Posts

Current Affairs

జాతీయ రాజ్యాంగ దినోత్సవం

భారత్‌ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాంగం. పౌరులు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ విభాగాలు - వాటి స్వరూపం, స్వభావం, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. వ్యక్తి స్వేచ్ఛకు, సర్వతోముఖాభివృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ భావనలను సూచించే ప్రాథమిక పత్రంలా ఇది పనిచేస్తుంది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ఏటా నవంబరు 26న ‘జాతీయ రాజ్యాంగ దినోత్సవం’గా (National Constitution Day) నిర్వహిస్తారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్నవారిని గౌరవించడం, రాజ్యాంగ సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన రాజ్యాంగానికి 1949, నవంబరు 26న ఆమోదం లభించింది. దీంతో ఆ తేదీని ‘జాతీయ రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రభుత్వం భావించింది.  2015 భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఏడాది నుంచి నవంబరు 26ను రాజ్యాంగ దినోత్సవంగానూ ప్రకటించింది. నాటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. 

Current Affairs

చెస్‌ ప్రపంచకప్‌

భారత్‌ ఆతిథ్యమిచ్చిన చెస్‌ ప్రపంచకప్‌లో ఉజ్బెకిస్థాన్‌కి చెందిన జవోకిర్‌ సిందరోవ్‌ విజేతగా నిలిచాడు. అతడి వయసు 19 ఏళ్లు. అత్యంత పిన్న వయసులో ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని సొంతం చేసుకున్న ప్లేయర్‌గా సిందరోవ్‌ రికార్డు నెలకొల్పాడు. ఫైనల్లో అతడు 2.5-1.5తో వీ యి (చైనా)ను ఓడించాడు.  నాదిర్బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను 2-0తో ఓడించిన ఆండ్రీ ఎసిపెంకో (ఫిన్లాండ్‌) మూడో స్థానంలో నిలిచాడు. 

Current Affairs

2030 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కువలు

అహ్మదాబాద్‌కు 2030 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కులను 2025, నవంబరు 26న అధికారికంగా కట్టబెట్టారు. కామన్వెల్త్‌ స్పోర్ట్‌ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కామన్వెల్త్‌ క్రీడల ఎగ్జిక్యూటివ్‌ బోర్డు అక్టోబరులో అహ్మదాబాద్‌ పేరును సిఫారసు చేసింది. ఇంతకుముందు 2010లో భారత్‌ దిల్లీలో కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. అందుకోసం రూ.70 వేల కోట్లు ఖర్చుచేసింది.  2030లో 15-17 క్రీడల్లో పోటీలు నిర్వహించాలని భారత్‌ భావిస్తోంది. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌ ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. 

Current Affairs

యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్‌ విగ్రహం

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని 2025, నవంబరు 26న ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఖాలెద్‌ ఎల్‌ ఎనానీ, 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

Current Affairs

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రజాస్వామ్యం, ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ (ఐఐడీఈఏ) అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 2026 సంవత్సర కాలంలో జరిగే కౌన్సిల్‌ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహిస్తారని ఎన్నికల సంఘం 2025, నవంబరు 26న తెలిపింది.  డిసెంబరు 3న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరగనున్న ఐఐడీఈఏ సభ్యదేశాల సమావేశంలో ఆయన అధ్యక్ష పదవిని స్వీకరిస్తారని తెలిపింది.

Current Affairs

ప్రోత్సాహక పథకం

అరుదైన భూ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించేందుకు రూ.7,280 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘స్కీమ్‌ టు ప్రమోట్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ సింటెర్డ్‌ రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌’కు అనుమతి లభించింది. ఏడాదికి 6,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం సృష్టించడం దీని లక్ష్యం. ఈ పథకం కాల వ్యవధి 7 ఏళ్లు. ఇందులో రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌ (ఆర్‌ఈపీఎం) తయారీ ప్లాంట్‌ ఏర్పాటు కోసం రెండేళ్ల సమయాన్ని (గెస్టేషన్‌ పీరియడ్‌) కూడా కలిపారు. ఆర్‌ఈపీఎం విక్రయాలపై 5 ఏళ్లు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు.

Current Affairs

ఇంద్రజాల్‌ రేంజర్‌

దేశంలోనే మొదటి యాంటీ డ్రోన్‌ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్‌ రేంజర్‌’ను హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న టీ హబ్‌లో 2025, నవంబరు 26న ఆవిష్కరించారు. భారత ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ దేవేంద్ర ప్రతాప్‌ పాండే, ఇంద్రజాల్‌ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్‌ రాజు దీన్ని విడుదల చేశారు. ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని రూపొందించారు.  దేశ సరిహద్దులు, బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్థ స్థలాలు, డ్రోన్‌ దాడి ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలపై ఇది నిఘా పెడుతుంది.

Current Affairs

స్వదేశీ నౌకా ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థ

ఓడరేవుల కోసం దేశంలో మొదటి స్వదేశీ నౌకా ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థను ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దీన్ని అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు 2025, నవంబరు 26న పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఇప్పటికే కేరళలోని విఝింజమ్‌ ఇంటర్నేషనల్‌ సీపోర్ట్‌ లిమిటెడ్‌(వీఐఎస్‌ఎల్‌)లో అమలు చేశారు. పశ్చిమ తీరంలోని మరో రెండు ఓడరేవుల్లోనూ అమలుకు ఐఐటీ మద్రాస్‌తో చర్చలు జరుపుతున్నాయి.   

Walkins

ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

గాంధీనగర్‌లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు:  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లెక్చరర్‌ విభాగాలు: టాక్సికాలజీ, నానోటెక్నాలజీ, ఫోరెన్సిక్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్‌/బ్లాక్‌ చైన్‌, లా, ఐటీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.75,000- రూ.90,000; లెక్చరర్‌కు రూ.68,000. ఇంటర్వ్యూ తేదీలు: 28.11.2025, 01.12.2025. వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ గాంధీనగర్‌ క్యాంపస్‌. Website:https://nfsu.ac.in/Contractual_Recruitment

Internship

ఎక్రాస్‌ ద గ్లోబ్‌ (ఏటీజీ) కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

ఎక్రాస్‌ ద గ్లోబ్‌ (ఏటీజీ)  కంపెనీ డిజిటల్‌ మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: ఎక్రాస్‌ ద గ్లోబ్‌ (ఏటీజీ)  పోస్టు పేరు: డిజిటల్‌ మార్కెటింగ్‌  నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.2,500- రూ.10,000 . వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 19-12-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-digital-marketing-internship-at-across-the-globe-atg1763519255