Posts

Current Affairs

International Maritime Organization (IMO)

♦ India has been re-elected to the Council of the International Maritime Organization (IMO), London, in Category B, comprising 10 countries with the largest interest in international seaborne trade. ♦ India secured the highest number of votes in the category, receiving 154 out of 169 valid votes cast during the elections held on 28 November 2025 at the 34th Session of the IMO Assembly. ♦ The IMO Council consists of 40 elected members across three categories and functions as the executive body of the IMO between sessions of the Assembly. ♦ On the sidelines of the Assembly, the Indian delegation engaged with several countries, international organisations and IMO officials on cooperation in areas of mutual interest.

Current Affairs

గినీ బిసావు నూతన ప్రధానిగా ఇలిడో వియెరా

పశ్చిమ ఆఫ్రికాలోని గినీ బిసావులో తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం.. దేశ ప్రధానిగా ప్రస్తుత ఆర్థిక మంత్రి ఇలిడో వియెరాను నియమించింది. ఈ మేరకు కొత్త సైనికాధిపతి జనరల్‌ హోర్టా ఎన్టా 2025, నవంబరు 28న ఆదేశాలు జారీ చేశారు. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు ఉమరో సిసాక ఎంబాలో స్థానంలో ఈయన నియమితులయ్యారు.  నవంబరు 23న గినీ బిసావో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. తర్వాత సైన్యం తిరుగుబాటు చేసింది. దీంతో అధ్యక్షుడు ఎంబాలో దేశం విడిచి పారిపోయారు. 

Current Affairs

ఓపెన్‌ డోర్స్‌ నివేదిక-2025

అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో వరుసగా రెండోసారి భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరం(2023-24) నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్‌ తొలిస్థానంలో నిలవగా... 2024-25 విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 3.63 లక్షలకు పెరిగి మరోసారి ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. అక్కడున్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను మన దేశం 2023-24లో వెనక్కి నెట్టింది. యూఎస్‌ఏకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ తాజాగా విడుదల చేసిన ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌-2025 ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాలో విద్యా సంవత్సరం అంటే ఆగస్టు-మే నెల వరకు భావిస్తారు. తాజా నివేదికను 2024-25 విద్యా సంవత్సరం గణాంకాల ఆధారంగా రూపొందించారు.

Current Affairs

ఆసియా పవర్‌ ఇండెక్స్‌- 2025

ఆసియా పవర్‌ ఇండెక్స్‌- 2025లో ‘ప్రధాన శక్తి’ హోదాకు భారత్‌ చేరుకుందని ఆస్ట్రేలియా సంస్థ లోవీ ఇన్‌స్టిట్యూట్‌ 2025, నవంబరు 28న వెల్లడించింది. ఆపరేషన్‌ సిందూర్‌లో మన దేశ ప్రదర్శన ఆధారంగా ఆర్థికాభివృద్ధి, సైనిక సామర్థ్యాల వల్లే, ఈ హోదా లభించినట్లు తెలిపింది. ఆసియా దేశాల శక్తి సామర్థ్యాలు, చూపించే ప్రభావం ఆధారంగా వార్షిక ఆసియా పవర్‌ ఇండెక్స్‌ను నిర్ణయిస్తారు.  ఆసియా పవర్‌ ఇండెక్స్‌-2024లో 38.1 పాయింట్ల స్కోర్‌తో ఉన్న భారత్‌.. ఈ ఏడాది (2025)లో 40 పాయింట్లతో ప్రధాన శక్తిగా అవతరించింది. అమెరికా (80.5 పాయింట్లు), చైనా (73.7 పాయింట్లు) తర్వాత భారత్‌ మూడోస్థానంలో ఉంది. 

Current Affairs

డిజిటల్‌ బ్యాంకింగ్‌

డిజిటల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింత సురక్షితం, సులభతరం చేయడంతో పాటు, ప్రమాణీకరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సిద్ధమయ్యింది. ఇందుకోసం ‘డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఛానల్స్‌ ఆథరైజేషన్‌ డైరెక్షన్స్‌-2025’ పేరుతో కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. 2026 జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సహా, అన్ని వాణిజ్య బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. 

Current Affairs

దేశ జీడీజీ 8.2%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబరు) భారత్‌ 8.2% వృద్ధిని నమోదు చేసింది. ఈ విషయాన్ని  జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) 2025, నవంబరు 28న తెలిపింది. ఇది ఆరు త్రైమాసికాల గరిష్ఠస్థాయి. జీఎస్‌టీ రేట్ల కోతలతో వినియోగం పెరుగుతుందనే అంచనాల మధ్య పరిశ్రమ ఉత్పత్తి అధికమైంది. అందువల్లే వ్యవసాయ ఉత్పత్తి తగ్గినా.. జీడీపీ రాణించగలిగింది.  2025-26 తొలి త్రైమాసిక వృద్ధిరేటు 7.8%, 2024-25 జులై-సెప్టెంబరులోని 5.6% కంటే తాజా గణాంకాలు మిన్నగా ఉన్నాయి. సేవల రంగం రెండంకెల వృద్ధి సాధించడమూ కలిసొచ్చింది. 2023-24 నాలుగో త్రైమాసికంలో నమోదైన 8.4% వృద్ధి తర్వాత, అత్యధిక వృద్ధి ఇదే. 

Current Affairs

జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌

ఒడిశా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదంలో మానవహక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్‌కు ఆయన నేతృత్వం వహించనున్నారు. ఐక్యరాజ్య సమితి దీన్ని ఏర్పాటు చేసింది.  ఇజ్రాయెల్, ‘ఆక్రమిత పాలస్తీనా ప్రాంతం’లో మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరపడం ఈ ప్యానెల్‌ ప్రధాన బాధ్యత. ఈ స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు గతంలో బ్రెజిల్‌ న్యాయనిపుణుడు పాలో సెర్గియో పిన్హీరో నేతృత్వం వహించారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా సంఘర్షణపై జస్టిస్‌ మురళీధర్‌ ఇవ్వబోయే నివేదికలకు చాలా ప్రాధాన్యం ఉండనుంది.

Current Affairs

ఐసీఏఐ గిన్నిస్‌ రికార్డు

ముంబయిలో ఒకే రోజులో అతిపెద్ద కెరీర్‌ సలహా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించి, గిన్నిస్‌ రికార్డు సాధించినట్లు చార్టర్డ్‌ అకౌంటెంట్ల అత్యున్నత సంస్థ ఐసీఏఐ 2025, నవంబరు 28న వెల్లడించింది. ఈ సెషన్‌లో 7400 మందికి పైగా విద్యార్థులు, ఇతర వ్యక్తులు పాల్గొన్నారు. ‘కెరీర్‌ ఇన్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఫర్‌ యూత్‌ (సీఏఎఫ్‌వై 4.0), సూపర్‌ మెగా కెరీర్‌ కౌన్సిలింగ్‌ ప్రోగ్రామ్‌’ను నవంబరు 27న దేశవ్యాప్తంగా నిర్వహించారు. 

Current Affairs

ఆపరేషన్‌ సాగర్‌ బంధు

దిత్వా తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు మానవతా సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ సాగర్‌ బంధు’ను ప్రారంభించింది. కష్టసమయంలో పొరుగుదేశానికి చేయూత అందించేందుకు భారత్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తుపాను కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతోపాటు కొండచరియలు విరిగిపడడంతో మరణించినవారి సంఖ్య 80కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. 

Current Affairs

India and the United Arab Emirates held the third meeting

♦ India and the United Arab Emirates held the third meeting of the Joint Committee under the India-UAE Comprehensive Economic Partnership Agreement (CEPA) in New Delhi on 27 November 2025. The meeting was co-chaired by Ajay Bhadoo, Additional Secretary in the Department of Commerce, and Juma Al Kait, Assistant Undersecretary for International Trade Affairs of the UAE. ♦ Both sides noted strong growth in bilateral trade, which reached USD 100.06 billion in FY 2024–25, marking a 19.6% increase. The UAE continues to be one of India’s most important trading partners. The Joint Committee meeting is the main platform for reviewing CEPA’s implementation, addressing challenges, and monitoring progress. ♦ Officials reviewed developments across multiple areas, including market access, data sharing, allocation of Gold Tariff Rate Quota (TRQ), anti-dumping issues, services, Rules of Origin, and BIS licensing. India also informed the UAE about its recent decision to allocate Gold TRQ through a transparent competitive bidding process.