Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

Immigration, Visa, Foreigners Registration and Tracking (IVFRT) Scheme

♦ The Union Cabinet, chaired by Prime Minister Narendra Modi, has approved the continuation of the Immigration, Visa, Foreigners Registration and Tracking (IVFRT) Scheme for another five years, from April 1, 2026 to March 31, 2031, with a total outlay of Rs.1,800 crore. The IVFRT platform is aimed at integrating and streamlining immigration, visa issuance, and foreigner registration processes in India through a secure, technology-driven framework. The move is part of the government’s broader push to modernise border management systems while ensuring ease of travel for legitimate visitors. ♦ Originally approved in 2010, the project has undergone multiple phases of expansion and extension. The latest approval comes in the backdrop of the recently enacted Immigration and Foreigners Act, 2025, which necessitates a more robust and responsive system to address evolving challenges such as illegal migration and increasing global mobility.

Current Affairs

2026-27లో భారత వృద్ధి 7.1%

వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధి 7.1 శాతంగా ఉండొచ్చని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు ఇందుకు దోహదపడతాయని తాజా త్రైమాసిక ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక వివరాల్లో తెలిపింది. 2025-26లో 7.6 శాతంగా ఉంటుందని పేర్కొంది.  2025-26 వృద్ధి అంచనాలను 0.4 శాతం పెంచి 7.6 శాతానికి, 2026-27 అంచనాలను 0.2 శాతం పెంచి 7.1 శాతానికి సవరించింది. 

Current Affairs

‘ఉడాన్‌’ పథకం

ప్రాంతీయ విమానయాన అనుసంధానతకు మరింత ఊతమివ్వడంలో భాగంగా రూ.28,840 కోట్ల కేటాయింపుతో నవీకరించిన ‘ఉడాన్‌’ పథకానికి కేంద్ర కేబినెట్‌ 2026, మార్చి 25న ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు ఈ నవీకరించిన పథకం అమల్లో ఉండనుంది. ఇప్పుడున్న ఉడాన్‌ పథకం గడువు 2026లోనే ముగియనుంది.  నవీకరించిన ఉడాన్‌ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 100 ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం వచ్చే ఎనిమిదేళ్లలో రూ.12,159 కోట్లను కేటాయించనున్నారు. 

Current Affairs

వలసలు, వీసా సేవల పథకం

‘వలసలు, వీసా, విదేశీయుల నమోదు-ట్రాకింగ్‌’ (ఐవీఎఫ్‌ఆర్‌టీ) పథకాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇమ్మిగ్రేషన్, వీసాల జారీ తదితర అంశాలన్నింటినీ అనుసంధానించే ఈ పథకాన్ని 1.4.2026 నుంచి 31.3.2031 వరకు కొనసాగించడానికి రూ.1,800 కోట్లు కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన 2026, మార్చి 25న జరిగిన క్యాబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తెలిపింది.   2010లో తొలిసారి ఆమోదం పొందిన పథకాన్ని 2015, 2017, 2021లలో పొడిగించారు.

Current Affairs

రావులపాలెంకు ఐఎస్‌వో గుర్తింపు

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం పంచాయతీకి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌వో) గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో ఐఎస్‌వో ధ్రువపత్రం దక్కిన తొలి పంచాయతీగా రావులపాలెం రికార్డు సృష్టించింది. కేరళలోని పంచాయతీలకు ఇటువంటి ధ్రువపత్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటివి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి 24 పంచాయతీలను ఎంపిక చేసి, మౌలిక సదుపాయాలు కల్పించింది. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన ఐఎస్‌వో ఆడిట్‌ బృందం రెండు రోజులుగా రావులపాలెంను పరిశీలించింది. అక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసి ఐఎస్‌ఓ సర్టిఫికేట్‌ జారీ చేసింది.

Current Affairs

పీఎం కుసుమ్‌ కాంపోనెంట్‌ సీ

పీఎం కుసుమ్‌ కాంపోనెంట్‌ సీ కింద (గ్రిడ్‌కు కనెక్ట్‌ చేసిన సౌర విద్యుత్తు పంప్‌సెట్లు) ఆంధ్రప్రదేశ్‌లోని 21 జిల్లాలకు 1,162.80 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్‌సెట్లు మంజూరు చేసినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్‌ 2025, మార్చి 25న లోక్‌సభలో తెలిపారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాకు 221 మెగావాట్ల సామర్థ్యం ఉన్న, తూర్పుగోదావరి జిల్లాకు అత్యల్పంగా 9.33 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్‌సెట్లను కేటాయించినట్లు వెల్లడించారు.

Current Affairs

క్యూఎస్‌ ర్యాంకింగ్‌

విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక క్వాకరెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) సంస్థ ‘క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ బై సబ్జెక్ట్‌ - 2026’ పేరిట ర్యాంకులను 2026, మార్చి 25న విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని టాప్‌- 50 వర్సిటీల జాబితాలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి భారత్‌ నుంచి దిల్లీ, బాంబే, ఖరగ్‌పూర్, మద్రాస్‌ ఐఐటీలతోపాటు జేఎన్‌యూ, బిట్స్‌-పిలానీలు చేరాయి. మొత్తం 99 విద్యా సంస్థలు వివిధ ర్యాంకులు సాధించాయి. కెమికల్, మెకానికల్, ఎలక్టిక్రల్, మైనింగ్‌ వంటి విభాగాల్లో భారతీయ సంస్థలు టాప్‌ 100, టాప్‌ 50 ర్యాంకుల్లో భారత సంస్థలు చోటు సంపాదించాయి.   ఈ ఏడాది 6 భారతీయ సంస్థలు టాప్‌ 100లో నిలవగా, గత ఏడాది ఈ సంఖ్య 2 మాత్రమే.  ఐఐటీ దిల్లీ తొలిసారిగా ఆరు ప్రధాన ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో టాప్‌ 50లో నిలిచింది. 

Walkins

సీఐపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రీ (సీఐపీ) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 24 వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ సైకియాట్రీ: 15 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరాలజీ: 03 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరోసర్జరీ: 02 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ అనస్థీషియా: 02 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ రేడియో-డయాగ్నోసిస్‌: 02 అర్హత: గుర్తింపు పొందన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్‌,  మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి. ఫెలోషిప్‌: నెలకు రూ.1,23,500. వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ: 04.04.2026. వేదిక: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రీ, కాన్కే, రాంచి, జార్ఖండ్‌. Website:https://www.cipranchi.nic.in/en/vacancy-content

Private Jobs

ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) బ్యాంకు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 33 వివరాలు:  ఆడిట్‌- ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌: 02 రిస్క్‌ మేనేజ్‌మెంట్‌-ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ: 04 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎంఐఎస్‌(ఐటీ అండ్‌ ఎంఐఎస్‌): 19 సెక్యూరిటీ ఆఫీసర్‌: 08 అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి టెన్త్‌/ఇంటర్మీడియట్‌ సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌, బీటెక్‌/బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 01.03.2026 నాటికి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగ అభ్యర్థులకు వయసులో సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250; జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీలకు రూ.1,050. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ: 08.04.2026. Website:https://www.idbi.bank.in/

Government Jobs

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ): 11,127 పోస్టులు వివరాలు: ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. అర్హత: సంబంధిత విభాగాలు, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 01-07-2026 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. ప్రారంభ వేతనం: నెలకు రూ.19900. ఎంపిక ప్రక్రియ: ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.05.2026. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.06.2026. Website:https://www.rrbapply.gov.in/#/auth/landing