Published on Feb 12, 2025
Current Affairs
2027లో రియాద్‌లో ఈస్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌
2027లో రియాద్‌లో ఈస్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌

తొలి ఈస్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌ 2027లో రియాద్‌ వేదికగా జరగనున్నాయి.

2025లోనే ఈ క్రీడలు నిర్వహించాల్సి ఉన్నా రెండేళ్లు ఆలస్యంగా ఆరంభం కానున్నాయి.

కింగ్‌డమ్‌ ఈస్పోర్ట్స్‌ ప్రపంచకప్‌ ఫౌండేషన్‌తో కలిసి ఈ ఆటలను నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ 2025, ఫిబ్రవరి 11న వెల్లడించింది.  

2034 పురుషుల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు కూడా సౌదీ అరేబియానే వేదిక.