Posts

Current Affairs

Nawaf Salam

♦ Lebanon has formed its first full-fledged government since 2022, ending a prolonged deadlock, with Nawaf Salam assuming the role of Prime Minister on 8 February 2025. ♦ President Joseph Aoun confirmed in a statement that he accepted the resignation of the previous caretaker government and signed a decree appointing Prime Minister Salam’s new administration.  ♦ Nawaf Salam is a former president of the International Court of Justice. ♦ The new cabinet, comprising 24 ministers evenly split between Christian and Muslim sects, was formed in less than a month after Mr. Salam’s appointment. 

Current Affairs

Bharat Electronics Limited (BEL)

♦ The Ministry of Defence signed a contract with Bharat Electronics Limited (BEL) for the procurement of 28 EON-51 systems for 11 New Generation Offshore Patrol Vessels and three Cadet Training Ships for the Indian Navy on 8 February 2025. The contract will cost over Rs.642 crore. ♦ EON-51 is an electro-optical fire control system that provides search, detection, and classification of targets using electro-optical and thermal imager devices.

Current Affairs

Delhi Assembly Election

♦ The Bharatiya Janata Party (BJP) won the Delhi Assembly Election, returning to power after 27 years by defeating the incumbent Aam Aadmi Party (AAP). ♦ The election results were announced on 8 February 2025. The BJP won 48 seats in the 70-member legislative assembly, while the AAP bagged 22 seats. The third contender, Congress, was completely wiped out in the polls after failing to win even a single seat. ♦ The BJP’s vote share was 45.56%, while the AAP secured 43.57% votes and the Congress’s poll percentage was 6.34. ♦ A party winning more than the halfway mark of 35 seats forms the government in the National Capital.

Current Affairs

ఎఫ్‌డీఐ

2000 ఏప్రిల్‌ నుంచి 2024 సెప్టెంబరు వరకు మన దేశంలోకి 1 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.87 లక్షల కోట్ల) ఎఫ్‌డీఐ తరలివచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సేవల విభాగం, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, వాహన, రసాయనాలు, ఔషధ రంగాల్లోకి ఎఫ్‌డీఐ అధికంగా వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరులో ఎఫ్‌డీఐ, వార్షిక ప్రాతిపదికన 45% పెరిగి 29.79 బి.డాలర్ల (సుమారు రూ.2.59 లక్షల కోట్ల)కు చేరింది. 

Current Affairs

తమిళనాడులో ఆన్‌లైన్‌ జూదం నిషేధం

యువత ఆన్‌లైన్‌లో జూదం ఆడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో 18 ఏళ్ల లోపు వారు డబ్బు చెల్లించి ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడేందుకు వీలు లేకుండా తమిళనాడు ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ నిషేధం విధించింది. ఆన్‌లైన్‌ జూదంలో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ గేమ్‌ల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ గేమ్‌లను క్రమబద్ధీకరించేలా నిబంధనలను కఠినతరం చేస్తూ గేమింగ్‌ అథారిటీ 2025, ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 18 ఏళ్ల లోపువారు ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి ఆడేందుకు నిషేధం విధించింది. అదేవిధంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడకూడదని స్పష్టం చేసింది.

Current Affairs

మణిపుర్‌ ముఖ్యమంత్రి రాజీనామా

మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ 2025, ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందించారు. దాన్ని గవర్నర్‌ ఆమోదించారు.  జాతుల వైరంతో 2023 మే నుంచి మణిపుర్‌లో చెలరేగిన అల్లర్లలో 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేలమంది నిరాశ్రయులయ్యారు. 

Current Affairs

ఫోర్బ్స్‌ జాబితాలో భాంజు వ్యవస్థాపకుడు

ఎడ్యుటెక్‌ అంకురం భాంజు వ్యవస్థాపకుడు, సీఈఓ నీలకంఠ భాను ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30-2025’ జాబితాలో స్థానం సంపాదించారు. 2022లో ఆసియా జాబితాలోనూ ఈయన పేరుంది. విద్యార్థులకు గణితం సులభంగా అర్థమయ్యేలా బోధించడం ఈ అంకురం ప్రత్యేకత. సంస్థ సహ వ్యవస్థాపకులు దేవులపల్లి లక్ష్మీ ప్రచోతన్, అల్లూరు ఉదయ్‌ కిరణ్, జొన్నలగడ్డ సాయి కృష్ణకాంత్‌లూ ఫోర్బ్స్‌ జాబితాలో ఉన్నారు.

Current Affairs

క్రయోజెనిక్‌ వాక్యూమ్‌ ప్రజ్వలన పరీక్ష విజయవంతం

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సీఈ20 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను శూన్య వాతావరణ (వాక్యూమ్‌) పరిస్థితుల్లో మండించే పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025, ఫిబ్రవరి 8న ప్రకటించింది. తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో దీన్ని నిర్వహించారు. మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో ఉపయోగించే ఎల్‌వీఎం-3 రాకెట్‌లో ఈ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ కీలకం. రోదసి యాత్ర మార్గమధ్యంలో క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను రీస్టార్ట్‌ చేసేటప్పుడు నెలకొనే పరిస్థితులను ఈ పరీక్షలో అనుకరించారు

Current Affairs

లెబనాన్‌లో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు

యుద్ధంతో కకావికలమైన లెబనాన్‌లో 2022 తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రధాన మంత్రి నవాఫ్‌ సలామ్‌ 2025, ఫిబ్రవరి 9న 24 మంత్రులతో క్యాబినెట్‌ను ప్రకటించారు. అపద్ధర్మ ప్రభుత్వం వైదొలగేందుకు అనుమతించి, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆదేశాలపై సంతకం చేసినట్లు లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ ఆన్‌ ప్రకటించారు.  నవాఫ్‌ సలామ్‌ గతంలో లెబనాన్‌ రాయబారిగా, అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా పనిచేశారు.

Current Affairs

బీఈఎల్‌తో నౌకాదళం ఒప్పందం

భారత నౌకాదళం కోసం 11 కొత్త తరం ఆఫ్‌షోర్‌ గస్తీ నౌకలు, 3 క్యాడెట్‌ శిక్షణ నౌకల కోసం అవసరమైన 28 కీలక సిస్టమ్స్‌ను కొనుగోలు చేసేందుకు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)తో రూ.624 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ 2025, ఫిబ్రవరి 8న వెల్లడించింది.  11 కొత్త తరం ఆఫ్‌షోర్‌ గస్తీ నౌకలు, 3 క్యాడెట్‌ ట్రైనింగ్‌ నౌకల కోసం 28 ఈఓఎన్‌-51 సిస్టమ్స్‌ను బీఈఎల్‌ నుంచి రూ.624 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.