Posts

Current Affairs

బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐ

బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రస్తుత 74% నుంచి 100 శాతానికి పెంచే బిల్లుకు 2025, డిసెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబరు 19న ముగియనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే బీమా సవరణ బిల్లు-2025ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్‌ చట్టం-1938లో సవరణలు చేసి, జీవిత, సాధారణ బీమా రెండింటినీ ఒకే సంస్థ అందించే విధంగా కాంపోజిట్‌ లైసెన్స్‌ విధానాన్ని తీసుకురావాలని కొత్త బిల్లు నిర్ణయించింది.

Current Affairs

ఆర్‌బీఐ గణాంకాలు

దేశవ్యాప్తంగా పండ్ల ఉత్పత్తిలో మొదటిస్థానంలో, పండ్లతోటల సాగులో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1.93 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మహారాష్ట్ర 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తితో మూడోస్థానంలో ఉంది. 8.07లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగు చేస్తూ దేశంలో రెండోస్థానంలో ఏపీ ఉండగా 8.96 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది.

Current Affairs

తగ్గిన రైలు ప్రమాదాలు

దేశంలో రైలు ప్రమాదాలు 2004-14 నుంచి 2024-25 మధ్యకాలంలో ఏటా 171 నుంచి 64కు తగ్గిపోయాయని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆయన 2025, డిసెంబరు 12న రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు.  2004-14 మధ్య పదేళ్ల కాలంలో మొత్తం 1,711 ప్రమాదాలు జరగ్గా, 2014-25 మధ్యకాలంలో 709 జరిగాయని చెప్పారు. 2025-26లో ఈ నవంబరు వరకు 11 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. 

Current Affairs

కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు

కేంద్ర మంత్రి మండలి 2025, డిసెంబరు 12న ‘వికసిత భారత్‌ శిక్షా అధీక్షణ్‌ బిల్లు’కు ఆమోదం తెలిపింది. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈసీ)లో భాగంగా ఉన్నత విద్యను ఒకే సంస్థ నియంత్రణలోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా దీన్ని రూపొందించారు. ప్రతిపాదిత బిల్లును తొలుత ‘భారత ఉన్నత విద్యా కమిషన్‌’(హెచ్‌ఈసీఐ)గా పేర్కొన్నారు. అయితే, తాజాగా దాని పేరును మార్చారు. ప్రస్తుతం విడివిడిగా ఉన్న యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నూతన సంస్థ నియంత్రణలోకి వస్తాయి. న్యాయ, వైద్య కళాశాలలను దీని పరిధి నుంచి మినహాయించారు. ప్రధాని అధ్యక్షతన దిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన గణనకు రూ.11,718.24 కోట్లు మంజూరు చేసింది. 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఇళ్ల జాబితా రూపకల్పన జరుగుతుంది. 2027 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనూ నిర్వహిస్తారు. 30 లక్షల మంది గణకులను నియమిస్తారు. డిజిటల్‌ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది.

Internship

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

దిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ డేటా ఇంజినీరింగ్ అండ్‌ అనలిటిక్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 50 వివరాలు: సంస్థ: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌ పోస్టు పేరు: జావా/పీహెచ్‌పీ/పైథాన్ డెవలపర్/నోడ్జెఎస్/డాట్‌నెట్, యూఐ -యూఎక్స్ డిజైనర్/ఫ్రంటెండ్ డెవలపర్, ప్రోడక్ట్ టెస్టింగ్/సెక్యూరిటీ, డేటాబేస్ ప్రోగ్రామర్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజినీరింగ్ & అనలిటిక్స్ నైపుణ్యాలు: అత్యంత స్కేలబుల్ అప్లికేషన్ కోసం అధ్యయనం, ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడం, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వెబ్-బేస్డ్ అప్లికేషన్‌లలో మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేయడంలో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.20,000. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 24-12-2025. Website:https://dic.gov.in/careers/

Government Jobs

ఎన్‌హెచ్‌ఎం ఈస్ట్‌ గోదావరిలో పోస్టులు

నేషనల్ హెల్త్‌ మిషన్‌ ఈస్ట్ గోదావరి (ఎన్‌హెచ్‌ఎం) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 35 వివరాలు: 1. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 03 2. ఫార్మసిస్ట్: 03 3. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 03 4. ఆడియో మెట్రీషియన్‌: 04 5. సీనియర్ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌: 03 6. హెల్త్ విజిటర్‌(టీబీ): 05 7. డిస్ట్రిక్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌: 02 8. డిస్ట్రిక్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ మిక్స్‌ కో-ఆర్డినేటర్‌: 01 9. అకౌంటెంట్‌: 02 10. డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ కౌన్సిలర్‌: 01 11. ఎల్‌జీఎస్‌: 08 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, డిగ్రీ, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 42 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉటుంది. వేతనం: నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,450, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.23,393, ఆడియో మెట్రీషియన్‌కు రూ.25,526, సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌కు రూ.33,975, హెల్త్‌ విజిటర్‌కు రూ.26,619, డిస్ట్రిక్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ రూ.35,520, డిస్ట్రిక్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ మిక్స్‌ కో-ఆర్డినేటర్‌కు రూ.28,980, అకౌంటెంట్‌కు రూ.18,233, డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ కౌన్సిలర్‌కు రూ.21,959, ఎల్‌జీఎస్‌కు రూ.15,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 డిసెంబర్ 15. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్‌ 20. Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/

Government Jobs

ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌లో అసోసియేట్స్‌ పోస్టులు

నేషనల్ హైవేస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) అసోసియేట్స్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అసోసియేట్స్‌: 64 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌(సివిల్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 30 ఏళ్లు. జీతం: నెలకు రూ.70,000 - రూ.80,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 డిసెంబర్ 18. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 12.  Website:https://www.nhidcl.com/current-jobs

Government Jobs

ఐఐటీ భువనేశ్వర్‌లో నాన్-టీచింగ్ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  భువనేశ్వర్‌ (ఐఐటీ భువనేశ్వర్) వివిధ విభాగాల్లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: నాన్-టీచింగ్: 101 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/బీఈ/ బీటెక్‌/ఎంటెక్/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 32 ఏళ్ల నుంచి 55 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 8. Website:https://www.iitbbs.ac.in/index.php/home/jobs/non-teaching-jobs/

Government Jobs

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో లీగల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఒప్పంద ప్రాతిపదికన లీగల్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: లీగల్‌ కన్సల్టెంట్‌: 75 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(లా)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 2025 డిసెంబర్‌ 30వ తేదీ నాటికి 35 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.80,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 30. Website:https://enforcementdirectorate.gov.in/vacancies

Internship

Internship Posts In Digital India Corporation

Digital India Corporation in Delhi is inviting applications for the recruitment of Data Engineering & Analytics posts. No. of Posts: 50 Details: Organization: Digital India Corporation Post Name: Java/PHP/Python Developer/NodeJS/DotNet, UI-UX Designer/Frontend Developer, Product Testing/Security, Database Programmer, Business Analyst, Data Engineering & Analytics Skills: Must have expertise in studying, developing best practices for highly scalable applications, developing modules in web-based applications using latest technology. Stipend: Rs.20,000. Duration: 6 months Application deadline: 24-12-2025. Website:https://dic.gov.in/careers/