Posts

Current Affairs

Board of Control for Cricket in India (BCCI)

♦ Roger Binny, the president of the Board of Control for Cricket in India (BCCI) has appointed Devajit Saikia as the interim Secretary of the board on 7 December 2024.  ♦ Saikia was previously managing the role of joint secretary of the board. ♦ The Secretary position remains vacant after Jay Shah has started his tenure as the International Cricket Council (ICC) Chairman.

Current Affairs

Mahatma Gandhi

♦ A bust of Mahatma Gandhi was unveiled in the State Capitol building in Nebraska. ♦ This is the first time a statue of the iconic Indian leader has been installed inside any such premise in the US Pacific North-West states that come under the jurisdiction of the Indian Consulate in Seattle. ♦ Governor Jim Pillen unveiled the bust of Gandhi at his office in the iconic Nebraska State Capitol premises in Lincoln.

Current Affairs

యూఎన్‌సీసీడీ నివేదిక

ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణకు గురయ్యే భూమి శాతం పెరుగుతోందని ఐరాస అనుబంధ సంస్థ యూఎన్‌సీసీడీ తన నివేదికలో పేర్కొంది. గత 30 ఏళ్లుగా 77 శాతం భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని పేర్కొంది. ఈ సమయంలో భూమిపై పొడి నేలల సంఖ్య 43 లక్షల చదరపు కి.మీ. పెరిగిందని, ఇది మొత్తం భూభాగంలో 40 శాతంపైనేనని వెల్లడించింది. 2024, డిసెంబరు 9న సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన యూఎన్‌ కన్వెన్షన్‌ టు కంబాట్‌ డిసెర్టిఫికేషన్‌ (యూఎన్‌సీసీడీ) సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు.

Current Affairs

2024 అత్యంత వేడి సంవత్సరం!

అత్యంత వేడి సంవత్సరంగా 2024 నమోదు కానుందని ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్‌ 2024, డిసెంబరు 9న తెలిపింది. అలాగే సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదు కావడం కూడా ఇదే తొలిసారి అని వెల్లడించింది. 2024 నవంబరు (2023 నవంబరు తర్వాత) కూడా రెండో అత్యంత వేడి నెలగా నిలిచిందని పేర్కొంది. నవంబరులో ఉపరితల గాలి సగటు ఉష్ణోగ్రత 14.10 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని, అది 1991-2020 సగటు కన్నా 0.73 డిగ్రీల సెల్సియస్‌ అధికమని చెప్పింది.  అలాగే గ్లోబల్‌ వార్మింగ్‌లో కూడా 2024 నవంబరు రికార్డు సృష్టించిందని, ఈ నెలలో పారిశ్రామికీకరణ ముందు స్థాయి కంటే 1.62 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయిందని వివరించింది. 

Current Affairs

సౌర కుటుంబం వెలుపల ఘనీకృత నీరు

సౌర కుటుంబం వెలుపల కొత్తగా పురుడుపోసుకుంటున్న ఒక గ్రహ వ్యవస్థలో మంచు రూపంలో నీటి ఆనవాళ్లను ఖగోళశాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) సాయంతో దీన్ని కనుక్కున్నారు. భూమికి 1,500 కాంతిసంవత్సరాల దూరంలోని ఒరాయన్‌ నెబ్యులాలో ఉన్న ఒక భారీ ప్రొటోప్లానెటరీ వలయంలో ఈ నీటి జాడను గుర్తించారు. 114-426 అనే నక్షత్ర వ్యవస్థ చుట్టూ ఇది కనిపించింది. 3 మైక్రాన్ల తరంగదైర్ఘ్యంలో ఇది వెలుగుచూసింది. ఇది ధూళితో నిండిన ఐస్‌కు ఇది సంకేతం. 

Current Affairs

పర్యావరణహిత ఇంధనంగా మిథేన్, కార్బన్‌ డైఆక్సైడ్‌

పర్యావరణంలో హానికరమైన మిథేన్, కార్బన్‌ డైఆక్సైడ్‌ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం వారు మెథానోట్రాపిక్‌ బ్యాక్టీరియాను ఉపయోగించారు. గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల వల్ల పర్యావరణంపై పడే ప్రభావం, తరగిపోతున్న శిలాజ ఇంధన నిల్వలు అనే రెండు సమస్యలకు విరుగుడును ఈ పరిశోధన కనుగొందని శాస్త్రవేత్తలు తెలిపారు. మిథేన్‌ అనేది కార్బన్‌ డైఆక్సైడ్‌ కంటే 30 రెట్లు హానికరమని వారు వివరించారు. 

Current Affairs

ఐఎన్‌ఎస్‌ తుశిల్‌

అధునాతన గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్‌ ఐఎన్‌ఎస్‌ తుశిల్‌ 2024, డిసెంబరు 9న భారత నౌకాదళంలో లాంఛనంగా చేరింది. రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి, ఇతర సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. అధునాతన సాధన సంపత్తి కలిగిన ఈ యుద్ధనౌక హిందూ మహాసముద్రంపై పనిచేయనుంది. ఐఎన్‌ఎస్‌ తుశిల్‌ను రష్యాలో నిర్మించారు. ఐఎన్‌ఎస్‌ తుశిల్‌ బరువు 3,900 టన్నులు. పొడవు 125 మీటర్లు. ఇందులో భారత పరిజ్ఞానం వాటా 26 శాతం మేర ఉంది. ఈ యుద్ధనౌకలో శక్తిమంతమైన ఆయుధాలు ఉంటాయి. 

Current Affairs

వై.జె.రావు కన్నుమూత

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) మొదటి ప్రాజెక్టు డైరెక్టర్‌ వై.జనార్దనరావు (వై.జె.రావు) 2024, డిసెంబరు 9న మృతి చెందారు. ఆయన వయసు 94 ఏళ్లు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, కోలవెన్ను గ్రామానికి చెందిన వై.జె.రావు శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. రాకెట్‌ కేంద్రానికి అనువుగా శ్రీహరికోట దీవిని తీర్చిదిద్దే బాధ్యతలను విక్రమ్‌ సారాభాయ్‌ ఆయనకు అప్పగించారు. అనంతరం 1972 నుంచి 1977 వరకు సంస్థ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అంతకుముందు వై.జె.రావు తిరువనంతపురంలోని స్పేస్‌ సెంటర్‌లో పనిచేశారు.

Current Affairs

ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా (56)ను కేంద్ర ప్రభుత్వం 2024, డిసెంబరు 9న నియమించింది. మంత్రివర్గ నియామకాల సంఘం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. మూడేళ్ల పాటు సంజయ్‌ ఈ పదవిలో కొనసాగుతారు.  సంజయ్‌ మల్హోత్రా 1990 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆర్థిక శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా పనిచేస్తున్నారు. 

Current Affairs

దేశంలోకి లక్ష కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐ

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు)కు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మనదేశం నిలుస్తోంది. 2000 ఏప్రిల్‌- 2024 సెప్టెంబరు మధ్య మనదేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) లక్ష కోట్ల డాలర్ల (రూ.84 లక్షల కోట్లకు పైగా) మైలురాయిని అధిగమించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) వెల్లడించింది. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం.. గత నాలుగున్నరేళ్లలో ఈక్విటీ, లాభాలను మళ్లీ పెట్టుబడులుగా పెట్టడం, ఇతర మూలధనం సహా మొత్తం ఎఫ్‌డీఐ 1,033.40 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  మొత్తం ఎఫ్‌డీఐల్లో 25% మారిషస్‌ మార్గంలో వచ్చాయి. సింగపూర్‌ (24%), అమెరికా (10%), నెదర్లాండ్స్‌ (7%), జపాన్‌ (6%), బ్రిటన్‌ (5%), యూఏఈ (3%), కేమన్‌ ఐలాండ్స్‌ (2%), జర్మనీ (2%), సైప్రస్‌ (2%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మారిషస్‌ నుంచి 177.18 బిలియన్‌ డాలర్లు, సింగపూర్‌ నుంచి 167.47 బిలియన్‌ డాలర్లు, అమెరికా నుంచి 67.8 బిలియన్‌ డాలర్ల చొప్పున మన దేశంలోకి పెట్టుబడులు వచ్చాయి.