Posts

Internship

సత్యజన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌లో ఉద్యోగాలు

సత్యజన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌లో ఉద్యోగాలు హైదరాబాద్‌లోని సత్యజన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: సత్యజన్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  పోస్టు పేరు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) నైపుణ్యాలు: మార్కెటింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్: రూ.15,000-రూ.20,000. వ్యవధి: 6 నెలలు. దరఖాస్తు గడువు: 27-06-2025. జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌. Website:https://internshala.com/internship/detail/business-development-sales-internship-in-hyderabad-at-satyajan-energy-solutions-private-limited1748419281

Government Jobs

ఎన్‌ఏఆర్‌ఎల్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

 ఎన్‌ఏఆర్‌ఎల్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా గదంకిలోని నేషనల్‌ అట్మాస్పియరిక్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్‌) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 13 వివరాలు: అర్హత: ఫిజిక్స్‌/ అట్మాస్పియరిక్‌ సైన్స్‌/ స్పేస్‌ ఫిజిక్స్‌/ మెటాలర్జీ తదితర విభాగంలో పీజీతో పాటు సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌/ గేట్‌/ జామ్‌/ జేఈఎస్‌టీ క్వాలిఫికేషన్‌ ఉండాలి. జీతం: నెలకు రూ.37,000. వయో పరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 6.7.2025. వెబ్‌సైట్‌:https://www.narl.gov.in/

Current Affairs

Jagat Prakash Nadda

♦ Union Health Minister Jagat Prakash Nadda launched FSSAI’s ‘Stop Obesity’ campaign on World Food Safety Day 2025 on June 7. ♦ The event themed “Stop Obesity by Eating Safe and Healthy,” held at the National Institute of Mental Health and Neuro-Sciences (NIMHANS) in Bengaluru. ♦ Organized by the Food Safety and Standards Authority of India (FSSAI) under the Ministry of Health and Family Welfare, the event emphasized the critical role of food safety and nutrition in combating obesity and non-communicable diseases.  ♦ The campaign under the Eat Right India programme, aimed at raising nationwide awareness about the health risks of obesity. ♦ Nadda highlighted the alarming rise in obesity, citing the ICMR–India Diabetes (INDIAB) study, which reported a 39.6% increase in urban India and a 23.1% increase in rural areas between 2008 and 2020. ♦ He warned that by 2050, one-third of India’s population could be obese if current trends persist.

Government Jobs

నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరాటరీస్‌లో టెక్నీషయన్‌ పోస్టులు

నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరాటరీస్‌లో టెక్నీషయన్‌ పోస్టులు బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌ (ఎన్‌ఏఎల్‌) టెక్నీషియన్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 86 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 2025 జులై 10వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.19,900 - రూ.63,200. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 10. Website:https://nal.res.in/en/news/advertisement-posts-technician-1-csir-nal-bengaluru-advtno-052025

Current Affairs

ప్రపంచ మహాసముద్ర దినోత్సవం

సముద్ర వనరుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఏటా జూన్‌ 8న ‘ప్రపంచ మహాసముద్ర దినోత్సవం’గా నిర్వహిస్తారు. భూగోళంపై అతి ముఖ్యమైన సహజ వనరుల్లో మహాసముద్రాలు ఒకటి. ఇవి అనేక కోట్ల జలచరాలకు ఆవాసాలుగా ఉండి, జీవవైవిధ్యాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సముద్రాల్లోని ఆల్గే, ప్లవకాల ద్వారా 25% ఆక్సిజన్‌ వాతావరణంలోకి విడుదలవుతుంది. మానవులకు 17% ఆహార ఉత్పత్తులు ఈ వనరుల నుంచే లభిస్తున్నాయి. అయితే ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందిన కొద్దీ మహాసముద్రాలు కూడా అంతే స్థాయిలో కాలుష్యాల బారిన పడుతున్నాయి. ఈ ప్రభావం సముద్ర జీవులతోపాటు, మానవాళిపైనా అధికంగానే ఉంటోంది. అందుకే మహాసముద్రాల పరిరక్షణ, దాని కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో 1992, జూన్‌ 3 నుంచి 14 వరకు ఎర్త్‌ సమ్మిట్‌ జరిగింది. అందులో జూన్‌ 8న కెనడాకు చెందిన ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ డెవలప్‌మెంట్‌ (ఐసీఓడీ) ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. సముద్రాల ప్రాముఖ్యతతోపాటు పూర్వం నుంచి వాటితో మానవాళికి ఉన్న సంబంధాలను తెలియజేసి, వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో దీన్ని ప్రతిపాదించింది. 2008లో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ జూన్‌ 8ని ‘ప్రపంచ మహాసముద్ర దినోత్సవం’గా అధికారికంగా ప్రకటించింది. 2025 నినాదం: "Wonder: Sustaining what sustains us"

Current Affairs

ఎల్‌ఐసీ ఎండీగా సత్‌పాల్‌ భాను

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సత్‌పాల్‌ భానుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం వెల్లడించింది. 2025, జూన్‌ 8 నుంచి 3 నెలల పాటు ఈ హోదాలో ఆయన కొనసాగనున్నారు. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ఉన్న నలుగురు ఎండీల్లో అత్యంత సీనియర్‌ సత్‌పాల్‌. ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓగా ఉన్న సిద్ధార్థ మొహంతి జూన్‌ 7న పదవీ విరమణ చేసినందున, సత్‌పాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.  

Freshers

క్వాల్‌కామ్‌లో ఫింగర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ పోస్టులు

క్వాల్‌కామ్‌లో ఫింగర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ పోస్టులు క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫింగ్‌ర్‌ప్రింట్‌ సాఫ్టవేర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: పోస్టు: ఫింగ్‌ర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌  కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అర్హత: ఇంజినీరింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉద్యోగానుభవం ఉండాలి. నైపుణ్యాలు:  సీ, సీ++, కమ్యూనికేషన్‌ తదితర నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 6.7.2025 Website:https://careers.qualcomm.com/careers?pid=446706130282&domain=qualcomm.com&sort_by=relevance

Current Affairs

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన అల్కరాస్‌

కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గాడు. 2025, జూన్‌ 8న పారిస్‌లో జరిగిన ఫైనల్లో అతడు 4-6, 6-7 (4-7), 6-4, 7-6 (7-3), 7-6 (10-2)తో టాప్‌ సీడ్‌ యానిక్‌ సినర్‌ (ఇటలీ)పై విజయం సాధించాడు. 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ ఫైనల్‌.. రొలాండ్‌ గారోస్‌ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఫైనల్‌గా రికార్డులకెక్కింది. 1982లో మాట్స్‌ విలాండర్‌-విలాస్‌ (4 గంటల 42 నిమిషాలు) నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది. అల్కరాస్‌కు ఇది రెండో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ట్రోఫీ.

Current Affairs

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

మంచి ఆహార అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్‌ 7న ‘ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’గా నిర్వహిస్తారు. జీవులు ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనాన్ని సాగించాలంటే ఆహార భద్రత అవసరం. ఇది లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. ప్రజల రోగనిరోధక శక్తి క్షీణించి, వ్యాధులు సంక్రమిస్తాయి. ఆహార వృథాను అరికట్టడంపైనా ఈ రోజు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంది. చారిత్రక నేపథ్యం: యూఎన్‌ఓకి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ), డబ్ల్యూహెచ్‌ఓ 2016లో సంయుక్తంగా ఆహార భద్రత ప్రాముఖ్యం గురించి ప్రజలకు తెలియజేయాలని భావించాయి. దీనికోసం ఒక రోజును ఏర్పాటు చేయాలనుకున్నాయి. 2017, జులైలో జరిగిన ఎఫ్‌ఏఓ 40వ సర్వసభ్య సమావేశంలో ఏటా జూన్‌ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు. అదే ఏడాది డిసెంబరులో ఆ తీర్మానానికి డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు ప్రకటించింది. 2018, డిసెంబరు 20న జరిగిన యూఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీలోనూ దీనికి ఆమోదం లభించింది. 2019 నుంచి ఏటా జూన్‌ 7న ఈ రోజును నిర్వహిస్తున్నారు. 2025 నినాదం: Food safety: science in action

Current Affairs

దేశంలో అత్యంత పేదరికం 5.3 శాతం

భారత్‌లో అత్యంత పేదరిక (ఎక్స్‌ట్రీమ్‌ పావర్టీ) రేటు వేగంగా తగ్గి 5.3 శాతానికి పరిమితమైందని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. 2011-12లో ఇది 27.1 శాతం కాగా, దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది. రోజుకు 3 డాలర్ల (రూ.255) కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్న వారిని అత్యంత పేదరికంలో ఉన్న వారిగా ప్రపంచ బ్యాంక్‌ నిర్వచించింది. 2021లో ఈ పరిమితి 2.15 డాలర్లుగా ఉంది. సవరించిన తర్వాత 15 శాతం పెంచి 3 డాలర్లుగా చేసింది. అయినప్పటికీ మన దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న వారు బాగా తగ్గారని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది.  2021 పరిమితి ప్రకారం చూస్తే అత్యంత పేదరికంలో ఉన్న వారు 16.2 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గారు. 2024లో 3 డాలర్ల పరిమితి వద్ద అత్యంత పేదరిక రేటు 5.44 శాతంగా ఉంది.