Posts

Current Affairs

సముద్ర సూక్ష్మజీవులపై నెల్లూరులో అధ్యయన కేంద్రం

సముద్రాల్లో నివసించే సూక్ష్మజీవులపై అధ్యయనం చేసేందుకు ‘డీప్‌ సీ మెరైన్‌ మైక్రోబియల్‌ రిపాజిటరీ’ కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటుచేస్తున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ బాలాజీ రామకృష్ణన్‌ తెలిపారు. ఇది దేశంలోనే మొదటి పరిశోధన కేంద్రం అవుతుందని పేర్కొన్నారు.  సముద్ర సూక్ష్మజీవులు అధిక హైడ్రోస్టాటిక్‌ పీడనం, తక్కువ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి లేకుండా తట్టుకుని జీవించే స్వభావం కలిగి ఉంటాయి.  నెల్లూరులో ఏర్పాటుచేసే ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు పారిశ్రామిక, బయోమెడికల్‌ పరిణామాలకు సంబంధించి సూక్ష్మజీవులపై అధ్యయనం చేస్తారు.

Current Affairs

గల్వాన్‌లో యుద్ధ స్మారకం

ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధస్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2025, డిసెంబరు 7న ఆవిష్కరించారు. దీన్ని గల్వాన్‌ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. లద్దాఖ్‌లోని ష్యోక్‌-దౌలత్‌బేగ్‌ ఓల్డీ మార్గంలో కేఎం-120 పోస్టు వద్ద దీన్ని నిర్మించారు.  ప్రపంచంలో సైనిక మోహరింపులు జరిగే అత్యంత కఠినమైన ప్రాంతంగా దీనికి పేరుంది. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో దీన్ని ‘భారత్‌ రణ్‌భూమి దర్శన్‌’ కార్యక్రమం కింద నిర్మించారు.  2025, జనవరి 15న ఆర్మీ దినోత్సవం నాడు దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. 

Current Affairs

రోహిత్‌ శర్మ

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ బ్యాటర్‌ రోహిత్‌. 2025, డిసెంబరు 6న దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో కేశవ్‌ మహరాజ్‌ వేసిన 14వ ఓవర్లో నాలుగో బంతికి రోహిత్‌ సింగిల్‌ తీసి 20 వేల క్లబ్బులో అడుగు పెట్టాడు.  ఈ ఇన్నింగ్స్‌ తర్వాత అతడి పరుగులు 20,048కి చేరుకున్నాయి. వన్డేల్లో 11,516 పరుగులు సాధించిన హిట్‌మ్యాన్‌.. టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు.

Current Affairs

జూనాగఢ్‌

గుజరాత్‌లోని జూనాగఢ్‌లో కాలుష్యం సున్నా స్థాయిలో ఉంది. ప్రపంచంలో కోట్ల మందిని కాలుష్యం ఇబ్బంది పెడుతుందగా.. అక్కడ ఎలాంటి కాలుష్య జాడలు లేవు. దీనికి ప్రధాన కారణం ఆ పట్టణంలో లేదా జిల్లాలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల్లేవు. అటవీ ప్రాంతం కారణంగా అక్కడి చెట్లు కాలుష్యాన్ని తగ్గించడానికి కారణమవుతున్నాయి. దీపావళి సమయంలో బాణసంచా, జనం అధికంగా రావడంవల్ల కొంత ఇబ్బందులేర్పడతాయి. మిగిలిన కాలంలో ఇక్కడ కాలుష్యమనేదే కనిపించదు. 

Current Affairs

రష్యా విపణిలోకి పతంజలి ఉత్పత్తులు

బాబా రామ్‌దేవ్‌ నేతృత్వంలోని పతంజలి గ్రూపు రష్యా విపణిలోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకు గాను ఆ దేశ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఆరోగ్యం, సంరక్షణ, వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నైపుణ్య మానవ వనరుల బదిలీ, పరిశోధన సంబంధిత కార్యకలాపాలు లాంటి లక్ష్యాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.  ఎంఓయూపై పతంజలి గ్రూపు తరపున బాబా రామ్‌దేవ్, ఇండో-రష్యా బిజినెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్, రష్యా మంత్రి సెర్గీ చెర్మిన్‌ సంతకాలు చేశారు. పతంజలి ఆయుర్వేద్, పతంజలి ఫుడ్స్‌ ద్వారా ఆయుర్వేదిక్, ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులను పతంజలి గ్రూపు విక్రయిస్తుంది. 

Walkins

ఈఎస్‌ఐసీ ఫరీదాబాద్‌లో ప్రొఫెసర్‌ పోస్టులు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్, ఫరీదాబాద్ (హరియాణ) ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పొస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 50 వివరాలు: 1. ప్రొఫెసర్‌ - 09 2. అసోసియేట్ ప్రొఫెసర్ - 23 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 18 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధింత విభాగాంలో గుర్తింపు పొందిన  యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. విభాగాలు: అనస్థీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బ్లడ్ బ్యాంక్, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్,  ఫార్మకాలజీ, ఫిజియాలజీ తదితర విభాగాలు. జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,60,226.అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,73,045. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,48,669. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ, ఈఎస్‌ఐసీ ఉద్యోగులకు, మాజీ సైనికులకు, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ తేదీలు: 10/12/2025.కానీ ఈ ప్రక్రియ 17.12.2025 వరకు ప్రతి బుధవారం కొనసాగుతుంది. వేదిక: ఫ్యాకల్టీ రిడింగ్ హాల్, అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, ఫరీదాబాద్. Website:https://esic.gov.in/recruitments

Government Jobs

ఎన్‌ఐడీసీఎల్‌లో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు

నేషనల్ హైవేస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐడీసీఎల్‌) సీనియర్‌ మేనేజర్‌ (టెక్నికల్‌), డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్), జనరల్ మేనేజర్ (టెక్నికల్), సీనియర్ జనరల్ మేనేజర్ (టెక్నికల్‌) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 48  వివరాలు: 1. సీనియర్ మేనేజర్(టెక్నికల్): 21 2. డిప్యూటీ జనరల్ మేనేజర్(టెక్నికల్): 15 3. జనరల్ మేనేజర్‌(టెక్నికల్‌): 07 4. సీనియర్ జనరల్ మేనేజర్(టెక్నికల్): 05 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌(సివిల్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: పోస్టులను అనుసరించి 38 ఏళ్ల నుంచి 48 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.80,000 - రూ.2,20,000, జనరల్ మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000, సీనియర్‌ జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.2,60,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 డిసెంబర్ 15. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 13.  Website:https://www.nhidcl.com/current-jobs

Government Jobs

ఐఐటీ ఇందౌర్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

ఇందౌర్‌లోని  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఇందౌర్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్  పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌/ ఎంటెక్‌(హైడ్రాలజీ/వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్/ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్/హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్‌/అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఫెలోషిప్: నెలకు రూ.35,000. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా  mfsosiiti@gmail.com.కు పంపాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31-12-2025. Website:https://www.iiti.ac.in/recruitments/project-positions

Apprenticeship

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌), కోరాపుత్‌ డివిజన్‌, సునాబెడా, ఒడిషాలో 2025-26 సంవత్సరానికి ఏడాది గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వివరాలు: గ్రాడ్యుయేట్‌ (టెక్నికల్‌) అండ్‌ డిప్లొమా (టెక్నీషియన్‌) విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకాం, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితరాలు. అర్హత: డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తు విధానం: ఎన్‌ఏటీ పోర్టల్‌ ద్వారా. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ: 15-12-2025. Website:https://hal-india.co.in/career

Admissions

ఎక్స్‌ఐఎస్‌ఎస్‌లో పీజీడీఎం ప్రోగ్రాం

జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సర్విస్‌, రాంచీ 2026-28 సంవత్సారానికి పీజీడీఎం ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:  పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) 2026-28 స్పెషలైజేషన్లు:  హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-హెచ్‌ఆర్‌ఎం) రూరల్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఆర్‌ఎం) మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఎంఎం) ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఎఫ్‌ఎం) అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గ్జాట్‌ 2026, క్యాట్‌ 2025, సీమ్యాట్‌ 2026, ఎక్స్‌ఐఎస్‌ఎస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ అర్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 15.12.2025. Website:https://xiss.ac.in/admission/?utm_source=kollegeapply&utm_medium=PNP28&utm_campaign=2026&gad_source=1