Posts

Current Affairs

యునిసెఫ్‌ డే

బాలల సంక్షేమంపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వారే రేపటి ప్రపంచ భవిష్యత్తు. చిన్నారుల సంరక్షణ విషయంలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి (United Nations Children's Fund - UNICEF) సంస్థ ఎనలేని కృషి చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బాలల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఇది పని చేస్తోంది. అనేక వర్థమాన దేశాల్లో బాలల ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం అందించడం, రోగ నియంత్రణ లాంటి కార్యక్రమాలను చేపడుతోంది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా డిసెంబరు 11న ‘యునిసెఫ్‌ డే’గా (UNICEF Day)  నిర్వహిస్తారు. పిల్లల జీవితాలకు సవాలుగా ఉన్న సమస్యల గురించి అవగాహన కల్పించడంతో పాటు వారికి సాయం చేయాల్సిన ఆవశ్యకత గురించి చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లోని బాలలకు ఆహారం, మందులు, దుస్తులు లాంటి అత్యవసర సాయం అందించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి (ఐరాస) జనరల్‌ అసెంబ్లీ 1946, డిసెంబరు 11న ‘ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి’ (యునిసెఫ్‌)ని ఏర్పాటు చేసింది. 1953లో ఇది ఐరాసకు శాశ్వత సంస్థగా మారింది. దీని స్థాపనకు గుర్తుగా ఏటా డిసెంబరు 11న ‘యూనిసెఫ్‌ డే’గా నిర్వహిస్తున్నారు.

Current Affairs

బీసీజీ, జడ్‌47 నివేదిక

దేశ జీడీపీలో తయారీ రంగ వాటా 2047 నాటికి 25 శాతానికి చేరొచ్చని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ), జడ్‌47 సంయుక్త నివేదిక పేర్కొంది. ప్రస్తుతం జీడీపీలో తయారీ రంగ వాటా దాదాపు 17 శాతంగా ఉంది. 2047కు అంతర్జాతీయ పారిశ్రామికశక్తిగా భారత్‌ మారనుందని ఈ నివేదిక తెలిపింది. ‘డిజిటైజింగ్‌ మేక్‌ ఇన్‌ ఇండియా 3.0’ పేరిట ఈ నివేదిక వెలువడింది. 2047కు అయిదు (ఎలక్ట్రానిక్స్, రక్షణ, వాహన-ఈవీ, ఇంధన, ఔషధ) రంగాల్లో 25 లక్షల కోట్ల డాలర్ల (రూ.2,250 లక్షల) విలువైన పారిశ్రామిక అవకాశాలు లభిస్తాయంది.  2022లో 33 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.97 లక్షల కోట్లు)గా ఉన్న భారత ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్, 2030కు 117 బి.డాలర్ల (సుమారు రూ.10.53 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉంది.

Current Affairs

పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఆర్కిటెక్ట్స్‌ ఆఫ్‌ ఏఐ

2025 ఏడాదికిగానూ ‘పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ‘ఆర్కిటెక్ట్స్‌ ఆఫ్‌ ఏఐ’ని (ఏఐ సృష్టికర్తలు) ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజీన్‌ టైమ్‌ ప్రకటించింది. 2025ను ఏఐ ఏడాదిగా అభివర్ణించిన ఈ మ్యాగజీన్‌.. దాని శక్తి ప్రపంచానికి స్పష్టంగా కనిపించిందని పేర్కొంది. ఏఐ మన జీవితాలను మార్చడంలో, ఆశ్చర్యపరచడంలో, ఆందోళన కలిగించడంలో ప్రధాన పాత్ర పోషించిందని వివరించింది.

Current Affairs

ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం

తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ 2025’ అవార్డు అందుకున్నారు. కెన్యాలో 2025, డిసెంబరు 11న నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణం కోసం విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందించారు.  తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం తదితర కార్యక్రమాలు చేపట్టినందుకు సుప్రియా సాహూను అవార్డుకు ఎంపికచేశారు.

Current Affairs

జల సంరక్షణలో రాష్ట్రానికి మొదటి స్థానం

గ్రామాల్లో జల సంరక్షణకు సంబంధించి ‘జల సంచాయ్‌-జన భాగిదారి’ కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా 2025లో 4,20,146 పనులు ప్రారంభించి, ఇప్పటివరకు 2,99,114 పూర్తి చేసింది. మిగతా 1,21,032 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కార్యక్రమం అమలును సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం మొదటి పది రాష్ట్రాలను ఎంపిక చేసింది.  బిహార్, గుజరాత్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచినట్లు చెప్పారు.

Current Affairs

హైడ్రోజన్‌తో నడిచే తొలి స్వదేశీ పడవ

హైడ్రోజన్‌తో నడిచే తొలి స్వదేశీ పడవను వారణాసిలో నమో ఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ 2025, డిసెంబరు 11న ఆవిష్కరించారు. అంతర్గత జల రవాణాలో ఇది కీలక ముందడుగు. దీని ప్రారంభంతో హైడ్రోజన్‌ శక్తితో పడవలు, ఓడలు నడుపుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్‌ దేశాల సరసన భారత్‌ నిలిచింది. ఈ నౌక పొడవు 24 మీటర్లు. ఏసీ క్యాబిన్‌ ఉంటుంది. దీనిలో 50 మంది ప్రయాణించవచ్చు. 

Private Jobs

నైనిటాల్ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్‌- ప్రైవేట్‌ సెక్టార్‌ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌, ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీఓ), గ్రేడ్‌/స్కేల్‌-1, 2లోని స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 185 వివరాలు: 1. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA): 71 2. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ)- ఆఫీసర్స్ గ్రేడ్/ స్కేల్-I: 40 3. రిస్క్ ఆఫీసర్ (గ్రేడ్/ స్కేల్-I): 03 4. చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) గ్రేడ్/ స్కేల్-II: 03 5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ఆఫీసర్    గ్రేడ్/ స్కేల్-II: 15 6. లా ఆఫీసర్ (గ్రేడ్/ స్కేల్-II): 02 7. క్రెడిట్ ఆఫీసర్ గ్రేడ్/ స్కేల్-II: 10 8. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ గ్రేడ్/ స్కేల్-II: 10 9. హెచ్ఆర్ ఆఫీసర్‌ గ్రేడ్/ స్కేల్-II: 04 10. మేనేజర్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) గ్రేడ్/ స్కేల్-II: 15 11. మేనేజర్- రిస్క్ (గ్రేడ్/స్కేల్-II): 02 12. మేనేజర్-చార్టర్డ్ అకౌంటెంట్ (గ్రేడ్/ స్కేల్-II): 05 13. మేనేజర్-లా (గ్రేడ్/ స్కేల్-II): 02 14. మేనేజర్- సెక్యూరిటీ ఆఫీసర్‌ (గ్రేడ్/ స్కేల్-II): 03 అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  పే స్కేల్: నెలకు కస్టమర్‌ సర్వీస్‌ అసోసిసయేట్‌ పోస్టులకు రూ.24,050 - రూ.64,480; గ్రేడ్/స్కేల్-I ఆఫీసర్స్‌కు రూ.48,480 - రూ.85,920; గ్రేడ్/స్కేల్-II మేనేజర్స్ పోస్టులకు రూ.64,820 - రూ.93,960. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఈ బ్యాంక్ ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్)ని నెట్‌వర్క్‌ శాఖల్లో పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు రుసుము: కస్టమర్‌ సర్వీస్‌ అసోసిసయేట్‌ పోస్టులకు రూ.1000; స్కేల్‌ I & II ఆఫీసర్స్/మేనేజర్‌ల పోస్టులకు రూ.1500. పరీక్షా కేంద్రాలు: నైనిటాల్‌ (ఉత్తరాఖండ్‌), దెహ్రాదూన్‌, బరేలీ, మీరట్‌, మొరాదాబాద్ (ఉత్తర ప్రదేశ్), లఖ్‌నవూ, జైపుర్‌, దిల్లీ, అంబాలా (హర్యానా), కాన్పూర్. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.01.2026. Website:https://www.nainitalbank.bank.in/english/recruitment.aspx

Government Jobs

ఎన్‌డీఏ & ఎన్‌ఏ-2026 ఎగ్జామినేషన్‌-1 నోటిఫికేషన్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (1) 2026 (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ప్రవేశానికి సంబంధించి పోస్టులను యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.  వివరాలు:  మొత్తం ఖాళీల సంఖ్య: 394 (పురుషులు-370,  మహిళలు-24) 1. ఆర్మీ: 208 (పురుషులు-198, మహిళలు-10) 2. నావీ: 42 (పురుషులు-37, మహిళలు-05) ఎయిర్ ఫోర్స్‌.. 1. ఫ్లైయింగ్‌: 92 (పురుషులు-90, మహిళలు-02) 2. గ్రౌండ్‌ డ్యూటీస్‌(టెక్‌): 18 (పురుషులు-16, మహిళలు-02) 3. గ్రౌండ్‌ డ్యూటీస్‌(నాన్‌ టెక్‌): 10 (పురుషులు-08, మహిళలు-02) నేవల్ అకాడమి(10+2 క్యాడెట్‌ ఎంట్రీ కేటగిరి స్కీమ్‌).. ఖాళీల సంఖ్య: 24 (పురుషులు-21, మహిళలు-03) అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌)లో ఉత్తీర్ణత ఉండాలి. ఎత్తు: పురుషులు 157 సెం.మీ, మహిళా అభ్యర్థులు 152 సెం.మీ ఉండాలి. వయోపరిమితి: 16 1/2 నుంచి 19 1/2 ఏళ్లు ఉండాలి. 2007 జులై 1 కంటే ముందు 2010 జులై 1 తరువాత అభ్యర్థులు జన్మించి ఉండరాదు. స్టైపెండ్‌: నెలకు రూ.56,100. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.100. ఇతరులకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 డిసెంబర్‌ 10. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 30. ఎంపిక పక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఎంపిక విధానం: ఎంపిక రెండు దశలలో జరుగుతుంది. రాత పరీక్ష: యూపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో అర్హత సాధించడం. పేపర్లు: మ్యాథమెటిక్స్ (300 మార్కులు), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). మొత్తం 900 మార్కులు. ప్రశ్నల రకం: అన్ని సబ్జెక్టులలో ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక) ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. నెగటివ్ మార్కింగ్: తప్పు సమాధానాలకు పెనాల్టీ (నెగటివ్ మార్కింగ్) ఉంటుంది. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) టెస్ట్/ఇంటర్వ్యూ:  రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ద్వారా ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి 900 మార్కులు. పరీక్ష తేదీ: 2026 ఏప్రిల్‌ 12. పరీక్ష ఫలితాలు: 2026 మే. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ తేదీ: 2026 జూన్‌ నుంచి జులై వరకు. ఎన్‌డీఏ 157వ కోర్సు ప్రారంభ తేదీ: 2027 జనవరి 1. ఎన్‌ఏ 119వ కోర్సు ప్రారంభ తేదీ: 2027 జనవరి 1. Website:https://upsc.gov.in/

Government Jobs

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో చీఫ్‌ కోచ్‌ పోస్టులు

దిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) ఒప్పంద ప్రాతిపదికన చీఫ్‌ కోచ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2026 జనవరి 11వ తేదీ నాటికి 64 ఏళ్లు మించకూడదు.   జీతం: నెలకు రూ.78,800 - రూ.2,09,200. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 2026 జనవరి 11. Website:https://sportsauthorityofindia.nic.in/sai_new/job-opportunities

Government Jobs

పవన్‌హాన్స్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌, సేఫ్టీ మేనేజర్‌ ఉద్యోగాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, సేఫ్టీ మేనేజర్‌ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 18 వివరాలు:  1. అసిస్టెంట్‌ మేనేజర్‌: 02 2. నెట్‌వర్క్‌/సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌: 01 3. సేఫ్టీ మేనేజర్‌: 02 4. డిప్యూటీ అండ్‌ డిప్యూటీ కంటిన్యూడ్‌ ఏయిర్‌వర్తినెస్‌ మేనేజర్‌: 03 5. డిప్యూటీ క్వాలిటీ మేనేజర్‌: 01 6. డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఫ్లైట్‌ సేఫ్టీ: 01 7. ఆఫీసర్‌: 01 8. స్టేషన్‌ మేనేజర్‌: 07 అర్హత: పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో బీఈ/బీటెక్‌, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, ఎంబీఏ,  పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఫ్లైట్‌ సేఫ్టీకు 55 ఏళ్లు; డిప్యూటీ కంటిన్యూడ్‌ ఏయిర్‌వర్తినెస్‌ మేనేజర్‌కు 45 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. జాబ్‌ లొకేషన్‌: న్యూదిల్లీ, నోయిడా, ముంబయి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, డాక్యూమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.295+జీఎస్‌టీ. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 02.01.2026. Website:https://www.pawanhans.co.in/english/index.aspx