Posts

Current Affairs

ఫ్యూజియన్‌లో బయటపడిన పురాతన పక్షి శిలాజం

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడి ఫ్యూజియన్‌ ప్రావిన్సులో బయటపడిన ఆ శిలాజం కనీసం 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు. పక్షి జాతుల పుట్టుక, వాటి పరిణామ క్రమం తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు 2025, ఫిబ్రవరి 13న వెల్లడించారు.  బామినోర్నిస్‌ జెంగెన్సిస్‌ అని వ్యవహరిస్తున్న ఈ పక్షి శరీర నిర్మాణం ఇంచుమించుగా ఆధునిక విహంగాల మాదిరిగానే ఉంది. తాజా పరిశోధనల ప్రకారం 17.2 కోట్ల నుంచి 16.4 కోట్ల ఏళ్ల కంటే ముందే పక్షులు పరిణామం చెందాయని భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

Current Affairs

న్యూట్రినో

సుదూర విశ్వం నుంచి భూమికి చేరుకున్న అత్యంత శక్తిమంతమైన ఉప పరమాణువు ‘న్యూట్రినో’ను శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. గతంలో గుర్తించిన న్యూట్రినోలతో పోలిస్తే ఇది దాదాపు 30 రెట్ల అధిక శక్తిని కలిగి ఉందని వారు పేర్కొన్నారు. దీని శక్తి 220 మిలియన్‌ బిలియన్‌ ఎలెక్ట్రాన్‌ వోల్ట్స్‌గా ఉన్నట్లు తెలిపారు.  న్యూట్రినోలు పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల లానే ఉంటాయి. కాకపోతే వీటికి ధనాత్మక, రుణాత్మక ఆవేశాలు ఉండవు. తటస్థంగా ఉంటాయి. ద్రవ్యరాశి కూడా ఉండదు. ఇతర పదార్థాలతో సంయోగం కూడా చెందవు. అందుకే న్యూట్రినోలు ఖగోళానికి ఆవల నుంచి వివిధ పదార్థాల గుండా చొచ్చుకుంటూ ఎలాంటి ఆటంకం లేకుండా సుదీర్ఘ దూరాలు ప్రయాణిస్తాయి. అరుదుగా నీటి అణువులో పతనమవుతాయి. అలా పతనమైనప్పుడు నీలి కాంతిని వెదజల్లుతాయి. మధ్యదరా సముద్రంలో 3.5 కిలోమీటర్ల లోతులో ఉన్న అత్యంత శక్తిమంతమైన కేఎం3ఎన్‌ఈటీ టెలిస్కోపు ఈ న్యూట్రినోను గుర్తించింది. 

Current Affairs

ముగిసిన జాతీయ క్రీడలు

38వ జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్‌ (7 స్వర్ణాలు, ఒక రజతం, 6 కాంస్యాలు) 18వ; తెలంగాణ (3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు) 26వ స్థానాలతో ముగించాయి. పోటీల చివరిరోజైన 2025, ఫిబ్రవరి 13న తెలంగాణకు మరో రెండు కాంస్య పతకాలు లభించాయి. షూటింగ్, నెట్‌బాల్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటారు. షాట్‌గన్‌ స్కీట్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో బత్తుల మునెక్‌- రష్మీ రాఠోడ్‌ జోడీ కాంస్యం సాధించింది. మిక్స్‌డ్‌ నెట్‌బాల్‌ విభాగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డ్‌ 121 పతకాలతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలుచుకుంది. మహారాష్ట్ర 198 (54 స్వర్ణాలు, 71 రజతాలు, 73 కాంస్యాలు) రెండు, హరియాణా 153 (48 స్వర్ణాలు, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానాలు దక్కించుకున్నాయి. ఈ రెండు జట్లు సర్వీసెస్‌ కన్నా ఎక్కువ పతకాలు గెలిచినా స్వర్ణాల్లో వెనకబడ్డాయి. 

Current Affairs

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

మణిపుర్‌లో 2025, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి ఈ మేరకు నోటిఫికేషన్‌ వెలువడింది. మణిపుర్‌ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్‌కు దఖలుపరుస్తూ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఉత్తర్వులిచ్చారు. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచినట్లు తెలిపింది.  మణిపుర్‌ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లా నివేదిక, ఇతరత్రా సమాచారం ఆధారంగా రాష్ట్రపతి తాజా నిర్ణయం తీసుకున్నారు.

Walkins

ఎన్‌ఐఈపీఎండీలో కన్సల్టెంట్‌ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్‌ ఎంపవర్‌మెంట్ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టీపుల్‌ డిసబిలిటీస్‌ (ఎన్‌ఐఈపీఎండీ) తాత్కాలిక ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: 1. ప్రొస్థెటిస్ట్‌ అండ్ ఆర్థోటిస్ట్‌: 01 2. క్లినికల్ అసిస్టెంట్: 01 3. స్పెషల్ ఎడ్యుకేటర్‌/ ఓరియంటేషన్‌ అండ్ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్‌: 01 4. క్లినికల్ అసిస్టెంట్(డెవలప్‌మెంటల్ థెరపిస్ట్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ( ప్రొస్థెటిస్ట్‌ అండ్ ఆర్థోటిక్స్‌) బీఎస్సీ( ఎస్‌పీ అండ్‌ హెచ్‌జీ), డిగ్రీ( డిప్లొమా, బీఈడీ, పీజీ స్పెషల్ ఎడ్యుకేషన్‌), పీజీడీఈఐ, బీఓటీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 56 ఏళ్లు. జీతం: నెలకు ప్రొస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్‌, క్లినికల్ అసిస్టెంట్‌కు రూ.50,000, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌కు రూ. 45,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ఎన్‌ఐఈపీఎండీ, ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్, ముట్టుకాడు, చెన్నై-603112 ఇంటర్వ్యూ తేదీ: 21-02-2025. Website:https://niepmd.nic.in/notice-category/recruitments/

Walkins

ఎంఏఎన్‌యుయులో ఫ్యాకల్టీ పోస్టులు

మౌలానా ఆజాద్‌ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్‌యుయు) పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 03 వివరాలు: 1. పోస్ట్‌ గ్రాడ్యుయేట్ టీచర్‌(పీజీటీ): 01 2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌(టీజీటీ సోషల్‌, ఇంగ్లిష్‌): 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ(ఎంఎస్సీ, పొలిటికల్‌ సైన్స్‌), బీఈడీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు పీజీటీ పోస్టుకు రూ.27,500, టీజీటీ పోస్టుకు రూ.26,250. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 20-02-2025 వేదిక: కమిటీ రూమ్‌, యూనివర్సిటీ గెస్ట్‌ హౌస్‌, ఎంఏఎన్‌యుయు క్యాంపస్‌, గచ్చిబౌలి, హైదరాబాద్-500032. Website:https://manuu.edu.in/notifications

Government Jobs

యూపీఎస్సీ- ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌ఈ 2025

న్యూ దిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్‌), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్‌) ఎగ్జామినేషన్- 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  మొత్తం ఖాళీలు: 47 వివరాలు: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్‌): 12 పోస్టులు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్‌): 35 పోస్టులు అర్హత:  ఎకనామిక్ సర్వీస్‌కు అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. స్టాటిస్టికల్ సర్వీస్‌కు అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ (స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.  వయోపరిమితి: అభ్యర్థులు 01.08.2025 నాటికి తప్పనిసరిగా 21- 30 సంవత్సరాల మధ్య ఉండాలి.  ఎంపిక విధానం: పరీక్ష విధానం: వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా. నెగిటివ్ మార్కింగ్: ఆబ్జెక్టివ్-టైప్ పేపర్లకు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము: రూ.200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 04.03.2025. పరీక్ష తేదీ ప్రారంభం: 20.06.2025. పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పట్న తదితరాలు.. Website:https://upsc.gov.in/ Apply online:https://upsconline.gov.in/upsc/OTRP/

Government Jobs

టీహెచ్‌డీసీలో సర్వేయర్‌ పోస్టులు

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీ) సర్వేయర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: 1. జూనియర్‌ మైన్‌ సర్వేయర్‌: 03 2. జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(మైన్‌ సర్వే, మైన్‌ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: మైన్‌ సర్వేయర్‌కు 36 ఏళ్లు, జీనియర్ ఓవర్‌మ్యాన్‌కు 32 ఏళ్లు.  జీతం: నెలకు జూనియర్ మైన్‌ సర్వేయర్‌కు రూ.29,600 - 1,19,500, జూనియర్ ఓవర్‌మ్యాన్‌కు రూ.29,400 - 1,19,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025. Website:https://thdc.co.in/index.php/en/career/new-job-opening

Government Jobs

టీహెచ్‌డీసీలో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులు

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీ) జూనియర్‌ ట్రైనీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 7 వివరాలు:  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(హోటల్ మేనేజ్‌మెంట్, హస్పిటాలిటి అండ్‌ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 12-02-2025 తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.29,200 - 1, 19,000. ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025. Website:https://thdc.co.in/index.php/en/career/new-job-opening

Government Jobs

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) కింది పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 03 వివరాలు: 1. సివిల్ ఇంజినీర్‌: 02 2. ఎలక్ట్రికల్ ఇంజినీర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 40 ఏళ్లు.  జీతం: నెలకు రూ.70,290. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-02-2025. Website:https://sportsauthorityofindia.nic.in/sai/latest-information/#job-opportunities