Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

The Department for Promotion of Industry and Internal Trade (DPIIT)

♦ The Department for Promotion of Industry and Internal Trade (DPIIT), under the Ministry of Commerce and Industry, has signed a Memorandum of Understanding (MoU) with Blue Star Limited to strengthen India’s manufacturing and startup ecosystem. The collaboration aims to support startups, innovators, and entrepreneurs working in key areas such as HVAC technologies, digital solutions, advanced manufacturing, and supply chain innovation. The initiative is designed to foster industry-driven innovation and enable startups to build scalable, market-ready solutions. ♦ The programme will also facilitate product validation, proof-of-concept (PoC) development, and integration into industry value chains.

Current Affairs

Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme

The Centre has disbursed over Rs.4.27 lakh crore to farmers under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme since its launch in February 2019, the government informed Parliament on 2026 March 24. Under the scheme, eligible cultivable landholding farmers receive Rs.6,000 annually in three equal instalments through Direct Benefit Transfer (DBT) into Aadhaar-seeded bank accounts.

Current Affairs

వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే

మానవులకు సోకే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో క్షయ ఒకటి. ఇది బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల కలుగుతుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రమాదకర ఆరోగ్య సమస్యగా పరిణమించింది. క్షయ వ్యాధి వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి 24న ‘వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే’గా నిర్వహిస్తారు. ఈ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడం, ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: జర్మనీకి చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ కోచ్‌ అనే వైద్యుడు 1882, మార్చి 24న మొదటిసారి క్షయ వ్యాధి కారకమైన మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ను గుర్తించారు. ఇది రోగ నిర్ధా రణ, చికిత్సకు పునాదిగా నిలిచింది. ఇది జరిగిన వందేళ్లకు 1982లో డబ్ల్యూహెచ్‌ఓ, IUATLD సంయుక్తంగా ఆ తేదీని ‘వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే’గా గుర్తించాయి.  2026 నినాదం:  ‘Yes! We can end TB!’

Current Affairs

యాంటీప్రొటాన్ల రవాణా

ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్‌) శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా యాంటీప్రొటాన్లను ట్రక్కు ద్వారా ప్రయోగాత్మకంగా రవాణా చేశారు. యాంటీప్రొటాన్‌ వంటి ప్రతిపదార్థం (యాంటీమ్యాటర్‌).. సాధారణ పదార్థం (మ్యాటర్‌)తో కలిస్తే నాశనమవుతుంది. ఈ క్రమంలో శక్తి విడుదలవుతుంది. తాజా ప్రయోగంలో భాగంగా 92 యాంటీప్రొటాన్లను ప్రత్యేకంగా రూపొందించిన క్రయోజెనిక్‌ పెన్నింగ్‌ ట్రాప్‌లో ఉంచారు. అందులో భారీగా శీతలీకరించిన, సూపర్‌ కండక్టింగ్‌ అయస్కాంతాలను అమర్చారు. ఈ పెట్టెను ట్రక్కులో ఉంచి రోడ్డుపై కొద్దిసేపు రవాణా చేశారు. ఆ తర్వాత తిరిగి ల్యాబ్‌కు తరలించారు. ఈ ప్రయోగ సమయంలో క్రయోజెనిక్‌ పెన్నింగ్‌ ట్రాప్‌ గోడలకు యాంటీప్రొటాన్లు తగలకుండా శూన్యంలో తేలియాడుతూ ఉన్నాయి. పెట్టెల గోడలకు తాకకుండా ఈ రేణువులను ఒక చోటు నుంచి మరో చోటుకు రవాణా చేయవచ్చా అన్నది చూడాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన.

Current Affairs

ఐక్యూఎయిర్‌ నివేదిక

ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశంగా 2025లో పాకిస్థాన్‌ నిలిచింది. వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ 2025, మార్చి 24న ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. మొత్తం 143 దేశాలు, 9,446 నగరాల్లో వాయు నాణ్యతా పరీక్షలు నిర్వహించింది. నివేదిక ప్రకారం..  పాకిస్థాన్‌ తర్వాత అత్యంత కలుషితమైన దేశాల జాబితాలో బంగ్లాదేశ్, తజికిస్థాన్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. 

Current Affairs

తొలి కారుణ్య మరణం

దేశంలో కారుణ్య మరణానికి అనుమతి పొందిన మొదటి వ్యక్తిగా గుర్తించిన హరీశ్‌ రాణా (31) 2026, మార్చి 24న దిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. 13 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడి సుదీర్ఘ కోమాలోకి వెళ్లిపోయిన హరీశ్‌కు సుప్రీంకోర్టు కారుణ్య మరణం ప్రసాదిస్తూ మార్చి 11న చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. నిబంధనల ప్రకారం అతడికి చికిత్సను నిలిపివేయడంతో మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Current Affairs

యూసీసీ బిల్లుకు గుజరాత్‌ ఆమోదం

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేసేందుకు గుజరాత్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిలో భాగంగా యూనిఫాం సివిల్‌ కోడ్‌ బిల్లు- 2026ను 2026, మార్చి 24న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ సభలో ప్రవేశపెట్టారు.  బహుభార్యత్వాన్ని నిషేధించే ఈ బిల్లుతో దేశంలో యూసీసీ బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. 2024 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మొదట ఈ బిల్లును ఆమోదించి, అమలు చేస్తోంది. 

Current Affairs

సుప్రీంకోర్టు తీర్పు

క్రైస్తవ మతంలోకి మారి దాని గురించి క్రియాశీలకంగా బోధిస్తూ, పాటించే వ్యక్తులు ఎస్సీల కిందికి రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2025 ఏప్రిల్‌ 30న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం 2026, మార్చి 24న తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహా ఏ మతాలవారూ ఎస్సీల కిందికి రారని స్పష్టం చేసింది. ఈ మూడు మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారినవారు వెంటనే ఎస్సీ హోదాను కోల్పోతారని పేర్కొంది. షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు 2025, ఆగస్టు 26న విచారణ ముగించి తీర్పు రిజర్వ్‌ చేసింది. మార్చి 24న దాన్ని వెలువరించింది. 

Government Jobs

ఐఐఎఫ్‌సీఎల్‌ దిల్లీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎసీల్‌), అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్ మేనేజర్: 33 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో  కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఎంలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు సుమారు రూ.1,00,000. ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా  దరఖాస్తు చివరి తేదీ: 10-04-2026. Website:https://www.iifcl.in/

Government Jobs

ఐసీహెచ్‌ఆర్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్), 2025-2026 విద్యా సంవత్సరానికి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌): 80 ఖాళీలు అర్హత: గుర్తింపు పొందన విశ్వవిద్యాలయం నుంచి హిస్టారికల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫెలోషిప్‌: నెలకు రూ.17,600. ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ స్టెజ్‌-1 రాత పరీక్ష, స్టేజ్‌2 ప్రెజెంటేషన్‌, ఇంటర్వ్యూ రెండు దశల్లో (మొత్తం 160 మార్కులు) ఉంటుంది.   దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత, జనరేట్ అయిన అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ తీసి, సంతకం చేసి ఈ హార్డ్ కాపీతో పాటు పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, విద్యార్హత పత్రాల స్వయం ధ్రువీకరణ కాపీలను జతచేసి, పోస్ట్ ద్వారా మెంబర్ సెక్రటరీ, ఐసీహెచ్‌ఆర్‌, న్యూదిల్లీ చిరునామాకు పంపాలి. దరఖాస్తు ఫీజు: ఓబీసీలకు రూ.500;ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు చివరి తేదీ: 10.04.2026. ప్రింటెడ్‌ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 17/04/2026. Website:http://ichr.ac.in/v3/