Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

తెలంగాణలో పెరిగిన రెవెన్యూ లోటు

తెలంగణలో గడిచిన ఆరేళ్లలో రెవెన్యూ లోటు పెరిగిందని కేంద్ర సామాజిక, ఆర్థిక సర్వే 2025-26 వెల్లడించింది. జీఎస్‌డీపీ వృద్ధితో పోల్చితే సొంత రెవెన్యూ రాబడి తగ్గడం, ఆదాయం కంటే నగదు బదిలీ లాంటి ఖర్చులు పెరగడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. 2019లో మిగులు రాష్ట్రం నుంచి 2025 నాటికి రెవెన్యూ లోటులోకి వెళ్లిందని నివేదిక వివరించింది. అదే సమయంలో తెలంగాణలో ఆహారం, ఇంధనం సహా ప్రజలు రోజూ వినియోగించే వస్తువుల ధరలు ఈ ఏడాదికి స్థిరంగా ఉన్నాయని, ప్రస్తుత ఏడాదికి హెడ్‌లైన్‌ ద్రవ్యోల్బణం 0.20 శాతంగా ఉందని వెల్లడించింది.  ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన ‘తెలంగాణ వీహబ్‌’ ఆవిష్కరణల్ని పెట్టుబడిదారులతో అనుసంధానం చేసే గొప్ప వేదికగా సర్వే వెల్లడించింది. మహిళా సాధికారతలో ఈ ప్రాజెక్టు ఆదర్శంగా ఉందని తెలిపింది. 

Current Affairs

పెరిగిన విదేశీ విద్యార్థులు

దేశానికి వచ్చే వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌లలో పెరిగిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 2026, జనవరి 29న ఆర్థిక సర్వే-2025-26ను విడుదల చేసింది. గతంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ప్రధాన కేంద్రాలుగా ఉన్న కర్ణాటక, తమిళనాడులలో ప్రస్తుతం ప్రవేశాలు తగ్గగా.. కొత్తగా దక్షిణాదిలో ఏపీలో విదేశీ విద్యార్థుల నమోదు పెరిగింది. ఆయా రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు, సంస్థాగత సామర్థ్యం, అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల ప్రవేశాల పెంపునకు దోహదం చేస్తున్నాయి. భారత్‌కు వస్తున్న వారిలో నేపాల్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్‌లాంటి పొరుగు దేశాలకు చెందిన వారే ఎక్కువ. వీరు 13 రకాల కోర్సుల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు. ఎక్కువగా బీటెక్, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో చేరుతున్నారు.  దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 2000-01లో 7 వేలలోపు ఉండగా.. 2020 నాటికి సుమారు ఇది 49 వేలకు చేరింది. అయినప్పటికీ ఇది మొత్తం ఉన్నత విద్యలో నమోదైన విద్యార్థుల్లో కేవలం 0.10 శాతమే. 

Current Affairs

ఉచిత విద్యుత్తు పథకం

ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నలకు 2026 ఏప్రిల్‌ 1 నుంచి ఉచిత విద్యుత్తు అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 1.03 లక్షల మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పథకం అమలుకు ఏడాదికి రూ.85 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. 

Current Affairs

2025-26 ఆర్థిక సర్వే

2025-26 ఆర్థిక సర్వేను 2026, జనవరి 29న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సర్వే రూపొందింది. అంతర్జాతీయంగా ఒడుదొడుకులు, వాణిజ్య ముప్పులు వెంటాడుతున్నా భారత్‌లో వచ్చే ఏడాది (2027) ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీయనుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2026-27 ఏడాదిలో ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% మధ్య ఉండవచ్చని తెలిపింది. అయితే వినియోగం, పెట్టుబడుల్లో స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది (2025-26) వృద్ధి రేటైన 7.4% కంటే వచ్చే ఏడాది స్వల్పంగా నెమ్మదించనుంది. 

Walkins

ఐటీఆర్‌లో డిప్లొమా అప్రెంటిస్‌ ఉద్యోగాలు

చాందీపూర్‌, బాలాసోర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) ఏడాది కాలానికి టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: 1. టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 07 ఖాళీలు అర్హత: డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ/ఈటీసీ/ఐ అండ్‌ ఈ/ఈఐ లేదా ఏదైనా సంబంధిత విభాగాలు) ఉత్తీర్ణత ఉండాలి. జీతం: నెలకు రూ.10,9,000. ఇంటర్వ్యూ తేదీ: 04.02.2026. వేదిక: ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌), చందీపూర్‌. Website:https://drdo.gov.in/drdo/

Internship

డీప్‌థాట్‌ కల్చర్‌టెక్‌ వెంచర్స్‌ కంపెనీలో పోస్టులు

డీప్‌థాట్‌ కల్చర్‌టెక్‌ వెంచర్స్‌ (డీటీసీవీ) డేటా అనలిటిక్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సంస్థ: డీప్‌థాట్‌ కల్చర్‌టెక్‌ వెంచర్స్‌ పోస్టు పేరు: డేటా అనలిటిక్స్‌  నైపుణ్యాలు: డేటా అనలిటిక్స్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.2,000 . వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 20-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-data-analytics-internship-at-deepthought-culturetech-ventures-private-limited1769005532

Government Jobs

యూసీఎస్‌ఎల్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు

కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్‌) శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 13 వివరాలు: 1. అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌: 02 2. సీనియర్‌ మేనేజర్‌: 01 3. మేనేజర్: 05 4. డిప్యూటీ మేనేజర్: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ (ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 2026 జనవరి 27వ తేదీ నాటికి అసిస్టెంట్‌ జనరల్ మేనేజేర్‌కు 50 ఏళ్లు,  సీనియర్ మేనేజర్‌, మేనేజర్‌కు 40 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు మించకూడదు.  జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.50,000 - రూ.2,20,000.  దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 17. Website:https://udupicsl.com/index.php/careers/

Government Jobs

రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్‌ ప్రొఫెసర్ పోస్టులు

బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సీనియర్‌ ప్రొఫెసర్  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా ea-director@rri.res.in కు పంపాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28. Website:https://www.rri.res.in/careers/regular-other-openings

Government Jobs

డీఆర్‌డీఓ విశాఖపట్నంలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

విశాఖపట్నంలోని డిఫెన్స్ రిసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.  వివరాలు: జూనియర్ రిసెర్చ్ ఫెలో - 07 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సంబంధిత విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.37,000. ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 26. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ఎన్‌ఎస్టీఎల్, విజ్ఞాన్ నగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. Website:https://www.drdo.gov.in/drdo/en/offerings/vacancies/nstl-visakhapatnam-calls-walk-interview-selection-junior-research-fellows

Admissions

ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాల సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎంపికైన విద్యార్థులకు స్టేట్‌ సిలబస్‌, ఆంగ్ల మాధ్యమ ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వివరాలు: 5వ తరగతి ప్రవేశాలు 2026-27 సీట్లు: ప్రతి జనరల్ ఎస్టీ గురుకుల పాఠశాలలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఈ 80 సీట్లను ఒక్కో సెక్షన్‌కు 40 మంది చొప్పున రెండు సెక్షన్లుగా విభజిస్తారు. రిజర్వేషన్‌: మొత్తం సీట్లలో ఎస్టీలకు 78%, ఎస్సీలకు 12%, బీసీలకు 5%, ఓసీలకు 2%, ఏఈక్యూ కింద 3% కేటాయించారు. అయిదో తరగతి ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. 6, నుంచి 9వ తరగతి బ్యాక్‌లాగ్‌ సీట్లలో ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంటుంది (వీటీ కోసం విడిగా ఆయా విద్యా సంస్థల స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు).  అర్హత: విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో లేదా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో (GAHS) లేదా ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000 మించకూడదు. వయోపరిమితి: ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులు 01-09-2013 నుంచి 31-08-2017 మధ్య జన్మించి ఉండాలి. బీసీ & ఓసీ అభ్యర్థులు: 01-09-2015 నుంచి 31-08-2017 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. పరీక్షా విధానం: ఓఎంఆర్‌ ఆధారిత ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. 4వ తరగతి స్థాయి సిలజస్‌లో మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. తెలుగు-10 మార్కులు, ఇంగ్లిష్‌-10 మార్కులు, గణితం-15 మార్కులు, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌-15 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05-02-2026. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28-02-2026. హాల్ టిక్కెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం: 10.03.2026. ప్రవేశ పరీక్ష తేదీ: 04-04-2026. మెరిట్ జాబితా వెల్లడి: 29.04.2026. Website:https://twreiscet.apcfss.in/