Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

తమిళనాడులో కాగితరహిత రిజిస్ట్రేషన్‌ సేవలు

రిజిస్ట్రేషన్‌ శాఖలోని ప్రజాసేవలను పూర్తిస్థాయి కాగితరహితంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం డిజిటల్‌ విధానాన్ని తీసుకొచ్చింది. సీఎం స్టాలిన్‌ ‘స్టార్‌ 3.0 స్ప్రింట్‌ 1’ సాంకేతిక వ్యవస్థను 2026, జనవరి 22న ప్రారంభించారు. ఆధార్‌ కార్డు ఓటీపీ, బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ ద్వారా తొలివిడతగా 18 రకాల సేవలను పొందేలా ఏర్పాట్లు చేశారు.   భూముల రిజిస్ట్రేషన్లను ఆధార్‌ వెరిఫికేషన్‌ పూర్తయ్యాక సబ్‌రిజిస్ట్రార్‌ డిజిటల్‌ సంతకంతో రిజిస్టర్‌ అయ్యేలా, ఆన్‌లైన్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ పత్రాన్ని పొందేలా చేస్తున్నారు. 

Current Affairs

టామ్‌టామ్‌ ట్రాఫిక్‌ సూచీ

ఏటా ప్రపంచ మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌ను సమీక్షించే నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్‌ టెక్నాలజీ సంస్థ ‘టామ్‌టామ్‌ ఇండెక్స్‌- 2025’ వివరాలను వెల్లడించింది. ఈ సూచీలో ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్‌  రద్దీ ఉండే నగరాల్లో మెక్సికో తొలి స్థానంలో ఉండగా, బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. పుణె 5వ స్థానంలో, ముంబయి 18, దిల్లీ 23, కోల్‌కతా 29, జైపుర్‌ 30, చెన్నై 32, హైదరాబాద్‌ 47వ స్థానంలో నిలిచాయి.  2024లో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు.. ఏడాదిలోనే రెండో స్థానానికి వచ్చేసింది. 

Current Affairs

పి.వి.సింధు అరుదైన ఘనత

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో 500 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆరో క్రీడాకారిణిగా ఘనత అందుకుంది. ఈ రికార్డు నమోదు చేసిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో సింధు ఈ చిరస్మరణీయ విజయంతో క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. 2026, జనవరి 22న ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్‌ 21-19, 21-18తో లైన్‌ హోయ్‌మార్క్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందింది.  డబుల్స్‌ మ్యాచ్‌లను జోడీస్తే సింధు ఖాతాలో మొత్తం 516 విజయాలున్నాయి.

Current Affairs

ఇండోనేసియా

ఇండోనేసియాలోని సులవేసిలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ చిత్రకళను శాస్త్రవేత్తలు ఇటీవల కనుక్కున్నారు. సున్నపురాయి గుహలో గుర్తించిన ఆ చిత్రాలలో ఒక చేతి గుర్తు కనీసం 67,800 సంవత్సరాల పురాతనమైందని వారు గుర్తించారు. ప్రాచీన చిత్రకళ గురించి ఆలోచిస్తే ముందుగా మనకు జ్ఞప్తికి వచ్చేది స్పెయిన్, ఫ్రాన్స్‌లలోని ప్రసిద్ధ గుహచిత్రాలు. వీటిని సాక్ష్యంగా చూపుతూ పురాతన మానవ సంస్కృతికి ఆ ప్రాంతాలను ప్రతీకగా భావిస్తారు. ఇండోనేసియాలో కనుగొన్న ఈ కొత్త సాక్ష్యాలు ఈ విషయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్న గుహ చిత్రకళ కంటే ఇది 30 వేల సంవత్సరాల కంటే పురాతనమైనది. 

Current Affairs

నైజీరియాలో ఆకలి కేకలు

ఈశాన్య నైజీరియాలో హింస ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో దాదాపు పది లక్షల మంది ఆహారం అందక ఆకలితో అలమటించే పరిస్థితి తలెత్తింది. తమకు తక్షణ ఆర్థిక సాయం అందని పక్షంలో బాధిత నైజీరియన్లకు ఆహారం, లభించని విపత్కర పరిస్థితులు ఏర్పడతాయని ఐక్యరాజ్యసమితి ఆహార కార్యక్రమ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం 3.5 కోట్ల మంది నైజీరియన్లు తీవ్ర ఆకలి ముప్పును ఎదుర్కోబోతున్నారని ఐరాస సంస్థ తెలిపింది. ఇంత పెద్ద స్థాయిలో ఆకలి తాండవించే పరిస్థితి నైజీరియాలో ఇంతకు ముందెన్నడూ తలెత్తలేదు.  ప్రమాదకర హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో నిధులు లేక ఐరాస సంస్థ తన ఆహార సహాయాన్ని వచ్చే నెల (2026 ఫ్రిబవరి) నుంచి 72 వేల మందికి పరిమితం చేయనుంది. 2025లో కష్ట కాలంలో ఈ సంస్థ 13 లక్షల మందికి ఆహారం అందించింది.

Current Affairs

‘గాజా పీస్‌ బోర్డు’

ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలిని 2026, జనవరి 22న లాంఛనంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించారు. ఛైర్మన్‌ హోదాలో ఆయన మండలి చార్టర్‌పై సంతకం చేశారు. ఐక్యరాజ్యసమితికి పోటీగా దీన్ని ట్రంప్‌ తెరపైకి తీసుకొస్తున్నారన్న వార్తల నేపథ్యంలో దావోస్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత్‌ సహా పలు దేశాలు దూరంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో కీలక దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలు హాజరయ్యాయి. ఈజిప్టు, తుర్కియే, అజర్‌బైజాన్, పాకిస్థాన్, మొరాకో, ఇండోనేసియా, పరాగ్వే, హంగేరి సహా మొత్తం 19 దేశాలు పాల్గొన్నాయి.

Current Affairs

రోబో కాప్‌

రైల్వేలో మొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్‌లో ‘రోబో కాప్‌’ను విధుల్లోకి తీసుకున్నారు. దీన్ని 2026, జనవరి 22న ఆర్పీఎఫ్‌ ఐజీ అలోక్‌ బోహ్రా, డీఆర్‌ఎం లలిత్‌బోహ్రా ఆవిష్కరించారు. ఈ రోబోకు రైల్వే పోలీసులు ‘ఏఎస్‌సీ అర్జున్‌’ అని పేరు పెట్టారు. ఏఐ, ఐఓటీ సాంకేతికత ఉన్న ఈ రోబో స్టేషన్‌లో నిత్యం పహారా కాస్తూ అనుమానితులను గుర్తిస్తుంది. తరచూ దొంగతనాలకు పాల్పడేవారి చిత్రాలు తీసి విశ్లేషించి వారిని గుర్తించడంలో సహాయపడుతుంది. 

Walkins

ఐఆర్‌సీటీసీ, వెస్ట్‌ జోన్‌లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ), వెస్ట్‌ జోన్‌ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.  వివరాలు: హాస్పిటాలిటీ మానిటర్: 43 పోస్టులు అర్హత: బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్‌ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌/ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్‌ క్యాటరింగ్ సైన్స్). లేదా బీబీఏ/ఎంబీఏ(కలినరీ ఆర్ట్స్)/ ఎంబీఏ(టూరిజం అండ్‌ హోటల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.   వేతనం: నెలకు రూ.30,000, ఇతర అలెవెన్సులు. వయోపరిమితి: 01.08.2026 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  ఇంటర్వ్యూ తేదీలు: 17, 24, 27.02.2026; 05.03.2026. వేదిక: మధ్యప్రదేశ్‌, ముంబయి, గోవా, గుజరాత్‌. Website:https://irctc.com/

Internship

హైర్‌అనిక్స్‌ ఏఐకంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

హైర్‌అనిక్స్‌ ఏఐ కార్పొరేట్‌ సేల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: హైర్‌అనిక్స్‌ ఏఐ పోస్టు పేరు: కార్పొరేట్‌ సేల్స్‌   నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.6,000. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 13-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-corporate-sales-internship-at-hireonix-ai1768329747

Government Jobs

ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 9 వివరాలు: 1. డిప్యూటీ మేనేజర్‌: 03 2. ఇంజినీర్‌: 01 3. ఆఫీసర్‌: 03 4. అసిస్టెంట్‌: 01 5. జూనియర్ అసిస్టెంట్‌: 02 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌/బీఈ, ఎంబీఏ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 38 నుంచి 49 ఏళ్లు. వేతనం: నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000, ఇంజినీర్‌/ఆఫీసర్‌కు రూ.60,000 - రూ.1,80,000, అసిస్టెంట్‌కు రూ.32,000 - రూ.1,28,000, జూనియర్ అసిస్టెంట్‌కు రూ.29,000 - రూ.1,20,000.  ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఆఫ్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 4. Website:https://recruitment.eil.co.in/