Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

యూనికార్న్‌గా జస్‌పే

ఫిన్‌టెక్‌ సంస్థ జస్‌పే, సరికొత్త యూనికార్న్‌ (100 కోట్ల డాలర్లు-రూ.9100 కోట్ల)గా అవతరించింది. జస్‌పే విలువను 1.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10,920 కోట్లు)గా పరిగణిస్తూ, 50 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.455 కోట్ల)ను వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ తాజాగా అందచేయడం ఇందుకు నేపథ్యం. 2025లో సంస్థ విలువ 900 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8190 కోట్లు)గా ఉంది. 

Current Affairs

భారత్‌లోకి ఎఫ్‌డీఐ వరద

2025లో మొత్తం మీద మన దేశంలోకి 47 బి. డాలర్ల (రూ.4.32 లక్షల కోట్ల) విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తరలివచ్చాయి. 2024లో వచ్చిన ఎఫ్‌డీఐ కంటే ఇవి 73% అధికం. సేవలు, తయారీలోకి ఎక్కువ శాతం పెట్టుబడులు వచ్చాయని, ఇందుకు భారత విధానాలు మద్దతుగా నిలిచాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ‘ద గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రెండ్స్‌ మానిటర్‌’ పేరిట యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీటీఏడీ) ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం..  అంతర్జాతీయ ఎఫ్‌డీఐ 14% వృద్ధితో 1.6 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.147 లక్షల కోట్ల) కు చేరింది. చైనాలోకి వరుసగా మూడో ఏడాదీ ఎఫ్‌డీఐలు తగ్గాయి. 2025లో 8% క్షీణతతో 107.5 బి. డాలర్లకు పరిమితమయ్యాయి. 

Current Affairs

రాష్ట్రపతి భవన్‌లో గ్రంథ్‌ కుటీర్‌

రాష్ట్రపతి భవన్‌లో భాగంగా ఒక గ్రంథ్‌ కుటీర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, జనవరి 23న ప్రారంభించారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా సహా 11 ప్రాచీన భారతీయ భాషల పుస్తకాలు, రాతప్రతులకు చోటు దక్కింది. ఇందులో పురాణాలు, తత్వశాస్త్రం, భాష, చరిత్ర, పాలన, సైన్స్‌ లాంటి అంశాల పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ విభాగంలో వలస పాలనకు సంబంధించిన పుస్తకాలు ఉండేవి. తాజాగా వాటిని రాష్ట్రపతి ఎస్టేట్‌లోని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. గ్రంథ్‌ కుటీర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, దాతల తోడ్పాటుతో సిద్ధం చేశారు. 

Current Affairs

డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం 2026, జనవరి 23న ప్రకటించింది. కొవిడ్‌ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం తెలిపింది. ఇకపై డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి వచ్చే అన్నిరకాల నిధులు నిలిపివేస్తున్నామని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని అన్ని కార్యాలయాల నుంచి యూఎస్‌ సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు వెల్లడించింది. ఇకనుంచి పరిమిత పరిధి మేరకు డబ్ల్యూహెచ్‌వోతో కలిసి పనిచేయనున్నట్లు యూఎస్‌ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 

Current Affairs

‘రోడ్‌మ్యాప్‌ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్స్‌ బై 2035-36’ నివేదిక

కేంద్ర విద్యుత్తు శాఖ 2026, జనవరి 23న ‘రోడ్‌మ్యాప్‌ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్స్‌ బై 2035-36’ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడో స్థానంలో నిలిచింది. 56,335 మెగావాట్ల సామర్థ్యంతో మహారాష్ట్ర, 41,525 మెగావాట్ల సామర్థ్యంతో ఒడిశా, 32,750 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ మొదటి మూడు స్థానాల్లో నిలిచినట్లు పేర్కొంది. ఈ విషయంలో ఏపీ దక్షిణాదిలో తొలి స్థానంలో ఉంది. ఏపీలో ఇప్పటికే 1,680 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. మరో 2,850 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో 12,050 మెగావాట్ల ప్రాజెక్టులు సర్వే, డీపీఆర్‌ దశలో ఉన్నాయి. 

Current Affairs

ఏపీలో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం

నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిలో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ తరహా కేంద్రాలు ప్రస్తుతం ముంబయి, హైదరాబాద్‌ల్లో మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ ఆర్థిక వేదిక ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.  ప్రభుత్వాలు, పరిశ్రమలతో కలిసి ఆచరణాత్మక విధానాలు రూపొందించడం, పైలట్‌ ప్రాజెక్టులు, ఆయా ప్రాంతాల ప్రాధాన్యతలను గుర్తించడంలో ఈ కేంద్రం కీలకంగా వ్యవహరిస్తుంది. 

Government Jobs

ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

ముంబయి పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (ఎలక్ట్రికల్): 16  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా.బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వేతనం: నెలకు రూ.40,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 10.02.2026. Website:https://mumbaiport.gov.in/show_content.php?lang=1&level=2&ls_id=960&lid=727

Government Jobs

ఐసీఎంఆర్‌ దిల్లీలో స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3 ఉద్యోగాలు

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3: 05 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఎంబీబీఎస్‌, పీజీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడుదు.  వేతనం: నెలకు రూ.67,700 - రూ.2,08,700. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.1,500. ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేది: 2026 ఫిబ్రవరి 28.  Website:https://www.icmr.gov.in/employment-opportunities

Apprenticeship

యురేనియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు

యునిరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్‌) వివిధ విభాగాల్లో ఐటీఐ ట్రేడ్‌, డిప్లొమా టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 364 వివరాలు: 1. ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 269 2. డిప్లొమా టెక్నీషియన్‌: 60 3. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 35 విభాగాలు: మైనింగ్‌, సివిల్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, టర్నర్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, మేట్‌. అర్హత: ఖాళీలను అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2026 ఫిబ్రవరి 28వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.  దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 1. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28. Website:https://ucil.gov.in/public/index.php

Apprenticeship

భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) చెన్నై యూనిట్‌ వివిధ విభాగల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం ఖాళీల సంఖ్య: 84 వివరాలు: 1. డిప్లొమా అప్రెంటిస్‌: 10 2. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 74 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌, బీకామ్‌/బీబీఏ/బీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి: 01-01-2026వ తేదీ నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.17,500, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,500. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.  ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 5, 6, 7.   Website:https://bel-india.in/job-notifications/