాల ద్వారా అందుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Current Affairs

ట్రాక్సన్‌ నివేదిక

2025లో మన దేశంలో మహిళా సహ వ్యవస్థాపకులు ఉన్న టెక్‌ అంకురాలు 407 విడతల్లో 1.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.10,000 కోట్లు) సమీకరించాయని డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ ట్రాక్సన్‌ నివేదికలో పేర్కొంది. 2024లో సమీకరించిన 1.2 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ.. ఫండింగ్‌ రౌండ్ల సంఖ్య 29 శాతం తగ్గినప్పటికీ (2024లో 580 నుంచి 2025లో 407కు), మధ్య స్థాయి ఒప్పందాల సగటు పరిమాణం 2024లో 2.4 మి.డాలర్ల నుంచి 2025లో 3.8 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. 

Current Affairs

ఎల్‌ఎక్స్‌ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక

దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే.. రాబోయే 10 ఏళ్ల కాలంలో వీళ్ల పెట్టుబడులు దేశ జీడీపీకి సుమారు రూ.40 లక్షల కోట్లను జతచేస్తాయని ఎల్‌ఎక్స్‌ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక పేర్కొంది. మహిళల వద్ద నిరుపయోగంగా ఉన్న పొదుపు మొత్తాన్ని ఉత్పాదకత, వృద్ధి ఆధారిత మూలధనం వైపు మళ్లించినప్పుడు ఈ ప్రభావం కనిపిస్తుందని తెలిపింది.  అందరికీ ఆర్థిక సేవలను దరిచేర్చడం ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందే విషయంలో మహిళలు ఇంకా దూరంగానే ఉన్నారని నివేదిక గుర్తించింది. బ్యాంకుల్లో మహిళల ఖాతాలు 2011లోని 26 శాతం నుంచి 2024లో 89 శాతానికి పెరిగినప్పటికీ.. వీటిని పొదుపు కోసం కంటే కూడా ప్రభుత్వ పథకాల నగదు బదిలీ, నగదు ఉపసంహరణ కోసం ఎక్కువగా వాడుతున్నారని తెలిపింది. 

Current Affairs

ఉన్నత విద్యలో ఎన్‌ఈపీ-2020 అమలు

తెలంగాణలో అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో 2026, మార్చి 7న జరిగిన ఏడు సంప్రదాయ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల సమావేశంలో అందుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ నిర్ణయం వల్ల న్యాక్, ఎన్‌బీఏ, నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ తదితర వాటిల్లో విశ్వవిద్యాలయాలకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం, ఆయా విభాగాల నుంచి పరిశోధన నిధులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయి. మండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 

Current Affairs

గద్దర్‌ సినీ అవార్డులు-2025

2025 ఏడాదికి సంబంధించిన గద్దర్‌ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం 2026, మార్చి 7న ప్రకటించింది. ‘ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్స్‌’ నుంచి వచ్చిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఉత్తమ చిత్రం సహా మొత్తం నాలుగు అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా సాయిలు కాంపాటి, ఉత్తమ గాయకుడిగా అనురాగ్‌ కులకర్ణి ఎంపికయ్యారు. అలాగే ఇందులో కీలకపాత్ర పోషించిన చైతు జొన్నలగడ్డకు ప్రత్యేక జ్యూరీ పురస్కారం దక్కింది.  ‘తండేల్‌’ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాకి ఉత్తమ నటిగా రష్మిక అవార్డులు సొంతం చేసుకున్నారు.  ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా వెంకటేశ్‌- అనిల్‌ రావిపూడి కలయికలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలిచింది.  ఉత్తమ సామాజిక సందేశాత్మక సినిమాగా ‘కోర్ట్‌’ సత్తాచాటింది. మార్చి 19న ఉగాది పండగ రోజు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి గద్దర్‌ అవార్డుల కోసం 90 సినిమాలు పోటీపడగా.. జ్యూరీ ఛైర్మన్‌ మణిశర్మ ఆధ్వర్యంలోని సభ్యులు వాటిని వీక్షించి ఎంపిక చేశారు. 

Walkins

ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు

గోవాలోని మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్ సైన్సెస్‌కు చెందిన ఈఎస్ఎస్‌ఎ- నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీపీఓఆర్‌) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 35 వివరాలు: వెహికల్‌ మెకానిక్‌: 04 జనరేటర్‌ మెకానిక్‌/ఆపరేటర్‌: 01 స్టేషన్ ఎలక్ట్రీషియన్: 1 వెహికల్ ఎలక్ట్రీషియన్: 3 ఆపరేటర్ ఎక్స్కవేటింగ్‌ మెషిన్‌ (డోజర్లు, ఎక్స్కవేటర్లు): 1 క్రేన్ ఆపరేటర్: 2 వెల్డర్: 3 బాయిలర్ ఆపరేటర్ & మెకానిక్/ ప్లంబర్/ ఫిట్టర్: 1 కార్పెంటర్: 3 వాయేజ్ సపోర్ట్ అసిస్టెంట్: 1 నర్స్‌(పురుష): 3 సైంటిఫిక్ అసిస్టెంట్: 2 ఇన్వెంటరీ & స్టోర్స్ అసిస్టెంట్: 2 రేడియో/వైర్‌లెస్ ఆపరేటర్: 3 చెఫ్ / కుక్: 5 అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో, విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్‌, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.60,090- రూ.81,212. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూదు. ఇంటర్వ్యూ తేదీలు: 28, 29, 30.03.2026, 01.05.2026. వేదిక: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌, గోవా. Website:https://ncpor.res.in/recruitment

Government Jobs

ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీలో లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు

కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) వివిధ సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 31 వివరాలు:  1. డిప్యూటీ డైరెక్టర్ (సైబర్ సెక్యూరిటీ/సైబర్ డిఫెన్స్): 01  2. డిప్యూటీ డైరెక్టర్ (ఫోరెన్సిక్ సైకాలజీ): 01  3. అసిస్టెంట్ డైరెక్టర్ (ఎన్‌డీపీఎస్‌): 01  4. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ సెక్యూరిటీ/సైబర్ డిఫెన్స్): 01 5. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (NDPS): 01  6. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బాలిస్టిక్స్): 01  7. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఫోరెన్సిక్ అకౌంటింగ్): 01  8. లాబొరేటరీ అసిస్టెంట్: 24  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ సైన్స్, సైకాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ లేదా అకౌంటింగ్ విభాగాల్లో పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: లాబొరేటరీ అసిస్టెంట్: 18 నుంచి 27 ఏళ్ల మధ్య, డిప్యూటీ డైరెక్టర్‌కు 50ఏళ్లు; అసిస్టెంట్ డైరెక్టర్‌కు 45 ఏళ్లు, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌కు 35 ఏళ్లు మించకూడదు.  ఎంపిక విధానం: విద్యార్హతలు, స్క్రీనింగ్ టెస్ట్‌, షార్ట్‌లిస్ట్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు చివరి తేదీ: 23.03.2026. Website:https://www.nfsu.ac.in/

Government Jobs

ఐడీబీఐ బ్యాంకులో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

ఇండస్ట్రీయల్‌ డెవెలప్‌మెంట్‌ బ్యాంకు (ఐడీబీఐ) బ్యాంకు 2026-27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  మొత్తం పోస్టుల సంఖ్య: 1,300. వివరాలు: 1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఒ’ : 1100 పోస్టులు 2. అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఏ’: 200 పోస్టులు జోన్లు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గువాహటి, హైదరాబాద్‌, కొచ్చి, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్, పుణె, పట్నా. అర్హతలు: గ్రేడ్ ‘ఒ’ పోస్టులకు ఏదైనా విభాగంలో కనీసం 60శాతం(జనవరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ) మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న జోన్‌కు సంబంధించిన ప్రాంతీయ భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఏ’ పోస్టులకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఏదైనా షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్/ షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ కోఆపరేటివ్ బ్యాంక్/ రీజినల్ రూరల్ బ్యాంకులలో కనీసం 2 సంవత్సరాల అర్హత తర్వాత పని అనుభవం ఉండాలి. వయస్సు: 01.03.2026 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఇస్తారు.  పే స్కేల్: ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష సబ్జెక్టులు: లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ కంప్యూటర్/ ఐటీ (60 ప్రశ్నలు- 60 మార్కులు). గ్రేడ్ ‘ఒ’- స్పెషలిస్ట్ పోస్టులకు అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు- 60 మార్కులు) విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 చెల్లించాలి.  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, చిత్తూరు, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం. ముఖ్య తేదీలు... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తులు ప్రారంభం: 08.03.2026. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.03.2026. ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2026. జేఏఎం ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2026 ఏప్రిల్‌ 12 (ఉదయం) అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2026 ఏప్రిల్‌ 12 (మధ్యాహ్నం) Website:https://www.idbi.bank.in/idbi-bank-careers-current-openings.aspx