Posts

Current Affairs

India and Russia

♦ Defence Minister Rajnath Singh and Russian Defence Minister Andrei Belousov co-chaired the 22nd meeting of the India–Russia Inter-Governmental Commission on Military and Military Technical Cooperation (IRIGC-M&MTC) at the Manekshaw Centre in the New Delhi on 4 December 2025.  ♦ Both sides reaffirmed that the India–Russia partnership is anchored in deep trust, shared principles and long-standing mutual respect. ♦ At the conclusion of the meeting, both ministers signed the protocol outlining ongoing and future areas of defence collaboration.

Current Affairs

India and the Netherlands

♦ India and the Netherlands held the 13th round of Foreign Office Consultations (FOC) in New Delhi on 4 December 2025, reviewing progress across key areas of the bilateral partnership and exploring new domains of cooperation. ♦ The talks were led by Secretary Sibi George from the Indian side and Christiaan Rebergen, Secretary General in the Dutch Ministry of Foreign Affairs, from the Netherlands. The previous round was held in The Hague in May 2024. ♦ During the consultations, the two delegations reviewed cooperation in critical technologies—including semiconductors and AI—science and technology, green hydrogen, shipping, defence, and security. Progress under the Water, Agriculture and Health (WAH) agenda also came up for discussion. Both sides expressed the intent to add greater strategic depth to the partnership. ♦ The two sides highlighted the strong cultural ties and people-to-people links, appreciating the role of the Indian community in the Netherlands as a key bridge between the countries.

Current Affairs

Fitch Ratings on 4 December 2025

♦ Fitch Ratings on 4 December 2025 revised India’s GDP growth forecast for FY26 to 7.4%, up from its earlier estimate of 6.9%, citing strong domestic demand and the positive impact of recent tax reforms. It said private consumption remains the primary engine of growth this fiscal year, supported by “strong real income dynamics, improved consumer sentiment, and the benefits of goods and services tax reforms.”  ♦ For FY27, Fitch expects growth to moderate to 6.4%, with domestic demand continuing to drive the economy. Public investment is likely to soften, while private investment is expected to strengthen in the second half of FY27. ♦ Fitch also expects the Indian rupee to strengthen to around 87 per US dollar next year (2026).

Current Affairs

నావికాదళ దినోత్సవం

భారత సాయుధ దళాల్లో నావికా విభాగం ఒకటి. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో, మన తీర ప్రాంతాలను కాపాడటంలో, శత్రుమూకల కారణంగా సముద్రంలో తలెత్తే సంక్షోభాలను ఎదుర్కోవడంలో భారత నావికా దళం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సాధించిన విజయాలు, దేశ రక్షణలో అంకితభావంతో అందించే సేవలను గౌరవించే లక్ష్యంతో ఏటా డిసెంబరు 4న ‘నావికాదళ దినోత్సవం’గా (Navy Day)  నిర్వహిస్తారు. జాతీయ భద్రతను కాపాడటం, అంతర్జాతీయ సంబంధాలు - సహకారాన్ని పెంపొందించడం, స్థిరమైన సముద్ర వాతావరణాన్ని ప్రోత్సహించడంలో నావికాదళ పాత్రను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం 1971 డిసెంబరు 3న భారత్‌ - పాకిస్థాన్‌ యుద్ధం ప్రారంభమైంది. పాకిస్థాన్‌ చెర నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఇది జరిగింది. భారత వైమానిక స్థావరాలపై పాకిస్థాన్‌ ఊహించని దాడి చేసింది. దీనికి ప్రతిగా మన నావికాదళం డిసెంబరు 4న ఆపరేషన్‌ ట్రైడెంట్‌ (Trident)ను ప్రారంభించింది. కరాచీలోని నావికా ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపింది. ఆపరేషన్‌ ట్రైడెంట్‌ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న మన దేశంలో నావికాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1972 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు. 

Current Affairs

ఆంధ్రా కోస్తా తీరం పొడవు 1,053 కిలోమీటర్లు

ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరం పొడవు ఇప్పుడు 1,053.07 కిలోమీటర్లకు చేరిందని కేంద్ర భూవిజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. నేషనల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీస్‌ ఇదివరకున్న 973.7 కిలోమీటర్లను సవరించి ఇప్పుడు 1,053.07 కిలోమీటర్లుగా నిర్ధారించినట్లు చెప్పారు. ఆయన 2025, డిసెంబరు 4న రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు.  నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ (ఎన్‌ఎస్‌సీఎస్‌) ప్రతిపాదించిన తాజా విధివిధానాలను అనుసరించి సర్వే ఆఫ్‌ ఇండియా సమన్వయంతో నేషనల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీస్‌ మదింపుచేసి భారత తీరప్రాంతాన్ని ఇదివరకున్న 7,516.6 కిలోమీటర్ల నుంచి 11,098.81 కిలోమీటర్లుగా ఖరారుచేసినట్లు చెప్పారు. 

Current Affairs

పాక్‌ తొలి సీడీఎఫ్‌గా మునీర్‌

పాకిస్థాన్‌ తొలి ‘రక్షణ బలగాల అధిపతి (సీడీఎఫ్‌)’గా సైన్యాధ్యక్షుడు ఫీల్డ్‌ మార్షల్‌ అసీమ్‌ మునీర్‌ 2025, డిసెంబరు 4న నియమితులయ్యారు. ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సిఫార్సు మేరకు ఆయన నియామకానికి దేశాధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ ఆమోద ముద్ర వేశారు. మునీర్‌ ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. సీడీఎఫ్‌ పదవిని కొత్తగా ఏర్పాటుచేస్తూ పాక్‌ పార్లమెంటు 2025 నవంబరులో 27వ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది.  జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ (సీజేసీఎస్‌సీ) ఛైర్మన్‌ పదవిని రద్దు చేసి.. దాని స్థానంలో సీడీఎఫ్‌ను తీసుకొచ్చారు. 

Current Affairs

భారత్‌లో ఎదుగుదల లేక బాలల మరణాలు

పోషకాహారం కొరవడటంతో ఎదుగుదల లేక అయిదేళ్ల వయసులోపే మరణించే బాలల సంఖ్యలో నైజీరియా మొదటి స్థానంలో ఉంటే, భారత్‌ రెండో స్థానంలో, కాంగో మూడో స్థానంలో ఉన్నాయని లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. బరువు తక్కువగా ఉండటం, కృశించిపోవడం, ఎదుగుదల లేక గిడసబారిపోవడం లాంటి రుగ్మతలు నీళ్ల విరేచనాలకూ, శ్వాసకోశ సమస్యలకు, మలేరియా, పొంగు వంటి వ్యాధులకు దారితీస్తాయి.  ప్రపంచంలో 2023లో ఎదుగుదల కొరవడి అయిదేళ్లలోపే మరణించిన బాలల సంఖ్య 10 లక్షలైతే, వాటిలో 1,88,000 మరణాలతో నైజీరియా, లక్ష మరణాలతో భారత్, 50,000 మరణాలతో డెమోకటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలు మొదటి మూడు స్థానాలను ఆక్రమిస్తున్నాయి.

Current Affairs

ద ఇన్‌ఫ్లూయెన్స్‌ 100

ప్రోవోక్‌ మీడియాకు చెందిన 2025 గ్లోబల్‌ 100 మంది ప్రభావశీల పారిశ్రామిక నేతల జాబితాలో, భారత అగ్రగామి కంపెనీల కమ్యూనికేషన్స్, మార్కెటింగ్‌ విభాగాల అధిపతులు చోటు చేసుకున్నారు. రిలయన్స్‌ గ్రూప్‌ హెడ్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ రోహిత్‌ బన్సల్, ఇన్ఫోసిస్‌ గ్లోబల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సుమిత్‌ విర్మానీ, టీసీఎస్‌ గ్లోబల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అభినవ్‌ కుమార్, వేదాంతా గ్రూప్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ రితు ఝింగావ్, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ చీఫ్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌ సుజిత్‌ పాటిల్, జిందాల్‌ స్టీల్‌ కార్పొరేట్‌ బ్రాండ్, కమ్యూనికేషన్స్‌ అధిపతి అర్పణ కుమార్‌ అహూజా తదితరులు ఈ జాబితాలో చోటు చేసుకున్నారు. 

Current Affairs

మహిళా లాయర్లకు రిజర్వేషన్లు

రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల ఎన్నికల్లో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయా కౌన్సిళ్ల కార్యనిర్వాహక కమిటీల్లోనూ మహిళా లాయర్ల ప్రాతినిధ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ)కి 2025, డిసెంబరు 4న సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి ధర్మాసనం సూచించింది.  యోగమయ, శెహ్లా చౌదరి అనే ఇద్దరు మహిళా న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

Walkins

ఈఎస్‌ఐసీ బెంగళూరులో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పీన్య, బెంగళూరు మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన  సీనియర్ రెసిడెంట్, ఫుల్ /పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 24 వివరాలు: 1. సీనియర్ రెసిడెంట్ - 20 2. ఫుల్ /పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ - 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/పీజీ/ఎంబీబీఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. విభాగాలు: అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ , సర్జరీ, రేడియాలజీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్, మెడికల్ ఆంకాలజీ, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు)తదితర విభాగాలు. గరిష్ఠ వయోపరిమితి: 2025. డిసెంబరు 16వ తేదీ నాటికి 67 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ఫుల్ /పార్ట్ టైమ్ స్పెషలిస్ట్‌కు రూ.1,00,000- రూ.1,27,141. ఇంటర్వ్యూ తేదీలు: 2025. డిసెంబరు 16. వేదిక: మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఈఎస్‌ఐసీ హాస్పిటల్, పీన్య, బెంగళూరు. Website:https://esic.gov.in/recruitments