45వ చెస్ ఒలింపియాడ్లో భారత అబ్బాయిలు, అమ్మాయిల జట్లు రెండూ విజేతలుగా నిలిచాయి. 2024, సెప్టెంబరు 22న బుడాపెస్ట్ (హంగేరీ)లో జరిగిన చివరిదైన పదకొండో రౌండ్లో పురుషుల జట్టు 3.5-0.5తో స్లొవేనియాపై గెలిచింది. మొత్తం 21 పాయింట్లతో ఆ జట్టు పసిడిని సొంతం చేసుకుంది.
మహిళల జట్టు కూడా 3.5-0.5 తేడాతోనే అజర్బైజాన్ను ఓడించి ట్రోఫీని అందుకుంది. ఆ జట్టు 19 పాయింట్లతో స్వర్ణం నెగ్గింది.
చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. 2014, 2022లో పురుషుల జట్లు, 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలిచాయి.