భారత సంతతి సీఈఓల్లో సంపన్నురాలు జయశ్రీ
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంపన్న సీఈఓల్లో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానంలో నిలిచారు. ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025’ ప్రకారం, అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ రూ.50,170 కోట్ల నికర సంపదతో సంపన్నుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ అయిన అరిస్టా నెట్వర్క్స్లో 2008 నుంచి ఆమె సేవలు అందిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. ఆమె నాయకత్వంలో 2024లో కంపెనీ 7 బిలియన్ డాలర్ల (రూ.63,000 కోట్ల) ఆదాయాన్ని నమోదు చేసింది. 2023తో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అరిస్టా నెట్వర్క్స్లో ఆమెకు సుమారు 3 శాతం వాటా ఉంది. జయశ్రీ ఉల్లాల్ 1961 మార్చి 27న లండన్లో భారత సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించారు. 2025లో ఇంజినీరింగ్లో గౌరవ డాక్టరేట్ పొందారు.