ఈఎస్ఐసీ పంజాబ్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ), పంజాబ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 97 వివరాలు: 1. ప్రొఫెసర్ - 15 2. అసోసియేట్ ప్రొఫెసర్ - 22 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 17 4. సీనియర్ రెసిడెంట్ - 43 విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలు. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ /ఎండీ/ఎంఎస్/డీఎన్బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 45 ఏళ్లు నుంచి 69 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రొఫెసర్ కు రూ.2,50,000. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,70,000. అసిస్టెంట్ ప్రొఫెసర్ /సీనియర్ రెసిడెంట్ కు రూ. 1,45,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబరు 31, ఇంటర్వ్యూ తేదీ: 08.01.2026. వేదిక: 2వ అంతస్తు, డీన్ ఆఫీస్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, లూధియానా-141001. Website:https://esic.gov.in/recruitments