Posts

Current Affairs

Pradhan Mantri Matsya Sampada Yojana

♦ India has recorded a significant surge in fish production and aquaculture productivity since the launch of the Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY) in 2020. With total fish production rising from around 141.6 lakh tonnes in 2019–20 to an estimated 197.75 lakh tonnes in 2024–25, marking a 38% growth. ♦ The increase has been driven by inland aquaculture expansion, marine fisheries development, strengthened value-chain infrastructure, and policy interventions under PMMSY.   ♦ India’s average aquaculture productivity also improved to 4.7 tonnes per hectare in 2025, up from 3 tonnes per hectare before the scheme. ♦ The fisheries sector’s Gross Value Added (GVA) reached Rs. 3,68,124 crore in 2023–24, compared with Rs. 2,12,087 crore in 2018–19, with its share in agriculture rising from 7% to 7.55%. Fish and fishery product exports grew 33.7%, from Rs. 46,662.85 crore in 2019–20 to Rs. 62,408.45 crore in 2024–25. ♦ The information was provided by Rajeev Ranjan Singh (Lallan Singh), Minister of Fisheries, Animal Husbandry and Dairying, in Lok Sabha on 17 December 2025. 

Current Affairs

Narendra Modi

♦ Prime Minister Narendra Modi met Oman’s Deputy Prime Minister for Defence Affairs, Sayyid Shihab bin Tarik Al Said on 17 December 2025, marking the beginning of his official engagements in the Sultanate. ♦ The visit holds particular significance as India and Oman share a comprehensive strategic partnership rooted in centuries-old historical links, longstanding trade relations and strong people-to-people ties. It also coincides with the 70th anniversary of the establishment of diplomatic relations between the two countries and follows the State visit of Sultan Haitham bin Tarik to India in December 2023. ♦ Prime Minister Modi arrived in Oman after completing his maiden visit to Ethiopia, during which India and Ethiopia elevated their relationship to a Strategic Partnership.

Current Affairs

Tripura Agriculture Department

♦ The Tripura Agriculture Department on 17 December 2025 signed a Memorandum of Understanding (MoU) with the Nagpur-based National Bureau of Soil Survey and Land Use Planning (NBSS and LUP). ♦ This is a major step towards enhancing agricultural productivity and achieving self-sufficiency in foodgrain production. The collaboration aims to carry out in-depth research on cultivable land across several districts of the state, paving the way for sustainable farming practices and a stronger agricultural future for Tripura.

Current Affairs

‘హనుమాన్‌’ గవర్నింగ్‌ బాడీ

ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణులు, ప్రజల మధ్య సంఘర్షణను నియంత్రించేందుకు అమలు చేయనున్న హీలింగ్‌ అండ్‌ నర్చరింగ్‌ యూనిట్స్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఎయిడ్‌ అండ్‌ నర్సింగ్‌ వైల్డ్‌లైఫ్‌ (హనుమాన్‌) ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేసింది. దీనికి ‘ఆంధ్రప్రదేశ్‌ హ్యూమన్‌-వైల్డ్‌లైఫ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ మిటిగేషన్‌ ఫౌండేషన్‌’ అని నామకరణం చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఛైర్‌పర్సన్‌గా అటవీ శాఖ కార్యదర్శి, పీసీసీఎఫ్‌ సహా మొత్తం 18 మంది సభ్యులతో ఈ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసింది. సొసైటీల చట్టం కింద రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చింది. ఈ మేరకు అటవీ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే 2025, డిసెంబరు 17న ఉత్తర్వులు జారీ చేశారు.

Current Affairs

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌- హురున్‌ జాబితా

స్వయంకృషితో ఎదిగిన 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్‌ - హురున్‌ ఇండియా ‘టాప్‌ 200 సెల్ఫ్‌ మేడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ద మిలేనియా 2025’ జాబితాను రూపొందించింది. ఇందులో విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేశ్‌ గంగ్వాల్‌ తొలిసారిగా అడుగుపెట్టి, ఏకంగా టాప్‌-10లో నిలిచారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సంస్థ మార్కెట్‌ విలువ 2025లో రూ. 2.2 లక్షల కోట్లకు చేరడంతో, ఈ జాబితాలో వీరు మూడో స్థానం దక్కించుకున్నారు.  ముఖ్యాంశాలు.. జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్‌ వంటి సంస్థలను నిర్వహిస్తున్న ఎటర్నల్‌ మార్కెట్‌ విలువ రూ.3.2 లక్షల కోట్లకు చేరడంతో.. ఈ జాబితా అగ్రస్థానంలో సంస్థ అధిపతి దీపిందర్‌ గోయల్‌ నిలిచారు. 2024లో తొలిస్థానంలో ఉన్న డిమార్ట్‌ మార్కెట్‌ విలువ 13% తగ్గడంతో, ఆ సంస్థ అధినేత దమానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు.  మొత్తం 200 కంపెనీల మార్కెట్‌ విలువ రూ.42 లక్షల కోట్లుగా నిలిచింది. బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9,000 కోట్ల) విలువైన కంపెనీల సంఖ్య 121 నుంచి 128కి చేరింది. 22 కొత్త కంపెనీలు ఈ జాబితాలోకి ఎక్కాయి.

Current Affairs

తారిక్‌ అల్‌ సయిద్‌తో నరేంద్ర మోదీ భేటీ

ఒమన్‌ ఉప ప్రధాని (రక్షణ వ్యవహారాలు) సయ్యిబ్‌ షిహాబ్‌ బిన్‌ తారిక్‌ అల్‌ సయిద్‌తో 2025, డిసెంబరు 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. మోదీ ఇథియోపియా పర్యటనను ముగించుకొని ఒమన్‌ చేరుకున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. భారత్‌-ఒమన్‌ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లవుతుండటాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఓ ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. ఆయన ఒమన్‌లో పర్యటించడం ఇది రెండోసారి.

Current Affairs

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ సీఎండీగా వంశీ రామ్మోహన్‌ బుర్రా

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా వంశీ రామ్మోహన్‌ బుర్రా పేరు ఖరారైంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి (పీఈఎస్‌బీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన అదే సంస్థలో ఫంక్షనల్‌ డైరెక్టర్‌(ప్రాజెక్ట్స్‌)గా పనిచేస్తున్నారు. వంశీకి విద్యుత్తు, టెలికాం రంగాల్లో మూడు దశాబ్దాల విస్తృత అనుభవం ఉంది. ఇది వరకు పవర్‌గ్రిడ్‌ టెలిసర్వీసెస్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గానూ సేవలందించారు. 

Walkins

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో కెమిస్ట్ ఉద్యోగాలు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: కెమిస్ట్ (ఫీల్డ్స్‌): 05 కెమిస్ట్‌ (ల్యాబొరేటరీ): 03 అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ70,000. వయోపరిమితి: 18 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్యూ తేదీ: 07-01-2026. వేదిక: ఆయిల్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీస్‌, ఐదో అంతస్తు, దులియంజల్‌, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, అస్సాం. Website:https://www.oil-india.com/

Walkins

ఈఎస్‌ఐసీ నొయిడాలో ప్రొఫెసర్‌ పోస్టులు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) నొయిడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం వస్టుల సంఖ్య: 21 వివరాలు: 1. ప్రొఫెసర్‌: 08 2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 11 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 02 విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, ఫారెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యునిటీ మెడిసిన్‌, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్‌, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, ఎండీ లేదా డీఎన్‌బీ, ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 67 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,22,543, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,47,986, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,27,141. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 డిసెంబర్‌ 24. Website:https://esic.gov.in/

Government Jobs

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో మేనేజిరియల్‌ పోస్టులు

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌), తెలంగాణ రాష్ట్రం రామగుండం, నోయిడా కార్పొరేట్‌ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, ఐటీ తదితర విభాగాల్లో మేనేజిరియల్‌ పోస్టుల భర్తీకి రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల సంఖ్య: 36 వివరాలు: ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌: 01 కెమికల్‌: 10 మెకానికల్‌: 03 ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 04 సివిల్‌: 01 కెమికల్‌ ల్యాబ్‌: 02 మెటీరియల్స్‌: 05 ట్రాన్స్‌పోర్టెషన్‌: 01 హ్యూమన్‌ రిసోర్సెస్‌: 05 ఫార్మసి: 01 ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌: 02 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 01 పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌, డిప్యూటీ మెనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ, ఎంబీఏ, సీఏ/సీఎంఏ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, బీఫార్మసి, ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; మేనేజర్‌కు రూ.70,000- .2,00,000; సీనియర్‌ మేనేజర్‌కు రూ.80,000- రూ. 2,20,000; చీఫ్‌ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000; డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.1,00,000- రూ. 2,60,000; జనరల్‌ మేనేజర్‌కు రూ.1,20,000- రూ.2,80,000. వయోపరిమితి: అసిస్టెంట్‌/డిప్యూటీ మేనేజర్లకు 40 ఏళ్లు; మేనేజర్‌/సీనయర్‌ మేనేజర్‌కు 45 ఏళ్లు; చీఫ్‌ మేనేజర్‌/డీజీఎంకు 50ఏళ్లు; జనరల్‌ మేనేజర్‌కు 55 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, సీబీటీ, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తయ్యాక ప్రింట్‌ తీసుకొని అవసరమైన ధ్రువపత్రాలతో నోయిడా కార్పొరేట్‌ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాలి. దరఖాస్తు ఫీజు: రూ.700- రూ.1000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు చివరి తేదీ: 15.01.2026. హార్డ్‌ కాపీలు పంపించడానికి చివరి తేదీ: 22.01.2026. Website:https://www.rfcl.co.in/