Posts

Current Affairs

INSV Tarini past Cape Horn

Lieutenant Commander Dilna K and Lieutenant Commander Rupa A of the Indian Navy have achieved a historic milestone by sailing INSV Tarini past Cape Horn, the southernmost tip of South America, during the third phase of the ‘Sagar Parikrama II’ expedition.  ♦ Cape Horn is situated just over 800 kilometres (432 nautical miles) from Antarctica, making it one of the closest land points to the icy continent.  ♦ In 2024, Chief of the Naval Staff of India, Admiral Dinesh Kumar Tripathi, flagged off INSV Tarini for Navika Sagar Parikrama II expedition at Ocean Sailing Node, INS Mandovi, Goa.

Current Affairs

ఒమన్‌ విదేశాంగమంత్రితో జైశంకర్‌ భేటీ

వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఒమన్‌ విదేశాంగమంత్రి బద్ర్‌ అల్‌బుసైదీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ 2025, ఫిబ్రవరి 16న విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాల 8వ సదస్సుకు హాజరుకావడానికి ఒమన్‌ రాజధానికి వచ్చిన జైశంకర్‌.. బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు సహా పలు దేశాల విదేశాంగమంత్రులతోనూ భేటీ అయ్యారు.  ఒమన్‌-భారత్‌ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లైన సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేక లోగోను విడుదల చేశారు. 

Current Affairs

భారత్‌ టెక్స్‌ 2025

‘భారత్‌ టెక్స్‌ 2025’ కార్యక్రమంలో 2025, ఫిబ్రవరి 16న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రపంచంలో టెక్స్‌టైల్స్‌ ఎగుమతుల్లో భారత్‌ 6వ స్థానంలో ఉన్నట్లు, 2024-25లో రూ.3 లక్షల కోట్ల టెక్స్‌టైల్‌ ఎగుమతులు చేసినట్లు మోదీ తెలిపారు. టెక్స్‌టైల్‌ రంగం 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతులే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.  2025-26 కేంద్ర బడ్జెట్‌లో రూ.5,272 కోట్ల (బడ్జెట్‌ అంచనాలు) నిధులను టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్‌ అంచనా రూ.4,417.03 కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. 

Current Affairs

దేశంలో నమోదైన డ్రోన్లు 29,501

దేశంలో 29,501 డ్రోన్లు (నమోదైనవి) ఉన్నాయని పార్లమెంట్‌లో పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్‌ మొహోల్‌ వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా దిల్లీలో 4,882 డ్రోన్లు, తమిళనాడులో 4,588, మహారాష్ట్రలో 4,132 ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత హరియాణాలో 3,689, కర్ణాటకలో 2,516, తెలంగాణలో 1,928, గుజరాత్‌లో 1,338, కేరళలో 1,318 డ్రోన్లు ఉన్నాయని పేర్కొన్నారు.

Current Affairs

వినోద్‌కుమార్‌ చౌధరి

దిల్లీలోని కిరాడీ ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్‌ చౌధరి (44) మొబైల్‌ ఫోను కీబోర్డుపై ముక్కుతో 108 ఆంగ్ల క్యారెక్టర్లను 1.18 నిమిషాల్లో టైప్‌ చేసి, 21వ సారి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ విజేతగా నిలిచారు. ఈ ప్రయత్నంలో 19 గిన్నిస్‌ రికార్డులను కలిగి ఉన్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రపంచ రికార్డును అధిగమించారు.  వినోద్‌కుమార్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఈయన కంప్యూటర్‌ ఆపరేటరుగా పనిచేస్తున్నారు. ఈయన్ను ‘టైపింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు.  2014లో తొలిసారిగా గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించిన వినోద్‌ ముక్కుతో వేగంగా టైపింగు చేయడం, కళ్లకు గంతలు కట్టుకొని టైప్‌ చేయడం, మౌత్‌ స్టిక్‌తో టైప్‌ చేయడం ఇలా వివిధ విన్యాసాలతో 11 ఏళ్లలో 21 సార్లు గిన్నిస్‌ రికార్డును సృష్టించారు.

Current Affairs

పెద్దకుర్మపల్లి రైతుకు జాతీయ పురస్కారం

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన రైతు మావురం మల్లికార్జున్‌రెడ్డికి జాతీయ పురస్కారం లభించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా ఉత్తమ రైతులను ఎంపిక చేసి ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) ఫెలో ఫార్మర్, ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ విభాగాల్లో పురస్కారాలు అందిస్తుంది. ఈ ఏడాది (2025) ఫెలో ఫార్మర్‌ పురస్కార విభాగంలో ఆరుగురు రైతులను ఎంపిక చేయగా, అందులో దక్షిణ భారతదేశం నుంచి మల్లికార్జున్‌రెడ్డి మాత్రమే ఉన్నారు.

Current Affairs

మెటా సముద్రగర్భ కేబుల్‌

ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్‌ అయిన ‘ప్రాజెక్ట్‌ వాటర్‌వర్త్‌’కు భారత్‌నూ అనుసంధానం చేయనున్నామని సామాజిక మాధ్యమం మెటా 2025, ఫిబ్రవరి 15న తెలిపింది. మెటా ఆధ్వర్యంలో సాగుతున్న ఈ కేబుల్‌ ద్వారా కార్యకలాపాలు, ఈ దశాబ్దం చివరకు ప్రారంభమవుతాయని అంచనా.  ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలను కలిపే ఈ కేబుల్‌ పొడవు 50,000 కి.మీ.కు పైగా విస్తరించి ఉంటుంది. ఇది భూమి చుట్టుకొలత (40,075 కి.మీ) కంటే ఎక్కువ. ఈ కేబుల్‌కు నౌకల లంగర్లు, ఇతర ప్రమాదాల వల్ల ఇబ్బంది లేకుండా అధునాతన సాంకేతికత వినియోగించి 7,000 మీటర్ల వరకు లోతులో బలంగా వేస్తున్నారు.

Current Affairs

జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌

క్వాంటమ్‌ కమ్యూనికేషన్లకు ఉపయోగపడే జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌ను ఖరగ్‌పుర్‌ ఐఐటీ పరిశోధకులు రూపొందించారు. ఈ లేజర్‌ నానో స్థాయి సూక్ష్మ లేజర్‌ టెక్నాలజీని విప్లవీకరిస్తుంది. కాంతి కిరణం పాదార్థిక అణువులను ఢీకొన్నప్పుడు చెల్లాచెదురవుతుంది. ఆ క్రమంలో అణువుల శక్తిలో మార్పు వస్తుంది. దీన్నే రామన్‌ శ్కాటరింగ్‌ లేదా రామన్‌ ఎఫెక్ట్‌ అంటారు.  జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌ క్వాంటమ్‌ కాంతి పౌనఃపున్యాన్ని మార్చేస్తూనే క్వాంటమ్‌ స్వభావానికి భంగం కలగకుండా చూస్తుంది. ఈ లక్షణం క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ సాంకేతికతలకు ఎంతో ఉపకరిస్తుంది. 

Current Affairs

జాతీయ కోచ్‌గా జస్పాల్‌ రాణా

దిగ్గజ షూటర్‌ జస్పాల్‌ రాణాను 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో హై పర్ఫార్మెన్స్‌ కోచ్‌గా నియమిస్తూ 2025, ఫిబ్రవరి 15న జాతీయ రైఫిల్‌ సంఘం నిర్ణయం తీసుకుంది. స్టార్‌ షూటర్‌ జీతు రాయ్‌కి 10 మీటర్ల విభాగంలో కోచింగ్‌ బాధ్యతలు అప్పగించింది.  2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన జస్పాల్‌ గతంలో జాతీయ జూనియర్‌ కోచ్‌గా వ్యవహరించాడు.

Current Affairs

గుల్వీర్‌ సింగ్‌

ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, భారత స్టార్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌ 16 ఏళ్ల జాతీయ రికార్డును తిరగరాశాడు. 2025, ఫిబ్రరి 15న బోస్టన్‌లో జరిగిన 3000 మీటర్ల ఇండోర్‌ రేసును 7 నిమిషాల 38.26 సెకన్లలో ముగించాడు. ఈ విభాగంలో సురేందర్‌ సింగ్‌ (2008లో  7 నిమిషాల 49.47 సెకన్లు) పేరిట ఉన్న రికార్డును మెరుగుపరిచాడు.  కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన గుల్వీర్‌ రేసును రెండో స్థానంలో ముగించాడు.