Posts

Current Affairs

David Szalay won the Booker Prize.

♦ Canadian-Hungarian-British writer David Szalay won the Booker Prize for fiction for his novel ‘Flesh’ at a ceremony in London on 10 November 2025. ♦ Flesh is the story of an ordinary man's life over several decades in which what isn't on the page is just as important as what is. ♦ Szalay to take the coveted literary award, which brings a £50,000 ($66,000) payday and a big boost to the winner’s sales and profile.  ♦ Szalay, who was born in Canada, raised in the U.K. and lives in Vienna, was previously a Booker finalist in 2016 for "All That Man Is," a series of stories about nine wildly different men. ♦ The Booker Prize was founded in 1969 and has established a reputation for transforming writers' careers. ♦ Its winners have included Salman Rushdie, Ian McEwan, Arundhati Roy, Margaret Atwood and Samantha Harvey, who took the 2024 prize for space station story "Orbital."

Current Affairs

శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం

సమాజాభివృద్ధిలో సైన్స్‌ పాత్రను గుర్తించడంతోపాటు దాని వల్ల కలిగే దుష్ప్రభావాలపైనా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా నవంబరు 10న ‘శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం’గా (World Science Day For Peace And Development) నిర్వహిస్తారు. విజ్ఞానశాస్త్రంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను తెలియజేయడం; శాంతిని పెంపొందించడంలో, స్థిరమైన సమాజాలను నిర్మించడంలో సైన్స్‌ పాత్రను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం విజ్ఞానశాస్త్రం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు దేశాలు, ప్రాంతాల మధ్య తలెత్తుతున్న సంఘర్షణలను రూపుమాపి, శాంతిని నెలకొల్పేలా శాస్త్రవేత్తల మధ్య సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా నవంబరు 10న ‘శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం’గా జరుపుకోవాలని యునెస్కో జనరల్‌ అసెంబ్లీ 2001లో తీర్మానించింది.   2002 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 2025 నినాదం: 'Trust, Transformation, and Tomorrow: The Science We Need for 2050'

Current Affairs

అందెశ్రీ మరణం

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64 ఏళ్లు) 2025, నవంబరు 10న హైదరాబాద్‌లో మరణించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో... ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జులై 18న జన్మించారు.  ‘జయ జయహే తెలంగాణ... జననీ జయ కేతనం...’ అంటూ తెలంగాణకు అధికారిక గీతం అందించారు. ఈ గీతాన్ని సరస్వతి అమ్మవారికి అంకితమిచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో కామారెడ్డిలో ధూంధాం పురుడు పోసుకున్నప్పుడు... దాన్ని ఏ పాటతో మొదలుపెట్టాలనే మీమాంస నుంచే 2002 సెప్టెంబరు 30న ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే గీతం వచ్చిందని చెప్పేవారు. 

Current Affairs

హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం

భారత ప్రభుత్వం అందించిన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దాన్ని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలు 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందనేందుకు ఈ ఎయిర్‌పోర్ట్‌ ఒక చిహ్నమని ముయిజ్జు పేర్కొన్నారు. 

Current Affairs

జూనియర్‌ హాకీ సారథిగా జ్యోతి

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు జ్యోతి సింగ్‌ సారథ్యం వహించనుంది. నవంబరు 25 నుంచి డిసెంబరు 13 వరకు చిలీలోని శాంటియాగోలో జరుగనున్న టోర్నీ కోసం 20 మంది క్రీడాకారులతో భారత జట్టును 2025, నవంబరు 10న ప్రకటించారు. భారత మాజీ ఆటగాడు తుషార్‌ ఖండ్కర్‌  చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు.

Current Affairs

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సామ్రాట్‌ రాణా స్వర్ణం నెగ్గాడు. 2025, నవంబరు 10న కైరోలో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో సామ్రాట్‌ 243.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. హు కయ్‌ (చైనా, 243.3) రజతం, భారత షూటర్‌ వరుణ్‌ తోమర్‌ (221.7) కాంస్యం నెగ్గారు. మరోవైపు భారత మహిళల జట్టు 10మీ ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో రజత పతకంతో సత్తాచాటింది.

Current Affairs

అపెక్స్‌ యోగా అండ్‌ నేచురోపతి పరిశోధన కేంద్రం

 దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.750 కోట్లతో ‘అపెక్స్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ యోగా అండ్‌ నేచురోపతి’ ఏర్పాటు కానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం 40 ఎకరాలు కేటాయించాలని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ యోగా, నేచురోపతి విభాగం ద్వారా ఏర్పాటుకానున్న ఈ పరిశోధన కేంద్రం 450 పడకలు కలిగి అన్ని వసతులతో ఏర్పాటు కానుంది.

Walkins

ఏఏయూలో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

గుజరాత్‌లోని ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఏయూ)  ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 08 వివరాలు: 1. రిసెర్చ్ అసోసియేట్ - 05 2. సీనియర్ రిసెర్చ్ ఫెలో -03 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ(ఇన్ ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ / ఫ్లోరికల్చర్ ల్యాండ్‌స్కేప్ ఇన్ ప్లాంట్ పాథాలజీ.ఇన్ సాయిల్ సైన్స్/ సాయిల్ సైన్స్ & అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ఇన్ వెజిటబుల్ సైన్స్, ఇన్ వెజిటబుల్ సైన్స్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ కు రూ.67,000. సీనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000.  ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 18-11-2025. వేదిక: యాజ్ఞవల్క్య హాల్, డైరెక్టరేట్ ఆఫ్ రిసెర్చ్, ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఆనంద్-388110. Website:https://aau.in/careers-list

Internship

డిజి అకాయ్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

డిజి అకాయ్‌ కంపెనీ గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: డిజి అకాయ్‌  పోస్టు పేరు: గ్రాఫిక్‌ డిజైన్‌  నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, డిజిటల్‌ ఇలస్ట్రేషన్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.7,000- రూ.11,000. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 28-11-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-graphic-design-internship-at-digi-acai1761712494

Government Jobs

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌లో ఉద్యోగాలు

హైదారాబాద్‌, సంగారెడ్డి ఎద్దుమైలారంలోని ఆర్మ్‌డ్‌ వెహికిల్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (ఓఎఫ్‌ఎంకే) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 17 వివరాలు: 1. సీనియర్‌ మేనేజర్‌: 01 2. జూనియర్‌ మేనేజర్‌: 16 విభాగాలు: ఆర్మౌర్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, ఎలక్ట్రకల్‌, మెటలార్జీ, సీఏడీ స్పెషలిస్ట్‌, మెకానికల్‌, మెకానికల్‌) అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: సీనియర్‌ మేనేజర్‌కు 45 ఏళ్లు; జూనియర్‌ మేనేజర్‌కు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.  జీతం: నెలకు సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000, జూనియర్‌ మేనేజర్‌కు రూ.30,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ది డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/హెచ్‌ఆర్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 28.11.2025. Website:https://ddpdoo.gov.in/career