Posts

Current Affairs

Ravinder Singh

♦ Indian shooter Ravinder Singh clinched the gold medal in the Men’s 50-meter Pistol event at the ISSF World Championships in Egypt, Cairo on 8 November 2025. ♦ Ravinder shot 569 in the men’s free pistol to finish on top of the 47-man pile and also combined with Kamaljeet (540, 20th) and Yogesh Kumar (537, 24th) to win the team silver in the event. ♦ Ravinder Singh is a Naib Subedar in the Indian Army had won individual and team bronze in the 2023 edition of the Worlds in Baku. ♦ Ravinder, who has been in and out of the India squad since 2019, shot 569 to take the top spot ahead of Kim Cheong-yong of South Korea, who shot 556, and Individual Neutral Athlete (AIN) Anton Aristarkhov (556), who settled for the bronze. ♦ The Indian women’s team of Elavenil, Meghana Sajjanar and Shreya Agrawal took bronze with an aggregate of 1893.3. ♦ China (1901.7) and South Korea (1899.9) took gold and silver respectively.

Current Affairs

జాతీయ న్యాయ సేవల దినోత్సవం

మన దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో సమానంగా న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటై, స్వతంత్రంగా పనిచేస్తోంది. వెనుకబడిన ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేలా, పేదలకు న్యాయ సహాయం అందించడం సహా వివిధ కార్యక్రమాలను ఇది చేపట్టింది. ఈ క్రమంలోనే లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చట్టం, 1987ను తీసుకొచ్చింది. దీన్ని ప్రారంభాన్ని గుర్తుచేసుకునేందుకు ఏటా నవంబరు 9న ‘జాతీయ న్యాయ సేవల దినోత్సవం’గా (National Legal Services Day) నిర్వహిస్తారు. ఉచిత న్యాయ సేవల లభ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు పౌరులందరికీ సహేతుకమైన పద్ధతిలో న్యాయం అందేలా చూడటం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం దేశవ్యాప్తంగా న్యాయ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు భారత పార్లమెంట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్ట్‌ 1987ను రూపొందించింది. 1994లో దీనికి కొన్ని సవరణలు చేశారు. 1995, నవంబరు 9న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మాజీ సీజేఐ రంగనాథ్‌ మిశ్రా దీని అమల్లో ముఖ్య భూమిక పోషించారు. దీని అమలుకు గుర్తుగా ఏటా నవంబరు 9న ‘జాతీయ న్యాయ సేవల దినోత్సవం’ నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్మానించింది. 

Current Affairs

మరణానంతరం శరీరంలో రక్తప్రసరణ

దిల్లీలోని హెచ్‌సీఎంసీటీ మణిపాల్‌ హాస్పిటల్‌ వైద్యులు మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు. ఆమె అవయవాలను దానం చేసేందుకు వీలుగా దీన్ని చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఆసియాలోనే ఈ ప్రక్రియను చేపట్టడం ఇదే మొదటిసారి. మోటార్‌ న్యూరాన్‌ వ్యాధి కారణంగా పక్షవాతం బారిన పడిన గీతా చావ్లా (55) అనే మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా కుటుంబసభ్యులు నవంబరు 5న అమెను మణిపాల్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ఆమె మరణించింది. ఆమె అవయవాలు దానం చేయాలనుకుంటున్నట్లు మృతురాలి కుటుంబం తెలియజేయడంతో అక్కడి వైద్యబృందం నార్మోథెర్మిక్‌ రీజినల్‌ పెర్ఫ్యూజన్‌ (ఎన్‌ఆర్‌పీ) అనే అరుదైన ప్రక్రియను నిర్వహించింది. 

Current Affairs

బహుభార్యత్వం నిషేధ బిల్లు

బహుభార్యాత్వం నిషేధించే బిల్లుకు అస్సాం మంత్రివర్గం 2025, నవంబరు 9న ఆదివారం ఆమోదం తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఆరో షెడ్యూల్‌ ప్రాంతాలకు మాత్రం కొన్ని మినహాయింపులు ఉంటాయి. బిల్లును నవంబరు 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. 

Current Affairs

వరల్డ్‌ రేడియాలజీ డే

జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త విలియం రాంట్‌జెన్‌ ఎక్స్‌-కిరణాలను కనుక్కున్నారు. ఆధునిక భౌతికశాస్త్ర అభివృద్ధికి కృషి చేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో రాంట్‌జెన్‌ ఒకరు. ఎక్స్‌-కిరణాలను వైద్యరంగంలో రేడియోగ్రఫీ, రేడియోథెరపీకి ఉపయోగిస్తారు. భత్రతా చర్యల్లో భాగంగా లగేజ్‌ను స్కాన్‌ చేయడంలోనూ ఈ కిరణాలను వినియోగిస్తారు. 1895, నవంబరు 8న ఎక్స్‌ - కిరణాలను కనుక్కున్న విలియం రాంట్‌జెన్‌ గౌరవార్థం ఏటా ఆ తేదీన  ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్‌ రేడియాలజీ డే’గా నిర్వహిస్తారు. ఈ కిరణాల ద్వారా శస్త్ర చికిత్స చేయకుండానే వైద్యులు మానవ శరీరంలోపలి కణజాలాలు, ఎములను చూడొచ్చు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన వీటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ రేడియాలజీ (ఈఎస్‌ఆర్‌), రేడియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (ఆర్‌ఎస్‌ఎన్‌ఏ), అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ రేడియాలజీ (ఏసీఆర్‌) సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని మొదటిసారి 2012లో నిర్వహించాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు. 

Current Affairs

అంతర్జాతీయ అటవీ సంరక్షణ కార్యక్రమం

కర్బన ఉద్గారాలను పీల్చుకునే ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ కార్యక్రమం (టీఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌)లో భారత్‌ పరిశీలకురాలి హోదాలో చేరింది. బ్రెజిల్‌ 12,500 కోట్ల డాలర్ల టీఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ నిధిని ప్రారంభించింది. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఈ కార్యక్రమానికి నిధులు సమకూరుస్తాయి. అడవులను సమర్థంగా పరిరక్షిస్తున్న దేశాలకు ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. 

Current Affairs

‘లింక్డ్‌ఇన్‌’ ఉత్తమ అంకుర సంస్థల జాబితా

ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ అయిన లింక్డ్‌ఇన్‌.. తాజాగా హైదరాబాద్‌లోని ఉత్తమ అంకుర సంస్థల జాబితాను వెల్లడించింది. ఇందులో ఏరోస్పేస్, సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌), ఎడ్యుటెక్‌ అంకుర సంస్థలదే పైచేయి. ఈ జాబితాను లింక్డ్‌ఇన్‌ ఏటా ప్రకటిస్తోంది. ఉద్యోగి వృద్ధి, ఉద్యోగంపై ఆసక్తి, ప్రతిభావంతులను ఆకర్షించటం... వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని రూపొందిస్తారు. ‘2025 టాప్‌ స్టార్టప్స్‌ లిస్ట్‌ ఫర్‌ హైదరాబాద్‌’ అనే పేరుతో రూపొందించిన ఈ జాబితాలో ఏరోస్పేస్‌ రంగానికి చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో రిసైకల్, స్వైప్‌ ఉన్నాయి. 2025 జాబితాలో ఏడు కొత్త సంస్థలు స్థానం సంపాదించాయి. 

Current Affairs

రామన్‌ మెగసెసె అవార్డు

2025కు గాను ప్రతిష్ఠాత్మకమైన ‘రామన్‌ మెగసెసె’ అవార్డును భారత్‌కు చెందిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ స్వచ్ఛంద సంస్థ అందుకుంది. దీన్ని ఆ సంస్థకు 2025 ఆగస్టు 31న ప్రకటించించారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని మెట్రోపాలిటన్‌ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 25 మందితో కూడిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ సంస్థ ఈ అవార్డును స్వీకరించింది. దీని వ్యవస్థాపకురాలు సఫీనా హుసేన్, సీఈవో గాయత్రి నాయర్‌ లోబో. ఈ సంస్థకు 55 వేల మంది వాలంటీర్లు ఉన్నారు.

Current Affairs

భారత 91వ గ్రాండ్‌మాస్టర్‌గా రాహుల్‌

చెస్‌లో రాహుల్‌ వీఎస్‌ (21 ఏళ్లు) కొత్తగా గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించాడు. ఈ ఘనత అందుకున్న 91వ భారత ప్లేయర్‌ అతడు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఎస్‌ఈఏఎన్‌ వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌లో ట్రోఫీ గెలిచిన రాహుల్‌.. ఈ క్రమంలో చివరి గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ను అందుకున్నాడు. 2021లో అతడు ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయ్యాడు.

Current Affairs

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రవీందర్‌ సింగ్‌ స్వర్ణం నెగ్గాడు. 2025, నవంబరు 8న కైరోలో జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో 569 పాయింట్లతో రవీందర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. కిమ్‌ (దక్షిణ కొరియా, 556), ఆంటోన్‌ అరిస్టార్‌కోవ్‌ (రష్యా, 556) వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. 50 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో రవీందర్‌ (569), కమల్‌జీత్‌ (540), యోగేశ్‌ కుమార్‌ (537)లతో కూడిన భారత బృందం (1646) రజతం గెలుచుకుంది. దక్షిణ కొరియా (1648) స్వర్ణం, ఉక్రెయిన్‌ (1644) కాంస్యం సాధించాయి.