పంజాబ్ & సింధ్ బ్యాంకులో స్పెషలిస్ట్ పోస్టులు
దిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన కంపెనీ సెక్రటరీ (మేనేజర్/ చీఫ్ మేనేజర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 4 వివరాలు: అర్హత: ఎల్ఎల్బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఎఫ్ఆర్ఎం ఉత్తీర్ణతతో పాటు తో పాటు పని అనుభవం ఉండాలి. ఐసీఎస్ఐ మెంబర్గా తప్పనిసరి. పే స్కేల్: నెలకు మేనేజర్కు రూ.64,820- 93,960; చీఫ్ మేనేజర్కు రూ.1,02300- 1,20940 ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ కేటగిరీకి రూ.1003. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.177. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, రెండో అంతస్తు, ఎన్బీసీసీ కాంప్లెక్స్, ఈస్ట్ కిద్వాయి నగర్, న్యూదిల్లీ. చివరి తేదీ: 18-04-2025. Website:https://punjabandsindbank.co.in/content/recuitment