Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Walkins

ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్  ఉద్యోగాలు

రాయ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.  వివరాలు: జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) - 40 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.56,100. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ: 19.01.2026.  వేదిక: గేట్ నెం. 5, 4వ అంతస్తు, అకడమిక్ సెక్షన్, కొత్త అకడమిక్ & అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఎయిమ్స్ రాయ్‌పుర్. Website: https://www.aiimsraipur.edu.in/user/vacancies-faculty.php?pst=jrsr

Government Jobs

ఐఐటీ దిల్లీలో రిసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ (ఐఐటీ దిల్లీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 17 వివరాలు: 1.ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-II : 09  2.ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-III : 02  3.ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III : 06 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 75 శాతం మార్కూలతో ఎమ్మెస్సీ/ఎంటెక్/ ఎంబీఏ(పర్యావరణ/వాతావరణ శాస్త్రాలు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, పబ్లిక్ హెల్త్ లేదా ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-IIకు రూ.67,000.ప్రాజెక్ట్ రిసెర్చ్  సైంటిస్ట్-III కు రూ.78,000. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-IIIకు రూ.28,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా sagnik@cas.iitd.ac.in కు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 30,  Website: https://ird.iitd.ac.in/current-openings

Government Jobs

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

దిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 09 వివరాలు: 1.టెక్నికల్ లీడ్     : 01 2. బిజినెస్ అనలిస్ట్    :01 3. ఫుల్ స్టాక్ డెవలపర్ : 03 4. ఏఐ/ఎంఎల్ ఇంజినీర్‌  : 01 5. డేటా సైంటిస్ట్ (ఏఐ)    :01 6. డెవాప్స్  ఇంజినీర్‌ : 01 7. టెస్టర్ (ఏఐ)    : 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 26-01-2026. Website: https://dic.gov.in/careers/

Apprenticeship

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) 2025-26 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టులు: 600 వివరాలు: అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.12,300. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ: 25-01-2026. Website: https://bankofmaharashtra.bank.in/current-openings

Current Affairs

National Startup Day

National Startup Day is observed every year on January 16 across the country to recognise the contribution of entrepreneurs, founders and startups transforming ideas into impactful solutions.  ♦ National Startup Day traces its origin to 16 January 2016, when the Startup India Initiative was officially launched. The initiative aimed to simplify regulations, provide funding support, encourage innovation and build a strong startup ecosystem across the country. ♦ This day was launched by Prime Minister Narendra Modi in 2022, the day celebrates visionary entrepreneurs who play a crucial role in economic growth, employment generation and technological advancement. 

Current Affairs

‘ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’

2024లో భారత్‌లో 9 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో జీవించారని ఒక అధ్యయనం తేల్చింది. తద్వారా ఈ రుగ్మత బాధితులు ఎక్కువగా ఉంటున్న దేశాల్లో రెండో స్థానంలో ఉందని పేర్కొంది. 14.8 కోట్ల మందితో చైనా మొదటిస్థానంలో, 3.9 కోట్ల మందితో అమెరికా మూడోస్థానంలో ఉన్నాయని వివరించింది. ఈ అధ్యయనం వివరాలు ‘ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’ పత్రికలో ప్రచురితమయ్యాయి. అధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికా, పాకిస్థాన్‌ వంటి దేశాలు మధుమేహుల వాటాను ఎక్కువగా కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.  ఈ విషయంలో 2050 నాటికి పాకిస్థాన్‌.. అమెరికాను దాటేయవచ్చని చెప్పారు. 215 దేశాలకు సంబంధించి 2005 నుంచి 2024 మధ్య జరిగిన 246 అధ్యయనాలను విశ్లేషించి, 2050 నాటి పరిస్థితిపై అంచనాలు వేశారు. 

Current Affairs

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ వశిష్ఠ

కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) విజిలెన్స్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ మాజీ అధికారి ప్రవీణ్‌ వశిష్ఠ 2026, జనవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు. విజిలెన్స్‌ కమిషనర్‌గా 2025, డిసెంబరులో ఆయన నియమితులయ్యారు. బిహార్‌ కేడర్‌లో పనిచేసిన ఆయన విజిలెన్స్‌ కమిషనర్‌కు ముందు కేంద్ర హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శి(అంతర్గత రక్షణ)గా సేవలందించారు. ప్రవీణ్‌ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

Current Affairs

Aaryan Varshney

Aaryan Varshney (21 years) became the 92nd Indian to earn the title of chess Grandmaster. He won the Andranik Margaryan Memorial title with a round to spare in Armenia, which confirmed his Grandmaster title. He drew against FM Tyhran Ambartsumian in the eighth round of the competition in Armenia to secure his third and final GM norm. ♦ Aaryan, who is from Delhi, is the eighth Grandmaster from the capital of India, along with Parimarjan Negi, Abhijeet Gupta, Sriram Jha, Vaibhav Suri, Sahaj Grover, Aryan Chopra, and Prithu Gupta.

Current Affairs

రిజర్వ్‌ బ్యాంక్‌-సమగ్ర అంబుడ్స్‌మన్‌ పథకం -2026

బ్యాంకులతో పాటు, ఇతర నియంత్రిత సంస్థల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా ‘రిజర్వ్‌ బ్యాంక్‌-సమగ్ర అంబుడ్స్‌మన్‌ పథకం -2026’ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకురానుంది. ఇందుకోసం ‘రిజర్వ్‌ బ్యాంక్‌- అంబుడ్స్‌మన్‌ స్కీం 2025’కు కొన్ని సవరణలతో ముసాయిదాను 2026, జనవరి 16న విడుదల చేసి, ప్రజల అభిప్రాయాలు కోరింది. బ్యాంకింగ్‌ సేవల్లో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సమర్థంగా, వేగంగా మార్చేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.   కొత్త పథకం 2026 జులై 1  నుంచి అమల్లోకి రానుంది. ఫిర్యాదిదారులకు తక్కువ ఖర్చుతో, వేగవంతమైన పరిష్కారాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యమని ఆర్‌బీఐ పేర్కొంది.

Current Affairs

వందేమాతరం ఇతివృత్తంగా గణతంత్ర కవాతు

వందేమాతర గీతం 150 ఏళ్ల పరిపూర్తి ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతుకు ప్రధాన ఇతివృత్తం కానుంది. వందేమాతర గీతం ప్రారంభ చరణాల భారీ చిత్రాలను కవాతు సందర్శకుల కోసం ఏర్పాటుచేసే ఆవరణలకు నేపథ్యంగా కర్తవ్య పథ్‌ ప్రాంతంలో ప్రదర్శించనున్నారు. యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్, యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలు ముఖ్య అతిథులుగా ఈ కవాతును తిలకించనున్నారు.