Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్‌ శుక్లా

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్రకు బదిలీచేసి ఆ స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాను కేంద్రం నియమించింది. జిష్ణుదేవ్‌వర్మ దాదాపు 20 నెలలు గవర్నర్‌గా తెలంగాణకు సేవలు అందించారు. ఆయన 2024 జులై 31న తెలంగాణకు నాలుగో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.  1952 ఏప్రిల్‌ 1న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లా రుద్రాపుర్‌ గ్రామంలో జన్మించిన శుక్లా ఇదివరకు మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.   2023 ఫిబ్రవరి 18న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణకు బదిలీ అయ్యారు. 

Current Affairs

జనాభా నిర్వహణ విధానం

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్వహణ విధానం తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2026, మార్చి 5న అసెంబ్లీలో తెలిపారు. ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ఈ పాలసీపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నెల రోజులపాటు చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఏప్రిల్‌ 1 నుంచి అమలు ప్రారంభిస్తామని ప్రకటించారు. రెండో బిడ్డ, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రసవం సమయంలోనే ఒక్కో బిడ్డకు రూ.25 వేల చొప్పున తల్లిదండ్రులకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. ఆ పిల్లలకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. ఇద్దర్ని మించి కనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇస్తామని పేర్కొన్నారు.

Current Affairs

కొత్త గవర్నర్లు

కేంద్ర ప్రభుత్వం 2026, మార్చి 5న 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇప్పుడు నియమించిన 9 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు/ లెఫ్టినెంట్‌ గవర్నర్లలో అయిదుగురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ముగ్గుర్ని కొత్తగా నియమించింది. మైనార్టీ వర్గానికి చెందిన బిహార్‌ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ పదవీకాలం ముగియడంతో ఆ స్థానాన్ని సయ్యెద్‌ అటా హస్నైన్‌తో భర్తీచేశారు.  పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ మార్చి 5న తన పదవికి రాజీనామా చేశారు.  తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి    పశ్చిమబెంగాల్‌కు బదిలీ అయ్యారు.

Current Affairs

ప్రగతి, వికాస్‌

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా హోంమంత్రి అమిత్‌ షా 2026, మార్చి 5న ప్రగతి, వికాస్‌ పేరుతో రెండు జనగణన చిహ్నాలను ఆవిష్కరించారు. స్త్రీ, పురుష జనగణకులను ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు. 2027 జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన సమాచారాన్ని వీటి సాయంతో ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేస్తారు. తొలిసారి డిజిటల్‌ రూపంలో సేకరించనున్న లెక్కల కోసం సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌) రూపొందించిన డిజిటల్‌ సాధనాలను కూడా అమిత్‌షా ఈ సందర్భంగా విడుదల చేశారు. 

Current Affairs

అలెగ్జాండర్‌ స్టబ్‌తో మోదీ భేటీ

భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో 2026, మార్చి 5న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతలు, ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఫిన్లాండ్‌ సంపూర్ణ మద్దతిస్తుందని స్టబ్‌ ప్రకటించారు. కృత్రిమ మేధ (ఏఐ), 6జీ టెలికాం, శుద్ధ ఇంధనం, క్వాంటమ్‌ కంప్యూటింగ్, రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తాజా చర్చల్లో మోదీ, స్టబ్‌ నిర్ణయించారు. 

Walkins

సెయిల్‌-ఐఐఎస్‌సీఓలో పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌)కి చెందిన పశ్చిమ బెంగాల్‌లోని ఐఐఎస్‌సీఓ స్టీల్‌ ప్లాంట్‌.. బర్న్‌పూర్‌ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి పారామెటిక్స్‌ శిక్షణకు వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టులు: 7 వివరాలు:  విభాగాల వారీగా ఖాళీలు క్రిటికల్‌ కేర్‌ టెక్నీషియన్‌: 05 డయాలసిస్‌ టెక్నీషియన్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.17,980. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ తేదీ: 23.03.2026. వేదిక: కన్ఫరెన్స్‌ హాల్‌, ఓపీడీ బ్లాక్‌, బర్న్‌పూర్‌ హాస్పిటల్‌, సెయిల్‌-ఐఎస్‌పీ. Website:https://sailcareers.com/

Internship

ఐఐటీ హైదరాబాద్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ 2026 సంవత్సరానికి గానూ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వివరాలను ప్రకటించింది. సమ్మర్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ ఎక్స్‌పోజర్‌ (ఎస్‌యూఆర్‌ఈ) కింద రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు  ప్రతిభావంతులైన విద్యార్థులకు పరిశోధన, సాంకేతిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.  వివరాలు: ఈ ఏడాది మొత్తం 250 మంది ఇంటర్న్‌లకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా 100 సీట్లను ప్రత్యేకంగా బాలికలకే కేటాయించారు.  ఎంపికైన అభ్యర్థులకు కనీసం నెల రోజుల పాటు ఇంటర్న్‌గా చేయాల్సి ఉంటుంది.  మొత్తంగా రెండు నెలల ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారికి రూ.15,000 చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. నెల రోజుల పాటు చేస్తే రూ.7500, నెలన్నర పాటు చేస్తే రూ.10వేలు చొప్పున  చెల్లిస్తారు. అర్హతలు: ఈ అవకాశం కేవలం ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు కాని వారికి (Non-IITH) మాత్రమే. ఎమ్మెస్సీ(మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/బయాలజీ), ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు బీటెక్‌ /బి.డిజైనింగ్‌ రెండు, మూడో సంవత్సరం (అన్ని బ్రాంచ్‌లు) లేదా ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌/ఎంటెక్‌ మూడు/నాలుగో సంవత్సరం చదువుతున్న వారు. దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు తమ మునుపటి ఏడాదిలో సాధించిన సీజీపీఏ లేదా పర్సెంటేజ్‌ స్కోరు ఆధారంగా ఈ ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేస్తారు. అలాగే, దరఖాస్తు సమయంలో సంబంధిత విద్యాసంస్థ హెడ్‌/ప్రిన్సిపల్‌ ధ్రువీకరణ తప్పనిసరి. మొదటి 20 శాతం (Top 20%) మెరిట్ జాబితాలో ఉండాలి. కాలపరిమితి, వసతి: ఇంటర్న్‌షిప్ మే 15, 2026 నుంచి జులై 14 మధ్య (ఒకటి లేదా రెండు నెలలు) ఉంటుంది. ఎంపికైన వారికి ఐఐటీ క్యాంపస్‌లోని హాస్టళ్లలో వసతి కల్పిస్తారు. అయితే మెస్ ఖర్చులను విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఫుల్‌టైం/రెగ్యులర్‌ విద్యార్థులకు మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం. అకడమిక్ పర్ఫార్మెన్స్, ఇతర పోటీ పరీక్షలు (ఒలింపియాడ్స్, ఎన్‌టీఎస్‌ఈ), ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థులు కేవలం ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి సమాచారం: ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు కేవలం ఈమెయిల్ (Email) ద్వారా మాత్రమే సమాచారం అందిస్తారు. అభ్యర్థుల తుది జాబితాను ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌లోని 'SRC Office' వెబ్‌పేజీలో ఉన్న 'News/Announcement' విభాగంలో కూడా చూడవచ్చు. ముఖ్య తేదీలు:  ఆన్‌లైన్ ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ: 10.03.2026. ఫలితాల ప్రకటన (SRC వెబ్‌సైట్‌లో): 15.04.2026 (తాత్కాలిక) కార్యక్రమం ప్రారంభం: 15.05.2026 Website:https://www.iith.ac.in/news/2026/02/27/Summer-Undergraduate-Research-Exposure/

Government Jobs

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీలో ఉద్యోగాలు

మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్‌)కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీ, మధ్యప్రదే ఒప్పంద ప్రాతిపదికన 'కెమికల్ ప్రాసెస్ వర్కర్' పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: కెమికల్ ప్రాసెస్ వర్కర్ (సీపీడబ్ల్యూ): 265 ఖాళీలు (జనరల్‌-108; ఓబీసీ- 39, ఎస్సీ-39, ఎస్టీ-53, ఈడబ్ల్యూఎస్‌-26, ఎక్స్-సర్వీస్‌మెన్-26) అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా ఏఓసీపీ (Attendant Operator Chemical Plant) ట్రేడ్‌లో నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఒకవేళ ఏఓసీపీ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, ఫీడర్ ట్రేడ్స్ (Fitter, Machinist, Turner, Electrician, మొదలైనవి) అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సర్టిఫికేట్ ఎన్‌సీవీటీ లేదా ఎన్‌సీవీఈటీ ద్వారా జారీ చేసీ ఉండాలి. మూల వేతనం: నెలకు రూ.19,900. వయస్సు పరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదు సంవత్సరాలు; ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఎన్‌సీటీవీటీ (ఎన్‌ఏసీ) పరీక్ష మార్కులు, ట్రేడ్ టెస్ట్ మార్కుల తదితరాలు ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. చిరునామా: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకొని దానిని పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీ, నర్మధపురం జిల్లా, మధ్యప్రదేశ్‌ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2026. Website:https://ddpdoo.gov.in/career

Government Jobs

ఎన్ఐటీ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), పట్నా రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్  - 10 అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/ఎంసీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 33 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.9,300 - రూ.34,800. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్టీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.250. పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. చిరునామా: రిజిస్ట్రార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ టెక్నాలజీ పట్నా- 800005  దరఖాస్తులకు చివరి తేదీ: 24.03.2026  Website:https://nitp.ac.in/Others/non-faculty-recruitment

Government Jobs

సీఎస్‌ఐఆర్‌ - ఐఐసీబీలో మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (ఐఐసీబీలతద) మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.   వివరాలు:  మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 08 (యూఆర్- 05, ఎస్సీ-01, ఓసీసీ-01, ఈడబ్ల్యూఎస్‌-01) అర్హత: టెన్త్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.  జీతం: నెలకు రూ.18,000- రూ.56,900. వయోపరిమితి: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ: 04/04/2026.  Website:https://iicb.res.in/