దిల్నా, రూప
అత్యంత శీతల ప్రదేశంగా పేరుగాంచిన కేప్ హార్న్ సముద్రాన్ని దాటి భారత నౌకాదళ మహిళా సాహస యాత్రికులు దిల్నా, రూప చరిత్ర సృష్టించినట్లు నేవీ వర్గాలు 2025, ఫిబ్రవరి 15న తెలిపాయి. భారత నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్లు అయిన వారు ‘ఐఎన్ఎస్ తరణి’ నౌకలో ‘నావికా సాగర్ పరిక్రమ-2’కు 2024లో శ్రీకారం చుట్టారు. వీరి యాత్ర దక్షిణ అమెరికాను చేరుకునే క్రమంలో గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ 5 మీటర్ల మేర అలలు ఎగసిపడినా ధైర్యసాహసాలు ప్రదర్శించారు. కేప్ హార్న్ అనేది అంటార్కిటికాకు 800 కి.మీ. దూరంలో ఉంది.