ప్రపంచంలోని దిగ్గజ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ మైక్రోసాఫ్ట్ 50 వసంతాలను పూర్తి చేసుకుంది.
విండోస్ లాంటి సాఫ్ట్వేర్ల ద్వారా వ్యక్తిగత కంప్యూటర్ల (పీఎస్) విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఈ సంస్థను 1975, ఏప్రిల్ 4న బిల్గేట్స్, పాల్ అలెన్ స్థాపించారు.
ఆల్టెయిర్ 8800 కంప్యూటర్కు సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలన్న వీరిద్దరి ఆలోచనతో ఈ సంస్థ ప్రయాణం ప్రారంభమైంది.
ఆ తర్వాత ఎంఎస్-డాస్ను తీసుకొని రావడం ద్వారా పీఎస్ల ఆపరేటింగ్ సిస్టమ్ విభాగాన్ని శాసించే స్థాయికి మైక్రోసాఫ్ట్ ఎదిగింది.
1980 నుంచి 2021 మధ్య ఎంఎస్-డాస్లో 9 ప్రధాన వెర్షన్లను, విండోస్లో 15 వెర్షన్లను మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది.
1986లో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ కంపెనీ.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్లలోనూ ఒకటిగా ఉంది.