Posts

Current Affairs

The Union Government

♦ The Union Government has approved a Rs.887-crore plan to develop a world-class marina at Mumbai Harbour, a move aimed at boosting coastal shipping, maritime tourism and waterfront-led urban development in the country’s financial capital. The project will be developed over nearly 12 hectares of seawater area and will have the capacity to berth 424 yachts of up to 30 metres in length. ♦ The marina will be implemented through a hybrid development model. The Mumbai Port Authority will invest around Rs.470 crore to build the core marina infrastructure on an engineering, procurement and construction (EPC) basis, while a private operator will develop the onshore facilities with an estimated investment of Rs.417 crore. 

Current Affairs

వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలిగా జస్టిస్‌ రాధారాణి

తెలంగాణ వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలిగా జస్టిస్‌ డా.గురజాల రాధారాణి 2025, డిసెంబరు 18న నియమితులయ్యారు. జస్టిస్‌ జైశ్వాల్‌ పదవీ విరమణ చేసిన 22 నెలల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమెను ఈ పదవిలో నియమించింది. జస్టిస్‌ రాధారాణి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.  రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలిగా ఆమె పేరును ఎంపిక కమిటీ సిఫారసు చేయగా... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. దీంతో ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Current Affairs

ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓగా శాశ్వత్‌ శర్మ

భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా శాశ్వత్‌ శర్మ నియమితులయ్యారు. 2026 జనవరి 1న ఆయన బాధ్యతలు చేపట్టి, అయిదేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం శాశ్వత్‌ శర్మ ఎయిర్‌టెల్‌ వినియోగదారు వ్యాపార విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎండీ, వైస్‌ఛైర్మన్‌ హోదాలో ఉన్న గోపాల్‌ విత్తల్‌ 2026 జనవరి 1 నుంచి భారతీ ఎయిర్‌టెల్‌కు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. 

Current Affairs

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, ఒమన్‌లు 2025, డిసెంబరు 18న చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు చేశాయి. ఉభయ దేశాల వృద్ధికి ఇది అనేక అవకాశాలు కల్పిస్తుందని ఒమన్‌ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆ దేశ సుల్తాన్‌ హైథమ్‌ బిన్‌ తారిక్‌తో ఆయన భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం-పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, సంస్కృతి, ప్రజా సంబంధాల లాంటి రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై వారిద్దరూ చర్చించారు.  ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా)’ పేరుతో కుదుర్చుకున్న ఎఫ్‌టీఏపై ప్రధాని మోదీ, సుల్తాన్‌ హైథమ్‌ల సమక్షంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్, ఒమన్‌ వాణిజ్య మంత్రి కయిస్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ యూసెఫ్‌ సంతకాలు చేశారు.

Current Affairs

ప్రముఖ శిల్పి రామ్‌ సుతార్‌ కన్నుమూత

ప్రముఖ భారత శిల్పి, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత రామ్‌ వాంజీ సుతార్‌ (100) 2025, డిసెంబరు 18న మరణించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ (సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌)తో పాటు స్టాచ్యూ ఆఫ్‌ ప్రాస్పరిటీ (కెంపెగౌడ)ల శిల్పాలను ఈయనే రూపొందించారు. పార్లమెంటు ముందు కూర్చొని ఉండే గాంధీ విగ్రహం, ఛత్రపతి శివాజీ విగ్రహం వంటి ఎన్నో ప్రసిద్ధ శిల్పాలకు రూపకర్త సుతార్‌. 

Current Affairs

‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు

ప్రముఖ దినపత్రిక ది ఎకనమిక్‌ టైమ్స్‌ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ‘ది ఎకనమిక్‌ టైమ్స్‌’ ప్రకటించింది. 2026 మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా సీఎం ఈ అవార్డును అందుకోనున్నారు. 

Current Affairs

వీబీ-జీ రామ్‌ జీ

గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైనవారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌)’ (వీబీ-జీ రామ్‌ జీ) బిల్లుకు 2025, డిసెంబరు 18న పార్లమెంట్‌ ఆమోదం లభించింది. మొదట ఆ బిల్లును లోక్‌ సభ ఆమోదించగా, అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎంజీనరేగా) చట్టాన్ని రద్దుచేసి ఆ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు.

Current Affairs

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ విజేతకు రూ.451 కోట్లు

2026 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ విజేత జట్టుకు రికార్డు స్థాయిలో రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. 2022 ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనాకు రూ.379 కోట్లు లభించాయి. గత కప్‌తో పోలిస్తే ఈసారి మొత్తం నగదు బహుమతిని ఫిఫా 48.9 శాతం పెంచింది. 2022 కప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ 3971 కోట్లు కాగా.. ఈసారి రూ.5911 కోట్లకు పెరిగింది.  గ్రూప్‌ దశలో పోటీపడే 48 జట్లకు రూ.81 కోట్ల చొప్పున దక్కనున్నాయి. 

Walkins

ఐసీఎంఆర్‌ దిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్-I (ఫైనాన్స్ & అకౌంట్స్) ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: యంగ్ ప్రొఫెషనల్-I (ఫైనాన్స్ & అకౌంట్స్) - 08 అర్హత: సంబంధిత అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ కనీసం 55 శాతం మార్కలతో బీకామ్‌/బీబీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  వయోపరిమితి: 2026 జనవరి 9వ తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.30,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2026 జనవరి 9,  వేదిక: ఐసీఎంఆర్ హెడ్‌క్వార్టర్స్, అన్సారీ నగర్ దిల్లీ. Website:https://www.icmr.gov.in/employment-opportunities

Government Jobs

కోల్ ఇండియాలో ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టులు

కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న సీఐఎల్‌ కేంద్రాలు/ అనుబంధ సంస్థల్లో వివిధ విభాగాల్లో ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ఇంటస్ట్రియల్‌ ట్రైనీ (సీఏ/సీఎంఏ): మొత్తం 125 పోస్టులు (యూజీ- 51; ఓబీసీ- 34; ఎస్సీ- 19; ఎస్టీ- 09; ఈడబ్ల్యూఎస్‌-12) కంపెనీల వారీగా పోస్టులు: 1. కోల్ ఇండియా లిమిటెడ్ (కోల్‌కతా): 7 2. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (ధన్‌బాద్): 12 3. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (రాంచీ): 15 4. సీఎంపీడీఐఎల్‌ (రాంచీ): 7 5. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 12 6. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 20 7. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 20 8. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 20 9. వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్: 12 అర్హత: అభ్యర్థులు ఐసీఏఐ నిర్వహించే సీఏ ఇంటర్మీడియట్ లేదా ఐసీఎంఏఐ నిర్వహించే సీఎంఏ ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇది వరకే ఏడాది లేదా అంతకు మించి ట్రైనింగ్‌ను పొందినవారు అర్హులు కారు. వయో పరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌కు 28 సంవత్సరాలు; ఓబీసీలకు 31 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు మించకూడదు.  స్టైపెండ్‌: నెలకు 22,000. ట్రైనింగ్‌ కాలం: 15 నెలలు. ఎంపిక ప్రక్రియ: సీఏ/సీఎంఏ మార్కుల మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు రుసుము: ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 26-12-2025. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15-01-2026. Website:https://www.coalindia.in/