Posts

Current Affairs

The 9th India-Australia Defence Policy

♦ The 9th India-Australia Defence Policy Talks were held in New Delhi, where both nations reaffirmed their commitment to strengthening defense cooperation. ♦ The Indian delegation was led by Joint Secretary Amitabh Prasad, while the Australian side was headed by Bernard Philip, First Assistant Secretary of the International Policy Division, Department of Defence, Australia. ♦ During the talks, both sides welcomed the progress made in bilateral defense ties, highlighted by the increased frequency and complexity of joint exercises and exchanges. ♦ The discussions focused on key cooperation priorities, including maritime domain awareness, reciprocal information sharing, collaboration in the defense industry and science & technology, and participation in defense trade expositions.

Current Affairs

Defence Minister Rajnath Singh

♦ Defence Minister Rajnath Singh held a meeting with his Netherlands counterpart, Ruben Brekelmans, in Delhi on 18 March 2025. ♦ The two leaders discussed enhancing bilateral cooperation in areas such as defence, security, information exchange, the Indo-Pacific, and new and emerging technologies.  ♦ Brekelmans is visiting India to attend the Raisina Dialogue, which is currently underway in New Delhi from March 17.   ♦ The Raisina Dialogue 2025 is being hosted by the Ministry of External Affairs (MEA) and the Observer Research Foundation (ORF). It is India’s premier conference on geopolitics and geoeconomics, aimed at addressing the most challenging issues facing the global community. ♦ Nearly 3,700 attendees, including over 800 speakers and delegates from around 130 countries worldwide, are attending the Raisina Dialogue. ♦ The theme of this year’s (2025) Raisina Dialogue is “Kalachakra: People, Peace, Planet.”

Current Affairs

Pioneering Solutions to End TB

♦ Union Minister of State for Health and Family Welfare, Anupriya Patel, inaugurated the India Innovation Summit – “Pioneering Solutions to End TB” at the Bharat Mandapam Convention Centre in Delhi on 18 March 2025.  ♦ The event comes as India’s National TB Elimination Program (NTEP) reaches a major milestone, with 26.07 lakh TB cases notified in 2024, the highest ever recorded. ♦ Since 2015, the incidence rate of TB has dropped by 17.7%, from 237 cases per lakh population to 195 in 2023, while TB-related deaths have decreased by 21.4%. ♦ The summit, jointly organized by the Department of Health Research (DHR), the Indian Council of Medical Research (ICMR), and the Central TB Division (CTD) of the Ministry of Health & Family Welfare, aims to fast-track India’s progress toward eliminating TB by 2025.

Current Affairs

ఏపీలో పెరిగిన భూగర్భజలాలు

ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భజలాలు 2024తో పోలిస్తే సగటున మీటరు మేర పెరిగాయి. 2024 ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా సగటున భూ ఉపరితలం నుంచి 9.75 మీటర్ల లోతులో నీళ్లు అందుబాటులో ఉండగా 2025 ఫిబ్రవరి నాటికి 8.82 మీటర్లకే జలాలు కనపడుతున్నాయి. రెండు రుతుపవనాలలో కలిపి 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 883.2 మి.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇంత వరకు 963.8 మి.మీ. మేర వర్షాలు పడ్డాయి. 8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంది. రాయలసీమ 8 జిల్లాల్లో సగటున 0.83 మీటర్ల మేర నీటిమట్టాలు పెరగగా కోస్తాంధ్రలోని 18 జిల్లాల్లో ఇది 0.98 మీటర్లుగా ఉంది.

Current Affairs

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నివేదిక

దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా రాజధాని దిల్లీ మరోసారి నిలిచినట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నివేదిక వెల్లడించింది. 2024-25 చలికాలంలో ఒక క్యూబిక్‌ మీటరుకు పీఎం 2.5 సాంద్రతతో 175 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. అయితే 2023-24 చలికాలంతో పోలిస్తే ఇది తక్కువేనని పేర్కొంది.  ఈ జాబితాలో రెండో స్థానంలో కోల్‌కతా నిలిచింది. అక్కడ ఈ చలికాలంలో పీఎం 2.5 సాంద్రతతో క్యూబిక్‌ మీటరుకు 65 మైక్రోగ్రాముల కాలుష్యకారకాలు ఉన్నట్లు గుర్తించారు.

Current Affairs

సునీతా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ ‘ఫ్రీడమ్‌’ 2025, మార్చి 18న వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. సునీత, విల్మోర్‌లతోపాటు నాసాకు చెందిన కమాండర్‌ నిక్‌ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ కూడా ఐఎస్‌ఎస్‌ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు.  కేవలం 8 రోజుల యాత్ర కోసం 2024, జూన్‌ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీత, విల్మోర్‌.. చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. గుజరాత్‌లోని మెహ్‌సాణా జిల్లా ఝూలాసన్‌లో సునీత పూర్వీకులు ఉంటున్నారు. సునీత తండ్రి దీపక్‌ పాండ్యా 1957లో ఝూలాసన్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. 

Walkins

ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు: ప్రాజెక్ట్ ఇంజినీర్‌- 01 టెక్నికల్ ఆఫీసర్‌- 03 అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌- 03 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టుకు మొదటి ఏడాది రూ.40,000, రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000; టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000, రెండో ఏడాది రూ.28,000; మూడో ఏడాది రూ.31,000; అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.24,804. వయోపరిమితి: పోస్టును అనుసరించి ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టుకు 33 ఏళ్లు; టెక్నికల్ ఆఫీసర్‌కు, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.  ఇంటర్వ్యూ తేదీ: 26.03.2025. వేదిక: కార్పొరేట్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్‌, నలంద కాంప్లెక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్‌, ఈసీఐఎల్‌ పోస్ట్‌, హైదరాబాద్‌.  Website:https://www.ecil.co.in/

Government Jobs

ఎగ్జిమ్ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్‌) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 28 వివరాలు: 1. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ- డిజిటల్‌ టెక్నాలజీ: 10 2. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ- రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌- 05 3. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ- రాజ్‌భాష: 02 4. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ- లీగల్‌: 05 5. డిప్యూటీ మేనేజర్‌- లీగల్‌: 04 6. డిప్యూటీ మేనేజర్‌: 01 7. చీఫ్‌ మేనేజర్‌: 01 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌. ఎంసీఏ, పీజీ, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  వయోపరిమితి: 28.02.2025 నాటికి ఎస్సీ/ ఎస్టీ వారికి 33 ఏళ్లు; ఓబీసీ వారికి 31 నుంచి 33; ఈడబ్ల్యూఎస్‌/ యూఆర్‌ అభ్యర్థులకు 28 నుంచి 40 ఏళ్లు మించకూడదు.  జీత భత్యాలు: నెలకు మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు రూ.65,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.48,480 నుంచి రూ.85,920; చీఫ్‌ మేనేజర్‌కు రూ.85,920 నుంచి 1,05,280. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.   దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈడబ్ల్యూఎస్‌/ మహిళా అభ్యర్థులకు రూ.100. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-03-2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15-04-2025. రాత పరీక్ష తేదీ: మే 2025. Website:https://www.eximbankindia.in/

Government Jobs

డీసీహెచ్‌ఎస్‌ ప్రకాశం జిల్లాలో పోస్టులు

ప్రకాశం జిల్లా, డీసీహెచ్‌ఎస్‌ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్, ఏరియా ఆసుపత్రుల్లో ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 16 వివరాలు: 1. ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌: 01 2. ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌2: 02 3. థియేటర్‌ అసిస్టెంట్‌- 03 4. ఆఫీస్‌ సబార్డీనేట్‌: 02 5. పోస్ట్‌ మార్టం అసిస్టెంట్‌: 02 6. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌- 06 అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత, డీఎంఎల్‌టీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాది అప్రెంటీస్‌షిప్‌ చేసి ఉండాలి.  వయోపరిమితి: 01.07.2024 తేదీ నాటికి 42 మించకూడదు. ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌2 పోస్టులకు రూ.32,670; ఇతర పోస్టులకు రూ.15,000. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఉద్యోగానుభం తదితరాల ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ఆఫీస్‌ ఆఫ్ ది డీసీహెచ్‌ఎస్‌ ప్రకాశం చిరునామాకు మార్చి 24 లోపు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 24-03-2025. Website:https://prakasam.ap.gov.in/

Admissions

నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం

గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ 2025 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గాంధీనగర్, దిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్, పుణె, గువాహటి, మణిపూర్, ధార్వాడ్‌లలో ఎన్‌జీఎస్‌యూ క్యాంపస్‌ ఉన్నాయి. ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఏ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎల్‌ఎల్‌ఎం, బీటెక్‌- ఎంటెక్‌, బీబీఏ-ఎంబీఏ, బీఎస్సీ- ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌, బీబీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు పొందవచ్చు.  వివరాలు: 1. ఎంఎస్సీ విభాగాలు: ఫోరెన్సిక్ సైన్స్/ ఫోరెన్సిక్ బయోటెక్నాలజీ/ టాక్సికాలజీ/ సైబర్ సెక్యూరిటీ/ డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/ నానోటెక్నాలజీ/ ఫుడ్‌ టెక్నాలజీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ/ న్యూరో సైకాలజీ/ క్లినికల్ సైకాలజీ/ ఫోరెన్సిక్ సైకాలజీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ. 2. ఎంఏ విభాగాలు: మాస్ కమ్యూనికేషన్ అండ్‌ ఫోరెన్సిక్ జర్నలిజం/ పోలీస్ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్/ క్రిమినాలజీ. 3. బీఎస్సీ- ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ 4. పీజీ డిప్లొమా  విభాగాలు: ఫింగర్‌ప్రింట్ సైన్స్/ ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్/ క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్/ డీఎన్‌ఏ ఫోరెన్సిక్స్/ ఫోరెన్సిక్ జర్నలిజం/ ఫోరెన్సిక్ బాలిస్టిక్స్/ కెనైన్‌ ఫోరెన్సిక్స్‌/ ఫోరెన్సిక్‌ ఆర్కియాలజీ, హ్యుమానిటేరియన్ ఫోరెన్సిక్స్/ డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్/ సెమీకండక్టర్ సెక్యూరిటీ/ సెక్యూరిటీ స్టడీస్‌/ సైబర్ క్రైమ్ ఇన్‌వెస్టిగేషన్‌/ సైబర్ సైకాలజీ/ ఇన్‌వెస్టిగేటివ్‌ సైకాలజీ/ సైబర్‌ లా/ డ్రగ్ అండ్ సబ్‌స్టాన్స్ అబ్యూస్‌ లాస్‌/ ఇండస్ట్రియల్ సేఫ్టీ, హైజీన్ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్. 5. ఎంటెక్ విభాగాలు: సైబర్ సెక్యూరిటీ/ ఏఐ అండ్‌ డీఎస్‌/ సివిల్ ఇంజినీరింగ్. 6. బీటెక్- ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్ 7. ఎంబీఏ  విభాగాలు: ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్/ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్/ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్/ బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ 8. బీబీఏ- ఎంబీఏ  విభాగాలు: ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్‌ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్/ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్. 9. ఎంఫిల్‌ క్లినికల్ సైకాలజీ 10. బీఏ- ఎంఏ క్రిమినాలజీ 11. డిప్లొమా (కెనిన్‌ ఫోరెన్సిక్స్/ ఫోరెన్సిక్‌ ఆర్కియాలజీ) 12. ఎల్‌ఎల్‌ఎం విభాగాలు: సైబర్ లా అండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్/ క్రిమినల్ లా అండ్ క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్. 13. బీఎస్సీ- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) 14. ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) 15. బీబీఏ- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) 16. ఎంఫార్మసీ (ఫోరెన్సిక్ ఫార్మసీ/ ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అస్యూరెన్స్) 17. ఎంఏ - పోలీస్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌ క్యాంపస్‌: గాంధీనగర్, దిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్, పుణె, గువాహటి, మణిపూర్, ధార్వాడ్, భువనేశ్వర్‌, చెన్నై, రాయ్‌పుర్‌, జయపుర. అర్హత: ప్రోగ్రాంను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ప్రక్రియ: వర్సిటీ నిర్వహించే నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్ (ఎన్‌ఎఫ్‌ఏటీ)-2025 తదితరాల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-05-2025. Website:https://nfsu.ac.in/admission