Posts

Current Affairs

Prime Minister Narendra Modi met with US President Donald Trump

♦ Prime Minister Narendra Modi met with US President Donald Trump at the White House in Washington, DC, on 14 February 2025. ♦ During the meeting, Modi and Trump discussed various issues, including trade, defense, technology, energy, security, and people-to-people ties. ♦ They also exchanged views on regional and international developments of mutual interest.  ♦ The two leaders have jointly launched the US-India Compact for the 21st Century to foster deeper collaboration in defense, trade, and technology. ♦ In the area of trade and investment, Mission-500 has been introduced to more than double total two-way trade to USD 500 billion by 2030. ♦ Additionally, the leaders unveiled plans to establish a new 10-year framework for the US-India Major Defence Partnership, spanning from 2025 to 2035. ♦ Trump said that the United States will sell F-35 fighter jets to India, which would join the elite club of countries with the state-of-the-art stealth planes.

Current Affairs

Wholesale Price Index (WPI)

♦ India’s annual Wholesale Price Index (WPI) inflation eased to 2.31% in January 2025 from 2.37% in December 2024, according to data released by the Commerce and Industry Ministry on 14 February 2025. ♦ Month-over-month, the WPI declined by 0.45% in January, driven by lower food prices. ♦ The index for primary articles fell by 2.01% as food article prices dropped by 3.62%. However, prices of crude petroleum and natural gas (6.34%), non-food articles (0.66%), and minerals (0.22%) increased. ♦ Inflation in the fuel and power category rose by 0.47%, though coal prices remained unchanged from December 2024. ♦ Manufactured products, which account for 64.23% of the index, saw a marginal increase of 0.14%. Out of 22 manufacturing groups, 15 recorded price increases, five saw declines, and two remained unchanged.  ♦ The WPI Food Index inflation dropped from 8.89% in December 2024 to 7.47% in January 2025.

Current Affairs

చంద్రశేఖరన్‌కు బ్రిటన్‌ గౌరవ నైట్‌హుడ్‌

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌కు ప్రతిష్ఠాత్మక హానరరీ నైట్‌హుడ్‌ పురస్కారాన్ని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌- బ్రిటన్‌ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు గాను దీన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. కింగ్‌ ఛార్లెస్‌ నుంచి ‘ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ - హానరరీ డీబీఈ/ కేబీఈ’ పురస్కారాన్ని చంద్రశేఖరన్‌ అందుకుంటారని తెలిపింది. సాంకేతికత, వినియోగం, ఆతిథ్యం, ఉక్కు, రసాయనాలు, వాహన రంగాల్లో బ్రిటన్‌తో బలమైన వ్యూహాత్మక సంబంధాలను టాటా సన్స్‌ కొనసాగిస్తుంది. బ్రిటన్‌లో 70,000 మందికి టాటా గ్రూపు ఉపాధి కల్పిస్తోంది. 

Current Affairs

2024లో ‘నోటా’కు అతితక్కువ ఓట్లు

ఓటరు తానెవరికీ ఓటేయడం లేదని ఈవీఎం ద్వారా తెలియజేసేందుకు వీలు కల్పించిన ‘నోటా’ ఐచ్ఛికానికి 2024 లోక్‌సభ ఎన్నికలో అతితక్కువ ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.   ఈవీఎంలలో ‘నోటా’ను 2013లో ప్రవేశపెట్టారు. 2014 సాధారణ ఎన్నికల్లో నోటాకు మొత్తం పోలైన ఓట్లలో 1.08 శాతం లభించగా 2024 ఎన్నికల్లో కేవలం 0.99 శాతం లభించాయి.  బిహార్‌లో గత ఎన్నికల్లో అత్యధికంగా 2.07 శాతం ఓట్లు ‘నోటా’కు పడ్డాయి. దాద్రా నగర్‌ హవేలి, దమన్‌ అండ్‌ దీవ్‌లో 2.06 శాతం, గుజరాత్‌లో 1.58 శాతం ఓట్లు పోలయ్యాయి. నాగాలాండ్‌లో 0.21 శాతం ఓట్లు ‘నోటా’ ఐచ్ఛికానికి పోలయ్యాయి.

Current Affairs

జననీమిత్ర యాప్‌

గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ఏఐ సాయంతో ‘జననీ మిత్ర యాప్‌’ను 2025, ఫిబ్రవరి 14న అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లా కూడేరు పీహెచ్‌సీ పరిధిలో స్వస్తి అనే సంస్థతో కలిసి ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలు యాప్‌ను వినియోగించడం వల్ల రోజూ వారు తినే ఆహారంతోపాటు ఆరోగ్య సంబంధ విషయాలను పరిశీలించుకోవచ్చు.

Current Affairs

ట్రంప్‌తో మోదీ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఫిబ్రవరి 14న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా శత్రుభీకరమైన ఎఫ్‌-35 యుద్ధవిమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. అమెరికా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోళ్లను పెంచడంతోపాటు 26/11 ముంబయి ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వూర్‌ రాణాను భారత్‌కు అప్పగించడం లాంటి పలు నిర్ణయాలు వెలువడ్డాయి.  ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా 50 వేలకోట్ల డాలర్లకు పెంచుకునేలా మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో కుదుర్చుకుంటామని రెండు దేశాలూ ప్రకటించాయి.

Walkins

సిరిసిల్ల కేంద్రియ విద్యాలయంలో పోస్టులు

తెలంగాణలోని కేంద్రియ విద్యాలయం సిరిసిల్ల (కేవీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: 1. ప్రైమరీ టీచర్‌(పీఆర్‌టీ) 2. టీజీటీ(ఇంగ్లీష్‌, సాన్‌స్క్రిట్, ఎస్‌ఎస్‌టీ, హిందీ, సైన్స్‌, మాథ్స్‌,) 3. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, బీఈ, ఎంఎస్సీ(సీఎస్‌), ఎంసీఏ, బీఎస్సీ(సీఎస్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 19 ఫిబ్రవరి 2025 Website:https://sircilla.kvs.ac.in/

Walkins

ఐఐపీఎస్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొల్యూషన్‌ సైన్స్‌ (ఐఐపీఎస్‌) కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: 1. మ్యాపర్స్‌ (మేల్): 04 2. లిస్టర్స్‌ (ఫిమేల్): 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(జాగ్రఫి, సోషల్ సైన్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: రోజుకు రూ.1375.  ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్(టీజీఐఆర్‌డీ), రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-500030. ఇంటర్వ్యూ తేదీ: 17 ఫిబ్రవరి 2025 Website:https://www.iipsindia.ac.in/recruitment/job/list/archive-list

Walkins

సీఎస్ఐఆర్‌-సీఈసీఆర్‌ఐలో పోస్టులు

తమిళనాడులోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్ఐఆర్‌-సీఈసీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 17 వివరాలు: 1. సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్: 02 2. ప్రాజెక్టు అసోసియేట్‌-2: 05 3. ప్రాజెక్టు అసోసియేట్-1: 07 4. ప్రాజెక్టు అసిస్టెంట్‌-2: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఈసీఈ, మెకానికల్, మెథాట్రోనిక్స్‌), బీఈ, బీటెక్‌(మెకానికల్, ఈసీఈ, ఈఐఈ), ఎంఎస్సీ(ఆర్గానిక్‌ కెమిస్ట్రీ), పీహెచ్‌డీ(ఫిజిక్స్‌, కెమికల్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్టు అసోసియేట్‌కు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు. జీతం: నెలకు సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.42,000, ప్రాజెక్టు అసోసియేట్-2కు రూ.35,000, ప్రాజెక్టు అసోసియేట్-1కు రూ.31,000, ప్రాజెక్టు అసిస్టెంట్‌కు రూ.20,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 04-03-2025. వేదిక: సీఎస్ఐఆర్‌-సీఈసీఆర్‌ఐ, చెన్నై యూనిట్‌, తరమణి. Website:https://www.cecri.res.in/Opportunities.aspx  

Government Jobs

టీఎంసీ-ఏసీటీఆర్‌ఈసీలో పోస్టులు

ముంబయిలోని టీఎంసీ- అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌, రీసెర్చ్‌ అండ్ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్‌ (టీఎంసీ-ఏసీటీఆర్‌ఈసీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 28 వివరాలు: 1. సైంటిఫిక్‌ ఆఫీసర్‌(హెల్త్‌ ఎకనామిక్స్‌): 01 2. సైంటిఫిక్‌ ఆఫీసర్‌( క్యాన్సర్‌ సైటోజెనిటిక్‌ ల్యాబ్‌): 01 3. మెడికల్ ఫిజిసిస్ట్‌: 03 4. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-3: 01 5. చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌: 01 6. నర్స్‌: 08 7. సైంటిఫిక్‌ అసిస్టెంట్: 02 8. స్టెనోగ్రాఫర్‌: 01 9. టెక్నీషియన్‌(సీఆర్‌ఐ ల్యాబ్స్‌): 07 10. టెక్నీషియన్‌( ఫోటోగ్రఫీ): 01 11. టెక్నీషియన్‌(కార్పెంటర్‌): 01 12. ఎల్‌డీసీ: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ(బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, లైఫ్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ, అనలిటికల్ కెమిస్ట్రి, బయోఫిసిక్స్‌, బోటని, జువాలజీ), బిఎస్సీ నర్సింగ్‌, పీజీ(హ్యూమన్‌ రీసోర్స్‌, ఫిజిక్స్‌), పీహెచ్‌డీ(హెల్త్ ఎకనామిక్స్‌), ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు సైంటిఫిక్‌ ఆఫీసర్‌కు రూ.78,800, మెడికల్ ఫిజిసిస్ట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌కు రూ.67,700, నర్స్‌కు రూ.44,900, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు రూ.35,400, స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500, టెక్నీషియన్‌, ఎల్‌డీసీ పోస్టులకు రూ.19900 వయోపరిమితి: 13-03-2025 తేదీ నాటికి సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 45 ఏళ్లు, మెడికల్ ఫిజిసిస్ట్‌కు 40 ఏళ్లు, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు 55 ఏళ్లు, నర్స్‌, సెంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, స్టెనోగ్రాఫర్‌, టెక్నీషియన్‌, ఎల్‌డీసీకీ 27 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 13.3.2025 Website:https://actrec.gov.in/jobs