Posts

Government Jobs

ASHA Worker Posts In DMHO Anakapalli Recruitment

District Medical & Health Officer (DMHO), Anakapalli has released a notification for the recruitment of 61 ASHA Worker posts under the National Health Mission (NHM).  Details: ASHA Worker: 61 Posts Rural Vacancies: 49 Urban Vacancies: 12 Eligibility: Candidates must be women residents of the concerned village/ward. Preference will be given to Married/Widow/Divorced/Separated women in the age group of 25-45 years. The minimum educational qualification is 10th Class pass (preference for higher qualification). Candidates should possess good communication skills, leadership qualities, and community engagement ability Selection Procedure: Selection will be made by Village/Ward Health Sanitation Committees (VHSNC/UHSNC). Eligible candidates will be shortlisted and forwarded to the District Health Society (DHS). How to Apply:  Candidates must submit applications in the prescribed format to the concerned Village/Ward Secretariat. Last date of Online Application: 13.09.2025. Website:https://anakapalli.ap.gov.in/

Government Jobs

Business Development Manager Posts In BOB Capital

BOB Capital Markets Limited, a subsidiary of Bank of Baroda in Mumbai, is inviting applications for the recruitment of 70 posts in the following zones.  Details: Business Development Manager: Total 70 posts North Zone: 20 West Zone: 33 South and East Zones: 17 Eligibility: Intermediate or Degree with 6 months of relevant work experience, Sales and Marketing, Communication skills. Application Procedure: Email ‘careers@bobcaps.in’. By. Application Deadline: 30-09-2025 Website:https://www.bobcaps.in/careers#jobopenings

Current Affairs

నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారం

ప్రముఖ కవయిత్రి, కాలమిస్టు నెల్లుట్ల రమాదేవిని 2025 ఏడాదికి కాళోజీ సాహితీ పురస్కారం వరించింది. రాష్ట్రప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. కాళోజీ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబరు 9న తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.  నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌. చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. ‘రమ’ కలం పేరుతో కార్టూన్లు కూడా వేస్తారు. 

Current Affairs

జపాన్‌ ప్రధాని రాజీనామా

జపాన్‌ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు 2025, సెప్టెంబరు 7న ప్రకటించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2024లో ఫుమియో కిషిద రాజీనామా తర్వాత అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఇషిబా.. అక్టోబరులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

Current Affairs

యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సబలెంకా మరోసారి యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ అయింది. 2025, సెప్టెంబరు 7న న్యూయార్క్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 6-3, 7-6 (7-3)తో ఎనిమిదో సీడ్‌ అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది.   మరోవైపు పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను గ్రానోలర్స్‌ (స్పెయిన్‌)-జెబాలాస్‌ (అర్జెంటీనా) జంట గెలుచుకుంది. ఫైనల్లో గ్రానోలర్స్‌ ద్వయం 3-6, 7-6 (7-4), 7-5తో సాలిస్‌బరి-స్కూప్‌స్కీ (బ్రిటన్‌) జంటను ఓడించింది. 

Current Affairs

ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో రిషబ్‌ యాదవ్, జ్యోతి సురేఖ ద్వయం రజతం నెగ్గింది. 2025, సెప్టెంబరు 7న గ్వాంజు (దక్షిణ కొరియా)లో జరిగిన ఫైనల్లో సురేఖ, రిషబ్‌ యాదవ్‌ జోడీ 155-157 (39-38, 37-39, 40-40, 39-40)తో నెదర్లాండ్స్‌కు చెందిన మైక్‌ స్కోల్‌సెర్, సేన్‌ డి లాట్‌ జంట చేతిలో పరాజయంపాలైంది.  ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సురేఖకు ఇది తొమ్మిదో పతకం. 

Current Affairs

ఆసియాకప్‌ హాకీ విజేత భారత్‌

భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. 2025, సెప్టెంబరు 7న రాజ్‌గిర్‌ (బిహార్‌)లో జరిగిన ఫైనల్లో 4-1తో దక్షిణ కొరియాపై నెగ్గింది. ఈ టైటిల్‌తో హర్మన్‌ప్రీత్‌ సేన 2026 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించింది.  భారత్‌కు ఇది నాలుగో ఆసియాకప్‌ టైటిల్‌. ఆ జట్టు ఇంతకుముందు 2003, 2007, 2017లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది. దక్షిణ కొరియా ఈ టైటిల్‌ను అయిదుసార్లు (1994, 1999, 2009, 2013, 2022) సొంతం చేసుకుంది.

Current Affairs

సిల్క్‌ నానోజెల్‌ ఇంజెక్టర్‌కు పేటెంట్‌

మానవ శరీరంలోని నిర్దేశిత భాగాలకు ఔషధాలు సరఫరా చేసేందుకు తయారు చేసిన సిల్క్‌ నానోజెల్‌ ఇంజెక్టర్‌ పరికరానికి కేంద్ర ప్రభుత్వం 2025, సెప్టెంబరు 6న పేటెంట్‌ మంజూరుచేసింది. ఈ ఇంజెక్టర్‌ను ఒడిశాలోని బ్రహ్మపుర(భంజవిహార్‌) విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మాలోచన్‌ హేంబ్రమ్‌ నేతృత్వంలో పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్‌ తదితర రోగాల చికిత్సలో ఈ పరికరం కీలక పాత్ర పోషించనుంది. 

Current Affairs

పీవీ ఫౌండేషన్‌ అవార్డు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఎకనమిక్స్‌ అవార్డును... మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ప్రకటించారు. 2025, సెప్టెంబరు 6న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఫౌండేషన్‌ సభ్యులు మన్మోహన్‌సింగ్‌ సతీమణి గురుశరణ్‌కౌర్‌కు అందజేశారు.

Current Affairs

దేశంతో ఆతిథ్య రంగం

ఆతిథ్య రంగం ద్వారా 2034నాటికి మన దేశ జీడీపీకి రూ.43.25 లక్షల కోట్లను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో 6.3 కోట్ల కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఆతిథ్య రంగం ద్వారా భారత విదేశీ మారకపు ఆదాయం 1999లో రూ.13,000 కోట్ల నుంచి 2024లో రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. దేశీయ పర్యాటకానికి ప్రభుత్వం చేపడుతున్న స్వదేశ్‌ దర్శన్‌ 2.0, ప్రసాద్, ఎస్‌ఏఎస్‌సీఐ, హీల్‌ వంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. వీటితో విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది.