ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి 8వ వేతన సవరణ సంఘం విధివిధానాల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కు 2025, అక్టోబరు 28న ఆమోద ముద్రవేసింది. ఈ కమిషన్కు ఛైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్ నియమితులయ్యారు. ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగుళూరు ఐఐఎం ప్రొఫెసర్ పులాక్ ఘోష్, సభ్య కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం-సహజవాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు. ఈ సంఘం 18 నెలల్లో తమ తుది నివేదికను సమర్పిస్తుంది.