Posts

Current Affairs

India's pharmaceutical exports reached over 30 billion dollar

♦ According to official trade data, India's pharmaceutical exports reached over 30 billion dollar in Financial Year 2024-25, marking an increase of over 9 percent compared to nearly 27.5 billion dollar in Financial Year 2023-24. The United States remaining a key market, accounting for more than one-third of the country’s total pharma exports.   ♦ In March 2025, pharma exports registered a year-on-year surge of over 30 percent, rising to 3,681 million dollar from 2,806 million dollar in the same month of the previous fiscal year. ♦ The exports to the United States, in value terms, recorded a growth of over 14 percent in Financial Year 2024-25. Other countries on top of India’s pharma exports were the UK, Brazil, France and South Africa last fiscal.

Current Affairs

ISRO has developed an alternative for the imported Columbium material

♦ ISRO has developed an alternative for the imported Columbium material used for the nozzle divergent in the fourth stage of the PSLV launch vehicle. It has indigenously developed the nozzle divergent made of Stellite. This alternate material is a cobalt-based alloy with additions of Chromium, Nickel, Tungsten and Iron.  ♦ The tests conducted on the Stellite made nozzle divergent has proved that it can retain strength at high temperatures up to 1150 degree Celsius. ♦ The test was conducted at the ISRO Propulsion Complex in Mahendragiri in Tamil Nadu. The use of Stellite nozzle divergent in PSLV will save ISRO 90 percent of the cost incurred on imported Columbium. 

Walkins

రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్ని్కల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. సీనియర్‌ రెసిడెంట్‌ ఇంజినీర్‌/ ఎస్‌ అండ్‌ టీ- 01 2. సీనియర్‌ రెసిడెంట్‌ ఇంజినీర్‌/ ఎలక్ట్రికల్‌-జనరల్‌ సర్వీస్‌- 01 3. ప్లానింగ్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఇంజినీర్‌- 02 4. సెక్షన్‌ ఇంజినీర్‌/ సివిల్‌- 01 5. డ్రాయింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ ఇంజినీర్‌/ ఎస్‌ అండ్‌ టీ- 01 6. డ్రాయింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ ఇంజినీర్‌/ ఎలక్ట్రికల్‌- 01 7. సెక్షన్‌ ఇంజినీర్‌- ఎలక్ట్రికల్‌- 02 8. క్యూఎస్‌ అండ్‌ బిల్లింగ్‌ ఇంజినీర్‌- 01 9. డిజైన్‌ ఇంజినీర్‌/ సివిల్‌- 01  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 55 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 28.04.2025- 30.04.2025. వేదిక: రైట్స్‌ లిమిటెడ్‌, షికర్‌, ప్లాట్‌ 1, లీజర్‌ వ్యాలీ, రైట్స్‌ భవన్‌, ఐఎఫ్‌ఎఫ్‌సీఓ చౌక్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర, గుడ్‌గావ్‌, హరియాణా. Website: https://rites.com/Career

Government Jobs

డీఆర్‌డీవోలో సైంటిస్ట్‌ పోస్టులు

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 21 వివరాలు: 1. సైంటిస్ట్‌-ఎఫ్‌: 01 2. సైంటిస్ట్‌-ఈ: 04 3. సైంటిస్ట్‌-డి: 04 4. సైంటిస్ట్‌-సి: 12 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సైంటిస్ట్‌-సి పోస్టులకు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 50 ఏళ్లు. జీతం: నెలకు సైంటిస్ట్‌(సి, డి, ఈ, ఎఫ్‌) పోస్టులకు రూ.67,700, రూ.78,800, రూ.1,23,100, రూ.1,31,100. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 9. Website: https://rac.gov.in/index.php?lang=en&id=0

Current Affairs

కల్పకం

భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్‌ ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ (పి.ఎఫ్‌.బి.ఆర్‌) తమిళనాడులోని కల్పకం అణు కేంద్రంలో 2026, సెప్టెంబరు నుంచి పని ప్రారంభించనుంది. భారత్‌ చేపట్టిన మూడంచెల అణు విద్యుదుత్పాదన కార్యక్రమంలో పి.ఎఫ్‌.బి.ఆర్‌ రెండో అంచె కిందకు వస్తుంది. దీనిలో వాడిన అణు ఇంధనం మూడో అంచెలో థోరియం అధారిత అణు కేంద్రాలకు చోదక శక్తిగా పని చేస్తుంది. * మొదటి అంచెలోని ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్లు సహజ యురేనియంను ఇంధనంగా వాడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే ప్లుటోనియం ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్లకు (ఎఫ్‌.బి.ఆర్‌) ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఆ ఇంధనం నుంచి మళ్లీ యురేనియం, థోరియం ఉత్పన్నమవుతాయి. చివరకు థోరియం ఆధారిత అధునాతన అణు రియాక్టర్లు విద్యుదుత్పాదన సాగిస్తాయి.

Government Jobs

ఏఎఫ్‌ఎంఎస్‌లో మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు

దిల్లీలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్ సర్వీసెస్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌) మెడికల్ ఆఫీసర్‌ పోస్టల  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 400 వివరాలు: 1. మెడికల్ ఆఫీసర్‌(మేల్‌): 300 2. మెడికల్ ఆఫీసర్‌(ఫీమేల్‌): 100 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు జాతీయ వైద్య కమిషన్ చట్టం-2019 ప్రకారం వైద్య అర్హతను కలిగి ఉండాలి. ఏదైనా రాష్ట్ర వైద్య మండలి/ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. రాష్ట్ర వైద్య మండలి ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ ద్వారా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: 32 ఏళ్లు. దరఖాస్తు ఫీజు: 200. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 12. Website: https://join.afms.gov.in/

Current Affairs

సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు

మన దేశం నుంచి సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు 2024-25లో 665.96 మిలియన్‌ డాలర్ల (రూ.5,700 కోట్ల)కు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023-24లో ఎగుమతి చేసిన 494.8 మి.డాలర్ల (సుమారు రూ.4,200 కోట్ల) ఉత్పత్తులతో పోలిస్తే ఇవి 34.6% ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన పప్పుధాన్యాలు, వంటనూనె, తాజా ఫలాలు, కూరగాయలకు గిరాకీ పెరగడమే ఇందుకు కారణం. పరిమాణం పరంగా చూస్తే ఎగుమతులు 4% పెరిగి 3,68,155 టన్నులకు చేరాయి.

Admissions

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌)-పీజీ 2025

న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ(పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌)లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2025 పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  వివరాలు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌)-పీజీ 2025 అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ/ ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. పరీక్ష రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2500. పరీక్షా విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, అమలాపురం, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, మచిలీపట్నం, నెల్లూరు, నరసరావుపేట, నంద్యాల, తాడిపత్రి, రాజమండ్రి, పుత్తూరు, ప్రొద్దుటూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 07-05-2025. దరఖాస్తు సవరణ తేదీలు: మే 9 నుంచి 13 వరకు. సిటీ ఇంటిమేషన్‌ వివరాలు: జూన్‌ 2. అడ్మిట్‌ కార్డులు విడుదల: జూన్‌ 11. పరీక్ష తేదీ: 15-06-2025. ఫలితాల వెల్లడి: 15-07-2025. Website: https://natboard.edu.in/ Apply online: https://cdn3.digialm.com/EForms/configuredHtml/1815/93433/Index.html

Current Affairs

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నివేదిక

2013 నుంచి 2024 మధ్య కాలంలో భారతీయ ఏఐ రంగంలోకి 11.29 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు  స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ తాజా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా 470.9 బి.డాలర్లు, చైనా 119.3 బి.డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. యూకే 28.2 బి.డాలర్లను 2024లోనే సంపాదించింది.  నివేదికలోని అంశాలు: * ఏఐ నిపుణుల నియామకాలు, సాంకేతికత అభివృద్ధి కార్యకలాపాల్లో భారత్‌ ఎంతో క్రియాశీలకంగా ఉందని కానీ, ప్రైవేట్‌ రంగం నుంచి ఏఐ పెట్టుబడులు సాధించడంలో భారత్‌ వెనకబడి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. * అంకురాల విషయంలోనూ భారత్‌ ఏమంత ఆశాజనకంగా లేదు. 2024లో కేవలం 74 ఏఐ స్టార్టప్‌లే ఇక్కడ ఆవిర్భవించాయి. అమెరికాలో 1,073, యూకేలో 116, చైనాలో 98 అంకురాలు వచ్చాయి. 

Current Affairs

ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు

ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల రిజర్వేషన్‌ను రెండు నుంచి మూడు శాతానికి పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025, ఏప్రిల్‌ 19న ఉత్తర్వులిచ్చింది. క్రీడల్లో ప్రతిభ కలిగి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన వారికి పోటీపరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వశాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు, పోలీస్, ఎక్సైజ్, అటవీ లాంటి యూనిఫాం శాఖలల్లోనూ క్రీడాకారులకు పెంచిన రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.  * క్రీడా విధానం 2024-29లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచింది.