Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

Sunetra Pawar

♦ Sunetra Pawar was sworn in as the first woman deputy chief minister of Maharashtra on 31 January 2026. She replaced her husband Ajit Pawar just three days after his death in an air crash. ♦ Sunetra Pawar has been given charge of excise duty, sports and youth welfare, and minorities development. Finance and planning, the portfolios handled by her husband, will be handled by Chief Minister Devendra Fadnavis. ♦ She was unanimously elected as the NCP Legislature Party leader.

Current Affairs

Elena Rybakina (Kazakhstan)

♦ Elena Rybakina (Kazakhstan) won the Australian Open 2026 women's singles title on 31 January 2026. She defeated top-ranked Aryna Sabalenka with 6-4, 4-6, 6-4 in the final. This becomes Rybakina's first Australian Open crown, and the second Grand Slam of her career. For Sabalenka, it is a second successive Australian Open final defeat. ♦ With this win Rybakina get prize money of $4,150,000 or Rs.38,04,82,582. Runners-up Sabalenka took home $2,150,000 or Rs 19,71,17,482.

Current Affairs

Ramsar Sites

♦ Chhari Dhand in Gujarat and Patna Bird Sanctuary in Uttar Pradesh have been recognised as Ramsar sites. This was confirmed by the official handle of the Ministry of Environment, Forest and Climate Change, Government of India on 31 January 2026. The designation of these two sites under the Ramsar Convention takes the total number of such wetlands in India to 98.  ♦ India’s Ramsar network has grown by over 276%—from 26 sites in 2014 to 98 today (as on 31 JAnuary 2026). ♦ The Ramsar Convention, also referred to as the Convention on Wetlands of International Importance Especially as Waterfowl Habitat, is an international treaty on the conservation of wetlands and their sustainable use. The convention was adopted in 1971 in Ramsar, Iran. India signed the Ramsar Convention in 1982.

Current Affairs

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం

జీవుల మనుగడకు, పర్యావరణ సమతౌల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. శీతోష్ణస్థితి, వరదల నియంత్రణ, నీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో ఇవి ఉన్నాయి. చిత్తడి నేలలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి, నీటిని శుభ్రపరుస్తాయి, వరదలను నివారిస్తాయి, అనేక రకాల మొక్కలు - జంతువులకు ఆవాసాలుగా ఉంటాయి. ప్రాణికోటికి ఎంతో ఉపయోగకరమైన ఈ నేలలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. చిత్తడి నేలల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 2న ‘ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం’గా (World Wetlands Day) నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణలో ఈ నేలల పాత్ర గురించి ప్రజలకు తెలియజేయడంతోపాటు వీటిని కాపాడుకోవడం ఎంత ఆవశ్యకమో చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రామ్‌సర్‌ పట్టణంలో ఒక సదస్సు నిర్వహించారు. ఇందులో భారత్‌ సహా 164 దేశాలు చిత్తడి నేలల పరిరక్షణకు సూచించిన ఉమ్మడి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సమావేశానికి గుర్తుగా 1997, ఫిబ్రవరి 2న మొదటిసారి ‘ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని’ జరిపారు. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. 

Current Affairs

క్రాఫోర్డ్‌ ప్రైజ్‌

భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్‌ రామనాథన్‌(82)ను భూ విజ్ఞానశాస్త్రంలో నోబెల్‌గా భావించే క్రాఫోర్డ్‌ ప్రైజ్‌ వరించింది. కాలుష్య మేఘాలు, క్లోరోఫ్లోరో కార్బన్‌ (సీఎఫ్‌సీ)ల వంటి సూపర్‌ పొల్యూటెంట్లపై దశాబ్దాల పాటు చేసిన పరిశోధనకు ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది.  రామనాథన్‌ ‘నాసా’కు పనిచేస్తున్న సమయంలో కార్బన్‌డయాక్సైడ్‌ కంటే ఫ్రిడ్జ్‌లు, ఏరోసోల్స్‌లో ఉపయోగించే సీఎఫ్‌సీలే 10 వేల రెట్లు ఎక్కువగా భూ వాతావరణంలో ఉష్ణాన్ని పట్టి ఉంచుతాయని కనుగొన్నారు. దీంతో గ్లోబల్‌ వార్మింగ్‌కు కార్బన్‌ డయాక్సైడే ప్రధాన కారణమని అప్పటి వరకూ ఉన్న భావనను ఆయన సమూలంగా మార్చేసినట్లయింది. 

Current Affairs

దలైలామాకు గ్రామీ అవార్డు

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్‌: ద రిఫ్లెక్షన్స్‌ ఆఫ్‌ హిస్‌ హోలీనెస్‌ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది. 90 ఏళ్ల టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు అయిన దలైలామాకు గోల్డెన్‌ గ్రామోఫోన్‌ దక్కడం ఇదే తొలిసారి. 2026, ఫిబ్రవరి 2న లాస్‌ ఏంజెలెస్‌లోని క్రిప్టోడాట్‌కామ్‌ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 90 కేటగిరీలో అవార్డులను ప్రకటించారు.  దలైలామా తరఫున గాయకుడు రఫూస్‌ వెయిన్‌రైట్‌ అవార్డును స్వీకరించారు. 

Current Affairs

రాష్ట్ర సూక్ష్మజీవి

కేరళ ప్రభుత్వం బ్యాసిలస్‌ సబ్టిలస్‌ అనే బ్యాక్టీరియంను ‘రాష్ట్ర సూక్ష్మజీవి’గా ప్రకటించింది. మంచి సూక్ష్మజీవులపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ చర్యను చేపట్టింది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో సూక్ష్మజీవుల పాత్రపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వాటి ఫలితాలను సమాజహితానికి అందుబాటులోకి తీసుకురావడానికి ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మైక్రోబయోమ్‌’ను కూడా ప్రారంభించింది. భారత్‌కు ఇప్పటికే ల్యాక్టోబ్యాసిలస్‌ బల్గేరికస్‌ను జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించింది. ఒక రాష్ట్రం కూడా  ఆ బాటలో పయనించడం ఇదే మొదటిసారి. 

Current Affairs

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌ నియమితులయ్యారు. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి.. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌ వేటు వేశారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్‌ చేయగా, ఉపాధ్యక్షుడు దల్జీత్‌సింగ్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Current Affairs

క్యాన్సర్‌ అట్లాస్‌

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులను గుర్తించేందుకు ప్రత్యేకంగా అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) 4.0 సర్వే చేపడుతున్న ప్రభుత్వం.. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్‌ అట్లాస్‌ను రూపొందించింది. క్యాన్సర్‌ను నోటిఫై వ్యాధిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా రూపొందించిన అట్లాస్‌ ద్వారా ఎక్కడికక్కడ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రాధాన్య అంశాలు నిర్దేశించుకుంది.  క్యాన్సర్‌ అట్లాస్‌లో పేర్కొన్న గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యాధి పీడితులు ఉన్నారు. అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలో (8,101) ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో (1,495) ఉన్నాయి. పీడితుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు. 50-59 ఏళ్ల వయసు వారు అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

Current Affairs

‘బ్యాగేజీ నిబంధనలు 2026’

2016 నాటి పాత నిబంధనల స్థానంలో, రూపొందించిన ‘బ్యాగేజీ నిబంధనలు 2026’ 2026, ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. దీని ప్రకారం, విదేశాల నుంచి విమానం లేదా సముద్ర మార్గాల్లో మనదేశానికి వచ్చే మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు. అయితే వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ, తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా కావచ్చు. ఈ ఆభరణాలు కచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలి. బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఈ మినహాయింపు లభించదు. ఇప్పటివరకు మహిళలు రూ.లక్ష, పురుషులు రూ.50 వేల విలువైన ఆభరణాలే ఇలా తెచ్చుకోవచ్చు.