Posts

Current Affairs

కేరళలో అరుదైన పరాన్నజీవి మొక్క

అరుదుగా పుష్పించే పరాన్నజీవి మొక్కను 175 ఏళ్ల తర్వాత కేరళలో పరిశోధకులు మళ్లీ కనుక్కున్నారు. ‘క్యాంప్‌బెలియా ఆరంటియాకా’గా ఈ మొక్కను గుర్తించారు. వయనాడ్‌ జిల్లాలోని థొల్లాయిరాం ప్రాంతంలో ఇది కనిపించింది. ఈ జాతి మొక్కను మొదట 1849కి ముందు తమిళనాడులోని నడువట్టం వద్ద స్కాటిష్‌ వృక్ష శాస్త్రవేత్త రాబర్ట్‌ విట్‌ చూశారు. అయితే, దీనికి సంబంధించిన విశ్వసనీయమైన రికార్డులేవీ లేవు.  కేరళలోని కాల్‌పెట్టకు చెందిన ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ పరిశోధకులు సలీం పిచాన్‌తోపాటు అలప్పుజలోని సనాతన ధర్మ కళాశాల నుంచి వచ్చిన డాక్టర్‌ జోస్‌ మాథ్యూ, అరుణ్‌రాజ్, డాక్టర్‌ వి.ఎన్‌.సంజయ్, శ్రీలంక యూనివర్సిటీకి చెందిన బి.గోపల్లవ బృందం ‘క్యాంప్‌బెలియా ఆరంటియాకా’ను కనుగొంది.

Current Affairs

నీతీశ్‌ కుమార్‌

బిహార్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల పదోసారి ప్రమాణం చేసిన నీతీశ్‌కుమార్‌కు 2025, డిసెంబరు 5న లండన్‌కు చెందిన ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స’ గుర్తింపు లభించింది. 2000లో మొదటిసారిగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన నీతీశ్‌.. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల వ్యవధిలోనే వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత 2005లో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, మధ్యలో స్వల్పకాలం (2014) మినహా ఇప్పటిదాకా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 

Current Affairs

తగ్గన రెపోరేటు

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ రెపోరేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తీసుకునే రుణాలకు చెల్లించే వడ్డీ)ను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. 2024 డిసెంబరు 6న రెపో రేటు 6.50% కాగా.. ఏడాది తర్వాత ఇప్పుడు 5.25 శాతానికి దిగివచ్చింది. అంటే 2025లో రెపో రేటు 1.25% (ఫిబ్రవరిలో 0.25%, ఏప్రిల్‌లో 0.25%, జూన్‌లో 0.50%, డిసెంబరులో 0.25% చొప్పున) తగ్గింది. 2025-26కు జీడీపీ వృద్ధి అంచనాను 6.8% నుంచి 7.3 శాతానికి ఆర్‌బీఐ పెంచింది.

Current Affairs

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు

మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు(విక్రమ్‌)ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025, డిసెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. అధికార భాషా సంఘం చేపట్టాల్సిన కార్యాచరణను ఉత్తర్వుల్లో వివరించింది. 

Current Affairs

ఏపీ వాసులకు జాతీయ హస్తకళ అవార్డులు

కేంద్ర జౌళి శాఖ 2023, 2024 సంవత్సరాలకు ప్రకటించిన ‘జాతీయ హస్తకళ’ అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కళాకారులు ఎంపికయ్యారు. ఇందులో డి.శివమ్మ (తోలుబొమ్మలాట) శిల్పగురు-2023, బ్రహ్మానంద మహారాణ (రాతి శిల్పం), గోర్సా సంతోష్‌కుమార్‌ (ఆటబొమ్మలు, గాలిపటాలు)లు జాతీయ హస్తకళ 2023, 2024 అవార్డులు గెలుచుకున్నారు.   

Current Affairs

పుతిన్‌తో మోదీ శిఖరాగ్ర భేటీ

భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో 2025, డిసెంబరు 5న శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్‌ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి.  భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇందుకుగానూ అయిదేళ్ల కాలానికి ‘2030 ఆర్థిక కార్యక్రమం’ ప్రణాళికకు తుదిరూపునిచ్చాయి.

Walkins

ఈఎస్‌ఐసీ అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అహ్మదాబాద్‌, (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 08 వివరాలు: 1. ప్రొఫెసర్ - 02 2. అసోసియేట్ ప్రొఫెసర్ - 02 3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ - 02 4. సీనియర్‌ రెసిడెంట్ - 02 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధింత విభాగాంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎంఎస్‌/డిఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. తదితర విభాగాలు... జీతం: నెలకు ప్రొఫెసర్ కు రూ.1,18,500. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.78,800. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.67,700. సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700 దరఖాస్తు ఫీజు:  జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఐసీ రెగ్యులర్ ఉద్యోగులకు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ తేదీ: 16/12/2025  వేదిక: డీన్ కార్యాలయం, 3వ అంతస్తు, పాత డీ-34 క్యాంపస్, మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ ఎదురుగా, ఖోఖ్రా, అహ్మదాబాద్, గుజరాత్-380008. Website:https://esic.gov.in/recruitments

Walkins

ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ (ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కోల్‌కతా, ముంబయి, న్యూ దిల్లీ, చెన్నై జోన్‌లలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌, టెక్నికల్ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 23  వివరాలు: 1. ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 15 2. అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఇంజినీర్: 03 3. టెక్నికల్ ఆఫీసర్‌: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: పోస్టులను అనుసరించి 30 నుంచి 33 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.40,000 - రూ.55,000, టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000 - రూ.31,000, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్‌కు రూ.25,506. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 డిసెంబర్ 16.  Website:https://www.ecil.co.in/jobs.html

Walkins

ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్‌ అసోసియేట్ ఉద్యోగాలు

దిల్లీలోని  ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్ దిల్లీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 06 వివరాలు: 1. రిసెర్చ్‌ అసోసియేట్  - 01 2. రిసెర్చ్ అసిస్టెంట్‌  - 01 3. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -I - 01 4. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -II( నాన్ - మెడికల్ )- 01 5. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ - 02 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఏ/ఎమ్మెస్సీ/ఎంఫీల్/పీహెచ్‌డీ( సోషల్ సైన్స్ / సైకాలజీలోక్లినికల్ సైకాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్ల - 40 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్ , ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -II కు రూ.67,000- రిసెర్చ్‌ అసిస్టెంట్ కు రూ.31,000.   ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -I కు రూ.18,000. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ కు రూ.32,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ: 20.12.2025.  వేదిక: బోర్డ్ రూమ్, నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ ఎన్‌డీడీటీసీ, ఎయిమ్స్‌, సెక్టార్-19, కమలా నెహ్రూ నగర్, సీజీఓ కాంప్లెక్స్, (ఘజియాబాద్). Website:https://www.aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment

Internship

పాజ్‌ ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

పాజ్‌ ఫౌండేషన్‌  కంపెనీ మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 100 వివరాలు: సంస్థ: పాజ్‌ ఫౌండేషన్‌  పోస్టు పేరు: మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌)  నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, అడ్వాన్స్‌డ్‌  ఎక్సెల్, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్, డిజిటల్, ఇన్‌స్టాగ్రామ్,  సోషల్‌మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటంలో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.1,500- రూ.15,000. వ్యవధి: 1 నెల దరఖాస్తు గడువు: 25-12-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-media-public-relations-pr-internship-at-pawzz-foundation1764073336