Published on Jul 1, 2025
Current Affairs
2025 వింబుల్డన్‌
2025 వింబుల్డన్‌

148 ఏళ్ల తర్వాత తొలిసారి లైన్‌ జడ్జిలు లేకుండానే 2025 వింబుల్డన్‌ టోర్నీని నిర్వహిస్తున్నారు.

వారి స్థానంలో ఎలక్ట్రానిక్‌ లైన్‌ కాలింగ్‌ను ప్రవేశపెట్టారు.

కోర్టులో బంతి ఎక్కడ పడిందో ఈ వ్యవస్థ గుర్తిస్తుంది.

కోర్టు దాటితే దీనిలో ఉండే మోనోటోన్‌ ‘ఔట్‌’ అని చెబుతుంది.

ఇందుకోసం వింబుల్డన్‌ కోర్టుల్లో 450పైనే కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఆస్ట్రేలియన్‌ ఓపెన్, యుఎస్‌ ఓపెన్లో ఎలక్ట్రానిక్‌ లైన్‌ కాలింగ్‌ అమలవుతోంది.

2021లోనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా.. 2024లో యుఎస్‌ ఓపెన్లోనూ అరంగేట్రం చేసింది.

మట్టి కోర్టుల్లో ఆడే ఫ్రెంచ్‌ ఓపెన్లో లైన్‌ జడ్జిలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.