Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఏపీ

ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించటమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ ‘గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (మహా హరిత కుడ్యం)’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీరప్రాంతం పొడవునా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్‌ ఏర్పాటు చేయనుంది. దీన్ని తీరానికి బయోషీల్డ్‌గా (జీవ రక్షణ కవచం) తీర్చిదిద్దినుంది. మొత్తం మూడు జోన్లతో గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ను ఏర్పాటు చేయనుంది. ముఖ్యాంశాలు: ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల ముప్పును అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. రాష్ట్రంలో తీరప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు: 33 లక్షల మంది కోతకు గురవుతున్న తీరప్రాంతం: 32% మేర

Current Affairs

ప్రపంచ హిందీ దినోత్సవం

మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. ఉత్తర భారతదేశంలో దీన్ని కేవలం భాషగానే కాకుండా తమ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. భారత సంస్కృతిలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. మన రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. హిందీ భాష ప్రాముఖ్యతను చాటి చెప్పే లక్ష్యంతో ఏటా జనవరి 10న ‘ప్రపంచ హిందీ దినోత్సవం’గా(World Hindi Day) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష వాడకాన్ని ప్రోత్సహించడంతోపాటు ఈ భాష మాట్లాడే సమూహాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం హిందీ భాషను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించే లక్ష్యంతో 1975, జనవరి 10న నాగ్‌పుర్‌లో మొదటి హిందీ ప్రపంచ సదస్సు జరిగింది. దీన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.  ఈ సదస్సు జరిగిన జ్ఞాపకార్థం ఏటా జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం (విశ్వ హిందీ దివస్‌)గా జరపాలని 2006లో అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 

Current Affairs

ఆదిత్య-ఎల్‌1

శక్తిమంతమైన సౌర తుపాన్ల కారణంగా.. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రంపై పడే ప్రభావం గురించి  ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం సరికొత్త విషయాలను అందించింది. సౌర తుపానులోని తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ప్రభావం అధికంగా ఉంటున్నట్లు వెల్లడైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది.  ఆదిత్య-ఎల్‌1 అనేది భారత తొలి సౌర పరిశీలక ఉపగ్రహం. 2024 అక్టోబరులో వచ్చిన సౌర తుపానుకు సంబంధించిన డేటాను ఇది అందించింది. దాన్ని, ఇతర అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లు అందించిన వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. సూర్యుడి నుంచి భారీ స్థాయిలో వెలువడిన సౌర ప్లాస్మా ప్రభావాన్ని పరిశీలించారు. సౌర తుపానుకు సంబంధించిన అల్లకల్లోల ప్రాంతం.. పుడమి అయస్కాంత క్షేత్రాన్ని తీవ్రస్థాయిలో సంకోచింపచేస్తున్నట్లు గుర్తించారు. 

Current Affairs

వ్యవసాయంలో చరిత్రాత్మక వృద్ధి

2014-15 నుంచి 2024-25 వరకు పదేళ్ల కాలంలో చరిత్రలో ఎన్నడూలేనంత వృద్ధిని వ్యవసాయ రంగం సాధించినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ సమయంలో వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధిరేటు నమోదు చేసిందని, ఇది గతంలో ఎన్నడూ లేదని తెలిపింది. ప్రపంచంలోని ప్రధాన వ్యవసాయ దేశాలతో పోలిస్తే ఇది అత్యధికమని తెలిపింది. చైనా సాధించిన 4.10% వృద్ధిరేటు కంటే ఇది అధికమని పేర్కొంది. 2015-16 నుంచి 2024-25 మధ్య ఏ ఒక్క ఏడాదీ ప్రతికూల వృద్ధి నమోదు కాలేదని తెలిపింది.  మత్స్యరంగం 9% వృద్ధి సాధించింది. పంటలతో పోలిస్తే ఇది రెట్టింపునకంటే ఎక్కువ.  అటవీ ఉత్పత్తుల వృద్ధి కూడా దాదాపు 4 శాతానికి చేరింది. 

Current Affairs

పెరిగిన బియ్యం ఎగుమతులు

2025లో మనదేశం నుంచి 215.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2024లో ఎగుమతి అయిన 180.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంతో పోలిస్తే, ఇవి 19.4% అధికం. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 25% వృద్ధితో 151.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు, బాస్మతీ బియ్యం 8% పెరిగి 64 లక్షల మెట్రిక్‌ టన్నులు తరలి వెళ్లినట్లు వివరించింది. ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ఇది సాధ్యమైంది. దేశీయంగా దిగుబడులు పెరిగినందునే, బియ్యం ఎగుమతులకు మన ప్రభుత్వం అనుమతించింది.

Current Affairs

అరుణాచల్‌లో కాగితం లాంటి పుట్టగొడుగులు

సన్నగా కాగితంలా ఉండే ‘ప్లీటెడ్‌ ఇంక్‌క్యాప్‌’ పుట్టగొడుగులను అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలిసారిగా గుర్తించారు. లాంగ్డింగ్‌ జిల్లాలోని ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రం ఐసీఏఆర్‌-కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే)లో ఈ తరహా పుట్టగొడుగులను కనుకుకన్నారు. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ‘పారాసోలా ప్లికాటిలిస్‌’. దీని జీవితకాలం 24 గంటల కంటే తక్కువే. సన్నగా కాగితంలా బూడిద రంగులో ఉండే క్యాప్, పెళుసైన కొమ్మలతో ఈ పుట్టగొడుగు కనిపిస్తుంది. నేలలో పోషకాల పునర్వినియోగాన్ని మెరుగుపరిచే ఎంజైమ్‌లను విడుదల చేయడం ద్వారా రాలిపోయిన ఆకులను, సేంద్రియ పదార్థాలు భూమిలో కలిసిపోయేందుకు ఈ పుట్టగొడుగు సాయపడుతుంది. 

Current Affairs

‘ఔట్‌స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్‌ అవార్డు’

డెయిరీ రంగ అభివృద్ధిలో దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ వీసీఎండీ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక ‘ఔట్‌స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్‌ అవార్డు-2025’ లభించింది. ఇండియన్‌ డెయిరీ అసోసియేషన్‌ సౌత్‌జోన్‌ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని కాలికట్‌ ట్రేడ్‌సెంటర్‌లో నిర్వహించిన సదరన్‌ డెయిరీ అండ్‌ ఫుడ్‌ కాన్‌క్లేవ్‌-2026 ప్రారంభ సభలో ప్రదానం చేశారు. 

Current Affairs

ప్రపంచ టాప్‌-100 పోర్ట్‌ల్లో విశాఖ

దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయంగా, ప్రపంచంలో టాప్‌-100లో ఒకటిగా విశాఖ పోర్ట్‌ స్థానం దక్కించుకున్నట్లు కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ 2026, జనవరి 10న పేర్కొన్నారు. విశాఖలో రూ.305 కోట్లతో దేశంలోనే అత్యాధునిక షిప్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.  విశాఖలోని సాగరమాల కన్వెన్షన్‌లో విశాఖ పోర్ట్‌ అథారిటీకి సంబంధించిన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు సోనోవాల్‌ శంకుస్థాపన చేశారు. ‘మారిటైం ఇండియా విజన్‌ 2030’, ‘మారిటైం అమృత్‌కాల్‌ విజన్‌ 2047’ రెండూ భారత నౌకాయాన అభివృద్ధికి ప్రకటించారన్నారు.

Internship

డీఆర్‌డీఓ హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

పుణెలోని రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్‌డీవో- హైఎనర్జీ మెటీరియల్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌) ఆరు నెలల కాలానికి ఏరోస్పేస్‌, కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ తదితర ఇంజినీరింగ్‌ విభాగంలో పేయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: పేయిడ్‌ ఇంటర్స్‌షిప్‌: 40 ఖాళీలు విభాగాలు: ఏరోస్పేస్‌, కెమికల్‌, మెకానికల్‌, కెమికల్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌, ఎంటెక్‌/ఎంఎస్సీ (చివరి ఏడాది) చదువుతున్న వారు. స్టైపెండ్‌: నెలకు రూ.5,000. ఎంపిక విధానం: విద్యార్హతల ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ది డైరెక్టర్‌ హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌, సుతర్వాడి, పుణె చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 20.01.2026. ఇంటర్న్‌షిప్ శిక్షణ ప్రారంభ తేదీ: 01.02.2026. Website:https://drdo.gov.in/drdo/

Government Jobs

టీసీఐఎల్‌లో మైక్రోవేవ్‌ రిగ్గర్‌ పోస్టులు

టెలీ కమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (టీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన మైక్రోవేవ్‌ రిగ్గర్, ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 34 వివరాలు: 1. మైక్రోవేవ్‌ రిగ్గర్‌: 31 2. ట్రాన్స్‌లేటర్‌: 03 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 40 - 45 ఏళ్లు. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 23.  Website:https://www.tcil.net.in/current_opening.php