డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ తూర్పు గోదావరి జిల్లాలో మల్టీ పర్సస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
తూర్పు గోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమం & సాధికారత కార్యాలయం (డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ) ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 04 వివరాలు: 1. సైకో-సోషల్ కౌన్సిలర్ (మహిళలు) - 01 2. కేస్ వర్కర్ (మహిళలు) - 01 3. మల్టీ-పర్పస్ అసిస్టెంట్ - 02 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిస్లొమా, డిగ్రీ (సైకాలజీ / సైకియాట్రీ / న్యూరోసైన్సెస్లో / లా / సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్స్ / సైకాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల నుంచి 42 ఏళ్లు మించకూడదు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు . సైకో-సోషల్ కౌన్సిలర్ కు రూ.20,000. కేస్ వర్కర్ కు రూ.19,500.మల్టీ-పర్పస్ అసిస్టెంట్ కు రూ.13,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ ద్వారా. చిరునామా: పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ను, విద్యార్హతల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవపత్రం మొదలైన వాటితో పాటు డీౠ్ల్యసీడౠ్ల్యఈ తూర్సు గోదావరి జిల్లా మహిళా ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరుకి సమర్పించాలి. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్ 7. Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/