డాక్టర్ విలియం కన్నుమూత
ప్రపంచ మానవాళి సాధించిన గొప్ప ప్రజారోగ్య విజయాల్లో ఒకటైన మశూచి నిర్మూలన కార్యక్రమ సారథి డాక్టర్ విలియం ఫోగ్ (89) మరణించారు. ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘టాస్క్ఫోర్స్ ఫర్ గ్లోబల్ హెల్త్’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. విలియం అంటువ్యాధుల నిర్మూలనలో గణనీయమైన పాత్ర పోషించారు. 1980ల ప్రాంతంలో అమెరికా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్స్కు డైరెక్టరుగా వ్యవహరించారు.