Posts

Current Affairs

దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 8,000

దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 8వేల పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. ఈ తరహా పాఠశాలలున్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో పశ్చిమ బెంగాల్, తర్వాతి స్థానాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్‌ ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఒక్క విద్యార్థీ చేరని ఈ పాఠశాలల్లో 20,187 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో విద్యార్థులు చేరని స్కూళ్లు 3,812 ఉండగా.. వాటిలో 17,965 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. తెలంగాణలో 2,245 విద్యాలయాల్లో 1,016 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

Current Affairs

ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సు

ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) వార్షిక సర్వసభ్య సమావేశాలు 2025, అక్టోబరు 26న కౌలాలంపూర్‌లో ప్రారంభమయ్యాయి. కూటమి భాగస్వామ్య దేశాలైన భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలు పాల్గొన్నాయి. ఆసియాన్‌లో నూతన (11వ) సభ్యదేశంగా తూర్పు తైమూర్‌ ఈ సదస్సులో లాంఛనప్రాయంగా చేరింది. 1990ల తర్వాత ఆసియాన్‌ తొలి విస్తరణ ఇదే. తూర్పు తైమూర్‌ను తైమూర్‌ లెస్ట్‌గానూ పిలుస్తుంటారు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సమగ్రత, సముద్ర వివాదాలు, అమెరికా సుంకాలు, మారుతున్న భౌగోళిక-వాణిజ్య పద్ధతులు తదితర అంశాలపై ఈ శిఖరాగ్ర సదస్సులో చర్చిస్తారు. 

Current Affairs

థాయ్‌లాండ్‌ ‘క్వీన్‌ మదర్‌’ కన్నుమూత

సంప్రదాయ చేతి వృత్తులు, అడవులను రక్షించేందుకు కృషిచేసిన థాయ్‌లాండ్‌ ‘క్వీన్‌ మదర్‌’ సిరికిట్‌ కిటియాకర (93) 2025, అక్టోబరు 25న బ్యాంకాక్‌లో మరణించారు. సిరికిట్‌ పుట్టినరోజును థాయ్‌లాండ్‌ ప్రజలు మాతృదినోత్సవంగా జరుపుకొంటారు. 1932, ఆగస్టు 12న ఓ ధనిక కుటుంబంలో సిరికిట్‌ జన్మించారు. 1950లో ఆమె అప్పటి రాజు భూమీబల్‌ అదుల్యతేజ్‌ను వివాహమాడారు. వీరికి ప్రస్తుత థాయ్‌లాండ్‌ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్‌ సహా నలుగురు సంతానం.  అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లను కాపాడేందుకు వన్యప్రాణుల పెంపక కేంద్రాలు, బహిరంగ జంతుప్రదర్శనశాలలను ఏర్పాటుచేసిన సిరికిట్‌ను గ్రీన్‌ క్వీన్‌గా పిలుస్తారు. 

Current Affairs

డబ్ల్యూఈవో నివేదిక

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తన వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈవో) నివేదికలో 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది. అంతేకాక భారత్‌ అత్యంత వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది. ఇదే కాలంలో చైనా 4.8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని పేర్కొంది.  అయితే, 2026లో భారత వృద్ధి రేటు 6.2 శాతానికి తగ్గవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 

Current Affairs

విజ్ఞాన్‌రత్న

దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన్‌రత్న అవార్డుకు సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్‌ నార్లీకర్‌ 2025, అక్టోబరు 25న ఎంపికయ్యారు. ఆయనకు మరణానంతరం ఈ అవార్డు లభించింది. విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన ‘బిగ్‌ బ్యాంగ్‌’ సిద్ధాంతాన్ని నార్లీకర్‌ తోసిపుచ్చారు. విశ్వం యావత్తూ ఒకే ఘడియలో పెను విస్ఫోటంతో ఆవిర్భవించినట్లు ‘బిగ్‌ బ్యాంగ్‌’ సిద్ధాంతం చెబుతుండగా, విశ్వం ఆద్యంతాలు లేనిదని నార్లీకర్‌ ప్రతిపాదించారు. అనంతమైన ఈ విశ్వంలో పదార్థం నిరంతరం ఏర్పడుతూనే ఉందని ఆయన వాదన. బ్రిటిష్‌ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్‌ హోయల్‌ ఇదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విజ్ఞాన శాస్త్రంలో శిఖరస్థాయికి చేరిన నార్లీకర్‌ 86 ఏళ్ల వయసులో ఈ ఏడాది మే 20న మరణించారు. 

Walkins

ఎన్‌ఐఎస్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎన్‌ఐఎస్‌) ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు:  ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 07 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.30,000.  వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. వేదిక: సీఎస్‌ఐఆర్‌- ఎన్‌ఐఐఎస్‌టీ, తిరువనంతపురం. ఇంటర్వ్యూ తేదీలు: 30.10.2025.  Website:https://iisc.ac.in/careers/contractual-positions/

Government Jobs

ఓఎన్‌జీసీలో జూనియర్ ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఆయిల్ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ దిల్లీ (ఓఎన్‌జీసీ) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ సివిల్ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌, జూనియర్‌ సివిల్ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 03  వివరాలు: 1. సీనియర్ సివిల్‌ స్ట్రక్చరల్ ఇంజినీర్‌: 01 2. జూనియర్ సివిల్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌: 02 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 నవంబర్‌ 5వ తేదీ నాటికి సీనియర్ ఇంజినీర్‌కు 50 ఏళ్లు, జూనియర్‌ ఇంజినీర్‌కు 40 ఏళ్లు ఉండాలి. వేతనం: సంవత్సరానికి సీనియర్‌ ఇంజినీర్‌కు రూ.60,00,000,  జూనియర్ ఇంజినీర్‌కు రూ.40,00,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ: 2025 నవంబర్‌ 5. Website:https://ongcindia.com/web/eng/career/recruitment-notice

Government Jobs

ఐఐటీ మద్రాస్‌లో రిసెర్చ్‌ అసోసియేట్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  మద్రాస్ (ఐఐటీ మద్రాస్‌), తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్‌ అసోసియేట్ ఉద్యోగాల  భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: రిసెర్చ్‌ అసోసియేట్  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ /పీజీ(ఎనర్జీ, కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్)లో ఉత్తీర్ణత ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: 07/11/2025 Website:https://icsrstaff.iitm.ac.in/careers/current_openings.php

Government Jobs

ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్ దిల్లీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో నుంచి టెన్త్‌, డిప్లొమా/ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్లు.  జీతం: నెలకు రూ.18,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా biochemistry4007@gmail.com కు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ: 08.11.2025,   Website:https://www.aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment

Admissions

ఎన్‌ఐపీహెచ్‌ఎంలో డిప్లొమా ప్రవేశాలు

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖకు చెందిన హైదారాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) 2025-26 విద్యాసంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ)తో కలిసి ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ రంగంలో 2025-26 సంవత్సరానికి డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (PGDPHM)  వ్యవధి: 12 నెలలు డిప్లొమా ఇన్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (DPHM)  వ్యవధి: 6 నెలలు మొత్తం సీట్లు: 30. అర్హత: సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఇన్ అగ్రికల్చర్‌ ఉత్తీర్ణత. దరఖాస్తు ఫీజు: రూ.200. ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఆన్‌లైన్‌ పరీక్ష తదితరాల ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 31.10.2025. Website:https://niphm.gov.in/pgdphm/index.html