Posts

Current Affairs

India’s pharmaceutical exports reached $30.47 billion in FY 2024–25

♦ India’s pharmaceutical exports reached $30.47 billion in FY 2024–25, registering a year-on-year growth of 9.4 percent, and are on track to surpass last year’s performance in the current financial year, the Pharmaceuticals Export Promotion Council of India (PHARMEXCIL) informed Commerce Secretary Rajesh Agrawal on 5 January 2026.  ♦ PHARMEXCIL highlighted that India is the world’s third-largest pharmaceutical producer by volume and a trusted supplier of affordable, quality-assured medicines to more than 150 countries,a underscoring the sector’s potential for sustained export-led growth.

Current Affairs

కార్బన్‌ డైఆక్సైడ్‌తో మిథనాల్‌ ఇంధనం ఉత్పత్తి

కార్బన్‌ డైఆక్సైడ్‌ను మిథనాల్‌ ఇంధనంగా మార్చేందుకు ఉపయోగపడే ఫొటోకెటలిటిక్‌ పదార్థాన్ని గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది సూర్యకాంతి సాయంతో ఈ చర్య జరుపుతుంది. పర్యావరణానికి మరింత హాని జరగకుండా.. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు ఇది మెరుగైన ఆవిష్కరణ అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పెట్రోలియం ఆధారిత ఇంధనాలపై ఆధారపడటం వల్ల కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాలు పెరుగుతున్నాయి. దీనివల్ల పర్యావరణంపై ఒత్తిడి పడటంతోపాటు భూతాపం పెరుగుతోంది. ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలు ఫొటోకెటలిటిక్‌ విధానాల రూపకల్పనపై పనిచేస్తున్నారు. అయితే దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది వేగంగా శక్తిని కోల్పోతుంది. ఇంధన ఉత్పత్తి కూడా తక్కువే. ఈ సమస్యలకు గట్టి విరుగుడు ఇప్పటివరకూ కనుగొనలేదు. ఈ నేపథ్యంలో గువాహటిలోని ఐఐటీ గ్రాఫైటిక్‌ కార్బన్‌ నైట్రైడ్‌ను ఫ్యూ లేయర్‌ గ్రాఫీన్‌తో కలిపారు. అత్యంత పలుచగా ఉండే ఈ గ్రాఫీన్‌ పదార్థం.. శక్తి నష్టాన్ని తగ్గించింది. సూర్యకాంతి సమక్షంలో ఇది సాధ్యమైంది. ఇది ఉత్ప్రేరకాన్ని దీర్ఘకాలం క్రియాశీలంగా ఉండేలా చేసింది. 

Current Affairs

‘సముద్ర ప్రతాప్‌’

‘సముద్ర ప్రతాప్‌’ నౌకను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జలప్రవేశం చేయించారు. గోవా షిప్‌యార్డ్‌లో 2026, జనవరి 5న ఈ కార్యక్రమం జరిగింది. కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూ.2,500 కోట్లతో గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఈ నౌకను నిర్మించింది. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని.. ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జలచరాలను కాపాడేందుకు దోహదపడే అధునాతన సాంకేతికత ఇందులో ఉంది. 

Current Affairs

జొహన్నెస్‌బర్గ్‌

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో బోచాసన్వాసి అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయ సముదాయంలో భారత యోగి, 18వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాగి, ఇత్తడితో తయారు చేసిన ఈ విగ్రహం 42 అడుగుల ఎత్తు, 20 టన్నుల బరువు ఉంటుంది.  ఆఫ్రికా ఖండంలోనే 4వ ఎత్తయిన కాంస్య విగ్రహంగా ఇది గుర్తింపు పొందింది. 

Current Affairs

ఫార్మా ఎగుమతులు

2024-25లో దేశీయ ఫార్మా ఎగుమతులు 9.4% వృద్ధితో సుమారు రూ.2.45 లక్షల కోట్ల (30.47 బిలియన్‌ డాలర్ల)కు చేరుకున్నాయని ఫార్మాస్యూటికల్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్‌) 2026, జనవరి 5న తెలిపింది. ప్రస్తుతం రూ.5.41 లక్షల కోట్లు (60 బిలియన్‌ డాలర్లు)గా ఉన్న ఫార్మా మార్కెట్‌ 2030కి రూ.11.72 లక్షల కోట్ల (130 బి.డాలర్ల) స్థాయికి చేరుకుంటుందని అంచనా వెసింది. భారతీయ జనరిక్‌ ఔషధాల ఎగుమతులను అంతర్జాతీయ మార్కెట్లో మరింత బలోపేతం చేసేందుకు ఫార్మెగ్జిల్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో ఫార్మెగ్జిల్‌ ప్రతినిధి బృందం ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది.  

Current Affairs

కనకమేడల రవీంద్రకుమార్‌

సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ 2026, జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.  రవీంద్రకుమార్‌ 1983లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌కౌన్సిల్‌లో నమోదై న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ విద్యుత్తు బోర్డు, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంల స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు.  2018 నుంచి 2024 వరకు తెలుగు దేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Current Affairs

మనోజ్‌ కొఠారి కన్నుమూత

బిలియర్డ్స్‌ మాజీ ప్రపంచ ఛాంపియన్, 15 ఏళ్లుగా భారత జట్టు కోచ్‌గా ఉన్న మనోజ్‌ కొఠారి (67 ఏళ్లు) 2026, జనవరి 5న కన్నుమూశారు. కోల్‌కతాకు చెందిన ఆయన తమిళనాడు తిరునెల్వేలిలో మరణించారు. మనోజ్‌ 1990లో ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచారు. ఆయన అర్జున అవార్డూ అందుకున్నారు.

Walkins

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ఉద్యోగాలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 21 వివరాలు: 1. రిసోర్స్‌ పర్సన్‌: 02 2. కన్సల్టెంట్‌: 02 3. టీం లీడ్‌: 05 4. వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌: 04 5. సీనియర్‌ ట్రైనర్స్‌: 03 6. డెవోప్స్‌ ఇంజినీర్‌: 01 7. ఫుల్‌స్టాక్‌ ఇంజినీర్‌: 02 8. అసిస్టెంట్‌: 01 9. ఎల్‌ఎంఎస్‌ డెవెలపర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రిసోర్స్‌ పర్సన్‌కు రూ.50,000; కన్సల్టెంట్‌, రూ.2,50,000; టీం లీడ్‌కు రూ.95,000; వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌కు రూ.40,000; సీనియర్‌ ట్రైనర్స్‌, డెవోప్స్‌ ఇంజినీర్‌, ఫుల్‌స్టాక్‌ ఇంజినీర్‌, ఎల్‌ఎంఎస్‌ డెవెలపర్‌ పోస్టులకు రూ.65,000; అసిస్టెంట్‌కు రూ.25,000. ఇంటర్వ్యూ తేదీ: 16.01.2026. వేదిక: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎన్‌ఐఈఎల్‌ఐటీ భవణ్‌, ప్లాట్‌ నెం.3, ద్వారక, న్యూదిల్లీ. Website:https://www.nielit.gov.in/chennai/recruitments

Government Jobs

టీసీఐఎల్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ బిహార్ (టీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 25 వివరాలు: 1. ప్రాజెక్ట్ మేనేజర్ - 01 2. ఆపరేషన్ లీడ్ - 03 3. ఇంజినీర్ ఎల్ -3 స్పెషలిస్ట్ - 03 4. పోర్టల్ అడ్మినిస్ట్రేటర్  - 01 5. ఇంజినీర్ ఎల్ -2 నెట్‌వర్క్ & మానిటరింగ్ - 06 6. హెల్ప్‌డెస్క్ ఇంజినీర్ - 06 7. వీడియో కాన్ఫరెన్సింగ్ కోఆర్డినేటర్ - 04 8. స్టోర్ ఇన్‌ఛార్జ్ - 01 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 33 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.22,546. - రూ.1,80,370. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ఈడి (డిటి) నెం. 501, టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, టిసిఐఎల్ భవన్, గ్రేటర్ కైలాష్ -I, దిల్లీ  - 110048 దరఖాస్తు చివరి తేదీ: 09.01.2026.  Website:https://www.tcil.net.in/current_opening.php

Government Jobs

సౌత్ ఈస్ట్రన్‌ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు

కోల్‌కతాలోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- సౌత్ ఈస్ట్రన్‌ రైల్వే 2025-26 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 54. వివరాలు: 1. గ్రూప్‌-సి (లెవెల్‌-4, లెవెల్‌-5): 05 2. గ్రూప్‌-సి (లెవెల్‌-2/3): 16 3. గ్రూప్‌-డి (లెవెల్‌-1): 33 అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ, పన్నెండో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, వాటర్ పోలో, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్ తదితరాలు. వయోపరిమితి: 01/01/2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10-01-2026. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09-02-2026. Website:https://rrcser.co.in/notice.html