రాష్ట్ర సూక్ష్మజీవి
కేరళ ప్రభుత్వం బ్యాసిలస్ సబ్టిలస్ అనే బ్యాక్టీరియంను ‘రాష్ట్ర సూక్ష్మజీవి’గా ప్రకటించింది. మంచి సూక్ష్మజీవులపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ చర్యను చేపట్టింది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో సూక్ష్మజీవుల పాత్రపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వాటి ఫలితాలను సమాజహితానికి అందుబాటులోకి తీసుకురావడానికి ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ మైక్రోబయోమ్’ను కూడా ప్రారంభించింది. భారత్కు ఇప్పటికే ల్యాక్టోబ్యాసిలస్ బల్గేరికస్ను జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించింది. ఒక రాష్ట్రం కూడా ఆ బాటలో పయనించడం ఇదే మొదటిసారి.