Posts

Government Jobs

Jobs in DMHO Hyderabad

District Medical and Health Office Hyderabad (DMHO) is inviting applications for the filling of following posts in various departments on contractual basis. Number of Posts: 18 Details: 1. Medical Officer (Basti Dawakhana): 15 2. Medical Officer (Pallative Care Center): 02 3. Psychiatrist: 01 Qualification: Candidates should have passed MBBS, MD in the relevant department along with work experience as per the posts. Age Limit: 18 - 46 years. Salary: Rs. 52,000 per month for Medical Officer, Rs. 1,30,000 for Psychiatrist. Application Fee: Rs. 500. Application Process: Offline. Address: Office of the DM&HOA Hyderabad, 4th Floor, GHMC Building, Patni, Secunderabad. Last Date for receipt of offline applications: June 16, 2025. Website:https://hyderabad.telangana.gov.in/notice_category/recruitment/

Apprenticeship

Graduate Apprentice Posts In FSNL

Ferro Srap Nigam Limited (FSNL) is inviting applications for the Graduate Apprentice posts in Chhattisgarh, Odisha, West Bengal, Jharkhand, Andhra Pradesh.  Details: Graduate Apprentice: 13 Qualification: Must have passed B.Tech, Degree, PG in the relevant discipline as per the post. Stipend: Rs.15,000 per month. Selection method: Based on marks obtained in educational qualifications. Application Process: Through Online. Application last date: 11th July 2025. Website:https://fsnl.co.in/career.php

Current Affairs

ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం

పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి కాపాడే లక్ష్యంతో ఏటా జూన్‌ 12న ‘ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం’గా నిర్వహిస్తారు. బాలబాలికలను చదువుకు దూరం చేసి, శ్రామిక యంత్రాలుగా మార్చడాన్ని బాల కార్మిక వ్యవస్థ అంటారు. సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల కొంతమంది బాలలు కార్మికులుగా మారుతున్నారు. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన వీరి బాల్యం.. ఆటలకు దూరమై, సరైన పోషకాహారం అందక పని ప్రదేశాల్లో మగ్గిపోతోంది. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలతోపాటు పరిశ్రమలు, సంస్థల యాజమాన్యాలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: బాల కార్మికుల సమస్యలపై దృష్టి సారించడంతోపాటు ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే ఉద్దేశంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2022, జూన్‌ 11న ఒక సమావేశాన్ని నిర్వహించింది. అందులో 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను ప్రమాదకర వాతావరణంలో పనిచేయించడాన్ని చట్టపరంగా నేరంగా ప్రకటించాలని సభ్యదేశాలు తీర్మానించాయి. దీన్ని వ్యాప్తి చేసేందుకు ఒక రోజును జరపాలని నిశ్చయించాయి. ఆ విధంగా వచ్చిందే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. దీన్ని మొదటిసారి 2022, జూన్‌ 12న ఐఎల్‌ఓ జెనీవాలోని తన ప్రధాన కార్యాలయంలో నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా ఈ రోజును జరుపుతున్నారు.

Current Affairs

బీసీజీ నివేదిక

 బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి, నిపుణులపై 2025, జూన్‌ 12న నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో 6 లక్షల మంది ఏఐ నిపుణులు ఉండగా, 2027 నాటికి ఈ సంఖ్య 12.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా.  అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఏఐ నిపుణులు ఉన్నది మన దేశంలోనే. ప్రపంచ వ్యాప్త ఏఐ నిపుణుల్లో 16 శాతం మంది ఇక్కడ ఉన్నారు. 

Current Affairs

యూఎన్‌హెచ్‌సీఆర్‌ నివేదిక

హింసా దౌర్జన్యాలు, వేధింపుల వల్ల స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల వ్యవహారాల సంఘం (యూఎన్‌హెచ్‌సీఆర్‌) నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య గతేడాదికన్నా 20 లక్షలు ఎక్కువ. దశాబ్దం క్రితంతో (2105) పోలిస్తే దాదాపు రెట్టింపు అని నివేదిక వివరించింది. సంఘర్షణల వల్ల స్వదేశం విడచిపెట్టిన శరణార్థుల్లో మూడింట రెండు వంతులు పొరుగు దేశాల్లోనే తల దాచుకొంటున్నారని నివేదిక తెలిపింది. 

Current Affairs

లింగ సమానత్వ సూచీ

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 2025 ఏడాదికి గాను వెలువరించిన లింగ సమానత్వ సూచీలో భారత్‌ 131వ ర్యాంకులో నిలిచింది. కేవలం 64.1 శాతం సమానత్వంతో దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకు పొందిన దేశాల సరసన భారత్‌ నిలిచింది. 2024లో భారత్‌ 129వ ర్యాంకులో ఉంది. స్త్రీ, పురుషుల ఆర్థిక భాగస్వామ్యం - అవకాశాలు, విద్యాపరమైన స్థితిగతులు, ఆరోగ్య- జీవన స్థితిగతులు, రాజకీయ సాధికారత లాంటి నాలుగు అంశాల ఆధారంగా 148 దేశాలకు డబ్ల్యూఈఎఫ్‌ ర్యాంకులను కేటాయించింది. ఈ జాబితాలో వరుసగా 16వ సారి ఐస్‌లాండ్‌ తొలి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ఫిన్‌లాండ్, 3వ స్థానంలో నార్వే ఉంది. 

Current Affairs

బెలూం గుహలకు ‘భౌగోళిక వారసత్వ’ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపునిచ్చింది. దీంతో వీటికి దేశ పర్యాటక ప్రదేశాల పటంలో స్థానం దక్కుతుంది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రచారం లభిస్తుంది. ఇవి ఇప్పటికే దేశంలోనే పొడవైన గుహలుగా పేరు తెచ్చుకున్నారు. ఏడాదికి దాదాపు 2 లక్షల మంది వీటిని సందర్శిస్తుంటారు.  

Current Affairs

యశస్వీ సోలంకి

భారత సర్వసైన్యాధికారైన రాష్ట్రపతికి ఎయిడ్‌-డె-క్యాంప్‌ (ఏడీసీ)గా నియమితులైన మొదటి మహిళా నేవల్‌ ఆఫీసర్‌గా నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ యశస్వీ సోలంకి గుర్తింపు పొందారు. భారత ప్రథమ పౌరులైన రాష్ట్రపతికీ, వివిధ ప్రభుత్వ విభాగాలకూ మధ్య సమన్వయకర్తగా ఉంటూ అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, మిలిటరీ ప్రోటోకాల్స్‌ సవ్యంగా సాగేలా చూడటం ఏడీసీ విధి. రాష్ట్రపతికి మొత్తం అయిదుగురు ఏడీసీలు ఉంటారు. ఆర్మీ నుంచి ముగ్గుర్నీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల నుంచి చెరొకరినీ ఎంపికచేస్తారు. వీళ్లలోంచి ఒకరిని రాష్ట్రపతి విధుల కోసం ఎంచుకుంటారు. సర్వీసులో కనీసం 5-7 ఏళ్లపాటు అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవాళ్లనే ఏడీసీగా నియమిస్తారు. 

Current Affairs

వింబుల్డన్‌ విజేతకు రూ.34 కోట్లు

2025లో వింబుల్డన్‌ టోర్నీ ప్రైజ్‌మనీని రూ.624 కోట్లుగా నిర్ణయించినట్లు ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్ అధికారులు వెల్లడించారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ మొత్తం 7 శాతం అధికం. విజేతగా నిలిచే ప్లేయర్‌ రూ.34 కోట్లు సొంతం చేసుకోనున్నాడు. 2024తో పోలిస్తే ఇది 11.1 శాతం ఎక్కువ. ఈ టోర్నీలో పురుషులు, మహిళల విజేతలకు సమాన నగదు బహుమతి దక్కుతుంది. తొలి రౌండ్లో నిష్క్రమించే క్రీడాకారులకు రూ.76 లక్షలు దక్కనున్నాయి.   జూన్‌ 30న వింబుల్డన్‌ ఆరంభం కానుంది. జులై 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 

Current Affairs

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత స్టార్‌ షూటర్‌ సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా కాంస్య పతకం సాధించింది. 2025, జూన్‌ 12న మ్యూనిక్‌లో జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ ఫైనల్లో ఆమె 453.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. జీనెట్‌ డ్యూస్టడ్‌ (466.9- నార్వే) స్వర్ణం, ఎమిలీ జేగీ (464.8- స్విట్జర్లాండ్‌) రజతం గెలిచారు.