తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీజీ సెట్)-2025ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష డిసెంబర్లో జరుగుతుంది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ నియామకాల అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీ సెట్ నిర్వహిస్తోంది.
వివరాలు:
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీజీ సెట్)-2025
టీజీ సెట్ 2025 పరీక్ష 29 విభాగాల్లో నిర్వహిస్తుంది. అవి...
సబ్జెక్టులు: జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధి సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ)) ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ ఆఖరు సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
పరీక్ష పీజు: ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్లకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్జెండర్లకు రూ.1000.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-10-2025.
ఆలస్య రుసుం రూ.1500, రిజిస్ట్రేషన్ ఫీజుతో: 01-11-2025- 08-11-2025.
ఆలస్య రుసుం రూ.2000, రిజిస్ట్రేషన్ ఫీజుతో: 09-11-2025- 19-11-2025.
ఆలస్య రుసుం రూ.3000, రిజిస్ట్రేషన్ ఫీజుతో: 20-11-2025- 21-11-2025.
దరఖాస్తులో మార్పులకు అవకాశం: 26-11-2025- 28-11-2025.
హాల్టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం: 03-12-2025 నుంచి.
పరీక్ష తేదీలు: డిసెంబర్ రెండో వారంలో..
Website:http://telanganaset.org/eligibility.html