‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’
భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్ నాగికి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్-2025 దక్కింది. 2026, ఫిబ్రవరి 5న దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్లో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం కింద రూబుల్ నాగీకి వర్కీ ఫౌండేషన్ 10 లక్షల డాలర్ల (సుమారు రూ.9కోట్లు) నగదు బహుమతిని అందించింది. రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఆమె దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం సుమారు 800 అభ్యసన కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కుడ్య చిత్రాలతో మురికివాడల గోడలను తరగతి గదుల్లా మార్చేశారు. ఈ కారణంగానే ఆమెకు ఈ ప్రైజ్ దక్కినట్లు కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.