Posts

Current Affairs

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్‌ 2025, జనవరి 4న బాధ్యతలు చేపట్టారు. 90 రోజులపాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించారు. వెనెజువెలా రాజధాని కారకాస్‌లో 1969లో డెల్సీ రోడ్రిగ్జ్‌ జన్మించారు. ఆమె వామపక్ష గెరిల్లా నాయకుడు జార్జ్‌ అంటోనియో కుమార్తె.  దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై 2025, జనవరి 3న అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఆ దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా సైన్యం.. బంధించి న్యూయార్క్‌కు తరలించింది. ఈ పేపథ్యంలోనే ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

Current Affairs

చరిత్ర సృష్టించిన ఏపీ జెన్‌కో

ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థ ఏపీ జెన్‌కో 2025, జనవరి 4న థర్మల్‌ ప్లాంట్ల ద్వారా 5,828 మెగావాట్లు, జల విద్యుత్‌ ద్వారా 181 మెగావాట్లు.. మొత్తం 6,009 మెగావాట్లను ఉత్పత్తి చేసి చరిత్ర సృష్టించింది. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల గతంతో పోలిస్తే రోజుకు సుమారు 1,500 మెగావాట్ల విద్యుత్‌.. థర్మల్‌ ప్లాంట్ల ద్వారా గ్రిడ్‌కు అందుతోందని అధికారులు తెలిపారు.  ఏపీ జెన్‌కో, ఏపీ విద్యుత్‌ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌)లకు విజయవాడ, కడప, నెల్లూరు జిల్లాల్లో 6,610 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న థర్మల్‌ యూనిట్లు ఉన్నాయి. వాటిద్వారా గతంలో 4 వేల మెగావాట్ల ఉత్పత్తే కష్టమయ్యేది. ప్రస్తుతం 5,828 మెగావాట్ల ఉత్పత్తి గ్రిడ్‌కు అందుతోంది. ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంలో సగటున 88.79 శాతం ఉత్పత్తి వస్తోంది.  ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని కారణంగా జల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం తక్కువ. ఈ పరిస్థితుల్లోనూ మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 120 మెగావాట్లు, నాగార్జునసాగర్‌ కుడికాలువ పంప్‌ హౌస్‌ ద్వారా 40 మెగావాట్లు, హంపి పవర్‌ హౌస్‌ ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ గ్రిడ్‌కు అందింది. 

Current Affairs

ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా డాక్టర్‌ రాజిరెడ్డి

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ చాడ రాజిరెడ్డి బెంగళూరులోని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా ఎన్నికయ్యారు. రసాయన శాస్త్రంలో.. ప్రత్యేకించి ఆరోగ్య సంరక్షణ అనువర్తనాల కోసం ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీలో ఆయన చేసిన అత్యుత్తమ పరిశోధనలకు దక్కిన గుర్తింపు ఇది.  భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేసిన కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌లో ఉపయోగించిన అడ్జువెంట్‌ మాలిక్యూల్‌ అభివృద్ధి ప్రక్రియలో పాల్గొన్న కీలక శాస్త్రవేత్తల్లో డాక్టర్‌ రాజిరెడ్డి ఒకరు. 

Current Affairs

రాజస్థాన్‌ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి

విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచడంతో పాటు పఠనాసక్తిని పెంపొందించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. విద్యార్థుల పదజాలం మెరుగుపరచడం, లోకజ్ఞానం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌లోనూ ఇటువంటి నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

Current Affairs

ప్రపంచ తెలుగు మహాసభ

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో 2026, జనవరి 3న ప్రారంభమమయ్యాయి. మాతృభాషను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు. జనవరి 4న మారిషస్‌ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్‌ గోకుల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజులుపాటు సాగిన కార్యక్రమం జనవరి 5న ముగిశాయి.  తెలుగు భాషకు సేవలందించిన పలువురు ప్రముఖులకు మహాసభల్లో పూర్ణకుంభ పురస్కారాల ప్రదానం జరిగింది. శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడి చేతుల మీదుగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ తనయుడు నాగేంద్ర, తూర్పుబాగోతం కళాకారుడు శంకర్రావు, సినీనటుడు ఏడిద శ్రీరాం, బుర్రా సాయిమాధవ్, గద్దర్‌ కుమార్తె వెన్నెల, తోలుబొమ్మల కళాకారుడు చిదంబరం, పొత్తూరు రంగారావు తదితరులను సత్కరించారు.

Internship

నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరిలో ఇంటర్న్స్‌ పోస్టులు

నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరి (ఎన్‌డీటీఎల్‌) ఇంటర్న్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ఇంటర్న్స్: 10  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.20,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 7.  Website:https://ndtlindia.com/career/

Government Jobs

ఐఐటీ రూర్కీలో జేఆర్‌ఎఫ్ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంటెక్‌/ఎమ్మెస్సీ(హైడ్రాలజీ లేదా జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌/రిమోట్ సెన్సింగ్/గ్లేషియాలజీ/జియాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు నెట్/ గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఫెలోషిప్‌: నెలకు రూ.37,000. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా dsarya.iitr@gmail.com.కు పంపాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 20. Website:https://iitr.ac.in/Careers/Project%20Jobs.html

Government Jobs

బనారస్ హిందూ యూనివర్సిటీలో రిసెర్చ్‌అసోసియేట్ పోస్టులు

వారణాసీలోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ), తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్‌అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: రిసెర్చ్‌ అసోసియేట్  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 24-01-2026. Website:https://www.bhu.ac.in/site/tempvacancy/1_2_16

Apprenticeship

ఎడ్‌సిల్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన న్యూదిల్లీలోని ఎడ్‌సిల్‌ (ఇండియా) లిమిటెడ్‌ విద్యా మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వంకు చెందిన మినీ రత్న క్యాటగిరీ-1 సీపీఎస్‌ఈ సంస్థ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 15 ఖాళీలు గ్రాడ్యుయేట్‌ విభాగాలు: బీటెక్‌ (సీఎస్‌/ఐటీ/ఈసీఈ), బీకాం, సీఏ(ఇంటర్మీడియట్‌), సీఎంఏ, బీబీఏ(హారర్స్‌)/బీఏ (హెచ్‌ఆర్‌ఎం)/బీఎంఎస్‌, బీబీఏ (జనరల్‌)/బీఏ (ఇంగ్లిష్‌)/సోషియాలజీ/సోషల్‌ సైన్స్‌). అర్హత: 01.04.2024 తరువాత ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట  ఉత్తీర్ణులై ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు 15,000. గరిష్ఠ వయోపరిమితి: చివరి తేదీ నాటికి 18 - 25 ఏళ్ల మద్య ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2026. Website:https://edcilindia.co.in/

Admissions

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2026

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2026-27 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఐదు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 306 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు.  వివరాలు: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ యూజీ)-2026 అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మాధ్యమం: 13 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా) రాయొచ్చు. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరాఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము: జనరల్- మూడు సబ్జెక్టుల వరకు రూ.1000; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.400. ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌- మూడు సబ్జెక్టులకు రూ.900; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.375. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జెండర్‌- మూడు సబ్జెక్టులకు రూ.800; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.350. తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్‌, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, పెద్దపల్లి. ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అదోని, అమలాపురం, అనంతపురం, బీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుత్తూరు, రాజమహేంద్రవరం, రాయచోటీ, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ తేదీలు: 03-01-2026 నుంచి 30.01.2026. రుసుము చెల్లింపు చివరి తేదీ: 31-01-202. దరఖాస్తు సవరణ తేదీలు: 02 నుంచి 04-02-2026 వరకు. పరీక్ష తేదీలు: 11- 31-05-2026 వరకు. Website:https://cuet.nta.nic.in/