Published on Sep 23, 2024
Current Affairs
45వ చెస్‌ ఒలింపియాడ్‌
45వ చెస్‌ ఒలింపియాడ్‌

45వ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత అబ్బాయిలు, అమ్మాయిల జట్లు రెండూ విజేతలుగా నిలిచాయి. 2024, సెప్టెంబరు 22న బుడాపెస్ట్‌ (హంగేరీ)లో జరిగిన చివరిదైన పదకొండో రౌండ్లో పురుషుల జట్టు 3.5-0.5తో స్లొవేనియాపై గెలిచింది. మొత్తం 21 పాయింట్లతో ఆ జట్టు పసిడిని సొంతం చేసుకుంది.  

మహిళల జట్టు కూడా 3.5-0.5 తేడాతోనే అజర్‌బైజాన్‌ను ఓడించి ట్రోఫీని అందుకుంది. ఆ జట్టు 19 పాయింట్లతో స్వర్ణం నెగ్గింది.

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. 2014, 2022లో పురుషుల జట్లు, 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలిచాయి.