Posts

Government Jobs

డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫార్మసిస్ట్ పోస్టులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అర్బన్ క్లినిక్‌లు/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి జిల్లా వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 40. వివరాలు: 1. ల్యాబ్ టెక్నీషియన్: 03 పోస్టులు 2. ఫార్మసిస్ట్: 11 పోస్టులు 3. డేటా ఎంట్రీ ఆపరేటర్: 11 పోస్టులు 4. శానిటరీ అటెండెంట్: 15 పోస్టులు అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, పీజీడీసీఏ, డీఫార్మసీ/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులై ఉండాలి.   గరిష్ఠ వయోపరిమితి: 01.09.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.  దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్-సర్వీస్‌మ్యాన్ అభ్యర్థులకు రూ.100. ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, గుంటూరు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30-10-2024. Website:https://guntur.ap.gov.in/

Admissions

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో యూజీ, పీజీ ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్యా విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: యూజీ ప్రోగ్రామ్: బీఏ, బీకాం, బీఎస్సీ  పీజీ ప్రోగ్రామ్: 1. ఎంఏ: జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్/ ఎకనామిక్స్/ హిస్టరీ/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ పొలిటికల్ సైన్స్/ సోషియాలజీ/ ఇంగ్లిష్/ తెలుగు/ హిందీ/ ఉర్దూ. 2. ఎంఎస్సీ: మ్యాథ్స్‌/ అప్లైడ్‌ మ్యాథ్స్‌/ సైకాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫిజిక్స్/ జువాలజీ. 3. ఎంకాం 4. ఎంఎల్‌ఐఎస్సీ  5. బీఎల్‌ఐఎస్సీ 6. డిప్లొమా ప్రోగ్రామ్‌: సైకలాజికల్ కౌన్సెలింగ్/ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ ఆపరేషనల్ మేనేజ్‌మెంట్/ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్/ హ్యూమన్ రైట్స్/ కల్చర్ & హెరిటేజ్ టూరిజం/ ఉమెన్స్ స్టడీస్/ ఇంటర్నేషనల్ రిలేషన్స్. 8. సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌/ ఎన్‌జీవోస్‌ మేనేజ్‌మెంట్‌/ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌. వ్యవధి: యూజీ ప్రోగ్రామ్‌నకు మూడేళ్లు, పీజీ ప్రోగ్రామ్‌కు రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/ బీఎల్‌ఐఎస్సీ/ డిప్లొమా ప్రోగ్రామ్‌నకు ఏడాది, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌కు ఆరు నెలలు. అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30-10-2024. వివరాలకు: అధ్యయన కేంద్రం లేదా 7382929570/580, 040-23680222/333/444/555 లేదా టోల్‌ ఫ్రీ 18005990101 సంప్రదించవచ్చు. Website:http://www.braouonline.in/

Current Affairs

భారత్‌లో ఖోఖో ప్రపంచకప్‌

భారతదేశానికి చెందిన ఖోఖో క్రీడను అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ప్రపంచకప్‌ నిర్వహించబోతున్నారు. ఈ మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. 2025, జనవరి 13 నుంచి 19 వరకు దీల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ప్రపంచకప్‌ జరుగుతుందని 2024, అక్టోబరు 16న నిర్వాహకులు ప్రకటించారు. 

Current Affairs

అఖిల్‌కు కాంస్యం

ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత షూటర్‌ అఖిల్‌ షెరాన్‌ కాంస్యం నెగ్గాడు. 2024, అక్టోబరు 16న దిల్లీలో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఫైనల్లో అతడు 452.6 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. ఇస్త్‌వాన్‌ (హంగేరీ- 465.3), జిరి (చెక్‌ రిపబ్లిక్‌- 464.2) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మరో భారత షూటర్‌ చైన్‌ సింగ్‌ (409.3) ఏడో స్థానంలో నిలిచాడు.  ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత షూటర్‌ అఖిల్‌ షెరాన్‌ కాంస్యం నెగ్గాడు. 2024, అక్టోబరు 16న దిల్లీలో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఫైనల్లో అతడు 452.6 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. ఇస్త్‌వాన్‌ (హంగేరీ- 465.3), జిరి (చెక్‌ రిపబ్లిక్‌- 464.2) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మరో భారత షూటర్‌ చైన్‌ సింగ్‌ (409.3) ఏడో స్థానంలో నిలిచాడు. 

Current Affairs

జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా

కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా(54) ప్రమాణం చేశారు. 2024, అక్టోబరు 16న శ్రీనగర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు మరో అయిదుగురు మంత్రులతోనూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రమాణం చేయించారు.  జమ్మూకశ్మీర్‌ సీఎంగా పగ్గాలు చేపట్టడం అబ్దుల్లాకు ఇది రెండో సారి. జమ్మూకశ్మీర్‌ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

Current Affairs

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2024, అక్టోబరు 16న కేంద్ర క్యాబినెట్‌ సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. వారణాశి వద్ద గంగా నదిపై నిర్మించనున్న నాలుగు వరుసల రైలు, ఆరు వరుసల రోడ్డుతో కూడిన వంతెన ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.2,642 కోట్లు.  పంటల మద్దతు ధరలు ఉత్పాదక వ్యయం కన్నా 1.5 రెట్లు అధికంగా ఉండేలా చూస్తామన్న హామీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గోధుమ, శనగ, మసూర్‌దాల్, ఆవాలు, బార్లీ, కుసుమ పంటల ధరలను నిర్ణయించింది. 2025, ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే 2025-26 మార్కెటింగ్‌ ఏడాది కోసం ఈ ధరలను నిర్ణయించింది.

Current Affairs

దామగుండంలో వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీప్రాంతంలో వీఎల్‌ఎఫ్‌ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 2024, అక్టోబరు 15న శంకుస్థాపన చేశారు. ఈ రాడార్‌ స్టేషన్‌ను 2,900 ఎకరాల్లో రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. క్లిష్టమైన ఆపరేషన్లలో సాయుధ దళాల కమాండ్‌ సెంటర్లు, నౌకలు, జలాంతర్గాముల మధ్య సురక్షితమైన రియల్‌టైం కమ్యూనికేషన్‌కు ఇది దోహదపడుతుంది.

Current Affairs

బీమా సుగమ్‌ ఇండియా ఫెడరేషన్‌ ఎండీగా ప్రసూన్‌ సిక్దర్‌

బీమా సుగమ్‌ ఇండియా ఫెడరేషన్‌ తొలి మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓగా ప్రసూన్‌ సిక్దర్‌ 2024, అక్టోబరు 15న ఎంపికయ్యారు. ఈ పదవిలో ఈయన మూడేళ్లపాటు కొనసాగుతారు. ప్రసూన్‌ మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు ఎండీ, సీఈఓగా ఉన్నారు. బీమా రంగంలో సిక్దర్‌కు 25ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అందరికీ బీమా అందించాలనే లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) తీసుకొచ్చిన వినూత్న ఆవిష్కరణ బీమా సుగమ్‌. 

Current Affairs

టి.వి.నరేంద్రన్‌

టాటా స్టీల్‌ ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న టి.వి.నరేంద్రన్‌ వరల్డ్‌స్టీల్‌ అసోసియేషన్‌ (ప్రపంచ ఉక్కు సంఘం) ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ తర్వాత భారత్‌ నుంచి ఈ పదవికి ఎన్నికైన రెండో వ్యక్తిగా నరేంద్రన్‌ నిలిచారు. ఆ సంస్థకు 17 మందితో కూడిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోనూ సభ్యుడిగా నరేంద్రన్‌ నియమితులయ్యారు. 

Current Affairs

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత క్రీడాకారిణి సోనమ్‌ మస్కర్‌ రజత పతకం సాధించింది. 2024, అక్టోబరు 15న దిల్లీలో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో సోనమ్‌ (252.9) ద్వితీయ స్థానంలో నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌ రన్నరప్‌ హువాంగ్‌ యుటింగ్‌ (254.5- చైనా) పసిడి నెగ్గింది. ఎనిమిది మంది బరిలో దిగిన ఫైనల్లో మరో భారత క్రీడాకారిణి తిలోత్తమ సేన్‌ ఆరో స్థానంలో నిలిచింది.