Posts

Current Affairs

ఇంధన పరిరక్షణలో తెలంగాణకు జాతీయ పురస్కారం

తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు (ఎన్‌ఈసీఏ) లభించింది. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఏటా ఇచ్చే జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుల్లో 2025 సంవత్సరానికి తెలంగాణకు ద్వితీయ పురస్కారం దక్కింది.  2025, డిసెంబరు 14న దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఈ అవార్డును అందుకున్నారు. 

Current Affairs

‘2025 గ్లోబల్‌ ఏఐ వైబ్రెన్సీ టూల్‌’ నివేదిక

ఏఐ (కృత్రిమమేధ) సాంకేతికత అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్‌ మూడోస్థానంలో ఉందని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ‘2025 గ్లోబల్‌ ఏఐ వైబ్రెన్సీ టూల్‌’ నివేదిక వెల్లడించింది. 2024 గ్లోబల్‌ ఏఐ వైబ్రెన్సీ ర్యాకింగ్‌ ఆధారంగా, తాజా జాబితాను స్టాన్‌ఫోర్డ్‌ విడుదల చేసింది. గత జాబితాతో పోలిస్తే భారత్‌ 4 స్థానాలు పైకొచ్చింది. ఏఐకి సంబంధించి ‘పరిశోధన -అభివృద్ధి, బాధ్యతాయుత ప్రవర్తన,  ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యాలు, విధాన నిర్ణయాల అమలు, ప్రజాభిప్రాయం, మౌలిక వసతులు’ వంటి అంశాల ఆధారంగా గతేడాది వ్యవధిలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని, వివిధ దేశాలకు ర్యాంకులను స్టాన్‌ఫోర్డ్‌ ప్రకటించింది. ఈ ప్రకారం.. ఏఐ పురోగతిలో అమెరికా (స్కోర్‌ 78.6), చైనా (36.95) తరవాత స్థానంలో మనదేశం ఉంది. ఈ సూచీలో మనదేశ స్కోర్‌ 21.59 కాగా, దక్షిణ కొరియా (17.24), యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (16.64), సింగపూర్‌ (16.43), స్పెయిన్‌ (16.37), యూఏఈ (16.06), జపాన్‌ (16.04) మనకంటే దిగువనే ఉన్నాయి. 

Current Affairs

ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్తు సంరక్షణ పురస్కారం

ఇంధన సంరక్షణలో మంచి పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు-2025 గ్రూప్‌-2 విభాగంలో మొదటి బహుమతి లభించింది. 2025, డిసెంబరు 14న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ లోతేటి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఈ అవార్డు స్వీకరించారు. అలాగే 53,132 యూనిట్ల విద్యుత్తు పొదుపు చేసినందుకు దక్షిణమధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు డీజిల్‌ ట్రాక్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రభుత్వ భవనాల విభాగంలో జాతీయస్థాయి పురస్కారాన్ని సొంతం చేసుకుంది. దాని తరఫున దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Current Affairs

స్క్వాష్‌ ప్రపంచకప్‌ విజేత భారత్‌

స్క్వాష్‌ ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న తొలి ఆసియా జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది. 2025, డిసెంబరు 14న చెన్నైలో జరిగిన ఫైనల్లో భారత్‌ 3-0తో హాంకాంగ్‌పై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో సీనియర్‌ క్రీడాకారిణి జోష్న చిన్నప్ప 3-1 (7-3, 7-5, 7-1)తో లీ కాయిని ఓడించగా.. అభయ్‌ సింగ్‌ పురుషుల సింగిల్స్‌లో 3-0 (7-1, 7-4, 7-4)తో అలెక్స్‌ లవును చిత్తు చేశాడు. భారత బృందం క్వార్టర్స్‌లో దక్షిణాఫ్రికాను, సెమీస్‌లో ఈజిప్ట్‌ను ఓడించింది. ఇప్పటిదాకా 2023లో మూడో స్థానంలో నిలవడమే భారత్‌కు టోర్నీలో ఉత్తమ ప్రదర్శన.

Current Affairs

దేశీయ బ్రెయిన్‌ స్టెంట్‌

పక్షవాత బాధితులకు చికిత్స విషయంలో దిల్లీలోని ఎయిమ్స్‌ దేశంలోనే తొలిసారిగా ఒక అధునాతన బ్రెయిన్‌ స్టెంట్‌ను రూపొందించింది. దీనిపై ప్రత్యేక క్లినికల్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ సాధనానికి సూపర్‌నోవా స్టెంట్‌ అని పేరు పెట్టారు. గ్రావిటీ మెడికల్‌ టెక్నాలజీ సంస్థ ఈ సాధనాన్ని అభివృద్ధి చేసింది. దీనిపై గ్రాస్‌రూట్‌ పేరిట ప్రయోగాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 8 కేంద్రాల్లో వీటిని చేపట్టారు. దీనికి దిల్లీ ఎయిమ్స్‌ జాతీయ సమన్వయ కేంద్రంగా వ్యవహరించింది. ఈ సాధనాన్ని ప్రత్యేకంగా భారత్‌లోని భిన్న విభాగాల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. 

Current Affairs

సయీ ఎస్‌. జాదవ్‌

దేహ్రాదూన్‌లోని 93 సంవత్సరాల భారత సైనిక అకాడమీ చరిత్ర (ఐఎంఏ)లో  సయీ ఎస్‌. జాదవ్‌ అనే మహిళా అధికారిణి శిక్షణను పూర్తి చేసుకుని భారతసైన్యంలో చేరారు. మహారాష్ట్రకు చెందిన ఈమె ప్రస్తుత బ్యాచ్‌లో ఏకైక మహిళా ఆఫీసర్‌ క్యాడెట్‌గా ఈ ఘనత సాధించారు.  సయీ జాదవ్‌ గ్రాడ్యుయేషన్‌ అయ్యాక ఎస్‌ఎస్‌బీ ద్వారా ఎంపికై ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో చేరారు. ఇక్కడ ఆరునెలల కఠినమైన సైనిక శిక్షణను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆమెను జెంటిల్‌మన్‌ క్యాడెట్స్‌ అని కాకుండా ఆఫీసర్‌  క్యాడెట్స్‌ అని పిలవనున్నారు.

Current Affairs

కమిషనర్‌గా సుధారాణి రేలంగి

కేంద్ర సమాచార కమిషనర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పెట్రోలియం, సహజవాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. ఇండియన్‌ లీగల్‌ సర్వీస్‌ అధికారి అయిన ఈమెకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్, లెజిస్లేటివ్‌ డ్రాఫ్టింగ్, ప్రాసిక్యూషన్, ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ విభాగంలో 35 ఏళ్ల అనుభవం ఉంది.  తెలుగువారైన ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ 2013 నవంబరు నుంచి 2018 నవంబరు వరకు కేంద్ర సమాచార కమిషనర్‌గా సేవలందించారు. 

Current Affairs

కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా రాజ్‌కుమార్‌ గోయల్‌

కేంద్ర సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌గా న్యాయశాఖ మాజీ కార్యదర్శి రాజ్‌కుమార్‌ గోయల్‌ 2025, డిసెంబరు 13న నియమితులయ్యారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామక కమిటీ ఈ పదవికి ఆయన పేరును సిఫార్సు చేసింది. అలాగే రైల్వే బోర్డు మాజీ ఛైర్మన్‌ జయవర్మ సిన్హా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ మాజీ కార్యదర్శి సురేంద్రసింగ్‌ మీనా, మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కుశ్వంత్‌సింగ్‌ సేథి, మాజీ ఐపీఎస్‌ అధికారి స్వాగత్‌దాస్, మాజీ ఐఏఎస్‌ అధికారి సంజీవ్‌కుమార్‌ జిందల్, సీనియర్‌ పాత్రికేయుడు పీఆర్‌ రమేష్, ఆశుతోష్‌ చతుర్వేదిలు కమిషనర్లుగా నియమితులయ్యారు. 

Walkins

సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో పోస్టులు

దిల్లీలోని సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎస్‌జీఎం)  ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ డాక్టర్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 39 వివరాలు: 1. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ - 32 2. స్పెషలిస్ట్ - 07 విభాగాలు: మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ఆబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ, అనస్థీషియా,రేడియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ విభాగాలు... అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌, డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.67700. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 17-12-2025. వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎస్‌జీఎం  హాస్పిటల్, 4వ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్, మంగోల్‌పురి, దిల్లీ - 110 083. Website:https://sgmh.delhi.gov.in/circulars-orders

Walkins

ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని  ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)  ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్), సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 102 వివరాలు: 1. ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) - 43 2. సీనియర్ రెసిడెంట్ - 44 3. మెడికల్ ఆఫీసర్ - 15 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ ఎండీ/ డీఎన్‌బీ/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు ఫ్యాకల్టీకు రూ.1,46,638- రూ.2,56,671, మెడికల్ ఆఫీసర్‌కు రూ.56,100 - రూ.1,17,103, సీనియర్ రెసిడెంట్ కు రూ. 67,700.  దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500.ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ తేదీలు: 2025 డిసెంబరు 29 నుంచి 2026 జనవరి 7వ  తేదీ వరకు  వేదిక: అకడమిక్ బ్లాక్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, సనత్‌నగర్, హైదరాబాద్. Website:https://mchyderabad.esic.gov.in/recruitments/medical_recruitment_list