Posts

Current Affairs

26th National Conference

♦ President Droupadi Murmu inaugurated the 26th National Conference for the Chairpersons of Public Service Commissions (PSC) in Hyderabad on 19 December 2025. Organised by the Telangana Public Service Commission (TGPSC), the two-day conference aims to bring together the Union Public Service Commission (UPSC) and State PSCs as a premier national platform for dialogue, institutional introspection and cooperative reforms. ♦ Speaking on the occasion, President Murmu emphasised the critical role of Public Service Commissions in the governance framework of India. ♦ The conference concludes on 20 December 2025

Current Affairs

ఎలాన్‌ మస్క్‌

2025, డిసెంబరు 21 నాటికి ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ 749 బి.డాలర్ల (రూ.67.41 లక్షల కోట్ల)కు చేరింది. ప్రపంచంలోనే తొలిసారిగా 700 బి.డాలర్లకు పైగా నికర సంపద కలిగిన వ్యక్తిగా మస్క్‌ రికార్డు సాధించారు. డెలావేర్‌ సుప్రీంకోర్టు 139 బిలియన్‌ డాలర్ల (రూ.12.51 లక్షల కోట్ల) విలువైన టెస్లా స్టాక్‌ ఆప్షన్లను పునరుద్ధరించడంతో పాటు, 2018లో ఎలాన్‌ మస్క్‌కు ప్రకటించిన 55 బి.డాలర్ల (రూ.4.95 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీకి అనుకూలంగా తీర్పు వెలువరించడంతో ఇది సాధ్యమైంది. మన దేశంలోని 4 అతి పెద్ద నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువను కలిపినా, మస్క్‌ సంపద విలువే అధికం.  గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా (సుమారు 500 బి.డాలర్లు-రూ.45 లక్షల కోట్లు) ఉన్నారు. 

Current Affairs

జెమ్‌

ప్రభుత్వరంగ సంస్థలకు అవసరమైన సేవలు, వస్తు సామగ్రి ని సమీకరించేందుకు నిర్వహిస్తున్న ది గవర్నమెంట్‌ ఇ-మార్కెట్‌ ప్లేస్‌ (జెమ్‌) ద్వారా ఇప్పటివరకు 11.25 లక్షలకు పైగా ఎంఎస్‌ఈ (సూక్ష్మ, చిన్న సంస్థ)లకు రూ.7.44 లక్షల కోట్లకు పైగా విలువైన ఆర్డర్లు లభించాయి. వాణిజ్య - పరిశ్రమల శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. జెమ్‌ సమీకరించే ఉత్పత్తుల్లో, ఎంఎస్‌ఈల వాటా 25% తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించగా, అంతకుమించి ఈ సంస్థల నుంచి సమీకరణ గత నెలకే 44.8 శాతానికి చేరింది.

Current Affairs

ఆసియాలో మొదటి రేడియో సేవలకు 100 ఏళ్లు

భారతదేశంలో ఒకప్పుడు రేడియో సిలోన్‌గా గుర్తింపు పొందిన శ్రీలంకలోని రేడియో సర్వీసు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీలంక ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆసియాలోని షార్ట్‌ వేవ్‌ స్టేషన్లలో ఇది మొదటిది. హిందీ పాటల వీక్లీ కౌంట్‌డౌన్‌ షో అయిన బినాకా గీతమాలను ఈ రేడియో ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ రేడియో ఆసియాలోనే అతి పెద్ద రికార్డెడ్‌ పాటల లైబ్రరీని కలిగి ఉందని శ్రీలంక బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎల్‌బీసీ) తెలిపింది. 

Current Affairs

‘శాంతి’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

అణు రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా తీసుకొచ్చిన సస్టెయినబుల్‌ హార్నెస్సింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా (శాంతి) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇటీవల పార్లమెంటులో నెగ్గిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారని 2025, డిసెంబరు 21న ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెల్లడించింది.  పౌర అణు రంగానికి సంబంధించిన అన్ని చట్టాలను ఇది డీల్‌ చేయడంతోపాటు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించనుంది. కొత్త చట్టం రాకతో ద ఆటమిక్‌ ఎనర్జీ చట్టం-1962, సివిల్‌ లయబిలిటీ ఫర్‌ న్యూక్లియర్‌ డ్యామేజీ చట్టం-2010 రద్దవుతాయి. 

Current Affairs

వీబీ-జీ రాం జీ బిల్లుకు చట్టరూపం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్‌- గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీ-జీ రాం జీ) బిల్లు చట్టంగా మారింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు 2025, డిసెంబరు 21న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది.  దీనిద్వారా ప్రతి ఏటా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు 125 పని దినాలకు హామీ లభిస్తుంది. వ్యవసాయ పనులకు కూలీల కొరత ఎదురుకాకుండా చూడటానికి విత్తనాలు, నూర్పిళ్లు ఎక్కువగా ఉండే 60 రోజులపాటు ఈ పథకాన్ని నిలిపేస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీనికింద చేపట్టే పనుల ప్రణాళిక, పర్యవేక్షణ అంతా గ్రామ పంచాయతీల ద్వారానే జరుగుతుంది. ఇందులో ప్రధానంగా నాలుగు రకాల పనులకే వీలు కల్పిస్తారు.  

Current Affairs

సేయంగ్‌ రికార్డు

ఒక ఏడాదిలో మిలియన్‌ డాలర్ల నగదు బహుమతిని గెలుచుకున్న తొలి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా దక్షిణ కొరియా స్టార్‌ ఆన్‌ సేయంగ్‌ ఘనత సాధించింది. 2025, డిసెంబరు 21న ఆమె బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో ఆమె 21-13, 18-21, 21-10తో వాంగ్‌ జియి (చైనా)ని ఓడించింది. ఈ టోర్నీకి దక్కిన దాంతో కలిపి 2025లో సేయాంగ్‌ మొత్తం నగదు బహుమతి మిలియన్‌ డాలర్లు దాటింది. 

Current Affairs

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ ఛైర్మన్‌గా బి.పి.కనుంగో

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బి.పి. కనుంగో నియమితులయ్యారు. 2025, డిసెంబరు 20న జరిగిన బోర్డు సమావేశంలో ఈయన నియామకానికి ఆమోదం లభించింది. కనుంగో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్‌. పరపతి విధానం, ఆర్థిక నియంత్రణలు, కేంద్ర బ్యాంకింగ్‌ వంటి అంశాల్లో ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. 

Current Affairs

డ్రోగ్‌ పారాచూట్ల పరీక్ష విజయవంతం

భారత్‌ చేపట్టనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ కోసం రూపొందించిన డ్రోగ్‌ పారాచూట్లపై పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. తిరుగుప్రయాణంలో క్రూ మాడ్యూల్‌ వేగాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన డిసలరేషన్‌ వ్యవస్థలో ఉపయోగించేందుకు వీటిని అభివృద్ధి చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది.  చండీగఢ్‌లో ఉన్న టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌లో ఉన్న రైల్‌ ట్రాక్‌ రాకెట్‌ స్లెడ్‌ (ఆర్‌టీఆర్‌ఎస్‌) కేంద్రంలో ఈ పరీక్షలు జరిగాయి. 

Current Affairs

సింధుఘోష్‌కు నేవీ వీడ్కోలు

భారత నౌకాదళానికి 40 ఏళ్ల పాటు సేవలందించిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ సింధుఘోష్‌ ఇక శాశ్వతంగా విశ్రాంతి తీసుకోనుంది. 2025, డిసెంబరు 20న దీన్ని లాంఛనంగా నేవీ నుంచి ఉపసంహరించారు. ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.