Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

సామాజిక సాధికారత స్మారక దినోత్సవం

కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోని ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక సాధికారత. దేశాభివృద్ధిలో ఇది కీలక భూమిక పోషిస్తుంది. ఒకప్పుడు సమాజంలో అంటరానితనం, సామాజిక వివక్ష లాంటి రుగ్మతలు ఉండేవి. వాటిని రూపుమాపేందుకు బలంగా పోరాడిన వ్యక్తుల్లో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఒకరు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన ప్రారంభించిన ‘మహద్‌ సత్యాగ్రహానికి’ గుర్తుగా ఏటా మార్చి 20న ‘సామాజిక సాధికారత స్మారక దినోత్సవం’గా నిర్వహిస్తారు. దీన్నే ‘సామాజిక సాధికారత దినోత్సవం’ అనే పేరుతోనూ పిలుస్తారు. అణగారిన వర్గాల హక్కులను తెలియజేయడంతోపాటు వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం:  అణగారిన వర్గాల హక్కుల కల్పనకు, వారిలో పోరాట స్ఫూర్తిని రేకెత్తించడానికి మహద్‌ సత్యాగ్రహం ఎంతగానో తోడ్పడింది. దళితులు చౌదర్‌ చెరువు నీటిని వాడుకోవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు వెలువరించాక 1940, మార్చి 19న అంబేడ్కర్‌ మహద్‌లో ర్యాలీ నిర్వహించారు. మహద్‌ సత్యాగ్రహానికి గుర్తుగా ఏటా మార్చి 20న ‘సాధికారత దినోత్సవం’గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నాటి నుంచి ప్రతి ఏడాది దీన్ని నిర్వహిస్తున్నారు. 

Current Affairs

తెలంగాణ తలసరి ఆదాయం

తలసరి ఆదాయంలో తెలంగాణలోని జిల్లాల మధ్య తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. అగ్రస్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఏకంగా రూ.11,29,735 ఉండగా... కేవలం రూ.2,37,809తో హనుమకొండ జిల్లా దిగువన ఉంది. రంగారెడ్డి జిల్లా ఆదాయానికి... రూ.4,76,679తో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు సైతం చాలా వ్యత్యాసముంది. మొదటి మూడు స్థానాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి... చివరి మూడు స్థానాల్లో వికారాబాద్, జగిత్యాల, హనుమకొండ నిలిచాయి. అయితే, తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే తెలంగాణలోని 33 జిల్లాలూ ముందున్నాయి. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, జాతీయ సగటు రూ.2,19,575 మాత్రమే. తెలంగాణలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 10.2గా ఉందని తెలంగాణ సామాజిక నివేదిక-2026 పేర్కొంది. 

Current Affairs

తెలంగాణ బడ్జెట్‌ రూ.3,24,234 కోట్లు

తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో 2026, మార్చి 20న రాష్ట్ర బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు. నూతనంగా తొమ్మిది సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత బడ్జెట్‌లో (2025-26) అన్ని రకాల సంక్షేమ పథకాలకు కలిపి రూ.1.04 లక్షల కోట్లు కేటాయిస్తే వచ్చే ఏడాదికి ఈ పద్దు కింద రూ.1,45,591 కోట్లను ప్రతిపాదించింది. మొత్తం బడ్జెట్‌ వ్యయంలో సంక్షేమ పథకాలకు కేటాయింపులు 44.90% కాగా.. గత బడ్జెట్‌లో ఇది 34.21 %. మొత్తం 69 రకాల సంక్షేమ పథకాలను వివిధ శాఖల్లో అమలుచేస్తున్నారు.   మూలధన వ్యయ పద్దును ప్రభుత్వం రూ.36,504 కోట్ల నుంచి రూ.47,267 కోట్లకు భారీగా పెంచింది. ఏకంగా 29.40 శాతం పెంపును బడ్జెట్‌లో ప్రతిపాదించడం రాష్ట్ర అభివృద్ధికి ఉపకరిస్తుందని అంచనా. మొత్తం 28 ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు వీటిని ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. గ్యారంటీ హామీలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు వచ్చే ఏడాదికి రూ.50,713 కోట్ల కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) కోసం గత బడ్జెట్‌లో వేసిన రూ.3.04 లక్షల కోట్ల అంచనాలకంటే ఆదాయం రూ.23,626 కోట్లు తగ్గింది. దీనిప్రకారం సవరించిన అంచనాలతో ఈ ఏడాది బడ్జెట్‌ ఆదాయం రూ.2.81 లక్షల కోట్లకు తగ్గిపోయింది. అయినా ప్రభుత్వం మరిన్ని భారీ ఆదాయ లక్ష్యాలతో.. సుమారు రూ.43 వేల కోట్లు పెంచి రూ.3.24 లక్షల కోట్ల కొత్త బడ్జెట్‌ను రూపొందించింది.   గత బడ్జెట్‌ అంచనాలకంటే అదనంగా పెంచిన రూ.43 వేల కోట్ల బడ్జెట్‌ ఆదాయ అంచనాలలో ఏ పద్దు కింద ఎంత పెరుగుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పన్నులద్వారా రూ.14 వేల కోట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలో రూ.13 వేల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.6,412 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.3,710 కోట్లు, కొత్త రుణాలు రూ.5,325 కోట్లు అదనంగా వస్తాయని ప్రభుత్వం వివరించింది.  ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలతో ఆర్థిక అస్థిరత నెలకొన్నా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్‌డీపీ) వృద్ధిరేటు గతేడాది 10.6 శాతముంటే ఈ ఏడాది 10.7 శాతానికి పెరగడం ఆశాజనకంగా భావిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ సగటు వృద్ధిరేటు 9.8 నుంచి 8 శాతానికి పడిపోయినా రాష్ట్రానికి 10.7 శాతానికి పెరిగింది. జీఎస్‌డీపీ విలువ రూ.17.82 లక్షల కోట్లకు చేరింది. కొత్త రుణాల సేకరణకు జీఎస్‌డీపీ విలువ పెరుగుదల అత్యంత కీలకం. దీని ఆధారంగానే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో తీసుకునే కొత్త రుణాలు ఈ ఏడాది సేకరించిన రూ.77,545.92 కోట్లకన్నా వచ్చే ఏడాది మరో రూ.5,325 కోట్లు అదనంగా వస్తాయని ప్రభుత్వం వివరించింది.  శాసనమండలిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టారు. వివిధ శాఖలకు కేటాయింపులు (రూ.కోట్లలో) ఆర్థికశాఖ      60,438 ఇంధన        21,285 వెనుకబడిన తరగతుల సంక్షేమం      12,511 హోం      11,907 ఎస్సీ కులాల అభివృద్ధి      11,784 రోడ్లు-భవనాలు     8,298 ప్రణాళిక          7,981 గిరిజన సంక్షేమం     7,937 గృహనిర్మాణం     7,430 పౌరసరఫరాలు     7,366 రవాణా     4,491 రెవెన్యూ      4,020 మైనార్టీ సంక్షేమం     3,769 పరిశ్రమలు-వాణిజ్యం     3,747 మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం   3,143 న్యాయ     2,306 యువజన, పర్యాటక, సాంస్కృతిక     2,127 పశు సంవర్ధక-మత్స్య      1,529 సాధారణ పరిపాలన     1,190 పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక     1,049 కార్మిక-ఉపాధికల్పన     998 ఐటీ                    875 శాసనసభ వ్యవహారాలు  259 పశుసంవర్ధక శాఖ     1,529 

Current Affairs

కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025

ఆరు దశాబ్దాల నాటి పాత పన్ను చట్టం-1961 స్థానంలో తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) 2026, మార్చి 20న ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను నోటిఫై చేసింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) కింద తమ మూల వేతనంలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితాను కేంద్రం ప్రస్తుత 4 నుంచి 8కి పెంచింది. ఇప్పటి వరకు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాలకే పరిమితమైన ఈ ప్రయోజనాన్ని.. కొత్త నిబంధనల ద్వారా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలకూ విస్తరించింది. ఇతర నగరాలు, పట్టణాల్లో నివసించే వారికి 40% పరిమితి కొనసాగుతుంది. ఈ పన్ను మినహాయింపులు పొందాలంటే అద్దెదారు, ఇంటి యజమాని మధ్య ఉన్న అద్దె ఒప్పందం/సంబంధ వివరాలు వెల్లడించడం తప్పనిసరి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు ఉండదు. పాత పన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేసేవారికే ఇది వర్తిస్తుంది.

Current Affairs

స్కైట్రాక్స్‌ వరల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ అవార్డ్స్‌- 2026

ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్‌ ఛాంగి ఎయిర్‌పోర్ట్‌ వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది. స్కైట్రాక్స్‌ వరల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ అవార్డ్స్‌- 2026 ప్రకారం.. రెండో స్థానంలో ఇన్చాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (దక్షిణ కొరియా), మూడో స్థానంలో టోక్యో హనేడా ఎయిర్‌పోర్ట్‌ (జపాన్‌) నిలిచాయి. ప్రపంచంలోని 10 అత్యుత్తమ విమానాశ్రయాల్లో హాంకాంగ్‌ విమానాశ్రయం, నరీటా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జపాన్‌), పారిస్‌ షాల్‌ ద గోల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఫ్రాన్స్‌), రోమ్‌ విమానాశ్రయం, ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ (తుర్కియే), మ్యూనిక్‌ ఎయిర్‌పోర్ట్‌ (జర్మనీ), వ్యాంకోవర్‌ ఎయిర్‌పోర్ట్‌లకూ చోటు దక్కింది.  భారత్‌ విమానాశ్రయాల విషయానికొస్తే.. దిల్లీ ఇందిరాగాంధీ ఇంçర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఈ జాబితాలో 28వ స్థానం దక్కింది. గతేడాది ఇది 32వ స్థానంలో ఉంది.

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ (హెచ్‌ఆర్‌) పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ రెగ్యులర్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌  (హెచ్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్‌ (హెచ్‌ఆర్‌): 15 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు. వేతనం: నెలకు రూ.20,000 - రూ.66,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనలర్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఈడబ్ల్యూఎస్‌, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.300. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, దిల్లీ/గుడ్‌గావ్‌, కోల్‌కతా, బెంగళూరు, ముంబయి, గువాహటి, లఖ్‌నవూ, భువనేశ్వర్‌, చెన్నై, బిలాయ్‌, అహ్మదాబాద్‌, రాంచి, పాట్న, త్రివేండ్రం. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 27. Website:https://www.rites.com/Career

Government Jobs

ఎన్‌ఐటీ తిరుచిరాపల్లిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

తమిళనాడులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) తిరుచిరాపల్లి ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 86 వివరాలు: విభాగాలు: అర్కిటెక్చర్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్మెంట్‌, హ్యూమనిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌, మేనేజ్‌మెంట్‌, మ్యాథమెటిక్స్‌, మెకానికల్‌, మెటలార్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌, ఫిజిక్స్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఎడ్యుకేషన్‌. అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఏ, ఎంఏ, బీఎడ్‌, ఎంఈడీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, గేట్‌/నెట్‌/సెట్‌/సీఎస్‌ఐఆర్‌ సెట్‌ ఉత్తీర్ణత ఉండాలి.  వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీలకు రూ.2,500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,250. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.04.2026. ఆఫ్‌లైన్‌(హార్డ్‌కాపీ) దరఖాస్తుకు చివరి తేదీ: 16.04.2026. Website:https://www.nitt.edu/

Government Jobs

ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరతోంది.  వివరాలు: డిప్యూటీ మేనేజర్‌: 15 పోస్టులు (యూఆర్‌-08, ఎస్సీ-02, ఎస్టీ-01, ఓబీసీ-03, ఈడబ్ల్యూఎస్‌-01) అర్హతలు: సీఏ/సీఎంఏ/ఎంకాం/ఎంబీఏ(ఫైనాన్స్‌) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000. వయోపరిమితి: 34 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: స్టేజ్‌-1, స్టేజ్‌-2 రాత పరీక్ష తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 27.03.2026. Website:https://www.nhidcl.com/homepage

Apprenticeship

ఐఐటీ తిరుపతిలో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 40 వివరాలు: 1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 26 2. డిప్లొమా అప్రెంటిస్‌: 14 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, జీఎన్‌ఎం, బీఈ/బీటెక్‌, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.20,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.18,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 2026, మార్చి 27, 28, 29. Website:https://www.iittp.ac.in/recruitment

Admissions

కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక, ఒకటో తరగతి ప్రవేశాలు

కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక, ఒకటి, రెండు ఆపైన తరగతులు, 11వ తరగతుల్లో ప్రవేశ ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) విడుదల చేసింది. మూడేళ్లకు పైబడి ఆరేళ్ల లోపు వయసు కలిగిన బాలబాలికలు అడ్మిషన్లు పొందవచ్చు. వివరాలు: కేంద్రీయ విద్యాలయాల్లో బాల్‌వాటిక, ఒకటో, రెండో తరగతుల్లో ప్రవేశాలు-2026  బాలవాటిక 1,2,3, తరగతి 1, 2 ప్రవేశాలు వయసు: బాలబాలికల వయసు మార్చి 31, 2026 నాటికి బాల్‌వాటిక-1కు మూడేళ్లు పూర్తయి నాలుగేళ్లు మించకుండా ఉండాలి. బాల్‌వాటిక-2కు నాలుగేళ్లు పూర్తయి, అయిదేళ్లు మించకూడదు. బాలవాటిక-3లో ప్రవేశాలకు అయిదేళ్లు నిండి, ఆరేళ్లు మించకూడదు. ప్రత్యేకావసరాలు కలిగిన వారికి రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది. (ఏప్రిల్ 1వ తేదీన జన్మించిన విద్యార్థిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు). ఆన్‌లైన్‌ విధానంలో బాలవాటిక 1,3, తరగతి ఒకటి- రిజిస్ట్రేషన్‌ తేదీలు: మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 2 వరకు. బాలవాటిక 1,3 తొలి ప్రొవిజినల్‌ జాబితాను వెల్లడి: 08.04.2026. బాలవాటిక 1,3 తొలి జాబితాను వెల్లడి: 09.04.2026. బాలవాటిక 1,3 రెండో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి (సీట్ల ఖాళీల ఆధారంగా): 16.04.2026. బాలవాటిక 1,3 మూడో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: 21.04.2026.. ఆఫ్‌లైన్‌ విధానంలో బాలవాటిక 2, తరగతి-II, ఆపై తరగతుల్లో రిజిస్ట్రేషన్‌ తేదీలు: 02.04.2026- 08.04.2026. తొలి ఎంపిక జాబితా: 13.04.2026. 11వ తరగతి ప్రవేశాలకు: పదో తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. Website:https://kvsangathan.nic.in/