Posts

Current Affairs

European Commission President Ursula von der Leyen

♦ European Commission President Ursula von der Leyen met Prime Minister Narendra Modi in New Delhi on 28 February 2025.  ♦ The discussions between the two leaders focused on enhancing the India-EU Strategic Partnership, with particular emphasis on key connectivity initiatives such as the India-Middle East-Europe Economic Corridor. India and the European Union (EU) have set an ambitious deadline to finalize negotiations for the Free Trade Agreement (FTA) by the end of this year (2025). ♦ Von der Leyen arrived in New Delhi on February 27 for a two-day visit at the invitation of PM Modi. This marks her third visit to India, following her bilateral visit in April 2022 and attendance at the G20 Leaders’ Summit in September 2023.

Current Affairs

Andhra Pradesh Finance Minister Payyavula Keshav

Andhra Pradesh Finance Minister Payyavula Keshav presented the annual budget for the financial year 2025-26 with a total outlay of Rs.3,22,359 crore in the Assembly in Amaravati on 28 February 2025. Of this, revenue expenditure is estimated at Rs.2,51,162 crore, and capital expenditure at Rs.40,635 crore. The estimated revenue deficit is around Rs.33,185 crore and the fiscal deficit is around Rs.79,926 crore. The revenue deficit will be around 1.82 percent  and fiscal deficit will be around 4.38 percent of Gross State Domestic Product (GSDP). ♦ The revised estimate for revenue expenditure for financial year (FY) 2024-25 is Rs.2,24,342 crore, and for capital expenditure it is Rs.24,072 crore. The revenue deficit for 2024-25 is around Rs.48,311 croгe, whereas the fiscal deficit is around Rs.73,362 crore. The revenue deficit is 3.01% and fiscal deficit is 4.57 percent of GSDP. ♦ For agriculture, a separate budget of Rs.48,000 crore was presented by Agriculture Minister K. Atchannaidu. Major Allocations: ♦ Rs.9,407 crore was allocated for Talliki Vandanam and Rs.6,300 crore for Annadata sukhibhava.  ♦ Rs.11,314 crore was allocated for Referring to Water Resources. For a sustainable agriculture and drought free state, Rs.29,655 crore was allocated. As much as Rs.2,800 crore is earmarked for Jal Jeevan Mission and Rs.400 crore for fishermen assistance. ♦ The allocation of Rs.6,705 crore for Polavaram irrigation project was made in the budget. The government for the first time announced Rs.10 crore for Telugu language development and free power to schools. ♦ Capital city Amaravati had also got Rs.6000 crore budgetary support.  ♦ For school education, the Finance Minister allocated Rs.31,805 crore, up from Rs.29,909 core in the previous budget (2024-25), while the allocation for agriculture and allied sectors stands at Rs.13,487 crore against Rs.11,855 crore allocated in 2024-25. ♦ For the welfare of Scheduled Castes, the government allocated Rs.20,281 crore, up from Rs.18,497 crore. It earmarked Rs.8,159 crore for the welfare of Scheduled Tribes. The allocation for STs in the previous budget was Rs.7,557 crore. ♦ The coalition government proposes to spend Rs.47,456 crore for the Backward Classes' welfare. This allocation was Rs.39,007 in 2024-25. ♦ The government also increased the allocation for minorities' welfare from Rs.4,376 crore to Rs.5,434 crore. ♦ The allocation for women and child welfare also increased from Rs.4,285 crore to Rs.4,332 crore. ♦ The Finance Minister proposed an allocation of Rs.1,228 crore for skill development, Rs.2,506 crore for higher education, Rs.19,264 crore for health, Rs.18,847 crore for Panchayat Raj and rural development and Rs.13,862 crore for municipal administration and urban development for 2025-26. ♦ The government has proposed an expenditure of Rs.6,318 crore for housing, Rs.18,019 crore for water resources, Rs.3,156 crore for industry and commerce, Rs.13,600 crore for energy, Rs.8,785 crore for roads and buildings, Rs.469 crore for youth affairs, tourism and culture, Rs.2,800 crore for Jal Jeevan Mission. ♦ For the NTR Bharosa pension scheme, which is already under implementation, the Finance Minister proposed an allocation of Rs.27,518 crore.

Current Affairs

ప్రపంచ బ్యాంక్‌ నివేదిక

2047 నాటికి భారత్‌ అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే సగటున 7.8% వార్షిక వృద్ధి రేటు అవసరమని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదిక అయిన ‘బికమింగ్‌ ఏ హై-ఇన్‌కమ్‌ ఎకానమీ ఇన్‌ ఏ జెనరేషన్‌’లో అభిప్రాయపడింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక రంగంతో పాటు భూమి, కార్మిక విభాగాల్లో సంస్కరణలు అవసరమని పేర్కొంది.  2000 సంవత్సరం నుంచి 2024 మధ్య మనదేశం సగటున 6.3% వృద్ధి సాధించింది. భవిష్యత్‌ లక్ష్యాలు సాధించేందుకు అవసరమైన బలమైన పునాదులను భారత్‌ వేసిందని నివేదిక వెల్లడించింది. సాధారణ పరిస్థితుల్లో ఇటువంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను సాధించడం సాధ్యపడదని, స్థూల తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయుల నుంచి దాదాపు 8 రెట్లు పెరగాల్సి ఉంటుందని వివరించింది. వృద్ధి మరింత పెరిగి, వచ్చే రెండు దశాబ్దాల పాటు అధికంగానే ఉండాలని, కొన్ని దేశాలు మాత్రమే ఈ ఘనత సాధించాయని పేర్కొంది. 

Current Affairs

సౌర జ్వాలలను ఆవిష్కరించిన ఆదిత్య-ఎల్‌1

సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1.. సౌర గోళానికి సంబంధించిన అద్భుత చిత్రాలను అందించింది. సూర్యుడి దిగువ పొరల్లో ఉత్పన్నమైన ఒక సౌర జ్వాలను క్లిక్‌మనిపించింది. సూర్యుడిలో సంభవించే విస్ఫోటక చర్యల గురించి ఇది లోతైన అంశాలను వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.  సౌర జ్వాలలనేవి భానుడిలో భారీ విస్ఫోటాలు. వీటి ద్వారా శక్తి, కాంతి, అత్యంత వేగవంతమైన రేణువులు రోదసిలోకి దూసుకొస్తాయి. తద్వారా అంతరిక్ష వాతావరణంపై ప్రభావం చూపుతాయి. పుడమిపై రేడియో కమ్యూనికేషన్లు, కక్ష్యలో ఉపగ్రహ కార్యకలాపాలకు అవరోధం కలిగిస్తాయి. సౌర జ్వాలలు.. సూర్యుడిపై దేదీప్యమానంగా కనిపిస్తుంటాయి.

Current Affairs

మోదీతో ఉర్సులా వాండెర్‌ లెయెన్‌ భేటీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లెయెన్‌ దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో 2025, ఫిబ్రవరి 28న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్, ఐరోపా యూనియన్‌ (ఈయూ) కమిషన్‌ మధ్య దీర్ఘకాలంగా చర్చల్లో నానుతున్న మెగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) 2025 చివరికల్లా పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించాయి.  రక్షణ, భద్రత, సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించుకోవాలని కూడా భారత్, ఈయూ నిర్ణయించాయి. తమ సన్నిహిత మిత్ర దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలతో కుదుర్చుకున్న తరహాలో భారత్‌తోనూ భద్రత, రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు లెయెన్‌ తెలిపారు. 2025 తర్వాత ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మార్గదర్శనం చేసే రోడ్‌మ్యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేశామని, 2025 భారత్‌-ఈయూ శిఖరాగ్ర సదస్సులో దాన్ని ఆవిష్కరిస్తామని మోదీ పేర్కొన్నారు. 

Current Affairs

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2025-26

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2025, ఫిబ్రవరి 28న శాసనసభలో 2025-26 సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే. రాష్ట్ర బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. రూ.48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.  సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. అసాధారణ రీతిలో రూ.40,635 కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రతిపాదించారు.  2025-26 బడ్జెట్‌ స్వరూపం మొత్తం బడ్జెట్‌: రూ.3,22,359.33 కోట్లు రాబడి: మూలధన వసూళ్లు: రూ.1,04,382.80 కోట్లు రెవెన్యూ వసూళ్లు: రూ.2,17,976.53 కోట్లు ఖర్చులు: మూలధన చెల్లింపులు: రూ.24,430.16 కోట్లు రుణాలు, అడ్వాన్సులు: రూ.6,130.95 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ.2,51,162.5 కోట్లు మూలధన వ్యయం: రూ.40,635.72 కోట్లు ’ రెవెన్యూ లోటు: -రూ.33,185.97 కోట్లు ’ ద్రవ్య లోటు: -రూ.79,926.90 కోట్లు రంగావవారీ కేటాయింపులు విద్యారంగం పాఠశాల, ఉన్నత విద్యకు కలిపి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.34,311 కోట్లు కేటాయించింది. ఇందులో  పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు; ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉండటంతో భారీ మొత్తం కేటాయించాల్సి వచ్చింది.   అమృత్‌ 2.0 పట్ణణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన అమృత్‌ 2.0 పథకానికి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.751.72 కోట్లు కేటాయించింది. ఈ పథకం 2022లో ప్రారంభమైంది. అమృత్‌ 2.0 పథకంలో 250 అసంపూర్తి పనులను రూ.7 వేల కోట్లతో హైబ్రిడ్‌ యాన్యూటీ మోడల్‌లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌లో చూపిన రూ.751.72 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద కేటాయిస్తుంది. మిగతా మొత్తాలను గుత్తేదారులతో పెట్టుబడిగా పెట్టించి, వడ్డీతో సహా ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయించాలని భావిస్తోంది. ఆరోగ్య రంగం ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, రోగుల సేవల మెరుగుకు కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తంగా ఈ రంగానికి ఇచ్చింది రూ.19,264 కోట్లు. అందులో పేదలకు ఆశాదీపమైన ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టుకు రూ.4 వేల కోట్లు, మందులకు రూ.600 కోట్లు కేటాయించింది. ఈ రంగానికి గత వైకాపా ప్రభుత్వం చివరి బడ్జెట్‌ (2023-24)లో రూ. 14,925 కోట్లు కేటాయించింది.  కిందటేడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ (పీఎం-అభీమ్‌) అవసరాలకు రూ.129 కోట్లు కేటాయించారు. తాజా బడ్జెట్‌లో రూ.1,112 కోట్లు వాడుకునేందుకు వీలు కల్పించారు. ఈ మొత్తంతో ఆసుపత్రుల్లోని 26 ల్యాబ్‌లను ‘ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీస్‌’ స్థాయిలో అప్‌గ్రేడ్‌ చేస్తారు. దీనివల్ల రోగ నిర్ధారణ పరీక్షలు పెరుగుతాయి.  జిల్లా, బోధన, ఇతర ఆసుపత్రుల్లో కలిపి 26 ‘క్రిటికల్‌ కేర్‌ బ్లాక్స్‌’ వస్తాయి. ప్రస్తుతం ఉన్న వాటినే కొత్త మార్గదర్శకాలు అనుసరించి ఉన్నతీకరిస్తారు.   పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మరో 45 అర్బన్‌ ఆరోగ్య మందిరాలు రానున్నాయి. ఒక్కొక్క దానికి రూ.75 లక్షల వరకు వ్యయం చేస్తారు. ముఖ్య కేటాయింపులు: జాతీయ ఆరోగ్య మిషన్‌: రూ.2,599 కోట్లు మందుల కొనుగోళ్లు: రూ.600 కోట్లు 104, 108 సర్వీసులు: రూ.316 కోట్లు రాజధాని నిర్మాణం అమరావతి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు ప్రతిపాదించింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేందుకు రూ.292.87 కోట్లు, రాజధాని ప్రాంతంలో సామాజిక భద్రతానిధి కోసం రూ.103.82 కోట్లు కేటాయించింది. రాజధానిలో భూమిలేని పేదలకు పింఛన్ల చెల్లింపు, ఇతర సామాజిక అవసరాల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు.  అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్, ఏడీబీ కలసి రూ.15వేల కోట్లు రుణం మంజూరు చేశాయి. రూ.12వేల కోట్లు ఇచ్చేందుకు సీఆర్‌డీఏతో హడ్కో అంగీకారం కుదుర్చుకుంది. రాజధాని నిర్మాణానికి ఆ నిధుల్నే ఖర్చు పెట్టబోతున్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన రూ.6వేల కోట్లు కూడా ఆ సంస్థల నుంచి వచ్చేవే.  2024-25 బడ్జెట్‌లో రాజధాని పనులకు రూ.3వేల కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ.5,700 కోట్లకు చేరింది.  రాజధానిలో సుమారు రూ.48వేల కోట్ల పనులకు సీఆర్‌డీఏ, ఏడీసీ ఇప్పటికే టెండర్లు పిలిచాయి. రాజధాని నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పారిశ్రామికరంగం 2025-26 వార్షిక బడ్జెట్‌లో పరిశ్రమలకు కూడా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఫర్‌ వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని అమలు కోసం బడ్జెట్‌లో రూ.2,000 కోట్లను కేటాయించింది. ఈ మొత్తంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు కూడా వాటా దక్కనుంది. వ్యవసాయ రంగం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను రూ.48,341.14 కోట్లతో ప్రవేశపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వార్షిక వృద్ధికి కార్యాచరణ రూపొందించామని, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకు ప్రాధాన్యమిస్తూ రూ.12,903.41 కోట్లు కేటాయించామని వివరించారు. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ‘అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం’ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి ఈ ఏడాది రూ.9,400 కోట్లు కేటాయించినట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు. సేద్యానికి 9 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్‌ ఇవ్వడానికి రూ.12,773.25 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.  అంశాల వారీగా కేటాయించిన నిధులు (రూ.కోట్లలో): ఉపాధి హామీ పథకం కింద సాగు అనుబంధ కార్యక్రమాలకు- 6,026.87  9 గంటల ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్‌- 12,773.25  అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్‌- 9,400   ఉచిత పంటల బీమా- 1,023  ఉద్యాన శాఖ- 930  మార్కెటింగ్‌ శాఖకు- 315.32   ధరల స్థిరీకరణకు- 300   రుణాలపై వడ్డీ రాయితీ- 250  మత్య్సకారుల వేట నిషేధకాల భృతి- 245.936  రాయితీ విత్తనాల పంపిణీ- 240  సహకార శాఖ- 239.85   వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్లు, ఇతర యంత్రాల పంపిణీ- 219.65  పామాయిల్‌ తోటల సాగు- 179  పట్టు పరిశ్రమ అభివృద్ధి- 96.22 పౌరసరఫరాల శాఖ పౌరసరఫరాల శాఖకు కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.3,807 కోట్లు కేటాయించింది. ఈ శాఖ కింద గత ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.1,901 కోట్లు ఖర్చు చేయగా... కూటమి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే రూ.9,415 కోట్లు (సవరించిన అంచనాల ప్రకారం) వినియోగించింది. రోడ్లు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ 2025-26 బడ్జెట్‌లో ఆర్‌అండ్‌బీ శాఖలోని జిల్లా, రాష్ట్ర, గ్రామీణ రోడ్లు, వంతెనల నిర్మాణం, జాతీయ రహదారులు, ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌ తదితరాలు అన్నింటికీ కలిపి రూ.4,129.76 కోట్లు కేటాయించారు. వైకాపా హయాంలో అయిదేళ్ల బడ్జెట్లలో ఆర్‌అండ్‌బీ రూ.19,429 కోట్లు నిధులు కేటాయించినట్లు చూపించగా ఖర్చు చేసింది రూ.9,015 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25లోనే రూ.3,399 కోట్లను రోడ్ల మరమ్మతులు, విస్తరణ, వంతెనల పనులకు వెచ్చించింది. కొత్త బడ్జెట్‌లో రైల్వే క్రాసింగ్స్‌ వద్ద వంతెనల నిర్మాణానికి రూ.270 కోట్లు, జిల్లా రోడ్లకు రూ.50 కోట్లు, ప్రధాన జిల్లా రోడ్లకు రూ.205 కోట్లు, రాష్ట్ర రోడ్లకు రూ.225 కోట్లు, రిమోట్‌ ఇంటీరియర్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (రెయిడ్‌) కింద రోడ్ల పనులకు రూ.160.85 కోట్లు, కేంద్ర రహదారి మౌలికవసతుల నిధి కింద రూ.550 కోట్లు, సేతుబంధన్‌ పథకానికి రూ.40 కోట్లు కేటాయించారు.  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో 1,307 కి.మీ. అభివృద్ధి చేయనుండగా.. దీనికి సాధ్యాసాధ్యాల నివేదిక, డీపీఆర్‌ తయారీకి రూ.47.86 కోట్లు కేటాయించారు. ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ)కి బడ్జెట్‌లో రూ.4,309 కోట్లు కేటాయించారు. రవాణాశాఖకు రూ.345.61 కోట్లు ఇవ్వనున్నారు. జలవనరులశాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో జలవనరులశాఖకు రూ.18,019 కోట్లు కేటాయించారు. ఇందులో చిన్ననీటి పారుదలకు రూ.877 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టుకు అత్యధికంగా రూ.5,756 కోట్లు కేటాయించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.3,243 కోట్లు ఖర్చు చేయనుంది. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.309 కోట్లు కేటాయించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తా ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులు, గోదావరి, కృష్ణా డెల్టా వ్యవస్థను, వరద గట్ల పటిష్ఠానికి కలిపి మొత్తం కేటాయింపుల్లో రూ.10,571.24 కోట్లు చూపారు. రాష్ట్రంలో మొత్తం 82 ప్రాజెక్టులకు పైగా నిర్మాణంలో ఉన్నాయి. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులూ పూర్తిచేయాలంటే రూ.1,64,815 కోట్లు అవసరమని తేల్చారు.  వంశధార రెండోభాగం పూర్తిచేసేందుకు రూ.182.52 కోట్లు, వెలిగొండ ప్రాజెక్టుకు రూ.309 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. తొలిదశ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి 1,19,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యం. కృష్ణా, గోదావరి డెల్టా వ్యవస్థలకు కలిపి రూ.600 కోట్లు కేటాయించారు. వరద గట్ల పటిష్ఠానికి రూ.250 కోట్లు ప్రతిపాదించారు. ముఖ్యాంశాలు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణసాయంతో చేపట్టిన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ప్రాజెక్టు మొదటి, రెండో దశలో ప్రతిపాదించిన పనులకు సంబంధించి రాష్ట్ర వాటా కింద రూ.837.71 కోట్లను 2025-26 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.259.59 కోట్లతో పోలిస్తే.. మూడున్నర రెట్ల నిధులను పెంచింది.  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న పోర్టులకు, ఆర్‌ ఆôడ్‌ ఆర్‌ పనులకు రూ.400.15 కోట్లు కేటాయించింది. మచిలీపట్నం పోర్టుకు రూ.150 కోట్లు, భావనపాడు భూముల పరిహారానికి రూ.100 కోట్లు, కాకినాడ ఎస్‌ఈజడ్‌ పోర్టుకు రూ.50 కోట్లు, రామాయపట్నంకు రూ.100 కోట్లు ప్రతిపాదించింది. 2024-25లో రూ.388.31 కోట్ల కంటే నిధులను పెంచింది. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా రూ.25 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం 2023-24లో రూ.12.13 కోట్లు కేటాయించి శంకస్థాపనకే పరిమితమైంది. భోగాపురం విమానాశ్రయానికి రూ.195 కోట్లు, ప్రాంతీయ విమానాశ్రయాలకు రూ.30 కోట్లు, విజయవాడ ఎయిర్‌పోర్టుకు రూ.29.99 కోట్లు కేటాయించడం ద్వారా విమానయాన రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. గత ప్రభుత్వం 2023-24లో రూ.70.10 కోట్లు మాత్రమే కేటాయించింది.  పీఎంఏవై పట్టణ (బీఎల్‌సీ) పథకానికి- రూ.4,642 కోట్లు (కేంద్రం వాటా రూ.2,639 కోట్లు, రాష్ట్రం వాటా రూ.2003 కోట్లు); పీఎంఏవై గ్రామీణ్‌- రూ.741 కోట్లు (కేంద్రం వాటా రూ.339 కోట్లు, రాష్ట్రం వాటా రూ.402 కోట్లు); పీఎం జన్‌మన్‌- రూ.225 కోట్లు (కేంద్రం వాటా రూ.135 కోట్లు, రాష్ట్రం వాటా రూ.90 కోట్లు). క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడానికి కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.65.15 కోట్లు కేటాయించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ఈ నిధులు వెచ్చించనుంది. దీంతో పాటుగా మౌలిక వసతుల కల్పనకు మరో రూ.49.85 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఈ బడ్జెట్‌లో రూ.115 కోట్లు కేటాయించింది.  బడ్జెట్‌లో ప్రతిపాదించిన కొత్త కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలను, వినూత్న కార్యక్రమాలనూ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ సదుపాయం కల్పించింది. దీంతో 46 వేల స్కూళ్లకు మేలు జరుగుతుంది.   తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించింది. ఇలాంటి కేటాయింపు ఇదే తొలిసారి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, తెలుగు భాష ప్రాముఖ్యతను గుర్తించి ప్రచారం చేసేందుకు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 శాతం వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ ఇచ్చే కొత్త విధానాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీని కోసం రూ.2,000 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మద్యపానం, మాదకద్రవ్యాల వ్యసనం నుంచి ప్రజలను, ముఖ్యంగా యువతను కాపాడేందుకు నవోదయం 2.0 పథకం కింద రూ.10 కోట్లు ప్రతిపాదించింది. వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగానికి ప్రాధాన్యం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు కొత్తగా వెయ్యి డ్రోన్‌లు. పురుగుమందులు చల్లడం, ఇతర సస్యరక్షణ చర్యల్లో వినియోగం.   గుంటూరు, శ్రీసిటీ, కర్నూలు, పెనుకొండ, అచ్యుతాపురం, శ్రీకాకుళం, నెల్లూరుల్లో ఈఎస్‌ఐ ఆసుపత్రులు. తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రిని 50 నుంచి 100 పడకలకు పెంచేందుకు చర్యలు.  సైబర్‌ నేరాల ముప్పు పెరుగుతుండటంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు.  పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి కార్యక్రమం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు, కుప్పంలో నాలుగు కొత్త పారిశ్రామికవాడలు. వెనుకబడినవర్గాల కోసం ఆదరణ పథకం పునరుద్ధరణ. రూ.వెయ్యి కోట్లు కేటాయింపు.  రియల్‌టైమ్‌ గవర్నమెంట్‌ సొసైటీకి రూ.101 కోట్లు కేటాయింపు. 

Walkins

సీఎస్‌ఐఆర్‌-సీఎంఈఆర్‌ఐలో పోస్టులు

పశ్చిమ్ బెంగాల్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఐఆర్‌-సీఎంఈఆర్‌ఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 13 వివరాలు: 1. ప్రాజెక్టు అసోసియేట్-1: 09 2. సీనియర్‌ ప్రాజెక్టు అసోసియేట్: 02 3. ప్రాజెక్టు సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: 01 4. ప్రాజెక్టు సైంటిస్ట్‌-1: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(మెకానికల్, కెమికల్, మెటీరియల్స్‌, మెటలర్జరీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, టెలీ కమ్యూనికేషన్స్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్, ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎరోస్పేస్‌, ఎరోనాటిక్‌, ప్రోడక్షన్‌), పీజీ(కెమిస్ట్రి, ఫిజిక్స్‌), ఎంఈ, ఎంటెక్‌(మెకానికల్, కెమికల్, మెటీరియల్‌, మెటలర్జరీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రాజెక్టు సీనియర్ రీసెర్చ్‌ ఫెలోకు 32 ఏళ్లు, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు నిండి ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్టు సైంటిస్ట్‌కు రూ.56,000, సీనియర్‌ ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.42,000, ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.31,000, ప్రాజెక్టు సీనియర్‌ రీసెర్చ్ ఫెలోకు రూ.37,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ఎంజీ, అవెన్యూ, దుర్గాపూర్‌-713209. ఇంటర్వ్యూ తేదీ: 10, 11 మార్చి 2025 Website:https://www.cmeri.res.in/vacancy

Government Jobs

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌, హైదరాబాద్‌లో పోస్టులు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 33 వివరాలు: 1. ప్రోగ్రామ్ ఆఫీసర్‌: 02 2. ప్రాజెక్టు ఆఫీసర్: 25 3. జూనియర్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌: 06 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌(సివిల్‌, ఐటీ, సీఎస్‌ఈ), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, హెచ్ఆర్‌), డిగ్రీ(అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్), ఎల్ఎల్‌బీ, మాస్టర్‌ డిగ్రీ( రూరల్ మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, డెవలప్‌మెంట్ రిలేటెడ్ ఫీల్డ్‌), మాస్టర్స్‌(ఫైనాన్స్‌, కామర్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 60 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు జూనియర్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు రూ.1,00,000, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌కు రూ.1,40,000, ప్రోగ్రామ్ ఆఫీసర్‌కు రూ.1,90,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 19-03-2025. Website:http://career.nirdpr.in//

Government Jobs

ఐఆర్‌ఎఫ్‌సీ, దిల్లీలో మేనేజర్‌ పోస్టులు

దిల్లీలోని ఇండియన్‌ ఫైనాన్స్ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఆర్‌ఎఫ్‌సీ) వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. గ్రూప్‌ జనరల్ మేనేజర్‌: 01 2. అడిషనల్ జనరల్ మేనేజర్‌(ఫైనాన్స్‌): 02 3. అడిషనల్ జనరల్ మేనేజర్‌(ఫైనాన్స్‌-ఇంటర్నల్‌ ఆడిట్‌): 01 4. మేనేజర్‌(ఫైనాన్స్‌): 05 5. మేనేజర్‌(ఐటీ): 01 6. పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్‌, ఐటీ, ఎంసీఏ, ఎంబీఏ), సీఏ, సీఎంఏ, డిగ్రీ(కామర్స్‌), పీజీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 1-03-2025 తేదీ నాటికి గ్రూప్ మేనేజరకు 55 ఏళ్లు, అడిషనల్ జనరల్ మేనేజర్‌, పీఆర్‌ఓకు 50 ఏళ్లు, మేనేజర్‌(ఫైనాన్స్‌)కు 47 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు గ్రూప్‌ మేనేజర్‌కు రూ.1,20,000 - 2,80,000, అడిషనల్ జనరల్ మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000, మేనేజర్‌కు రూ.60,000 - రూ.1,80,000, పీఆర్‌ఓకు రూ.70,000 - రూ.2,00,000.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: జీఎం/హెచ్‌ఆర్‌ అండ్ అడ్మిన్‌, ఇండియన్‌, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌, యూజీ ఫ్లోర్‌, ఈస్ట్‌ టవర్‌, ఎన్‌బీసీసీ, భీష్మ్‌ పితామహ్‌ మార్గ్‌, లోది రోడ్, ప్రగతి విహార్‌, న్యూ దిల్లీ-110003. దరఖాస్తు చివరి తేదీ: 20-03-2025. Website:https://irfc.co.in/active-jobs

Government Jobs

దీన్‌ దయాల్‌ పోర్ట్‌ అథారిటీలో మేనేజర్‌ పోస్టులు

దీన్‌ దయాల్ పోర్ట్ అథారిటీ, గుజరాత్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోది. మొత్తం పోస్టుల సంఖ్య: 16 వివరాలు: 1. చీఫ్‌ మేనేజర్‌: 04 2. సీనియర్‌ మేనేజర్‌: 04 3. మేనేజర్‌: 08 విభాగాలు: ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, కార్పొరేట్ లీగల్‌, ఎన్విరాన్‌మెంట్ అండ్ సేఫ్టీ, బిజినెస్‌ డెవలప్‌మెంట్ అండ్ ట్రేడ్ ప్రమోషన్‌. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్‌, ఐటీ), లా, పీజీ(ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌, ఎంబీఏ), డిప్లొమా(సేఫ్టీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: మేనేజర్‌కు 40 ఏళ్లు, సీనియర్ మేనేజర్‌కు 45 ఏళ్లు, చీఫ్‌ మేనేజర్‌కు 55 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు చీఫ్‌ మేనేజర్‌కు రూ.2,00,000, సీనియర్ మేనేజర్‌కు రూ.1,60,000, మేనేజర్‌కు రూ.1,20,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ది సెక్రటరీ, దీన్‌ దయాల్ పోర్ట్ అథారిటీ, పోస్ట్ బ్యాగ్‌ నెం.50, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌ బిల్డింగ్‌, ఠాగూర్‌ రోడ్, గాంధీధాం(ఖచ్‌), గుజరాత్-370201.  దరఖాస్తు చివరి తేదీ: 20-03-2025. Website:https://irfc.co.in/active-jobs