Published on Sep 2, 2025
Current Affairs
2026 ప్రపంచ బ్యాడ్మింటన్‌ దిల్లీలో
2026 ప్రపంచ బ్యాడ్మింటన్‌ దిల్లీలో

2026, ఆగస్టులో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు దిల్లీ ఆతిథ్యమివ్వనుంది.

2025లో పారిస్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఆగస్టు 31న ముగిసింది.

ఆ వెంటనే బీడబ్ల్యూఎఫ్‌ తర్వాతి టోర్నీకి దిల్లీని వేదికగా ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. 

భారత్‌ చివరగా 2009లో ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది.

అప్పుడు హైదరాబాద్‌లో ఇది జరిగింది.